Skip to main content

జేడీయూతో విభేదాలు లేవు: అమిత్‌ షా




బీహార్ లోని తమ బీజేపీ-జేడీయూ కూట‌మిలో విభేదాలు ఉన్నాయ‌ంటూ వస్తున్న ప్రచారాన్ని కేంద్ర మంత్రి, బీజేపీ జాతీయాధ్యకుడు అమిత్ షా కొట్టిపారేశారు. వచ్చే ఏడాది జరగనున్న ఆ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, జేడీయూ కలిసే పోటీ చేస్తాయని ఆయన స్పష్టతనిచ్చారు. అలాగే, ఆ ఎన్నికల్లో తమ కూటమి నాయకత్వ బాధ్యతలను ముఖ్యమంత్రి నితీశ్ కుమారే చేప‌డతార‌ని తెలిపారు. అలాగే, ఈ ఎన్నికల అనంతరం కూడా ఆయనే ముఖ్యమంత్రిగా కొనసాగుతారని చెప్పారు.
 
కొంతకాలంగా నితీశ్ కుమార్ ప్రభుత్వంపై మిత్రపక్షం బీజేపీ నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఇరు పార్టీల మధ్య విభేదాలున్నట్లు ప్రచారం జరుగుతోంది. కాగా, ఈ ఏడాది జరిగిన లోక్ సభ ఎన్నికల్లో బీహార్‌లో బీజేపీ, జేడీయూ కలిసి పోటీ చేసిన విషయం తెలిసిందే. అయితే, ఈ ఏడాది జరిగే బీహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ ఈ ఇరు పార్టీలు కలిసే పోటీ చేస్తాయా? అన్న ప్రశ్నలు తలెత్తాయి. ఈ సందేహాలకు అమిత్ షా తెరదించారు.

Comments

Popular posts from this blog

పవన్ కు శుభాకాంక్షలు చెప్పిన చిరంజీవి

  సినీనటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఈ రోజు పుట్టినరోజు వేడుక జరుపుకుంటోన్న నేపథ్యంలో ఆయనకు మెగాస్టార్ చిరంజీవి శుభాకాంక్షలు తెలిపారు.  ఆయనకు మహేశ్ బాబుతో పాటు పలువురు టాలీవుడ్ ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్లు చేశారు. సినిమాలతో పాటు రాజకీయాల్లో పవన్ కల్యాణ్ అద్భుత విజయాలు సాధించాలని తాము కోరుకుంటున్నట్లు తెలిపారు.

చింతమనేనికి బెయిల్ నిరాకరణ: అక్టోబర్ 9వరకు రిమాండ్ పొడిగింపు

తెలుగుదేశం పార్టీ నేత, దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కు కోర్టులో చుక్కెదురు అయ్యింది. చింతమనేనికి బెయిల్ ఇచ్చేందుకు ఏలూరు కోర్టు నిరాకరించింది. అంతేకాదు చింతమనేని రిమాండ్ ను అక్టోబర్ 9 వరకు పొండిగించింది.  2017లో అప్పనపాడు గ్రామంలో స్థల వివాదంలో వ్యక్తిని నిర్బంధించి కులం పేరుతో దూషించిన కేసులో కేసు నమోదు అయ్యింది. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులో భాగంగా ఇటీవలే చింతమనేని ప్రభాకర్ ను పోలీసులు అరెస్ట్ చేశారు.  అనంతరం చింతమనేని ప్రభాకర్ ను ఏలూరులోని ఎస్సీఎస్టీ అట్రాసిటీ కోర్టులో హాజరుపరచగా కోర్టు 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. రిమాండ్ పూర్తవ్వడంతో బుధవారం పోలీసులు మరోసారి ఏలూరు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కోర్టులో హాజరుపరిచారు.  అలాగే బెయిల్ ఇవ్వాలంటూ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తరపు న్యాయవాది సైతం కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. చింతమనేని బెయిల్ పిటీషన్ ను న్యాయస్థానం తోసిపుచ్చింది. అనంతరం చింతమనేని రిమాండ్ ను వచ్చే నెల 9 వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ఏలూరు కోర్టు.  ఇకపోతే చింతమనేని ప్రభాకర్ ను అరెస్ట్ చేసేందుకు వెళ్లిన సమయంలో మహిళా పో...