Skip to main content

సాక్షి మాజీ యాంకర్ , నటుడు శ్రీనివాస్ రెడ్డీలకు జగన్ కీలక పదవులు



తిరుమల , తిరుపతి దేవస్థానం శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ( ఎస్వీబీసీ ) బోర్డులో డైరెక్టర్లుగా టీవీ యాంకర్ స్వప్న , నటుడు ‌శ్రీనివాస్ రెడ్డీలను ఏపీ ప్రభుత్వం నియమించింది . ఎస్వీబీసీ చైర్మెన్ గా పృధ్వీరాజ్ బాలిరెడ్డీని గతంలో నియమించిన సంగతి తెలిసిందే.ఆయనతో కలిసి ఈ డైరెక్టర్స్ ఇద్దరూ పనిచేయనన్నారు .

వాస్తవానికి ఎస్వీబీసీ బోర్డులో చైర్మన్ తో పాటు టీడీపీ పాలకమండలి సభ్యులను డైరెక్టర్లుగా నియమించడం ఆనవాయితీగా వస్తుంది . కానీ ప్రభుత్వం ఈసారి ఆ సాంప్రదాయానికి స్వస్తి పలికి ఇతరులకు అవకాశం కల్పించింది . యాంకర్ స్వప్న తొలుత దూరదర్శన్ , టీవీ 9 లో పనిచేసి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు . టీవీ 9 లో దాదాపు పదేళ్లకు పైగా పనిచేసి తరువాత సాక్షి ఛానల్లో చేరారు . కొన్నాళ్లు అందులో పనిచేసి బయటకి వచ్చినా సాక్షీకి కన్సెల్టెంట్ గా పనిచేయడం విశేషం .

ప్రస్తుతం 10 టీవీలో పనిచేస్తున్న స్వప్న సొంతంగా ఓ వెబ్ చానల్ నడుపుతున్నారు . దీనిద్వారా జగన్ మీద విధేయతా చాటుకుంటూనే ఉన్నారు . నాటి టీడీపీ ప్రభుత్వాన్ని తన ఇంటర్వ్యూల ద్వారా ఇరుకున పెట్టి జగన్ కు అనుకూలంగా వ్యవహరించారు . ఎన్నికల సమయంలో జగన్ కి ఉడతా భక్తిగా సాయంచేసి అధికారంలోకి రావడానికి సహకరించారు . తనపై ఉడతాభక్తి చాటుకున్న స్వప్నాకు ఎస్వీబీసీ లో.డైరెక్టర్ పదవి కట్టబెట్టి జగన్ రుణం తీర్చుకున్నారనే వాదన వినిపిస్తుంది .

Comments

Popular posts from this blog

సుజనా చౌదరి లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా ప్రైవేట్ బిల్లు పెడతాం: వైసీపీ ఎంపీ బాలశౌరి

బీజేపీ ఎంపీ సుజనాచౌదరిపై వైసీపీ ఎంపీ బాలశౌరి తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేశారు. మొన్నటి వరకు టీడీపీలో ఉన్న సుజనాచౌదరి బీజేపీలో చేరింది చంద్రబాబు అజెండా మోయడానికి కాదా? రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమా? చంద్రబాబు ప్రయోజనాలు ముఖ్యమా? ప్రధాని మోదీకి వ్యతిరేకంగా గతంలో ధర్మదీక్షలు చేసింది సుజనా కాదా? అని ప్రశ్నించారు. పొలిటికల్ బ్రోకర్, డూప్లికేట్ బీజేపీ నేత సుజనా చౌదరి మాటలకు విలువే లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సుజనా డూప్లికేట్ బీజేపీ నేత కాబట్టే చంద్రబాబు అజెండా అమలు చేస్తున్నారని ఆరోపించారు. సుజనాపై ఎథిక్స్ కమిటీలో ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు.  బ్యాంకులను మోసం చేసి డబ్బులు ఎగ్గొట్టిన సుజనా లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా పార్లమెంట్ లో ప్రైవేట్ బిల్లు పెడతామని సంచలన వ్యాఖ్యలు చేశారు.  

తెలంగాణ సర్కారుకు దర్శకుడు హరీశ్ శంకర్ సలహా

  హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ సమస్యలను తగ్గించడానికి మంత్రి కేటీఆర్ అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సమావేశంపై తెలంగాణ ఐటీ, పరిశ్రమల మంత్రిత్వ శాఖ ట్విట్టర్ లో పోస్ట్ చేయగా, దానిపై దర్శకుడు హరీశ్ శంకర్ స్పందించారు. హైదరాబాద్ నగరానికి స్లిప్ రోడ్ల అవసరం ఎంతో ఉందని తెలిపారు. మంత్రి కేటీఆర్ సమావేశంలో కొత్త స్లిప్ రోడ్ల అంశం కూడా చర్చకు రాగా, తక్షణ అవసరం అదేనని హరీశ్ శంకర్ అభిప్రాయపడ్డారు. హరీశ్ ప్రతిపాదనకు నెటిజన్ల నుంచి గణనీయమైన స్థాయిలో మద్దతు లభిస్తోంది.