Skip to main content

ఎయిర్‌ ఇండియాలో పైలట్ల రాజీనామాలు!

 
ఎయిర్‌ ఇండియాలో పైలట్ల రాజీనామాలు!
ఎయిర్ ఇండియాలో కొందరు పైలట్లు మూకుమ్మడిగా రాజీనామాలు చేసినట్లు తెలుస్తోంది. వేతనం, పదోన్నతుల విషయంలో పైలట్లు అసంతృప్తితో ఉన్నారని సమాచారం. వేతనం, పదోన్నతుల విషయంలో వారి డిమాండ్లను సంస్థ దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోకపోవడంతో దాదాపు 120 మంది ఎయిర్‌బస్‌ ఏ-320 విమానాల పైలట్లు వారి రాజీనామా పత్రాలను దాఖలు చేశారు. రాజీనామా చేసిన ఒక ఉద్యోగి మీడియాతో మాట్లాడుతూ.. ‘వేతనాల పెంపు చాలా కాలంగా పెండింగ్‌లో ఉంది. ఇందుకు సంబంధించి మేము చేసిన డిమాండ్లపై సంస్థ కచ్చితమైన హామీ ఇవ్వడంలో విఫలమైంది. అంతేకాకుండా మేము మా వేతనాల్ని సరైన సమయంలో పొందలేకపోతున్నాం. పైలట్లు మొదట ఐదు సంవత్సరాల కాంట్రాక్టు ప్రాతిపదికన తక్కువ వేతనానికి ఉద్యోగంలో చేరారు. అలాంటి వారు ఇప్పుడు వేతనం పెరుగుతుందని ఎన్నో ఆశలతో ఉన్నారు. అనుభవం పొందినా అందుకు తగ్గ వేతనం అందడం లేదు’ అని అన్నారు. 
ప్రస్తుతం మార్కెట్లో చాలా అవకాశాలు ఉన్నాయి. పైలట్లు తమకు ఇక్కడ కాకపోయినా మరో సంస్థలో ఉద్యోగం దొరుకుతుందనే నమ్మకంతో ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం ఇండిగో, గో ఎయిర్‌, విస్తారా, ఎయిర్‌ ఏసియా తదితర సంస్థలు కూడా ఏ-320 విమానాలు నడుపుతున్నట్లు సమాచారం. దీనిపై ఎయిర్‌ ఇండియా ప్రతినిధి మాట్లాడుతూ.. పైలట్ల రాజీనామాలతో సంస్థకు ఎలాంటి నష్టం వాటిల్లదు అని తెలిపారు.  ప్రస్తుతం ఎయిర్‌ ఇండియాలో మొత్తం 2వేల పైలట్లు ఉన్నట్టు సమాచారం.

Comments

Popular posts from this blog

పవన్ కు శుభాకాంక్షలు చెప్పిన చిరంజీవి

  సినీనటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఈ రోజు పుట్టినరోజు వేడుక జరుపుకుంటోన్న నేపథ్యంలో ఆయనకు మెగాస్టార్ చిరంజీవి శుభాకాంక్షలు తెలిపారు.  ఆయనకు మహేశ్ బాబుతో పాటు పలువురు టాలీవుడ్ ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్లు చేశారు. సినిమాలతో పాటు రాజకీయాల్లో పవన్ కల్యాణ్ అద్భుత విజయాలు సాధించాలని తాము కోరుకుంటున్నట్లు తెలిపారు.

చింతమనేనికి బెయిల్ నిరాకరణ: అక్టోబర్ 9వరకు రిమాండ్ పొడిగింపు

తెలుగుదేశం పార్టీ నేత, దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కు కోర్టులో చుక్కెదురు అయ్యింది. చింతమనేనికి బెయిల్ ఇచ్చేందుకు ఏలూరు కోర్టు నిరాకరించింది. అంతేకాదు చింతమనేని రిమాండ్ ను అక్టోబర్ 9 వరకు పొండిగించింది.  2017లో అప్పనపాడు గ్రామంలో స్థల వివాదంలో వ్యక్తిని నిర్బంధించి కులం పేరుతో దూషించిన కేసులో కేసు నమోదు అయ్యింది. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులో భాగంగా ఇటీవలే చింతమనేని ప్రభాకర్ ను పోలీసులు అరెస్ట్ చేశారు.  అనంతరం చింతమనేని ప్రభాకర్ ను ఏలూరులోని ఎస్సీఎస్టీ అట్రాసిటీ కోర్టులో హాజరుపరచగా కోర్టు 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. రిమాండ్ పూర్తవ్వడంతో బుధవారం పోలీసులు మరోసారి ఏలూరు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కోర్టులో హాజరుపరిచారు.  అలాగే బెయిల్ ఇవ్వాలంటూ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తరపు న్యాయవాది సైతం కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. చింతమనేని బెయిల్ పిటీషన్ ను న్యాయస్థానం తోసిపుచ్చింది. అనంతరం చింతమనేని రిమాండ్ ను వచ్చే నెల 9 వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ఏలూరు కోర్టు.  ఇకపోతే చింతమనేని ప్రభాకర్ ను అరెస్ట్ చేసేందుకు వెళ్లిన సమయంలో మహిళా పో...