Skip to main content

సీఎం జగన్ ని ఏకవచనంతో సంబోధిస్తారా? ఏమైపోయింది మీ సంస్కారం?: చంద్రబాబుపై బొత్స ఫైర్

ఏపీ సీఎం జగన్ ను టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు సంబోధిస్తున్న తీరుపై మంత్రి బొత్స సత్యనారాయణ నిప్పులు చెరిగారు. విశాఖపట్టణంలో ఈరోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఒక రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న వ్యక్తిని పట్టుకుని ఏకవచనంతో చంద్రబాబు సంబోధిస్తారా? ఏమైపోయింది మీ సంస్కారం? ఇలాంటి భాష మాట్లాడటం న్యాయమేనా? అని ప్రశ్నించారు.

మూడుసార్లు ముఖ్యమంత్రిగా, మూడుసార్లు ప్రతిపక్ష నేతగా చేసిన చంద్రబాబు మాట్లాడే తీరు ఇదేనా? అని ధ్వజమెత్తారు. చంద్రబాబు మైండ్ సెట్ మారనట్టు ఉందని, ఆయన వయసుకు ఉన్న గౌరవాన్ని కూడా రోజురోజుకీ తగ్గించుకుంటున్నారని విమర్శించారు. ప్రజల ముందుకు, మీడియా ముందుకు వచ్చినప్పుడు హుందాగా ప్రవర్తించాలని, ఆ హుందాతనం బాబులో కనిపించడం లేదని అన్నారు. ‘మీరు (చంద్రబాబు) మాట్లాడిన ప్రతి మాటలోనూ నీ కడుపు మంట కనిపిస్తోంది తప్ప, వాస్తవం కనిపించట్లేదు’ అని బాబుపై ఓ రేంజ్ లో బొత్స విరుచుకుపడ్డారు.   

Comments

Popular posts from this blog

అత్యంత కష్టం మీద బోటును బయటికి తీసిన ధర్మాడి సత్యం బృందం

నెలరోజులకు పైగా గోదావరి నదీ గర్భంలోనే ఉండిపోయిన రాయల్ వశిష్ట బోటును ఎట్టకేలకు బయటికి తీశారు. ధర్మాడి సత్యం బృందం తీవ్ర ప్రయాసలకోర్చి బోటు ఆచూకీ గుర్తించడమే కాకుండా దాన్ని పైకి తీసుకువచ్చారు. మరికాసేపట్లో బోటును ఒడ్డుకు చేర్చనున్నారు. స్కూబా డైవర్ల సాయంతో బోటుకు లంగర్లు ఫిక్స్ చేసి పైకి తీసుకువచ్చేందుకు ధర్మాడి సత్యం బృందం చేసిన ప్రయత్నాలు ఫలించాయి. మొదట కొన్ని భాగాలుగా విడిపోయినా, ఆ తర్వాత మరోసారి ఐరన్ రోప్ లు బిగించి మొత్తం బోటును వెలికి తీశారు. గోదావరి ఉపరితలంపైకి చేరిన బోటును మరో రెండు గంటల్లో తీరానికి చేర్చే అవకాశాలున్నాయి.

మీడియాపై మాకు గౌరవముంది: కోటంరెడ్డి

  కొన్ని పత్రికలు, ఛానల్స్ తమ పాలనపై ప్రజల్లో అపోహలు సృష్టిస్తున్నాయని  వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. మీడియాపై తమకు గౌరవం ఉందని, అది ఎప్పటికీ కొనసాగుతుందని చెప్పారు. జీవో 2430 కొత్తగా తీసుకొచ్చింది కాదని, ఎప్పటినుంచో అది ఉందని తెలిపారు.  ఈ రోజు కోటంరెడ్డి మీడియాతో మాట్లాడారు. కొన్ని పత్రికలు, ఛానల్స్ పనికట్టుకుని తప్పుడు వార్తలతో అపోహలు సృష్టిస్తున్నాయన్నారు. తప్పుడు వార్తలు రాసేవారు భయపడాలని పేర్కొన్నారు. ఒకప్పుడు సాక్షి మీడియాను చంద్రబాబు అనుమతించనప్పుడు ఈ ఉద్యమ నేతలు ఎటుపోయారని నిలదీశారు. లోకేశ్ దీక్షలను చూసి ప్రజలు నవ్వుకుంటున్నారన్నారు. మంగళగిరి నియోజక వర్గంలో ఎన్ని ఓట్లు ఉన్నాయో కూడా లోకేశ్ కు తెలియదని విమర్శించారు. తమ పాలనను చంద్రబాబు సహించలేకపోతున్నారని ఆయన మండిపడ్డారు. చంద్రబాబు, తన హయాంలో తన కొడుకు లోకేశ్ తో కలిసి దోచుకుని లోటు బడ్జెట్ ను చూపెట్టారని విమర్శించారు. ప్రస్తుతం సీఎం జగన్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గాడిలో పెడుతున్నారని చెప్పారు.  చంద్రబాబుకు చదువుకునేటప్పటి నుంచే కులపిచ్చి ఉందని పేర్కొన్నారు. స్థాని...