Skip to main content

దీక్ష కొనసాగిస్తున్న కొల్లు రవీంద్ర


దీక్ష కొనసాగిస్తున్న కొల్లు రవీంద్ర
 కృత్రిమ ఇసుక కొరతను నిరసిస్తూ చేపట్టిన 36 గంటల దీక్షను పోలీసులు భగ్నం చేసినప్పటికీ.. మచిలీపట్నంలోని ఇంటిదగ్గర కొల్లు రవీంద్ర దీక్షను కొనసాగిస్తున్నారు. ఇసుక కొరతపై గాంధీ అహింసా మార్గంలో దీక్ష పట్టాలని నిర్ణయం తీసుకుంటే.. పోలీసులు తమను రాత్రి నుంచి వేధిస్తూ దీక్షను అడ్డుకుంటున్నారని కొల్లు ఆరోపించారు. రెండు పోలీస్ స్టేషన్లు తిప్పి ఇంటికి‌ తీసుకొచ్చారని ఆయన మండిపడ్డారు. జగన్ నియంతలా మారి ప్రజావ్యతిరేక విధానాలతో రాష్ట్ర ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారని దుయ్యబట్టారు. ఇవాళ రాష్ట్రంలో ఇసుక లేక అసంఘటిత కార్మికులు పస్తులుంటున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. కొత్త ఇసుక పాలసీ వచ్చి నెల రోజులు గడుస్తున్నా సామాన్యులకు ఇసుక దొరకడం లేదని ఆరోపించారు. వైకాపా నాయకులకే ఇసుక కేంద్రాల నుంచి ఇసుక తరలిపోతోందని మండిపడ్డారు. ప్రభుత్వానికి ఈ విషయం తమ నిరసన ద్వారా చెప్పాలని చూస్తే పోలీసుల ద్వారా అడ్డుకుంటున్నారని విమర్శించారు. ప్రభుత్వ, పోలీసుల బెదిరింపులకు భయపడేది లేదని ఆయన స్పష్టంచేశారు. 36 గంటల దీక్షతో ఆపేది లేదని, సామాన్యులకు ఇసుక చేరేవరకూ దఫదఫాలుగా తమ నిరసన కొనసాగిస్తామని తేల్చిచెప్పారు.

Comments

Popular posts from this blog

సుజనా చౌదరి లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా ప్రైవేట్ బిల్లు పెడతాం: వైసీపీ ఎంపీ బాలశౌరి

బీజేపీ ఎంపీ సుజనాచౌదరిపై వైసీపీ ఎంపీ బాలశౌరి తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేశారు. మొన్నటి వరకు టీడీపీలో ఉన్న సుజనాచౌదరి బీజేపీలో చేరింది చంద్రబాబు అజెండా మోయడానికి కాదా? రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమా? చంద్రబాబు ప్రయోజనాలు ముఖ్యమా? ప్రధాని మోదీకి వ్యతిరేకంగా గతంలో ధర్మదీక్షలు చేసింది సుజనా కాదా? అని ప్రశ్నించారు. పొలిటికల్ బ్రోకర్, డూప్లికేట్ బీజేపీ నేత సుజనా చౌదరి మాటలకు విలువే లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సుజనా డూప్లికేట్ బీజేపీ నేత కాబట్టే చంద్రబాబు అజెండా అమలు చేస్తున్నారని ఆరోపించారు. సుజనాపై ఎథిక్స్ కమిటీలో ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు.  బ్యాంకులను మోసం చేసి డబ్బులు ఎగ్గొట్టిన సుజనా లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా పార్లమెంట్ లో ప్రైవేట్ బిల్లు పెడతామని సంచలన వ్యాఖ్యలు చేశారు.  

తెలంగాణ సర్కారుకు దర్శకుడు హరీశ్ శంకర్ సలహా

  హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ సమస్యలను తగ్గించడానికి మంత్రి కేటీఆర్ అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సమావేశంపై తెలంగాణ ఐటీ, పరిశ్రమల మంత్రిత్వ శాఖ ట్విట్టర్ లో పోస్ట్ చేయగా, దానిపై దర్శకుడు హరీశ్ శంకర్ స్పందించారు. హైదరాబాద్ నగరానికి స్లిప్ రోడ్ల అవసరం ఎంతో ఉందని తెలిపారు. మంత్రి కేటీఆర్ సమావేశంలో కొత్త స్లిప్ రోడ్ల అంశం కూడా చర్చకు రాగా, తక్షణ అవసరం అదేనని హరీశ్ శంకర్ అభిప్రాయపడ్డారు. హరీశ్ ప్రతిపాదనకు నెటిజన్ల నుంచి గణనీయమైన స్థాయిలో మద్దతు లభిస్తోంది.