Skip to main content

సాక్షి మాజీ యాంకర్ , నటుడు శ్రీనివాస్ రెడ్డీలకు జగన్ కీలక పదవులు



తిరుమల , తిరుపతి దేవస్థానం శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ( ఎస్వీబీసీ ) బోర్డులో డైరెక్టర్లుగా టీవీ యాంకర్ స్వప్న , నటుడు ‌శ్రీనివాస్ రెడ్డీలను ఏపీ ప్రభుత్వం నియమించింది . ఎస్వీబీసీ చైర్మెన్ గా పృధ్వీరాజ్ బాలిరెడ్డీని గతంలో నియమించిన సంగతి తెలిసిందే.ఆయనతో కలిసి ఈ డైరెక్టర్స్ ఇద్దరూ పనిచేయనన్నారు .

వాస్తవానికి ఎస్వీబీసీ బోర్డులో చైర్మన్ తో పాటు టీడీపీ పాలకమండలి సభ్యులను డైరెక్టర్లుగా నియమించడం ఆనవాయితీగా వస్తుంది . కానీ ప్రభుత్వం ఈసారి ఆ సాంప్రదాయానికి స్వస్తి పలికి ఇతరులకు అవకాశం కల్పించింది . యాంకర్ స్వప్న తొలుత దూరదర్శన్ , టీవీ 9 లో పనిచేసి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు . టీవీ 9 లో దాదాపు పదేళ్లకు పైగా పనిచేసి తరువాత సాక్షి ఛానల్లో చేరారు . కొన్నాళ్లు అందులో పనిచేసి బయటకి వచ్చినా సాక్షీకి కన్సెల్టెంట్ గా పనిచేయడం విశేషం .

ప్రస్తుతం 10 టీవీలో పనిచేస్తున్న స్వప్న సొంతంగా ఓ వెబ్ చానల్ నడుపుతున్నారు . దీనిద్వారా జగన్ మీద విధేయతా చాటుకుంటూనే ఉన్నారు . నాటి టీడీపీ ప్రభుత్వాన్ని తన ఇంటర్వ్యూల ద్వారా ఇరుకున పెట్టి జగన్ కు అనుకూలంగా వ్యవహరించారు . ఎన్నికల సమయంలో జగన్ కి ఉడతా భక్తిగా సాయంచేసి అధికారంలోకి రావడానికి సహకరించారు . తనపై ఉడతాభక్తి చాటుకున్న స్వప్నాకు ఎస్వీబీసీ లో.డైరెక్టర్ పదవి కట్టబెట్టి జగన్ రుణం తీర్చుకున్నారనే వాదన వినిపిస్తుంది .

Comments

Popular posts from this blog

అత్యంత కష్టం మీద బోటును బయటికి తీసిన ధర్మాడి సత్యం బృందం

నెలరోజులకు పైగా గోదావరి నదీ గర్భంలోనే ఉండిపోయిన రాయల్ వశిష్ట బోటును ఎట్టకేలకు బయటికి తీశారు. ధర్మాడి సత్యం బృందం తీవ్ర ప్రయాసలకోర్చి బోటు ఆచూకీ గుర్తించడమే కాకుండా దాన్ని పైకి తీసుకువచ్చారు. మరికాసేపట్లో బోటును ఒడ్డుకు చేర్చనున్నారు. స్కూబా డైవర్ల సాయంతో బోటుకు లంగర్లు ఫిక్స్ చేసి పైకి తీసుకువచ్చేందుకు ధర్మాడి సత్యం బృందం చేసిన ప్రయత్నాలు ఫలించాయి. మొదట కొన్ని భాగాలుగా విడిపోయినా, ఆ తర్వాత మరోసారి ఐరన్ రోప్ లు బిగించి మొత్తం బోటును వెలికి తీశారు. గోదావరి ఉపరితలంపైకి చేరిన బోటును మరో రెండు గంటల్లో తీరానికి చేర్చే అవకాశాలున్నాయి.

మీడియాపై మాకు గౌరవముంది: కోటంరెడ్డి

  కొన్ని పత్రికలు, ఛానల్స్ తమ పాలనపై ప్రజల్లో అపోహలు సృష్టిస్తున్నాయని  వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. మీడియాపై తమకు గౌరవం ఉందని, అది ఎప్పటికీ కొనసాగుతుందని చెప్పారు. జీవో 2430 కొత్తగా తీసుకొచ్చింది కాదని, ఎప్పటినుంచో అది ఉందని తెలిపారు.  ఈ రోజు కోటంరెడ్డి మీడియాతో మాట్లాడారు. కొన్ని పత్రికలు, ఛానల్స్ పనికట్టుకుని తప్పుడు వార్తలతో అపోహలు సృష్టిస్తున్నాయన్నారు. తప్పుడు వార్తలు రాసేవారు భయపడాలని పేర్కొన్నారు. ఒకప్పుడు సాక్షి మీడియాను చంద్రబాబు అనుమతించనప్పుడు ఈ ఉద్యమ నేతలు ఎటుపోయారని నిలదీశారు. లోకేశ్ దీక్షలను చూసి ప్రజలు నవ్వుకుంటున్నారన్నారు. మంగళగిరి నియోజక వర్గంలో ఎన్ని ఓట్లు ఉన్నాయో కూడా లోకేశ్ కు తెలియదని విమర్శించారు. తమ పాలనను చంద్రబాబు సహించలేకపోతున్నారని ఆయన మండిపడ్డారు. చంద్రబాబు, తన హయాంలో తన కొడుకు లోకేశ్ తో కలిసి దోచుకుని లోటు బడ్జెట్ ను చూపెట్టారని విమర్శించారు. ప్రస్తుతం సీఎం జగన్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గాడిలో పెడుతున్నారని చెప్పారు.  చంద్రబాబుకు చదువుకునేటప్పటి నుంచే కులపిచ్చి ఉందని పేర్కొన్నారు. స్థాని...