Skip to main content

ఎయిర్‌ ఇండియాలో పైలట్ల రాజీనామాలు!

 
ఎయిర్‌ ఇండియాలో పైలట్ల రాజీనామాలు!
ఎయిర్ ఇండియాలో కొందరు పైలట్లు మూకుమ్మడిగా రాజీనామాలు చేసినట్లు తెలుస్తోంది. వేతనం, పదోన్నతుల విషయంలో పైలట్లు అసంతృప్తితో ఉన్నారని సమాచారం. వేతనం, పదోన్నతుల విషయంలో వారి డిమాండ్లను సంస్థ దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోకపోవడంతో దాదాపు 120 మంది ఎయిర్‌బస్‌ ఏ-320 విమానాల పైలట్లు వారి రాజీనామా పత్రాలను దాఖలు చేశారు. రాజీనామా చేసిన ఒక ఉద్యోగి మీడియాతో మాట్లాడుతూ.. ‘వేతనాల పెంపు చాలా కాలంగా పెండింగ్‌లో ఉంది. ఇందుకు సంబంధించి మేము చేసిన డిమాండ్లపై సంస్థ కచ్చితమైన హామీ ఇవ్వడంలో విఫలమైంది. అంతేకాకుండా మేము మా వేతనాల్ని సరైన సమయంలో పొందలేకపోతున్నాం. పైలట్లు మొదట ఐదు సంవత్సరాల కాంట్రాక్టు ప్రాతిపదికన తక్కువ వేతనానికి ఉద్యోగంలో చేరారు. అలాంటి వారు ఇప్పుడు వేతనం పెరుగుతుందని ఎన్నో ఆశలతో ఉన్నారు. అనుభవం పొందినా అందుకు తగ్గ వేతనం అందడం లేదు’ అని అన్నారు. 
ప్రస్తుతం మార్కెట్లో చాలా అవకాశాలు ఉన్నాయి. పైలట్లు తమకు ఇక్కడ కాకపోయినా మరో సంస్థలో ఉద్యోగం దొరుకుతుందనే నమ్మకంతో ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం ఇండిగో, గో ఎయిర్‌, విస్తారా, ఎయిర్‌ ఏసియా తదితర సంస్థలు కూడా ఏ-320 విమానాలు నడుపుతున్నట్లు సమాచారం. దీనిపై ఎయిర్‌ ఇండియా ప్రతినిధి మాట్లాడుతూ.. పైలట్ల రాజీనామాలతో సంస్థకు ఎలాంటి నష్టం వాటిల్లదు అని తెలిపారు.  ప్రస్తుతం ఎయిర్‌ ఇండియాలో మొత్తం 2వేల పైలట్లు ఉన్నట్టు సమాచారం.

Comments

Popular posts from this blog

అత్యంత కష్టం మీద బోటును బయటికి తీసిన ధర్మాడి సత్యం బృందం

నెలరోజులకు పైగా గోదావరి నదీ గర్భంలోనే ఉండిపోయిన రాయల్ వశిష్ట బోటును ఎట్టకేలకు బయటికి తీశారు. ధర్మాడి సత్యం బృందం తీవ్ర ప్రయాసలకోర్చి బోటు ఆచూకీ గుర్తించడమే కాకుండా దాన్ని పైకి తీసుకువచ్చారు. మరికాసేపట్లో బోటును ఒడ్డుకు చేర్చనున్నారు. స్కూబా డైవర్ల సాయంతో బోటుకు లంగర్లు ఫిక్స్ చేసి పైకి తీసుకువచ్చేందుకు ధర్మాడి సత్యం బృందం చేసిన ప్రయత్నాలు ఫలించాయి. మొదట కొన్ని భాగాలుగా విడిపోయినా, ఆ తర్వాత మరోసారి ఐరన్ రోప్ లు బిగించి మొత్తం బోటును వెలికి తీశారు. గోదావరి ఉపరితలంపైకి చేరిన బోటును మరో రెండు గంటల్లో తీరానికి చేర్చే అవకాశాలున్నాయి.

మీడియాపై మాకు గౌరవముంది: కోటంరెడ్డి

  కొన్ని పత్రికలు, ఛానల్స్ తమ పాలనపై ప్రజల్లో అపోహలు సృష్టిస్తున్నాయని  వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. మీడియాపై తమకు గౌరవం ఉందని, అది ఎప్పటికీ కొనసాగుతుందని చెప్పారు. జీవో 2430 కొత్తగా తీసుకొచ్చింది కాదని, ఎప్పటినుంచో అది ఉందని తెలిపారు.  ఈ రోజు కోటంరెడ్డి మీడియాతో మాట్లాడారు. కొన్ని పత్రికలు, ఛానల్స్ పనికట్టుకుని తప్పుడు వార్తలతో అపోహలు సృష్టిస్తున్నాయన్నారు. తప్పుడు వార్తలు రాసేవారు భయపడాలని పేర్కొన్నారు. ఒకప్పుడు సాక్షి మీడియాను చంద్రబాబు అనుమతించనప్పుడు ఈ ఉద్యమ నేతలు ఎటుపోయారని నిలదీశారు. లోకేశ్ దీక్షలను చూసి ప్రజలు నవ్వుకుంటున్నారన్నారు. మంగళగిరి నియోజక వర్గంలో ఎన్ని ఓట్లు ఉన్నాయో కూడా లోకేశ్ కు తెలియదని విమర్శించారు. తమ పాలనను చంద్రబాబు సహించలేకపోతున్నారని ఆయన మండిపడ్డారు. చంద్రబాబు, తన హయాంలో తన కొడుకు లోకేశ్ తో కలిసి దోచుకుని లోటు బడ్జెట్ ను చూపెట్టారని విమర్శించారు. ప్రస్తుతం సీఎం జగన్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గాడిలో పెడుతున్నారని చెప్పారు.  చంద్రబాబుకు చదువుకునేటప్పటి నుంచే కులపిచ్చి ఉందని పేర్కొన్నారు. స్థాని...