Skip to main content

జేడీయూతో విభేదాలు లేవు: అమిత్‌ షా




బీహార్ లోని తమ బీజేపీ-జేడీయూ కూట‌మిలో విభేదాలు ఉన్నాయ‌ంటూ వస్తున్న ప్రచారాన్ని కేంద్ర మంత్రి, బీజేపీ జాతీయాధ్యకుడు అమిత్ షా కొట్టిపారేశారు. వచ్చే ఏడాది జరగనున్న ఆ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, జేడీయూ కలిసే పోటీ చేస్తాయని ఆయన స్పష్టతనిచ్చారు. అలాగే, ఆ ఎన్నికల్లో తమ కూటమి నాయకత్వ బాధ్యతలను ముఖ్యమంత్రి నితీశ్ కుమారే చేప‌డతార‌ని తెలిపారు. అలాగే, ఈ ఎన్నికల అనంతరం కూడా ఆయనే ముఖ్యమంత్రిగా కొనసాగుతారని చెప్పారు.
 
కొంతకాలంగా నితీశ్ కుమార్ ప్రభుత్వంపై మిత్రపక్షం బీజేపీ నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఇరు పార్టీల మధ్య విభేదాలున్నట్లు ప్రచారం జరుగుతోంది. కాగా, ఈ ఏడాది జరిగిన లోక్ సభ ఎన్నికల్లో బీహార్‌లో బీజేపీ, జేడీయూ కలిసి పోటీ చేసిన విషయం తెలిసిందే. అయితే, ఈ ఏడాది జరిగే బీహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ ఈ ఇరు పార్టీలు కలిసే పోటీ చేస్తాయా? అన్న ప్రశ్నలు తలెత్తాయి. ఈ సందేహాలకు అమిత్ షా తెరదించారు.

Comments

Popular posts from this blog

అంబులెన్స్‌కు దారి ఇచ్చిన సీఎం కాన్వాయ్...‌

వీడియో చూడండి : Click here ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వాహన శ్రేణి అంబులెన్స్‌కు దారిఇచ్చింది. పులివెందుల నుంచి తిరిగివచ్చిన సీఎం గన్నవరం విమానాశ్రయం నుంచి తాడేపల్లి నివాసానికి బయల్దేరారు. గూడవల్లి నిడమానూరు మధ్య ప్రమాదంలో గాయపడ్డ వ్యక్తిని తరలిస్తున్న అబులెన్స్‌కు దారి ఇచ్చారు. ఉయ్యూరు నుంచి గన్నవరం బైక్‌పైవెళ్తున్న చాపర్తిన శేఖర్‌ అనే వ్యక్తి ఉషారామ ఇంజినీరింగ్‌కాలేజీ సమీపంలో ప్రమాదానికి గురయ్యారు. అతన్ని నేషనల్‌ హైవే అంబులెన్స్‌ ద్వారా విజయవాడ ఈఎస్‌ఐ ఆస్పత్రికి తరలిస్తుండగా, దీనికి ముందు ఉన్న ముఖ్యమంత్రి కాన్వాయ్‌ పక్కకు తొలగి అంబులెన్స్‌కు దారి ఇచ్చింది.

వారానికోసారి కష్టమేమీ కాదు... సీఎం జగన్‌ కేసులో సీబీఐ కౌంటర్

కోర్టుకు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని ఏపీ సీఎం జగన్ వేసిన పిటిషన్‌పై సీబీఐ కౌంటర్ దాఖలు చేసింది. అక్రమాస్తుల కేసు విచారణ నుంచి తనకు వ్యక్తిగత హాజరు మినహాయింపు ఇవ్వాలని ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సీబీఐ కోర్టులో వేసిన పిటిషన్‌పై సీబీఐ కౌంటర్ దాఖలు చేసింది. సీఎం జగన్ దాఖలు చేసిన పిటిషన్‌పై సీబీఐ అభ్యంతరం వ్యక్తం చేసింది. సాక్షులను జగన్ ప్రభావితం చేసే అవకాశం ఉందని పిటిషన్‌లో పేర్కొంది. ఆయన వాస్తవాలను దాచిపెట్టి పిటిషన్ వేశారని ఆరోపించింది. జగన్ జైల్లో ఉన్నప్పుడు సాక్షులను ప్రభావితం చేశారని... సీఎం పదవిలో ఉన్న జగన్ సాక్షులను మరింత ప్రభావితం చేసే అవకాశం ఉందని సీబీఐ తన పిటిషన్‌లో పేర్కొంది. ఏపీలో రెవెన్యూ లోటు అనేది సీఎంగా ఉన్న జగన్ వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇచ్చే కారణం కాదని తెలిపింది. సీఎంగా ఉన్న జగన్ విజయవాడ నుంచి వారానికోసారి హైదరాబాద్ రావడంకష్టమేమీ కాదని కౌంటర్‌ పిటిషన్‌లో సీబీఐ పేర్కొన్నట్టు తెలుస్తోంది. సీబీఐ కౌంటర్‌పై కోర్టు శుక్రవారం వాదనలు వినిపించనుంది.