Skip to main content

చంద్రబాబును లోపల వేయడానికి బాగా ప్రయత్నాలు జరుగుతున్నాయి: జేసీ వ్యాఖ్యలు




ఏపీలో మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబును జైలుకు పంపడానికి తీవ్రస్థాయిలో ప్రయత్నాలు జరుగుతున్నాయని సీనియర్ రాజకీయవేత్త జేసీ దివాకర్ రెడ్డి అంటున్నారు. ఓ మీడియా చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వం వైపు నుంచి చంద్రబాబును లోపలికి పంపే యత్నాలు జరగడం సాధారణమేనని, ఇందులో బీజేపీ పాత్ర ఉందో, లేదో సరిగా చెప్పలేను కానీ, వైసీపీ మాత్రం చంద్రబాబును లక్ష్యంగా చేసుకుందని జేసీ వివరించారు. తాను ఇదే విషయాన్ని చంద్రబాబును కూడా అడిగినట్టు వెల్లడించారు.

"ఏం బాబూ ఎప్పుడు లోపలికి వెళ్లేది అని చంద్రబాబును అడిగితే, నేను లోపలికి పోను దివాకర్ రెడ్డీ, వీళ్లు నన్నేమీ చేయలేరు అని చెప్పారు. నేను ఏ విషయాన్ని దాచుకోను. అందుకే చంద్రబాబును అడిగితే ఆయన నేనేమీ తప్పు చేయలేదు, నాకేమీ కాదు అని ధీమా వ్యక్తం చేశారు" అంటూ జేసీ వివరించారు.

అప్పట్లో అమాయకుడైన జగన్ ను చంద్రబాబు, సోనియా అందరూ కలిసి జైల్లో వేశారని వైసీపీ వాళ్లు అనుకుంటుంటారని వెల్లడించారు. అందులో నిజం ఎంతో తనకు తెలియదు కానీ, 45 ఏళ్ల నవయువకుడైన జగన్ కు కోపమో, తాపమో ఉండడం సహజమేనని, అతని ఆవేశాన్ని తాను తప్పుబట్టడంలేదని అన్నారు. జగన్ పుట్టిపెరిగిన వాతావరణం, అతను పీల్చిన గాలి, ఇతర పరిస్థితుల ప్రకారం చంద్రబాబును లోపల వేయాలన్న ఆలోచన అతనిలో ఉంటే ఆశ్చర్యపోవాల్సిన పనిలేదని జేసీ అభిప్రాయపడ్డారు.
ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జగన్ సీఎం అయ్యాక కలిసి అభినందించే అవకాశం రాలేదని వెల్లడించారు. ఎదురుపడితే తప్పకుండా మాట్లాడతానని స్పష్టం చేశారు. జగన్ కుటుంబంతో తమకు సన్నిహిత సంబంధాలున్నాయని తెలిపారు. జగన్ పెద్దమ్మ ఎన్నికల ముందు ఓసారి తనతో మాట్లాడారని వెల్లడించారు.

"ఎంత పనిచేస్తివన్నా, మీరందరూ దూరమైపోయారు అని అడిగింది. ఆయన వైపు నుంచి సరైన ఆహ్వానం లేకపోతే నన్నేం చేయమంటావు చెప్పు అన్నాను. ఇప్పటికీ జగన్ అన్నా, ఆయన కుటుంబ సభ్యులన్నా వ్యక్తిగతంగా ఎంతో గౌరవం ఉంది" అని జేసీ వివరించారు. ఇప్పుడు మరో పార్టీలోకి వెళ్లేందుకు తాను సిద్ధంగా లేనని, కానీ జగన్ తదితరులు ఎక్కడన్నా కనిపిస్తే మాత్రం మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నానని వివరణ ఇచ్చారు. వాళ్లు తనకేమీ వ్యక్తిగత శత్రువులు కారని, రాజకీయ విభేదాలు ఉంటాయని తెలిపారు.


Comments

Popular posts from this blog

బలపరీక్ష ఎప్పుడు నిర్వహించినా సిద్ధం.. తమ ఎమ్మెల్యేలను హోటళ్లకు తరలించిన శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్

మహారాష్ట్రలో నెలకొన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీలు తమ ఎమ్మెల్యేలను ముంబయిలోని పలు లగ్జరీ హోటళ్లకు తరలించాయి. తమ పార్టీ ఎమ్మెల్యేలను బీజేపీ ప్రలోభాలకు గురి చేయకుండా ఉండేందుకు ఆ పార్టీల అగ్రనేతలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అసెంబ్లీలో బీజేపీ బలనిరూపణ ఏ రోజు జరిగినా దానికి హాజరయ్యేందుకు సిద్ధంగా ఉండాలని ఆ మూడు పార్టీలు భావిస్తున్నాయి. ముంబయిలోని పోవైలో ఉన్న ఓ హోటల్ కు నిన్న రాత్రే ఎన్సీపీ ఎమ్మెల్యేలు బస్సుల్లో చేరుకున్నారు. శివసేన నుంచి 56 మంది నేతలు అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన విషయం తెలిసిందే. వారిలో 55 మంది  అధేరీలో ఉన్న ఓ హోటల్ లో ఉన్నారు. అలాగే, వారి నుంచి ఆ పార్టీ అధిష్ఠానం సెల్ ఫోన్ లను తీసుకుంది. కాంగ్రెస్ పార్టీ తమ 44 మంది ఎమ్మెల్యేలను మరో హోటల్ కి తరలించింది. అలాగే, శివసేన ఎమ్మెల్యేలు ఉన్న హోటల్ లోనే ఎనిమిది మంది స్వతంత్ర ఎమ్మెల్యేలు కూడా ఉన్నారని ఇండిపెండెంట్ ఎమ్మెల్యే రాజ్ కుమార్ పటేల్ మీడియాకు చెప్పారు. 

రామమందిర నిర్మాణానికి ముహూర్తం ఖరారు: బీజేపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు

అయోధ్యలో రామమందిర నిర్మాణానికి ముహూర్తం ఖరారయ్యిందన్నట్లు మాట్లాడి ఓ బీజేపీ ఎమ్మెల్యే సంచలనానికి తెరతీశారు. నవంబరు 18వ తేదీన నిర్మాణం ప్రారంభమవుతుందంటూ డేట్‌ కూడా ఫిక్స్‌ చేసేశారు. ప్రస్తుతం ఈ వివాదం కోర్టు పరిధిలో వుంది. రామాలయ నిర్మాణం విషయంలో శుభవార్త వింటారని ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాధ్ రెండు రోజుల క్రితమే వ్యాఖ్యానించారు. ఈ సమయంలో ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు మరింత ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. వివరాల్లోకి వెళితే...రాజస్థాన్‌ రాష్ట్రం పాలి జిల్లా కేంద్రంలో జరిగిన రాంలీలా కార్యక్రమంలో పాల్గొన్న స్థానిక ఎమ్మెల్యే గైన్‌చంద్‌ పరఖ్‌ మాట్లాడారు. సుప్రీం కోర్టులో విచారణ జరుగుతున్న రామజన్మభూమి కేసు నవంబరు 17వ తేదీ నాటికి కొలిక్కి వస్తుందని, 18వ తేదీన రామమందిర నిర్మాణం మొదలవుతుందని చెప్పారు. బీజేపీ ఎమ్మెల్యే వ్యాఖ్యలపై ఆసక్తికర చర్చ సాగుతోంది.