Skip to main content

అబ్‌కీ బార్ ట్రంప్ స‌ర్కార్‌.. మోదీ అలా అన‌లేదట‌



ఇటీవ‌ల అమెరికాలో జ‌రిగిన హౌడీ మోదీ స‌భ‌లో ప్ర‌సంగిస్తూ అబ్‌కీ బార్ ట్రంప్ స‌ర్కార్ అని ప్ర‌ధాని మోదీ అన్న విష‌యం తెలిసిందే. అమెరికా దేశాధ్య‌క్షుడిగా ట్రంప్ రెండ‌వ సారి పోటీ చేయ‌నున్నారు. ఈ నేప‌థ్యంలో ఆ స‌భ‌లో మోదీ మాట్లాడుతూ ఆ కామంట్ చేశారు. అయితే మోదీ అలా అన‌లేద‌ని ఇవాళ విదేశాంగ మంత్రి జైశంక‌ర్ అన్నారు. అమెరికా టూర్‌లో ఉన్న ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ మోదీ కామెంట్‌ను వ‌క్రీక‌రిస్తున్నార‌న్నారు. మోదీ చెప్పిన మాట‌ల‌ను త‌ప్పుగా చిత్రీక‌రిస్తున్నార‌ని జైశంక‌ర్ అన్నారు.

2020లో జ‌ర‌గ‌నున్న అమెరికా ఎన్నిక‌ల్లో భార‌త్ జోక్యం చేసుకుంటోంద‌న్న ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. ప్ర‌ధాని మోదీ ప్ర‌త్య‌క్షంగా ట్రంప్‌కు మ‌ద్ద‌తు ఇస్తున్న‌ట్లుగా మాట్లాడ‌ర‌ని కూడా కొంద‌రు విమ‌ర్శించారు. అయితే మోదీ వ్యాఖ్య‌ల‌ను వ‌క్రీక‌రిస్తున్నార‌ని జైశంక‌ర్ అన‌డాన్ని కాంగ్రెస్ పార్టీ ఎంపీ రాహుల్ తీవ్రంగా ఆక్షేపించారు. ప్ర‌ధాని మోదీ అస‌మ‌ర్థ‌త్వాన్ని క‌ప్పిపుచ్చుత‌న్న కేంద్ర మంత్రికి థ్యాంక్స్ అంటూ రాహుల్ ట్వీట్ చేశారు. అంత‌ర్జాతీయ దౌత్యం ఎలా చేయాలో కాస్త మోదీకి నేర్పాలంటూ జైశంక‌ర్‌ను కోరారు.

Comments

Popular posts from this blog

బలపరీక్ష ఎప్పుడు నిర్వహించినా సిద్ధం.. తమ ఎమ్మెల్యేలను హోటళ్లకు తరలించిన శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్

మహారాష్ట్రలో నెలకొన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీలు తమ ఎమ్మెల్యేలను ముంబయిలోని పలు లగ్జరీ హోటళ్లకు తరలించాయి. తమ పార్టీ ఎమ్మెల్యేలను బీజేపీ ప్రలోభాలకు గురి చేయకుండా ఉండేందుకు ఆ పార్టీల అగ్రనేతలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అసెంబ్లీలో బీజేపీ బలనిరూపణ ఏ రోజు జరిగినా దానికి హాజరయ్యేందుకు సిద్ధంగా ఉండాలని ఆ మూడు పార్టీలు భావిస్తున్నాయి. ముంబయిలోని పోవైలో ఉన్న ఓ హోటల్ కు నిన్న రాత్రే ఎన్సీపీ ఎమ్మెల్యేలు బస్సుల్లో చేరుకున్నారు. శివసేన నుంచి 56 మంది నేతలు అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన విషయం తెలిసిందే. వారిలో 55 మంది  అధేరీలో ఉన్న ఓ హోటల్ లో ఉన్నారు. అలాగే, వారి నుంచి ఆ పార్టీ అధిష్ఠానం సెల్ ఫోన్ లను తీసుకుంది. కాంగ్రెస్ పార్టీ తమ 44 మంది ఎమ్మెల్యేలను మరో హోటల్ కి తరలించింది. అలాగే, శివసేన ఎమ్మెల్యేలు ఉన్న హోటల్ లోనే ఎనిమిది మంది స్వతంత్ర ఎమ్మెల్యేలు కూడా ఉన్నారని ఇండిపెండెంట్ ఎమ్మెల్యే రాజ్ కుమార్ పటేల్ మీడియాకు చెప్పారు. 

రామమందిర నిర్మాణానికి ముహూర్తం ఖరారు: బీజేపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు

అయోధ్యలో రామమందిర నిర్మాణానికి ముహూర్తం ఖరారయ్యిందన్నట్లు మాట్లాడి ఓ బీజేపీ ఎమ్మెల్యే సంచలనానికి తెరతీశారు. నవంబరు 18వ తేదీన నిర్మాణం ప్రారంభమవుతుందంటూ డేట్‌ కూడా ఫిక్స్‌ చేసేశారు. ప్రస్తుతం ఈ వివాదం కోర్టు పరిధిలో వుంది. రామాలయ నిర్మాణం విషయంలో శుభవార్త వింటారని ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాధ్ రెండు రోజుల క్రితమే వ్యాఖ్యానించారు. ఈ సమయంలో ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు మరింత ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. వివరాల్లోకి వెళితే...రాజస్థాన్‌ రాష్ట్రం పాలి జిల్లా కేంద్రంలో జరిగిన రాంలీలా కార్యక్రమంలో పాల్గొన్న స్థానిక ఎమ్మెల్యే గైన్‌చంద్‌ పరఖ్‌ మాట్లాడారు. సుప్రీం కోర్టులో విచారణ జరుగుతున్న రామజన్మభూమి కేసు నవంబరు 17వ తేదీ నాటికి కొలిక్కి వస్తుందని, 18వ తేదీన రామమందిర నిర్మాణం మొదలవుతుందని చెప్పారు. బీజేపీ ఎమ్మెల్యే వ్యాఖ్యలపై ఆసక్తికర చర్చ సాగుతోంది.