Skip to main content

ఎయిర్‌ ఇండియాలో పైలట్ల రాజీనామాలు!

 
ఎయిర్‌ ఇండియాలో పైలట్ల రాజీనామాలు!
ఎయిర్ ఇండియాలో కొందరు పైలట్లు మూకుమ్మడిగా రాజీనామాలు చేసినట్లు తెలుస్తోంది. వేతనం, పదోన్నతుల విషయంలో పైలట్లు అసంతృప్తితో ఉన్నారని సమాచారం. వేతనం, పదోన్నతుల విషయంలో వారి డిమాండ్లను సంస్థ దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోకపోవడంతో దాదాపు 120 మంది ఎయిర్‌బస్‌ ఏ-320 విమానాల పైలట్లు వారి రాజీనామా పత్రాలను దాఖలు చేశారు. రాజీనామా చేసిన ఒక ఉద్యోగి మీడియాతో మాట్లాడుతూ.. ‘వేతనాల పెంపు చాలా కాలంగా పెండింగ్‌లో ఉంది. ఇందుకు సంబంధించి మేము చేసిన డిమాండ్లపై సంస్థ కచ్చితమైన హామీ ఇవ్వడంలో విఫలమైంది. అంతేకాకుండా మేము మా వేతనాల్ని సరైన సమయంలో పొందలేకపోతున్నాం. పైలట్లు మొదట ఐదు సంవత్సరాల కాంట్రాక్టు ప్రాతిపదికన తక్కువ వేతనానికి ఉద్యోగంలో చేరారు. అలాంటి వారు ఇప్పుడు వేతనం పెరుగుతుందని ఎన్నో ఆశలతో ఉన్నారు. అనుభవం పొందినా అందుకు తగ్గ వేతనం అందడం లేదు’ అని అన్నారు. 
ప్రస్తుతం మార్కెట్లో చాలా అవకాశాలు ఉన్నాయి. పైలట్లు తమకు ఇక్కడ కాకపోయినా మరో సంస్థలో ఉద్యోగం దొరుకుతుందనే నమ్మకంతో ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం ఇండిగో, గో ఎయిర్‌, విస్తారా, ఎయిర్‌ ఏసియా తదితర సంస్థలు కూడా ఏ-320 విమానాలు నడుపుతున్నట్లు సమాచారం. దీనిపై ఎయిర్‌ ఇండియా ప్రతినిధి మాట్లాడుతూ.. పైలట్ల రాజీనామాలతో సంస్థకు ఎలాంటి నష్టం వాటిల్లదు అని తెలిపారు.  ప్రస్తుతం ఎయిర్‌ ఇండియాలో మొత్తం 2వేల పైలట్లు ఉన్నట్టు సమాచారం.

Comments

Popular posts from this blog

సుజనా చౌదరి లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా ప్రైవేట్ బిల్లు పెడతాం: వైసీపీ ఎంపీ బాలశౌరి

బీజేపీ ఎంపీ సుజనాచౌదరిపై వైసీపీ ఎంపీ బాలశౌరి తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేశారు. మొన్నటి వరకు టీడీపీలో ఉన్న సుజనాచౌదరి బీజేపీలో చేరింది చంద్రబాబు అజెండా మోయడానికి కాదా? రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమా? చంద్రబాబు ప్రయోజనాలు ముఖ్యమా? ప్రధాని మోదీకి వ్యతిరేకంగా గతంలో ధర్మదీక్షలు చేసింది సుజనా కాదా? అని ప్రశ్నించారు. పొలిటికల్ బ్రోకర్, డూప్లికేట్ బీజేపీ నేత సుజనా చౌదరి మాటలకు విలువే లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సుజనా డూప్లికేట్ బీజేపీ నేత కాబట్టే చంద్రబాబు అజెండా అమలు చేస్తున్నారని ఆరోపించారు. సుజనాపై ఎథిక్స్ కమిటీలో ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు.  బ్యాంకులను మోసం చేసి డబ్బులు ఎగ్గొట్టిన సుజనా లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా పార్లమెంట్ లో ప్రైవేట్ బిల్లు పెడతామని సంచలన వ్యాఖ్యలు చేశారు.  

చైనాకు షాక్ : వాటిపై పెరగనున్న సుంకం

విదేశాల నుంచి దిగుమతయ్యే యాక్టివ్‌ ఫార్మాసూటికల్‌ ఇన్‌గ్రీడియంట్స్‌ (ఏపీఐ) దిగుమతులపై భారత  ప్రభుత్వం త్వరలోనే షాక్ ఇవ్వనుంది. ఏపీఐ దిగమతులపై కస్టమ్స్ సుంకాన్ని10 నుంచి 15 శాతం దాకా  పెంచాలని  ఫార్మాస్యూటికల్స్ విభాగం (డీఓపీ) యోచిస్తోంది. ముడి ఔషధాల (ఏపీఐ) దేశీయ తయారీని ప్రోత్సాహం ఇవ్వడంతోపాటు,చైనాపై అధికంగా ఆధారపడటాన్ని తగ్గించాలన్న వ్యూహంలో భాగంగా కేంద్రం ఈ నిర్ణయం తీసుకోనుంది. ఏపీఐ దిగుమతులపై సుంకాన్ని 20-25 శాతంగా ఉంచేందుకు ప్రభుత్వం పరిశీలిస్తోందని ఎకనామిక్ టైమ్స్ నివేదించింది. ప్రస్తుతం ఇది 10 శాతం మాత్రమే. భారత్-చైనా సరిహద్దు వివాదం, ఇటు చైనా ఉత్పత్తులను నిషేధించాలన్న డిమాండ్ అటు ప్రధానంగా ఏఐపీల కోసం చైనాపై అధికంగా ఆధారపడుతున్న తరుణంలో ఇది చైనాకు ప్రతికూలంగా మారనుంది.   ప్రస్తుతం, భారతదేశం 68 శాతం ఏపీఐలు, 90 శాతం కంటే ఎక్కువ యాంటీబయాటిక్‌లను చైనా నుండి దిగుమతి చేసుకుంటోంది. దేశీయంగా  వాల్యూమ్ పరంగా ప్రపంచంలో మూడవ అతిపెద్దది. క్లిష్టమైన కీ స్టార్టింగ్ మెటీరియల్స్ (కెఎస్ఎం), డ్రగ్ ఇంటర్మీడియట్...