తెలంగాణ ఆర్టీసీ సమ్మె కొనసాగుతోంది. దీనిపై ఆర్టీసీ కార్మిక సంఘాలు జేఏసీ అధ్యక్షుడు అశ్వత్థామరెడ్డి స్పందించారు. ప్రభుత్వం కావాలనే ఆర్టీసీని సమ్మెలోకి నెట్టిందని, ఆర్టీసీ ఆస్తులను దోచుకోవాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆయన ఆరోపించారు. ఆర్టీసీని మూసివేసేందుకు సర్కారు కుట్రలకు పాల్పడుతోందని, విమానాలపై ఉన్న శ్రద్ధ ఆర్టీసీపై లేదా? అంటూ ప్రశ్నించారు. తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మెకు అన్ని సంఘాలు మద్దతుగా నిలుస్తున్నాయని అశ్వత్థామరెడ్డి వెల్లడించారు. హైదరాబాద్ లోని ఏఐటీయూసీ కార్యాలయంలో ట్రేడ్ యూనియన్ల రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
సినీనటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఈ రోజు పుట్టినరోజు వేడుక జరుపుకుంటోన్న నేపథ్యంలో ఆయనకు మెగాస్టార్ చిరంజీవి శుభాకాంక్షలు తెలిపారు. ఆయనకు మహేశ్ బాబుతో పాటు పలువురు టాలీవుడ్ ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్లు చేశారు. సినిమాలతో పాటు రాజకీయాల్లో పవన్ కల్యాణ్ అద్భుత విజయాలు సాధించాలని తాము కోరుకుంటున్నట్లు తెలిపారు.
Comments
Post a Comment