Skip to main content

సమ్మె కాదు..ఆర్టీసీనే ముగుస్తుంది: కేసీఆర్‌

సమ్మె కాదు..ఆర్టీసీనే ముగుస్తుంది: కేసీఆర్‌ రాష్ట్రంలో సమ్మెతో ఆర్టీసీ కార్మికులు దురహంకార పద్ధతిని అవలంబించారని సీఎం కేసీఆర్‌ వ్యాఖ్యానించారు. కార్మికుల వేతనాలు నాలుగేళ్లలోపు 67 శాతం పెంచామని.. దేశంలో ఎక్కడైనా ఇలా పెంచిన చరిత్ర ఉందా అని ప్రశ్నించారు. తెలంగాణలో భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆర్టీసీ సమ్మెపై స్పందించారు. కార్మికులు ఇంకా గొంతెమ్మ కోర్కెలు కోరడమేంటని ఆగ్రహం వ్యక్తం చేశారు.
విలీనం అసంబద్ధమైన నినాదం
‘‘ప్రభుత్వంలో విలీనం చేయాలని ఎవరు పడితే వారు కోరితే కలుపుతారా? ఎవర్ని మోసం చేయాలని? రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో 57 కార్పొరేషన్లు ఉన్నాయి. ఆ తర్వాత వారు కూడా విలీనం చేయాలని కోరితే ఏం చేయాలి? ప్రభుత్వానికి ఓ పద్ధతి, విధానం ఉంటుంది. ఆర్టీసీని విలీనం చేశారు.. వీరిని ఎందుకు చేయరని ఇవే కోర్టులు మళ్లీ ఆదేశాలు జారీ చేస్తాయి. అప్పుడేం సమాధానం చెప్పాలి? ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలనేది అసంబద్ధమైన, అర్థరహితమైన, తెలివి తక్కువ నినాదం. కార్మికులు చేస్తున్న సమ్మెలో ఔచిత్యం లేదు. ఆర్టీసీ సమ్మె కాదు.. ఆర్టీసీనే ముగుస్తుంది. ఆర్టీసీ ముగిసిపోయింది.. ఇట్స్‌ గాన్‌ కేస్‌. సమ్మెతో వెయ్యి శాతం పాత ఆర్టీసీ ఉండే అవకాశం లేదు’’ అని కేసీఆర్‌ ఘాటుగా వ్యాఖ్యానించారు.
సమ్మె కాదు..ఆర్టీసీనే ముగుస్తుంది: కేసీఆర్‌
ఆర్టీసీ మునగక తప్పదు.. ఎవరూ కాపాడలేరు
‘‘ఆర్టీసీలో లాభాలు తెస్తున్న అద్దె బస్సులు వద్దని డిమాండ్‌ చేస్తారా? మనం స్వీకరించే వృత్తి ఏంటి? మన బాధ్యత ఏంటి? అనేది తెలుసుకోవాలి. ఆర్టీసీ కార్మికులకు సగటున రూ.50వేల జీతం వస్తోంది. సంస్థ మీది.. కాపాడుకోవాలనే బాధ్యత మీకు లేదా? సందర్భానుసారం పనిచేయాల్సిన బాధ్యత మీకు లేదా? ఆర్టీసీ మునగక తప్పదు.. ఎవరూ కాపాడలేదు. రాష్ట్రం ఏర్పడక ముందు ఆర్టీసీకి ఇచ్చిన నిధులు రూ.712కోట్లు. తెరాస అధికారంలోకి వచ్చాక రూ.4,250 కోట్లు విడుదల చేశాం. ఆర్టీసీకి ఈ సంవత్సరం బడ్జెట్‌లో రూ.550కోట్లు కేటాయించాం. ఇప్పటికే రూ.425 కోట్లు విడుదల చేశాం. అదనపు ఆదాయం వచ్చే సమయంలో సమ్మెకు వెళ్లారు. సమ్మెపై మొదట స్పందించాం.. కమిటీ వేశాం. నోటీసు ఇవ్వగానే సముదాయించే ప్రయత్నం చేశాం. సమ్మెకు వెళ్తామనగానే కమిటీ వేసి చర్చలు జరిపాం’’ అని కేసీఆర్‌ వివరించారు.
సమ్మె కాదు..ఆర్టీసీనే ముగుస్తుంది: కేసీఆర్‌
యూనియన్లే కార్మికుల గొంతు కోస్తున్నాయ్‌!
‘‘ఆర్టీసీ యూనియన్‌ ఎన్నికలకు ముందు జరిగే హడావుడే ఈ సమ్మెకు ప్రధాన కారణం. సమ్మె ముసుగులో యూనియన్లే అమాయక కార్మికుల గొంతు కోస్తున్నాయి. డ్రైవర్లు, కండక్టర్లతో నాకు పంచాయితీ లేదు. యూనియన్లు లేకుండా ఆర్టీసీ కార్మికులు పనిచేస్తే రెండేళ్లలో రూ.లక్ష బోనస్‌ తీసుకుంటారు. తెలంగాణ కోసం ఆర్టీసీ వాళ్లే కాదు.. అందరూ పనిచేశారు. నా ఇంట్లో ఉన్నవాళ్లు దొంగతనం చేస్తే దొంగతనం కాకుండా పోతుందా?. భూగోళం ఉన్నంత వరకు ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం సాధ్యం కాదు. ఆర్టీసీకి పోటీ ఉండాలని ప్రధాని మోదీయే చట్టాన్ని తీసుకొచ్చారు. సెప్టెంబర్‌ 1 నుంచి మోటారు వాహనాల సవరణ చట్టం అమల్లోకి వచ్చింది. ఆరాచక వ్యవస్థను ప్రతిపక్షాలు ప్రోత్సహిస్తున్నాయి. భాజపా, కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాల్లో ఆర్టీసీని ప్రభుత్వం విలీనం చేయమనండి’’ అని ధ్వజమెత్తారు.
ఏపీలో ఆర్డర్‌ మాత్రమే ఇచ్చారు
‘‘ఏపీలో ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు. సీఎం జగన్‌ సంగతే చెబుతున్నా. ఏపీలో విలీనంపై ఆర్డర్‌ మాత్రమే ఇచ్చారు.. కమిటీ వేశారు. ఏం జరుగుతుందనేది  మూడు నెలలకో.. ఆరునెలలకో తెలుస్తుంది. ఆ కమిటీ ఏం చెబుతుందో ఎవరికీ తెలియదు’’ అని కేసీఆర్‌ వ్యాఖ్యానించారు. 

