Skip to main content

అత్యంత దయనీయంగా 'నానో' పరిస్థితి... ఏడాదిలో ఒక్క కారు అమ్మకం!

 
టాటా మోటార్స్ ను ప్రపంచ విపణిలో అగ్రగామిగా నిలబెట్టాలని, మధ్య తరగతి ప్రజలు, గ్రామీణ ప్రాంతాల వారు కూడా కారులో విహరించాలన్న అభిలాషతో రతన్ టాటా నానో కారును తీసుకువచ్చారు. కానీ, ఆయన ఆకాంక్షకు తీవ్ర విఘాతం ఏర్పడింది. నానో కారు అమ్మకాలు నానాటికీ తీసికట్టుగా తయారవడమే కాదు, సంస్థ చరిత్రలోనే అత్యంత దారుణ వైఫల్యంగా నిలిచిపోయే పరిస్థితి ఏర్పడింది. ఈ ఏడాదిలో ఇప్పటివరకు అమ్ముడైంది ఒక్కటే. గత తొమ్మిది నెలల్లో నానో కర్మాగారాల నుంచి ఒక్క కారు కూడా తయారుకాలేదు.

2008లో తెరపైకి వచ్చిన నానో మొదట్లో సంచలనం సృష్టించే విధంగా కనిపించింది. ఆ మరుసటి ఏడాది మార్కెట్లోకి వచ్చినప్పుడు తొలినాళ్లలో బాగానే అమ్మకాలు జరిగినా, ఆ తర్వాత తీవ్రస్థాయిలో పతనమైంది. ప్రస్తుతానికి తయారీకేంద్రాల్లో ఉత్పత్తి నిలిచిపోగా, వచ్చే ఏడాదితో అధికారికంగా నానో అంతర్ధానం కానుంది.   

Comments

Popular posts from this blog

వారానికోసారి కష్టమేమీ కాదు... సీఎం జగన్‌ కేసులో సీబీఐ కౌంటర్

కోర్టుకు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని ఏపీ సీఎం జగన్ వేసిన పిటిషన్‌పై సీబీఐ కౌంటర్ దాఖలు చేసింది. అక్రమాస్తుల కేసు విచారణ నుంచి తనకు వ్యక్తిగత హాజరు మినహాయింపు ఇవ్వాలని ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సీబీఐ కోర్టులో వేసిన పిటిషన్‌పై సీబీఐ కౌంటర్ దాఖలు చేసింది. సీఎం జగన్ దాఖలు చేసిన పిటిషన్‌పై సీబీఐ అభ్యంతరం వ్యక్తం చేసింది. సాక్షులను జగన్ ప్రభావితం చేసే అవకాశం ఉందని పిటిషన్‌లో పేర్కొంది. ఆయన వాస్తవాలను దాచిపెట్టి పిటిషన్ వేశారని ఆరోపించింది. జగన్ జైల్లో ఉన్నప్పుడు సాక్షులను ప్రభావితం చేశారని... సీఎం పదవిలో ఉన్న జగన్ సాక్షులను మరింత ప్రభావితం చేసే అవకాశం ఉందని సీబీఐ తన పిటిషన్‌లో పేర్కొంది. ఏపీలో రెవెన్యూ లోటు అనేది సీఎంగా ఉన్న జగన్ వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇచ్చే కారణం కాదని తెలిపింది. సీఎంగా ఉన్న జగన్ విజయవాడ నుంచి వారానికోసారి హైదరాబాద్ రావడంకష్టమేమీ కాదని కౌంటర్‌ పిటిషన్‌లో సీబీఐ పేర్కొన్నట్టు తెలుస్తోంది. సీబీఐ కౌంటర్‌పై కోర్టు శుక్రవారం వాదనలు వినిపించనుంది.

బోటు వెలికితీత మరింత ఆలస్యం

కచ్చులూరు వద్ద మునిగిన బోటును రేపు వెలికితీస్తామని ధర్మాడి సత్యం తెలిపారు. బోటు వెలికితీత కోసం రెండోరోజు చేసిన ప్రయత్నాలు విఫలమైనట్లు చెప్పారు. వాతావరణం అనుకూలించనందువల్లే ఈ ఆలస్యం జరుగుతుందని వివరించారు. గోదావరిలో వరద ప్రహహం తగ్గిన కారణంగా బోటును రేపు బయటికి తీస్తామని స్పష్టం చేశారు. కాగా.. ధర్మాడి సత్యం బృందం వేసిన లంగర్‌కు బోటు తగిలి కదిలిందని స్థానికులు తెలిపారు.