Skip to main content

అబ్‌కీ బార్ ట్రంప్ స‌ర్కార్‌.. మోదీ అలా అన‌లేదట‌



ఇటీవ‌ల అమెరికాలో జ‌రిగిన హౌడీ మోదీ స‌భ‌లో ప్ర‌సంగిస్తూ అబ్‌కీ బార్ ట్రంప్ స‌ర్కార్ అని ప్ర‌ధాని మోదీ అన్న విష‌యం తెలిసిందే. అమెరికా దేశాధ్య‌క్షుడిగా ట్రంప్ రెండ‌వ సారి పోటీ చేయ‌నున్నారు. ఈ నేప‌థ్యంలో ఆ స‌భ‌లో మోదీ మాట్లాడుతూ ఆ కామంట్ చేశారు. అయితే మోదీ అలా అన‌లేద‌ని ఇవాళ విదేశాంగ మంత్రి జైశంక‌ర్ అన్నారు. అమెరికా టూర్‌లో ఉన్న ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ మోదీ కామెంట్‌ను వ‌క్రీక‌రిస్తున్నార‌న్నారు. మోదీ చెప్పిన మాట‌ల‌ను త‌ప్పుగా చిత్రీక‌రిస్తున్నార‌ని జైశంక‌ర్ అన్నారు.

2020లో జ‌ర‌గ‌నున్న అమెరికా ఎన్నిక‌ల్లో భార‌త్ జోక్యం చేసుకుంటోంద‌న్న ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. ప్ర‌ధాని మోదీ ప్ర‌త్య‌క్షంగా ట్రంప్‌కు మ‌ద్ద‌తు ఇస్తున్న‌ట్లుగా మాట్లాడ‌ర‌ని కూడా కొంద‌రు విమ‌ర్శించారు. అయితే మోదీ వ్యాఖ్య‌ల‌ను వ‌క్రీక‌రిస్తున్నార‌ని జైశంక‌ర్ అన‌డాన్ని కాంగ్రెస్ పార్టీ ఎంపీ రాహుల్ తీవ్రంగా ఆక్షేపించారు. ప్ర‌ధాని మోదీ అస‌మ‌ర్థ‌త్వాన్ని క‌ప్పిపుచ్చుత‌న్న కేంద్ర మంత్రికి థ్యాంక్స్ అంటూ రాహుల్ ట్వీట్ చేశారు. అంత‌ర్జాతీయ దౌత్యం ఎలా చేయాలో కాస్త మోదీకి నేర్పాలంటూ జైశంక‌ర్‌ను కోరారు.

Comments

Popular posts from this blog

సుజనా చౌదరి లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా ప్రైవేట్ బిల్లు పెడతాం: వైసీపీ ఎంపీ బాలశౌరి

బీజేపీ ఎంపీ సుజనాచౌదరిపై వైసీపీ ఎంపీ బాలశౌరి తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేశారు. మొన్నటి వరకు టీడీపీలో ఉన్న సుజనాచౌదరి బీజేపీలో చేరింది చంద్రబాబు అజెండా మోయడానికి కాదా? రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమా? చంద్రబాబు ప్రయోజనాలు ముఖ్యమా? ప్రధాని మోదీకి వ్యతిరేకంగా గతంలో ధర్మదీక్షలు చేసింది సుజనా కాదా? అని ప్రశ్నించారు. పొలిటికల్ బ్రోకర్, డూప్లికేట్ బీజేపీ నేత సుజనా చౌదరి మాటలకు విలువే లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సుజనా డూప్లికేట్ బీజేపీ నేత కాబట్టే చంద్రబాబు అజెండా అమలు చేస్తున్నారని ఆరోపించారు. సుజనాపై ఎథిక్స్ కమిటీలో ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు.  బ్యాంకులను మోసం చేసి డబ్బులు ఎగ్గొట్టిన సుజనా లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా పార్లమెంట్ లో ప్రైవేట్ బిల్లు పెడతామని సంచలన వ్యాఖ్యలు చేశారు.  

చైనాకు షాక్ : వాటిపై పెరగనున్న సుంకం

విదేశాల నుంచి దిగుమతయ్యే యాక్టివ్‌ ఫార్మాసూటికల్‌ ఇన్‌గ్రీడియంట్స్‌ (ఏపీఐ) దిగుమతులపై భారత  ప్రభుత్వం త్వరలోనే షాక్ ఇవ్వనుంది. ఏపీఐ దిగమతులపై కస్టమ్స్ సుంకాన్ని10 నుంచి 15 శాతం దాకా  పెంచాలని  ఫార్మాస్యూటికల్స్ విభాగం (డీఓపీ) యోచిస్తోంది. ముడి ఔషధాల (ఏపీఐ) దేశీయ తయారీని ప్రోత్సాహం ఇవ్వడంతోపాటు,చైనాపై అధికంగా ఆధారపడటాన్ని తగ్గించాలన్న వ్యూహంలో భాగంగా కేంద్రం ఈ నిర్ణయం తీసుకోనుంది. ఏపీఐ దిగుమతులపై సుంకాన్ని 20-25 శాతంగా ఉంచేందుకు ప్రభుత్వం పరిశీలిస్తోందని ఎకనామిక్ టైమ్స్ నివేదించింది. ప్రస్తుతం ఇది 10 శాతం మాత్రమే. భారత్-చైనా సరిహద్దు వివాదం, ఇటు చైనా ఉత్పత్తులను నిషేధించాలన్న డిమాండ్ అటు ప్రధానంగా ఏఐపీల కోసం చైనాపై అధికంగా ఆధారపడుతున్న తరుణంలో ఇది చైనాకు ప్రతికూలంగా మారనుంది.   ప్రస్తుతం, భారతదేశం 68 శాతం ఏపీఐలు, 90 శాతం కంటే ఎక్కువ యాంటీబయాటిక్‌లను చైనా నుండి దిగుమతి చేసుకుంటోంది. దేశీయంగా  వాల్యూమ్ పరంగా ప్రపంచంలో మూడవ అతిపెద్దది. క్లిష్టమైన కీ స్టార్టింగ్ మెటీరియల్స్ (కెఎస్ఎం), డ్రగ్ ఇంటర్మీడియట్...