Comments

Popular posts from this blog

సుజనా చౌదరి లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా ప్రైవేట్ బిల్లు పెడతాం: వైసీపీ ఎంపీ బాలశౌరి

బీజేపీ ఎంపీ సుజనాచౌదరిపై వైసీపీ ఎంపీ బాలశౌరి తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేశారు. మొన్నటి వరకు టీడీపీలో ఉన్న సుజనాచౌదరి బీజేపీలో చేరింది చంద్రబాబు అజెండా మోయడానికి కాదా? రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమా? చంద్రబాబు ప్రయోజనాలు ముఖ్యమా? ప్రధాని మోదీకి వ్యతిరేకంగా గతంలో ధర్మదీక్షలు చేసింది సుజనా కాదా? అని ప్రశ్నించారు. పొలిటికల్ బ్రోకర్, డూప్లికేట్ బీజేపీ నేత సుజనా చౌదరి మాటలకు విలువే లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సుజనా డూప్లికేట్ బీజేపీ నేత కాబట్టే చంద్రబాబు అజెండా అమలు చేస్తున్నారని ఆరోపించారు. సుజనాపై ఎథిక్స్ కమిటీలో ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు.  బ్యాంకులను మోసం చేసి డబ్బులు ఎగ్గొట్టిన సుజనా లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా పార్లమెంట్ లో ప్రైవేట్ బిల్లు పెడతామని సంచలన వ్యాఖ్యలు చేశారు.  

చైనాకు షాక్ : వాటిపై పెరగనున్న సుంకం

విదేశాల నుంచి దిగుమతయ్యే యాక్టివ్‌ ఫార్మాసూటికల్‌ ఇన్‌గ్రీడియంట్స్‌ (ఏపీఐ) దిగుమతులపై భారత  ప్రభుత్వం త్వరలోనే షాక్ ఇవ్వనుంది. ఏపీఐ దిగమతులపై కస్టమ్స్ సుంకాన్ని10 నుంచి 15 శాతం దాకా  పెంచాలని  ఫార్మాస్యూటికల్స్ విభాగం (డీఓపీ) యోచిస్తోంది. ముడి ఔషధాల (ఏపీఐ) దేశీయ తయారీని ప్రోత్సాహం ఇవ్వడంతోపాటు,చైనాపై అధికంగా ఆధారపడటాన్ని తగ్గించాలన్న వ్యూహంలో భాగంగా కేంద్రం ఈ నిర్ణయం తీసుకోనుంది. ఏపీఐ దిగుమతులపై సుంకాన్ని 20-25 శాతంగా ఉంచేందుకు ప్రభుత్వం పరిశీలిస్తోందని ఎకనామిక్ టైమ్స్ నివేదించింది. ప్రస్తుతం ఇది 10 శాతం మాత్రమే. భారత్-చైనా సరిహద్దు వివాదం, ఇటు చైనా ఉత్పత్తులను నిషేధించాలన్న డిమాండ్ అటు ప్రధానంగా ఏఐపీల కోసం చైనాపై అధికంగా ఆధారపడుతున్న తరుణంలో ఇది చైనాకు ప్రతికూలంగా మారనుంది.   ప్రస్తుతం, భారతదేశం 68 శాతం ఏపీఐలు, 90 శాతం కంటే ఎక్కువ యాంటీబయాటిక్‌లను చైనా నుండి దిగుమతి చేసుకుంటోంది. దేశీయంగా  వాల్యూమ్ పరంగా ప్రపంచంలో మూడవ అతిపెద్దది. క్లిష్టమైన కీ స్టార్టింగ్ మెటీరియల్స్ (కెఎస్ఎం), డ్రగ్ ఇంటర్మీడియట్...