Skip to main content

బోటు వెలికితీత ప్రయత్నంలో.. బలంగా లాగడంతో వంగిపోయిన లంగరు

 


తూర్పుగోదావరి జిల్లా కచ్చులూరు వద్ద గోదావరిలో మునిగిపోయిన బోటు వెలికితీత పనులు కొనసాగుతున్నాయి. ధర్మాడి సత్యం బృందం సర్వశక్తులు ఒడ్డి శ్రమిస్తున్నా బోటు వెలికితీత అత్యంత కష్టంగా పరిణమిస్తోంది. బోటు రెయిలింగ్ లంగరుకు తగులుకుని బయటికి రావడంతో ధర్మాడి సత్యం బృందంలో ఉత్సాహం రెట్టించింది. అయితే, ఓ పెద్ద లంగరుతో బోటును చుట్టి బయటికి లాగేందుకు ప్రయత్నించినా ఈసారి లంగరు వంగిపోయింది. ఈ పరిణామంతో ధర్మాడి సత్యం బృందం నిరాశకు గురైంది. ఎవరైనా నదిలో దిగి బోటుకు సరైన ప్రాంతంలో లంగరు ఫిక్స్ చేస్తే తప్ప బోటు బయటికి రాదని సత్యం భావిస్తున్నారు. ఇప్పటికే కొందరిని సంప్రదించినా నదిలో లోతుకు వెళ్లేందుకు ఎవరూ ముందుకు రావడంలేదు.    

Comments

Popular posts from this blog

అమరావతిలో భూముల రేట్లు తగ్గకుండా: సీఆర్డీఏ స్థానంలో కొత్త అథారిటీ: కీలక నోటిఫికేషన్

 మూడు రాజధానులను ఏర్పాటు చేయడానికి ఉద్దేశించిన ఏపీ వికేంద్రీకరణ బిల్లు ఆమోదం పొందడం, రాజధాని ప్రాంత అభివృద్ధి అథారిటీ (సీఆర్డీ) రద్దు నేపథ్యంలో.. ప్రభుత్వం మెరుపు వేగంతో నిర్ణయాలను తీసుకుంటోంది. పరిపాలనను వేగవంతం చేసేలా తక్షణ చర్యలకు దిగింది. సీఆర్డీఏ బిల్లు రద్దు అనంతరం దాని స్థానంలో అమరావతి మెట్రోపాలిటన్ ప్రాంత అభివృద్ధి మండలిని ఏర్పాటు చేస్తామని ప్రకటించిన ప్రభుత్వం.. దాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. ఏఎంఆర్డీఏ కమిటీ సభ్యులనూ నియమించింది. సీఆర్డీఏకు బదులుగా ఏఎంఆర్డీఏ సీఆర్డీఏ స్థాయంలో అమరావతి మెట్రోపాలిటన్ ప్రాంత అభివృద్ధి మండలి (ఏఎంఆర్డీఏ)ని ఏర్పాటు చేసింది. ఈ మేరకు నోటిఫికేషన్‌ను జారీ చేసింది. సీఆర్డీఏను రద్దు చేస్తూ అసెంబ్లీ ఆమోదించిన తీర్మానంపై గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆమోదముద్ర వేసిన మరుసటి రోజే ఏఎంఆర్డీఏను తెరపైకి తీసుకొచ్చింది. దానితో పాటు కొత్త సభ్యులను నియమించింది. మున్సిపల్ శాఖ కార్యదర్శి జే శ్యామల రావు దీనికి సంబంధించిన నోటిఫికేషన్‌ను జారీ చేశారు. మొత్తం 11 మంది సభ్యులను ఏఎంఆర్డీఏ కమిటీలో నియమించారు. సభ్యులు వీరే.. మున్సిపల్ శాఖ కార్యదర్శి డిప్య...