Skip to main content

చెత్త ఏరుతున్నప్పుడు తన చేతిలో ఉన్న పరికరం ఏంటో చెప్పిన ప్రధాని మోదీ




చైనా అధినేత షీ జిన్ పింగ్ తో చర్చల కోసం మహాబలిపురం వెళ్లిన ప్రధాని మోదీ ఉదయం వ్యాహ్యాళి సందర్భంగా బీచ్ లో చెత్త ఏరడం అందరి దృష్టిని ఆకర్షించింది. ఆ సమయంలో మోదీ చేతిలో ఉన్న టార్చ్ లైట్ వంటి పరికరం కూడా అందరిలో ఆసక్తి కలిగించింది. అదేంటన్నది చాలామందికి తెలియలేదు. కొందరు టార్చ్ లైట్ అని, మరికొందరు లైట్ వెయిట్ డంబెల్ అని ఎవరికి తోచినట్టు వారు వ్యాఖ్యానించారు. సామాన్య ప్రజలే కాదు, మోదీ సన్నిహితుల్లోనూ ఇదే సందేహం కలిగింది. దీనిపై స్వయంగా మోదీనే వివరణ ఇచ్చారు.

తన చేతిలో ఉన్నది ఆక్యుప్రెషర్ రోలర్ అని వెల్లడించారు. ఇది చేతిలో ఉంచుకోవడం వల్ల దేహంలో రక్తప్రసరణ క్రమబద్ధంగా కొనసాగుతుందని, తద్వారా ఒత్తిళ్లు తగ్గుతాయని తెలిపారు. విపరీతమైన ఉద్విగ్నత, నిద్రలేమి సమస్యలు, తలనొప్పి, జీర్ణ సంబంధ సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుందని వివరించారు. తాను ఆక్యుప్రెషర్ రోలర్ ను ఎక్కువగా ఉపయోగిస్తుంటానని, అది తనకెంతో ఉపయుక్తంగా ఉంటోందని ట్వీట్ చేశారు.

Comments

Popular posts from this blog

సుజనా చౌదరి లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా ప్రైవేట్ బిల్లు పెడతాం: వైసీపీ ఎంపీ బాలశౌరి

బీజేపీ ఎంపీ సుజనాచౌదరిపై వైసీపీ ఎంపీ బాలశౌరి తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేశారు. మొన్నటి వరకు టీడీపీలో ఉన్న సుజనాచౌదరి బీజేపీలో చేరింది చంద్రబాబు అజెండా మోయడానికి కాదా? రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమా? చంద్రబాబు ప్రయోజనాలు ముఖ్యమా? ప్రధాని మోదీకి వ్యతిరేకంగా గతంలో ధర్మదీక్షలు చేసింది సుజనా కాదా? అని ప్రశ్నించారు. పొలిటికల్ బ్రోకర్, డూప్లికేట్ బీజేపీ నేత సుజనా చౌదరి మాటలకు విలువే లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సుజనా డూప్లికేట్ బీజేపీ నేత కాబట్టే చంద్రబాబు అజెండా అమలు చేస్తున్నారని ఆరోపించారు. సుజనాపై ఎథిక్స్ కమిటీలో ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు.  బ్యాంకులను మోసం చేసి డబ్బులు ఎగ్గొట్టిన సుజనా లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా పార్లమెంట్ లో ప్రైవేట్ బిల్లు పెడతామని సంచలన వ్యాఖ్యలు చేశారు.  

చైనాకు షాక్ : వాటిపై పెరగనున్న సుంకం

విదేశాల నుంచి దిగుమతయ్యే యాక్టివ్‌ ఫార్మాసూటికల్‌ ఇన్‌గ్రీడియంట్స్‌ (ఏపీఐ) దిగుమతులపై భారత  ప్రభుత్వం త్వరలోనే షాక్ ఇవ్వనుంది. ఏపీఐ దిగమతులపై కస్టమ్స్ సుంకాన్ని10 నుంచి 15 శాతం దాకా  పెంచాలని  ఫార్మాస్యూటికల్స్ విభాగం (డీఓపీ) యోచిస్తోంది. ముడి ఔషధాల (ఏపీఐ) దేశీయ తయారీని ప్రోత్సాహం ఇవ్వడంతోపాటు,చైనాపై అధికంగా ఆధారపడటాన్ని తగ్గించాలన్న వ్యూహంలో భాగంగా కేంద్రం ఈ నిర్ణయం తీసుకోనుంది. ఏపీఐ దిగుమతులపై సుంకాన్ని 20-25 శాతంగా ఉంచేందుకు ప్రభుత్వం పరిశీలిస్తోందని ఎకనామిక్ టైమ్స్ నివేదించింది. ప్రస్తుతం ఇది 10 శాతం మాత్రమే. భారత్-చైనా సరిహద్దు వివాదం, ఇటు చైనా ఉత్పత్తులను నిషేధించాలన్న డిమాండ్ అటు ప్రధానంగా ఏఐపీల కోసం చైనాపై అధికంగా ఆధారపడుతున్న తరుణంలో ఇది చైనాకు ప్రతికూలంగా మారనుంది.   ప్రస్తుతం, భారతదేశం 68 శాతం ఏపీఐలు, 90 శాతం కంటే ఎక్కువ యాంటీబయాటిక్‌లను చైనా నుండి దిగుమతి చేసుకుంటోంది. దేశీయంగా  వాల్యూమ్ పరంగా ప్రపంచంలో మూడవ అతిపెద్దది. క్లిష్టమైన కీ స్టార్టింగ్ మెటీరియల్స్ (కెఎస్ఎం), డ్రగ్ ఇంటర్మీడియట్...