Skip to main content

గోదావరిలో బోటు వెలికితీత... లోపల అంతా బురదే...


గోదావరిలో బోటు వెలికితీత... లోపల అంతా బురదే...


తూర్పు గోదావరి జిల్లా... కచ్చులూరు దగ్గర ప్రవాహం దాటికి నీటిలో మునిగిపోయిన బోటును బయటకు తీసేందుకు మళ్లీ ధర్మాడి సత్యం బృందం ప్రయత్నిస్తోంది. ఈ ఉదయం క్రేన్లు, సరంజామాతో వచ్చిన నిపుణులు... ఇనుప వైర్లను గోదావరిలోకి వదులుతున్నారు. నిజానికి ముంబై నుంచీ వచ్చిన ఓ టీమ్... అత్యాధునిక టెక్నాలజీతో బోటును వెలికి తీయాలని నిర్ణయించి... తీరా అది సాధ్యం కాదని చెప్పి... తిరిగి వెళ్లిపోయింది. ఇందుకు కారణం... బోటు 200కు పైగా ఆడుగుల లోతున ఉందని భావించడమే. ఐతే... ధర్మాడి సత్యం టీమ్‌కి ఇలాంటి పడవల్ని బయటకు తీసిన అనుభవం ఉండటంతో... ప్రభుత్వం రూ.22 లక్షల కాంట్రాక్ట్‌తో డీల్ కుదుర్చుకుంది. ఈ బృందం క్రేన్లకు ఇనుప వైర్లు కట్టి... ఆ వైర్లకు యాంకర్ వేసి... నీటిలోకి వదులుతోంది.

లంగర్‌కి బోట్ తగిలితే... బయటకు లాగాలన్నది ప్లాన్. ఐతే... బోటు పూర్తిగా బురదలో కూరుకుపోయినట్లు తెలిసింది. ప్రమాదం జరిగి... నెల కావడంతో... ఇప్పుడా బోటును బయటకు లాగితే... అది బురదలో పూర్తిగా నానిపోయి... ముక్కలైపోతుందనే వాదన వినిపిస్తోంది. అయినప్పటికీ బోటును బయటకు తీసి తీరతామని ధర్మాడి సత్యం బృందం చెబుతోంది.

వారం కిందట కూడా ఇలాంటి ప్రయత్నాలు చేసి... తీరా గోదావరి ఉద్ధృతి పెరగడంతో... పనికి తాత్కాలిక బ్రేక్ వేసింది నిపుణుల బృందం. ఇప్పుడు పై నుంచీ వస్తున్న వరద నీరు తగ్గడంతో... బోటును బయటకు తీసేందుకు వీలుగా ఉండటంతో... మళ్లీ ప్రయత్నిస్తున్నారు.

Comments

Popular posts from this blog

సుజనా చౌదరి లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా ప్రైవేట్ బిల్లు పెడతాం: వైసీపీ ఎంపీ బాలశౌరి

బీజేపీ ఎంపీ సుజనాచౌదరిపై వైసీపీ ఎంపీ బాలశౌరి తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేశారు. మొన్నటి వరకు టీడీపీలో ఉన్న సుజనాచౌదరి బీజేపీలో చేరింది చంద్రబాబు అజెండా మోయడానికి కాదా? రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమా? చంద్రబాబు ప్రయోజనాలు ముఖ్యమా? ప్రధాని మోదీకి వ్యతిరేకంగా గతంలో ధర్మదీక్షలు చేసింది సుజనా కాదా? అని ప్రశ్నించారు. పొలిటికల్ బ్రోకర్, డూప్లికేట్ బీజేపీ నేత సుజనా చౌదరి మాటలకు విలువే లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సుజనా డూప్లికేట్ బీజేపీ నేత కాబట్టే చంద్రబాబు అజెండా అమలు చేస్తున్నారని ఆరోపించారు. సుజనాపై ఎథిక్స్ కమిటీలో ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు.  బ్యాంకులను మోసం చేసి డబ్బులు ఎగ్గొట్టిన సుజనా లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా పార్లమెంట్ లో ప్రైవేట్ బిల్లు పెడతామని సంచలన వ్యాఖ్యలు చేశారు.  

తెలంగాణ సర్కారుకు దర్శకుడు హరీశ్ శంకర్ సలహా

  హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ సమస్యలను తగ్గించడానికి మంత్రి కేటీఆర్ అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సమావేశంపై తెలంగాణ ఐటీ, పరిశ్రమల మంత్రిత్వ శాఖ ట్విట్టర్ లో పోస్ట్ చేయగా, దానిపై దర్శకుడు హరీశ్ శంకర్ స్పందించారు. హైదరాబాద్ నగరానికి స్లిప్ రోడ్ల అవసరం ఎంతో ఉందని తెలిపారు. మంత్రి కేటీఆర్ సమావేశంలో కొత్త స్లిప్ రోడ్ల అంశం కూడా చర్చకు రాగా, తక్షణ అవసరం అదేనని హరీశ్ శంకర్ అభిప్రాయపడ్డారు. హరీశ్ ప్రతిపాదనకు నెటిజన్ల నుంచి గణనీయమైన స్థాయిలో మద్దతు లభిస్తోంది.