Skip to main content

భారత్ రోబోలను రూపొందించదు... మనుషుల్ని తయారుచేస్తుంది: ప్రధాని మోదీ

 విజయదశమి సందర్భంగా ఢిల్లీ రామ్ లీలా మైదానంలో నిర్వహించిన రావణవధ కార్యక్రమానికి ప్రధాని మోదీ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలిపారు. భారతదేశం పండుగల పుణ్యభూమి అని, ఏడాది పొడవునా ఎక్కడో ఒక చోట ఉత్సవాలు జరుగుతూనే ఉంటాయని తెలిపారు. మన పండుగలన్నీ ప్రజలను ఒకచోట చేరుస్తాయని, వివిధ ప్రాంతాల ప్రజలను కలుపుతాయని అన్నారు. వేల ఏళ్ల సంస్కృతి, పరంపరతో ప్రజల జీవితం ముడిపడి ఉందని మోదీ పేర్కొన్నారు.

మన సంప్రదాయం చెడుపై పోరాటం చేస్తుందని తెలిపారు. భారత్ రోబోలను రూపొందించదని, మనుషుల్ని తయారుచేస్తుందని వ్యాఖ్యానించారు. విజయదశమి పర్వదినం సందర్భంగా ప్రతి ఒక్కరూ సంకల్పం చేయాలని పిలుపునిచ్చారు. ప్రజల సామూహిక శక్తి అనిర్వచనీయం అని, రాముడు సామూహిక శక్తితోనే వారధి నిర్మించి లంక చేరుకున్నాడని వివరించారు. దసరా వంటి ఉత్సవాలు ప్రజలకు అలాంటి సామూహిక శక్తినే అందిస్తాయని అన్నారు.   

Comments

Popular posts from this blog

సుజనా చౌదరి లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా ప్రైవేట్ బిల్లు పెడతాం: వైసీపీ ఎంపీ బాలశౌరి

బీజేపీ ఎంపీ సుజనాచౌదరిపై వైసీపీ ఎంపీ బాలశౌరి తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేశారు. మొన్నటి వరకు టీడీపీలో ఉన్న సుజనాచౌదరి బీజేపీలో చేరింది చంద్రబాబు అజెండా మోయడానికి కాదా? రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమా? చంద్రబాబు ప్రయోజనాలు ముఖ్యమా? ప్రధాని మోదీకి వ్యతిరేకంగా గతంలో ధర్మదీక్షలు చేసింది సుజనా కాదా? అని ప్రశ్నించారు. పొలిటికల్ బ్రోకర్, డూప్లికేట్ బీజేపీ నేత సుజనా చౌదరి మాటలకు విలువే లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సుజనా డూప్లికేట్ బీజేపీ నేత కాబట్టే చంద్రబాబు అజెండా అమలు చేస్తున్నారని ఆరోపించారు. సుజనాపై ఎథిక్స్ కమిటీలో ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు.  బ్యాంకులను మోసం చేసి డబ్బులు ఎగ్గొట్టిన సుజనా లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా పార్లమెంట్ లో ప్రైవేట్ బిల్లు పెడతామని సంచలన వ్యాఖ్యలు చేశారు.  

తెలంగాణ సర్కారుకు దర్శకుడు హరీశ్ శంకర్ సలహా

  హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ సమస్యలను తగ్గించడానికి మంత్రి కేటీఆర్ అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సమావేశంపై తెలంగాణ ఐటీ, పరిశ్రమల మంత్రిత్వ శాఖ ట్విట్టర్ లో పోస్ట్ చేయగా, దానిపై దర్శకుడు హరీశ్ శంకర్ స్పందించారు. హైదరాబాద్ నగరానికి స్లిప్ రోడ్ల అవసరం ఎంతో ఉందని తెలిపారు. మంత్రి కేటీఆర్ సమావేశంలో కొత్త స్లిప్ రోడ్ల అంశం కూడా చర్చకు రాగా, తక్షణ అవసరం అదేనని హరీశ్ శంకర్ అభిప్రాయపడ్డారు. హరీశ్ ప్రతిపాదనకు నెటిజన్ల నుంచి గణనీయమైన స్థాయిలో మద్దతు లభిస్తోంది.