Skip to main content

అబ్‌కీ బార్ ట్రంప్ స‌ర్కార్‌.. మోదీ అలా అన‌లేదట‌



ఇటీవ‌ల అమెరికాలో జ‌రిగిన హౌడీ మోదీ స‌భ‌లో ప్ర‌సంగిస్తూ అబ్‌కీ బార్ ట్రంప్ స‌ర్కార్ అని ప్ర‌ధాని మోదీ అన్న విష‌యం తెలిసిందే. అమెరికా దేశాధ్య‌క్షుడిగా ట్రంప్ రెండ‌వ సారి పోటీ చేయ‌నున్నారు. ఈ నేప‌థ్యంలో ఆ స‌భ‌లో మోదీ మాట్లాడుతూ ఆ కామంట్ చేశారు. అయితే మోదీ అలా అన‌లేద‌ని ఇవాళ విదేశాంగ మంత్రి జైశంక‌ర్ అన్నారు. అమెరికా టూర్‌లో ఉన్న ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ మోదీ కామెంట్‌ను వ‌క్రీక‌రిస్తున్నార‌న్నారు. మోదీ చెప్పిన మాట‌ల‌ను త‌ప్పుగా చిత్రీక‌రిస్తున్నార‌ని జైశంక‌ర్ అన్నారు.

2020లో జ‌ర‌గ‌నున్న అమెరికా ఎన్నిక‌ల్లో భార‌త్ జోక్యం చేసుకుంటోంద‌న్న ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. ప్ర‌ధాని మోదీ ప్ర‌త్య‌క్షంగా ట్రంప్‌కు మ‌ద్ద‌తు ఇస్తున్న‌ట్లుగా మాట్లాడ‌ర‌ని కూడా కొంద‌రు విమ‌ర్శించారు. అయితే మోదీ వ్యాఖ్య‌ల‌ను వ‌క్రీక‌రిస్తున్నార‌ని జైశంక‌ర్ అన‌డాన్ని కాంగ్రెస్ పార్టీ ఎంపీ రాహుల్ తీవ్రంగా ఆక్షేపించారు. ప్ర‌ధాని మోదీ అస‌మ‌ర్థ‌త్వాన్ని క‌ప్పిపుచ్చుత‌న్న కేంద్ర మంత్రికి థ్యాంక్స్ అంటూ రాహుల్ ట్వీట్ చేశారు. అంత‌ర్జాతీయ దౌత్యం ఎలా చేయాలో కాస్త మోదీకి నేర్పాలంటూ జైశంక‌ర్‌ను కోరారు.

Comments

Popular posts from this blog

అత్యంత కష్టం మీద బోటును బయటికి తీసిన ధర్మాడి సత్యం బృందం

నెలరోజులకు పైగా గోదావరి నదీ గర్భంలోనే ఉండిపోయిన రాయల్ వశిష్ట బోటును ఎట్టకేలకు బయటికి తీశారు. ధర్మాడి సత్యం బృందం తీవ్ర ప్రయాసలకోర్చి బోటు ఆచూకీ గుర్తించడమే కాకుండా దాన్ని పైకి తీసుకువచ్చారు. మరికాసేపట్లో బోటును ఒడ్డుకు చేర్చనున్నారు. స్కూబా డైవర్ల సాయంతో బోటుకు లంగర్లు ఫిక్స్ చేసి పైకి తీసుకువచ్చేందుకు ధర్మాడి సత్యం బృందం చేసిన ప్రయత్నాలు ఫలించాయి. మొదట కొన్ని భాగాలుగా విడిపోయినా, ఆ తర్వాత మరోసారి ఐరన్ రోప్ లు బిగించి మొత్తం బోటును వెలికి తీశారు. గోదావరి ఉపరితలంపైకి చేరిన బోటును మరో రెండు గంటల్లో తీరానికి చేర్చే అవకాశాలున్నాయి.

మీడియాపై మాకు గౌరవముంది: కోటంరెడ్డి

  కొన్ని పత్రికలు, ఛానల్స్ తమ పాలనపై ప్రజల్లో అపోహలు సృష్టిస్తున్నాయని  వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. మీడియాపై తమకు గౌరవం ఉందని, అది ఎప్పటికీ కొనసాగుతుందని చెప్పారు. జీవో 2430 కొత్తగా తీసుకొచ్చింది కాదని, ఎప్పటినుంచో అది ఉందని తెలిపారు.  ఈ రోజు కోటంరెడ్డి మీడియాతో మాట్లాడారు. కొన్ని పత్రికలు, ఛానల్స్ పనికట్టుకుని తప్పుడు వార్తలతో అపోహలు సృష్టిస్తున్నాయన్నారు. తప్పుడు వార్తలు రాసేవారు భయపడాలని పేర్కొన్నారు. ఒకప్పుడు సాక్షి మీడియాను చంద్రబాబు అనుమతించనప్పుడు ఈ ఉద్యమ నేతలు ఎటుపోయారని నిలదీశారు. లోకేశ్ దీక్షలను చూసి ప్రజలు నవ్వుకుంటున్నారన్నారు. మంగళగిరి నియోజక వర్గంలో ఎన్ని ఓట్లు ఉన్నాయో కూడా లోకేశ్ కు తెలియదని విమర్శించారు. తమ పాలనను చంద్రబాబు సహించలేకపోతున్నారని ఆయన మండిపడ్డారు. చంద్రబాబు, తన హయాంలో తన కొడుకు లోకేశ్ తో కలిసి దోచుకుని లోటు బడ్జెట్ ను చూపెట్టారని విమర్శించారు. ప్రస్తుతం సీఎం జగన్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గాడిలో పెడుతున్నారని చెప్పారు.  చంద్రబాబుకు చదువుకునేటప్పటి నుంచే కులపిచ్చి ఉందని పేర్కొన్నారు. స్థాని...