Skip to main content

ఈయన విజయసాయిరెడ్డి... ట్వీట్లతో రెచ్చగొడతాడు: చంద్రబాబు

వైసీపీ సోషల్ మీడియాలో తమపై భరించలేనంతగా అసత్య ప్రచారం, ఫేక్ న్యూస్ వ్యాప్తి చేస్తోందని టీడీపీ అధినేత చంద్రబాబు మండిపడ్డారు. మీడియా సమావేశం ఏర్పాటు చేసిన ఆయన పాత్రికేయులకు పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. సోషల్ మీడియాలో తమపై ఎలా ప్రచారం చేస్తున్నారో చూడండి అంటూ మచ్చుకు కొన్ని క్లిప్పింగ్స్ ను చూపించారు. ఈ క్రమంలో వైసీపీ ముఖ్యనేత విజయసాయిరెడ్డి చేసిన ట్వీట్లను కూడా ఏకరవు పెట్టారు.

ఈయన... విజయసాయిరెడ్డి... కోడెలపై వచ్చిన ఫర్నిచర్ ఆరోపణలతో వరుసగా ట్వీట్లు చేసి రెచ్చగొట్టాడని ఆరోపించారు. సహించలేనంత పదజాలంతో ట్వీట్లు చేసి చివరికి కోడెల ఆత్మహత్యకు కారకులయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. లక్ష రూపాయల ఫర్నిచర్ ను తీసుకెళ్లమని కోడెల లేఖ కూడా రాశారని, అయినా రాద్ధాంతం చేశారని మండిపడ్డారు. కానీ, రూ.43 వేల కోట్ల అవినీతికి పాల్పడ్డ మిమ్మల్నేం చేయాలంటూ నిప్పులు చెరిగారు.

Comments

Popular posts from this blog

అమరావతిలో భూముల రేట్లు తగ్గకుండా: సీఆర్డీఏ స్థానంలో కొత్త అథారిటీ: కీలక నోటిఫికేషన్

 మూడు రాజధానులను ఏర్పాటు చేయడానికి ఉద్దేశించిన ఏపీ వికేంద్రీకరణ బిల్లు ఆమోదం పొందడం, రాజధాని ప్రాంత అభివృద్ధి అథారిటీ (సీఆర్డీ) రద్దు నేపథ్యంలో.. ప్రభుత్వం మెరుపు వేగంతో నిర్ణయాలను తీసుకుంటోంది. పరిపాలనను వేగవంతం చేసేలా తక్షణ చర్యలకు దిగింది. సీఆర్డీఏ బిల్లు రద్దు అనంతరం దాని స్థానంలో అమరావతి మెట్రోపాలిటన్ ప్రాంత అభివృద్ధి మండలిని ఏర్పాటు చేస్తామని ప్రకటించిన ప్రభుత్వం.. దాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. ఏఎంఆర్డీఏ కమిటీ సభ్యులనూ నియమించింది. సీఆర్డీఏకు బదులుగా ఏఎంఆర్డీఏ సీఆర్డీఏ స్థాయంలో అమరావతి మెట్రోపాలిటన్ ప్రాంత అభివృద్ధి మండలి (ఏఎంఆర్డీఏ)ని ఏర్పాటు చేసింది. ఈ మేరకు నోటిఫికేషన్‌ను జారీ చేసింది. సీఆర్డీఏను రద్దు చేస్తూ అసెంబ్లీ ఆమోదించిన తీర్మానంపై గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆమోదముద్ర వేసిన మరుసటి రోజే ఏఎంఆర్డీఏను తెరపైకి తీసుకొచ్చింది. దానితో పాటు కొత్త సభ్యులను నియమించింది. మున్సిపల్ శాఖ కార్యదర్శి జే శ్యామల రావు దీనికి సంబంధించిన నోటిఫికేషన్‌ను జారీ చేశారు. మొత్తం 11 మంది సభ్యులను ఏఎంఆర్డీఏ కమిటీలో నియమించారు. సభ్యులు వీరే.. మున్సిపల్ శాఖ కార్యదర్శి డిప్య...