Skip to main content

జగన్ ను చూసి నేర్చుకోవాలి... కేసీఆర్ కు కౌంటర్ ఇచ్చిన జేఏసీ చీఫ్ అశ్వత్థామరెడ్డి

తెలంగాణలో ఆర్టీసీ సమ్మె పట్ల సీఎం కేసీఆర్ ఉక్కుపాదం మోపాలని నిర్ణయించుకున్న సంగతి తెలిసిందే. పండుగ సీజన్ లో సమ్మెకు దిగిన వారితో రాజీపడేది లేదని, కొత్తగా నియామకాలు చేపట్టాలని కేసీఆర్ నిర్ణయం తీసుకోవడం పట్ల ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ అధ్యక్షుడు అశ్వత్థామరెడ్డి దీటుగా స్పందించారు. ప్రభుత్వ బెదిరింపులకు భయపడేది లేదని స్పష్టం చేశారు. పక్క రాష్ట్రం సీఎం జగన్ ను చూసి మన రాష్ట్రం నేర్చుకోవాలంటూ కేసీఆర్ కు కౌంటర్ ఇచ్చారు.

తమ పోరాటంలో ధర్మం, న్యాయం ఉందని, కార్మికులు ఆందోళన చెందాల్సిన అవసరంలేదని అన్నారు. తాము కూడా న్యాయపరంగానే ముందుకెళతామని అశ్వత్థామరెడ్డి వెల్లడించారు. అంతకుముందు, ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించిన సీఎం కేసీఆర్ సమ్మెలో పాల్గొన్నవారిపై వేటు వేయాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. అంతేకాదు, ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసేది లేదని తెగేసి చెప్పినట్టు సమాచారం.

Comments

Popular posts from this blog

వారానికోసారి కష్టమేమీ కాదు... సీఎం జగన్‌ కేసులో సీబీఐ కౌంటర్

కోర్టుకు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని ఏపీ సీఎం జగన్ వేసిన పిటిషన్‌పై సీబీఐ కౌంటర్ దాఖలు చేసింది. అక్రమాస్తుల కేసు విచారణ నుంచి తనకు వ్యక్తిగత హాజరు మినహాయింపు ఇవ్వాలని ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సీబీఐ కోర్టులో వేసిన పిటిషన్‌పై సీబీఐ కౌంటర్ దాఖలు చేసింది. సీఎం జగన్ దాఖలు చేసిన పిటిషన్‌పై సీబీఐ అభ్యంతరం వ్యక్తం చేసింది. సాక్షులను జగన్ ప్రభావితం చేసే అవకాశం ఉందని పిటిషన్‌లో పేర్కొంది. ఆయన వాస్తవాలను దాచిపెట్టి పిటిషన్ వేశారని ఆరోపించింది. జగన్ జైల్లో ఉన్నప్పుడు సాక్షులను ప్రభావితం చేశారని... సీఎం పదవిలో ఉన్న జగన్ సాక్షులను మరింత ప్రభావితం చేసే అవకాశం ఉందని సీబీఐ తన పిటిషన్‌లో పేర్కొంది. ఏపీలో రెవెన్యూ లోటు అనేది సీఎంగా ఉన్న జగన్ వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇచ్చే కారణం కాదని తెలిపింది. సీఎంగా ఉన్న జగన్ విజయవాడ నుంచి వారానికోసారి హైదరాబాద్ రావడంకష్టమేమీ కాదని కౌంటర్‌ పిటిషన్‌లో సీబీఐ పేర్కొన్నట్టు తెలుస్తోంది. సీబీఐ కౌంటర్‌పై కోర్టు శుక్రవారం వాదనలు వినిపించనుంది.

బోటు వెలికితీత మరింత ఆలస్యం

కచ్చులూరు వద్ద మునిగిన బోటును రేపు వెలికితీస్తామని ధర్మాడి సత్యం తెలిపారు. బోటు వెలికితీత కోసం రెండోరోజు చేసిన ప్రయత్నాలు విఫలమైనట్లు చెప్పారు. వాతావరణం అనుకూలించనందువల్లే ఈ ఆలస్యం జరుగుతుందని వివరించారు. గోదావరిలో వరద ప్రహహం తగ్గిన కారణంగా బోటును రేపు బయటికి తీస్తామని స్పష్టం చేశారు. కాగా.. ధర్మాడి సత్యం బృందం వేసిన లంగర్‌కు బోటు తగిలి కదిలిందని స్థానికులు తెలిపారు.