Skip to main content

దుష్యంత్ చౌతాలాపై మండిపడ్డ కాంగ్రెస్

 

జేజేపీతో పాటు ఇండిపెండెంట్ల మద్దతుతో హర్యానాలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. నిన్న ఉదయం జేజేపీ అధినేత దుష్యంత్ చౌతాలా ఢిల్లీలో మాట్లాడుతూ, బీజేపీకి మద్దతు పలికే అవకాశమే లేదంటూ కుండ బద్దలు కొట్టారు. కానీ, సాయంత్రానికల్లా మాట మార్చేసి, బీజేపీకి మద్దతు పలుకుతున్నట్టు ప్రకటించి, అందరినీ ఆశ్చర్యపరిచారు. ఈ నేపథ్యంలో, దుష్యంత్ చౌతాలాపై కాంగ్రెస్ మండిపడింది. కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణదీప్ సూర్జేవాలా ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ, జేజేపీ, లోక్ దళ్ పార్టీలు ఎప్పుడూ బీజేపీ తొత్తులేనంటూ తీవ్ర వ్యాఖ్యలు చేవారు. దుష్యంత్ చౌతాలా మాట తప్పారని మండిపడ్డారు.

హర్యానాలో మనోహర్ లాల్ ఖట్టర్ ప్రభుత్వాన్ని ప్రజలు తిరస్కరించారనేది నిజమనే విషయం అందరికీ తెలుసని సూర్జేవాలా అన్నారు. బీజేపీని వ్యతిరేకించడం వల్లే జేజేపీ 10 సీట్లను గెలుచుకుందని... బీజేపీతో ఎప్పటికీ పొత్తు పెట్టుకోబోమని ఆ పార్టీ ప్రకటించిందని... ఇప్పుడు అధికార కాంక్షకే ఆ పార్టీ పెద్ద పీట వేసిందని మండిపడ్డారు. సమాజాన్ని చీల్చి అధికారంలోకి రావాలని బీజేపీ ఎప్పుడు ప్రయత్నించినా... జేజేపీ, లోక్ దళ్ పార్టీలు దానికి తొత్తులుగా నిలుస్తున్నాయని విమర్శించారు.   

Comments

Popular posts from this blog

సుజనా చౌదరి లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా ప్రైవేట్ బిల్లు పెడతాం: వైసీపీ ఎంపీ బాలశౌరి

బీజేపీ ఎంపీ సుజనాచౌదరిపై వైసీపీ ఎంపీ బాలశౌరి తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేశారు. మొన్నటి వరకు టీడీపీలో ఉన్న సుజనాచౌదరి బీజేపీలో చేరింది చంద్రబాబు అజెండా మోయడానికి కాదా? రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమా? చంద్రబాబు ప్రయోజనాలు ముఖ్యమా? ప్రధాని మోదీకి వ్యతిరేకంగా గతంలో ధర్మదీక్షలు చేసింది సుజనా కాదా? అని ప్రశ్నించారు. పొలిటికల్ బ్రోకర్, డూప్లికేట్ బీజేపీ నేత సుజనా చౌదరి మాటలకు విలువే లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సుజనా డూప్లికేట్ బీజేపీ నేత కాబట్టే చంద్రబాబు అజెండా అమలు చేస్తున్నారని ఆరోపించారు. సుజనాపై ఎథిక్స్ కమిటీలో ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు.  బ్యాంకులను మోసం చేసి డబ్బులు ఎగ్గొట్టిన సుజనా లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా పార్లమెంట్ లో ప్రైవేట్ బిల్లు పెడతామని సంచలన వ్యాఖ్యలు చేశారు.  

తెలంగాణ సర్కారుకు దర్శకుడు హరీశ్ శంకర్ సలహా

  హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ సమస్యలను తగ్గించడానికి మంత్రి కేటీఆర్ అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సమావేశంపై తెలంగాణ ఐటీ, పరిశ్రమల మంత్రిత్వ శాఖ ట్విట్టర్ లో పోస్ట్ చేయగా, దానిపై దర్శకుడు హరీశ్ శంకర్ స్పందించారు. హైదరాబాద్ నగరానికి స్లిప్ రోడ్ల అవసరం ఎంతో ఉందని తెలిపారు. మంత్రి కేటీఆర్ సమావేశంలో కొత్త స్లిప్ రోడ్ల అంశం కూడా చర్చకు రాగా, తక్షణ అవసరం అదేనని హరీశ్ శంకర్ అభిప్రాయపడ్డారు. హరీశ్ ప్రతిపాదనకు నెటిజన్ల నుంచి గణనీయమైన స్థాయిలో మద్దతు లభిస్తోంది.