Skip to main content

చెత్త ఏరుతున్నప్పుడు తన చేతిలో ఉన్న పరికరం ఏంటో చెప్పిన ప్రధాని మోదీ




చైనా అధినేత షీ జిన్ పింగ్ తో చర్చల కోసం మహాబలిపురం వెళ్లిన ప్రధాని మోదీ ఉదయం వ్యాహ్యాళి సందర్భంగా బీచ్ లో చెత్త ఏరడం అందరి దృష్టిని ఆకర్షించింది. ఆ సమయంలో మోదీ చేతిలో ఉన్న టార్చ్ లైట్ వంటి పరికరం కూడా అందరిలో ఆసక్తి కలిగించింది. అదేంటన్నది చాలామందికి తెలియలేదు. కొందరు టార్చ్ లైట్ అని, మరికొందరు లైట్ వెయిట్ డంబెల్ అని ఎవరికి తోచినట్టు వారు వ్యాఖ్యానించారు. సామాన్య ప్రజలే కాదు, మోదీ సన్నిహితుల్లోనూ ఇదే సందేహం కలిగింది. దీనిపై స్వయంగా మోదీనే వివరణ ఇచ్చారు.

తన చేతిలో ఉన్నది ఆక్యుప్రెషర్ రోలర్ అని వెల్లడించారు. ఇది చేతిలో ఉంచుకోవడం వల్ల దేహంలో రక్తప్రసరణ క్రమబద్ధంగా కొనసాగుతుందని, తద్వారా ఒత్తిళ్లు తగ్గుతాయని తెలిపారు. విపరీతమైన ఉద్విగ్నత, నిద్రలేమి సమస్యలు, తలనొప్పి, జీర్ణ సంబంధ సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుందని వివరించారు. తాను ఆక్యుప్రెషర్ రోలర్ ను ఎక్కువగా ఉపయోగిస్తుంటానని, అది తనకెంతో ఉపయుక్తంగా ఉంటోందని ట్వీట్ చేశారు.

Comments

Popular posts from this blog

వారానికోసారి కష్టమేమీ కాదు... సీఎం జగన్‌ కేసులో సీబీఐ కౌంటర్

కోర్టుకు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని ఏపీ సీఎం జగన్ వేసిన పిటిషన్‌పై సీబీఐ కౌంటర్ దాఖలు చేసింది. అక్రమాస్తుల కేసు విచారణ నుంచి తనకు వ్యక్తిగత హాజరు మినహాయింపు ఇవ్వాలని ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సీబీఐ కోర్టులో వేసిన పిటిషన్‌పై సీబీఐ కౌంటర్ దాఖలు చేసింది. సీఎం జగన్ దాఖలు చేసిన పిటిషన్‌పై సీబీఐ అభ్యంతరం వ్యక్తం చేసింది. సాక్షులను జగన్ ప్రభావితం చేసే అవకాశం ఉందని పిటిషన్‌లో పేర్కొంది. ఆయన వాస్తవాలను దాచిపెట్టి పిటిషన్ వేశారని ఆరోపించింది. జగన్ జైల్లో ఉన్నప్పుడు సాక్షులను ప్రభావితం చేశారని... సీఎం పదవిలో ఉన్న జగన్ సాక్షులను మరింత ప్రభావితం చేసే అవకాశం ఉందని సీబీఐ తన పిటిషన్‌లో పేర్కొంది. ఏపీలో రెవెన్యూ లోటు అనేది సీఎంగా ఉన్న జగన్ వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇచ్చే కారణం కాదని తెలిపింది. సీఎంగా ఉన్న జగన్ విజయవాడ నుంచి వారానికోసారి హైదరాబాద్ రావడంకష్టమేమీ కాదని కౌంటర్‌ పిటిషన్‌లో సీబీఐ పేర్కొన్నట్టు తెలుస్తోంది. సీబీఐ కౌంటర్‌పై కోర్టు శుక్రవారం వాదనలు వినిపించనుంది.

బోటు వెలికితీత మరింత ఆలస్యం

కచ్చులూరు వద్ద మునిగిన బోటును రేపు వెలికితీస్తామని ధర్మాడి సత్యం తెలిపారు. బోటు వెలికితీత కోసం రెండోరోజు చేసిన ప్రయత్నాలు విఫలమైనట్లు చెప్పారు. వాతావరణం అనుకూలించనందువల్లే ఈ ఆలస్యం జరుగుతుందని వివరించారు. గోదావరిలో వరద ప్రహహం తగ్గిన కారణంగా బోటును రేపు బయటికి తీస్తామని స్పష్టం చేశారు. కాగా.. ధర్మాడి సత్యం బృందం వేసిన లంగర్‌కు బోటు తగిలి కదిలిందని స్థానికులు తెలిపారు.