Skip to main content

అబ్‌కీ బార్ ట్రంప్ స‌ర్కార్‌.. మోదీ అలా అన‌లేదట‌



ఇటీవ‌ల అమెరికాలో జ‌రిగిన హౌడీ మోదీ స‌భ‌లో ప్ర‌సంగిస్తూ అబ్‌కీ బార్ ట్రంప్ స‌ర్కార్ అని ప్ర‌ధాని మోదీ అన్న విష‌యం తెలిసిందే. అమెరికా దేశాధ్య‌క్షుడిగా ట్రంప్ రెండ‌వ సారి పోటీ చేయ‌నున్నారు. ఈ నేప‌థ్యంలో ఆ స‌భ‌లో మోదీ మాట్లాడుతూ ఆ కామంట్ చేశారు. అయితే మోదీ అలా అన‌లేద‌ని ఇవాళ విదేశాంగ మంత్రి జైశంక‌ర్ అన్నారు. అమెరికా టూర్‌లో ఉన్న ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ మోదీ కామెంట్‌ను వ‌క్రీక‌రిస్తున్నార‌న్నారు. మోదీ చెప్పిన మాట‌ల‌ను త‌ప్పుగా చిత్రీక‌రిస్తున్నార‌ని జైశంక‌ర్ అన్నారు.

2020లో జ‌ర‌గ‌నున్న అమెరికా ఎన్నిక‌ల్లో భార‌త్ జోక్యం చేసుకుంటోంద‌న్న ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. ప్ర‌ధాని మోదీ ప్ర‌త్య‌క్షంగా ట్రంప్‌కు మ‌ద్ద‌తు ఇస్తున్న‌ట్లుగా మాట్లాడ‌ర‌ని కూడా కొంద‌రు విమ‌ర్శించారు. అయితే మోదీ వ్యాఖ్య‌ల‌ను వ‌క్రీక‌రిస్తున్నార‌ని జైశంక‌ర్ అన‌డాన్ని కాంగ్రెస్ పార్టీ ఎంపీ రాహుల్ తీవ్రంగా ఆక్షేపించారు. ప్ర‌ధాని మోదీ అస‌మ‌ర్థ‌త్వాన్ని క‌ప్పిపుచ్చుత‌న్న కేంద్ర మంత్రికి థ్యాంక్స్ అంటూ రాహుల్ ట్వీట్ చేశారు. అంత‌ర్జాతీయ దౌత్యం ఎలా చేయాలో కాస్త మోదీకి నేర్పాలంటూ జైశంక‌ర్‌ను కోరారు.

Comments

Popular posts from this blog

ఎలన్ మస్క్... స్టార్ షిప్ రెడీ... వచ్చే ఏడాది మార్స్ చెంతకు ప్రయాణం

మార్స్ గ్రహంపైకి వన్ వే ట్రిప్‌గా ఆసక్తి ఉన్న ప్రజలను పంపుతానని ప్రకటించిన ఆమెరికా బిలియనీర్ వ్యాపారి ఎలన్ మస్క్... అన్నంత పనీ చేస్తున్నారు. మనుషుల్ని చందమామ, మార్స్ చెంతకు తీసుకెళ్లడం కోసం ఆయన కంపెనీ స్పేస్ ఎక్స్... సరికొత్త విమానం తరహా స్పేస్ షిప్‌లను తయారుచేస్తోంది. ఇవి రాకెట్‌‌లా కాకుండా... విమానం లాగా... అంతరిక్షంలోకి వెళ్లి... గ్రహాలపై మనుషుల్ని దించేసి... తిరిగి ఖాళీగా వెనక్కి వచ్చేస్తాయి. గ్రహాలపైకి వెళ్లినవాళ్లు తిరిగి వచ్చే అవకాశాలు లేవు. ఇందుకు రిటర్న్ ట్రిప్ అవకాశం కల్పించట్లేదు ఎలన్ మస్క్. వన్ వే ట్రిప్‌గా వెళ్లేందుకు ఆసక్తి ఉన్నవారే టికెట్ బుక్ చేసుకోమని సూచిస్తున్నారు. తాజాగా ఆయన ఆవిష్కరించిన స్పేస్‌షిప్‌లో వంద మంది ప్రయాణించేందుకు వీలుంది. టెక్సాస్... బోకా చికాలో... ఎంతో మంది అంతరిక్ష ఔత్సాహికులు, రిపోర్టర్ల సమక్షంలో చందమామ, మార్స్‌పైకి పంపే స్టార్ షిప్‌ను ఆవిష్కరించారు ఎలన్ మస్క్. వచ్చే ఆరు నెలల్లో దాన్ని అంతరిక్షంలో ఓ రౌండ్ వేయించి... వచ్చే ఏడాది మనుషులను అందులో పంపాలనుకుంటున్నారు ఎలన్ మస్క్. ఎప్పుడో పదకొండు ఏళ్ల కిందట ఫాల్కన్-1 రాకెట్‌ను తయారుచేసింది స్పేస్ ఎక...

క్రెడిట్ పై పెట్రోలును కొనుగోలు చేస్తే నో క్యాష్‌బ్యాక్‌

క్రెడిట్‌ కార్డులను వినియోగించి పెట్రోలును కొనుగోలు చేస్తే ఇన్నాళ్లూ లభిస్తున్న 0.75 శాతం క్యాష్‌బ్యాక్‌ అక్టోబరు ఒకటో తేది నుంచి ఉండబోదని కంపెనీలు ప్ర‌క‌టించాయి.  2016లో పెద్ద నోట్లను రద్దు చేసిన తర్వాత డిజిటల్‌ చెల్లింపులను ప్రోత్సహించడానికి ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగానే డిస్కౌంట్‌ ఇవ్వాలని చమురు కంపెనీలను కోరింది. దీంతో డిజిటల్‌ చెల్లింపులను ప్రోత్సహించడానికి  2016 డిసెంబరు నుంచి క్రెడిట్‌, డెబిట్‌, ఈ-వాలెట్ల ద్వారా పెట్రోల్‌, డీజిల్‌ కొనుగోలు చేసే వారికి 0.75శాతం డిస్కౌంట్‌ను క్యాష్‌బ్యాక్‌ రూపంలో  ఇవ్వాల‌ని  చమురు కంపెనీలు క్యాష్‌బ్యాక్‌లను ప్రకటించిన విష‌యం తెలిసిందే. కాగా వచ్చే నెల ఒకటో తేది నుంచి ఆ డిస్కౌంట్‌ ఉండబోదని తాజాగా కంపెనీలు వెల్లడించాయి. ఇకమీదట డెబిట్‌, ఇతర డిజిటల్‌ పద్ధతుల ద్వారా చెల్లించేవారికి మాత్రం ఈ డిస్కౌంట్‌ యధావిధిగా కొనసాగుతుంది.