Skip to main content

నేడు పోస్ట్‌డే- ఎస్‌బిఐకి ధీటుగా ఎదుగుతున్న త‌పాలా శాఖ‌


పోస్టల్ శాఖ‌ తరపున ప్రజలకి ఎన్నో‌ సేవలు అందిస్తున్నామ‌ని, విదేశాలు వెళ్లేందుకు కావాల్సిన పాస్ పోర్ట్ కూడా తపాలాశాఖ ద్వారా పొందవచ్చన్నారు  విజయవాడ రీజియన్ పోస్ట్ మాస్టర్ జనరల్ ఎలీషా..‌. మీడియాకు చెప్పారు. గురువారం వరల్డ్ పోస్ట్ డే సంద‌ర్భంగా ఆయ‌న త‌న కార్యాల‌యంలో మీడియాలో మాట్లాడుతూ  ప్రపంచ వ్యాప్తంగా నిర్వహించే పోస్ట్‌డేని  ఈనెల 9 నుంచి 15 వరకు వారోత్సవాలు గా రోజువారీ కార్య‌క్ర‌మాల‌తో నిర్వహిస్తున్నామ‌ని చెప్పారు.
10న  పోస్ట‌ల్‌ బ్యాంకింగ్ కార్యకలాపాలను ప్రజలకు తెలుపుతారు. SBI తర్వాత పోస్టల్ లోనే ఎక్కువ మంది ఖాతాదారులు ఉన్నారని, వీటిని మ‌రింత పెంచేందుకు చ‌ర్య‌లు తీసుకుంటున్న‌ట్టు తెలిపారు.11వ తేదీన గ్రామీణ ఇన్సూరెన్స్ స్కీంపై అవగాహన కల్పిస్తామ‌న్నారు. 12వ తేదీన పాఠశాలల్లో పిల్లలకు స్టాంపుల పై త‌మ సిబ్బంది తెలియ‌జేస్తార‌ని,14న వ్యాపార వేత్తలకు పోస్టల్ శాఖ అందించే సేవలను తెలిపి కొత్త ఖాతాదారుల పెంపుకు కృషి చేస్తార‌న్నారు.  అలాగే15న పోస్టల్ మెయిల్ కార్యకలాపాలని ప్రజల్లోకి తీసుకెళతామ‌ని తెలిపారు. 
ఇప్ప‌టి వ‌ర‌కు ఎపి లో 575 ఆధార్ కేంద్రాలు పోస్టల్ శాఖ తరపున ఏర్పాటు చేశామ‌ని, దాదాపు అన్ని పోస్టాఫీసుల‌లొ అన్ని రకాల లావాదేవీలు పూర్తి గా డిజిటలైజ్ చేశామ‌ని త‌ద్వారా గ్రామీణ ప్రాంతాలలో సైతం అన్ని రకాల‌ సేవలు ఆన్ లైన్ లో ఉంటాయని చెప్పారు.ప్రజలకు‌ చేరువుగా ఉండే పోస్టల్ శాఖ లో బ్యాంకు ఖాతాలు ప్రారంభించాలని కోరుతున్నామ‌ని, ఆప్ కా బ్యాంక్.. ఆప్ కా ద్వార్ నినాదంతో ఇంట్లో ఉండే లావాదేవీలు చూసుకునే అవకాశం కల్పించామ‌ని తెలిపారు.  పోస్టల్ లో ఖాతా ప్రారంభానికి కేవలం ఒక్క ఆధార్ ఫ్రూఫ్ స‌రిపోతుంద‌ని తెలిపారు. ఎ విష‌యం పైన అయినా నేరుగా పోస్ట‌ల్‌ వెబ్ సైట్ లోకి‌ వెళ్లి దరఖాస్తు‌ చేసుకోవచ్చని ఖాతాదారుల‌కు ఆయ‌న సూచించారు.
ఇప్ప‌టివ‌ర‌కు 1.29కోట్ల ఖాతాలు  పోస్టల్ శాఖ లో ఉన్నాయని ఓ ప్ర‌శ్న‌కు స‌మాధానంగా చెప్పారు.  2,700 మంది ని గ్రామీణ ప్రాంతాల్లో కొత్త గా నియమించేందుకు నిర్ణ‌యించామ‌ని ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ త్వరలో ప్రకటిస్తామ‌ని ఎలీషా చెప్పారు.

Comments

Popular posts from this blog

పవన్ కు శుభాకాంక్షలు చెప్పిన చిరంజీవి

  సినీనటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఈ రోజు పుట్టినరోజు వేడుక జరుపుకుంటోన్న నేపథ్యంలో ఆయనకు మెగాస్టార్ చిరంజీవి శుభాకాంక్షలు తెలిపారు.  ఆయనకు మహేశ్ బాబుతో పాటు పలువురు టాలీవుడ్ ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్లు చేశారు. సినిమాలతో పాటు రాజకీయాల్లో పవన్ కల్యాణ్ అద్భుత విజయాలు సాధించాలని తాము కోరుకుంటున్నట్లు తెలిపారు.

చింతమనేనికి బెయిల్ నిరాకరణ: అక్టోబర్ 9వరకు రిమాండ్ పొడిగింపు

తెలుగుదేశం పార్టీ నేత, దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కు కోర్టులో చుక్కెదురు అయ్యింది. చింతమనేనికి బెయిల్ ఇచ్చేందుకు ఏలూరు కోర్టు నిరాకరించింది. అంతేకాదు చింతమనేని రిమాండ్ ను అక్టోబర్ 9 వరకు పొండిగించింది.  2017లో అప్పనపాడు గ్రామంలో స్థల వివాదంలో వ్యక్తిని నిర్బంధించి కులం పేరుతో దూషించిన కేసులో కేసు నమోదు అయ్యింది. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులో భాగంగా ఇటీవలే చింతమనేని ప్రభాకర్ ను పోలీసులు అరెస్ట్ చేశారు.  అనంతరం చింతమనేని ప్రభాకర్ ను ఏలూరులోని ఎస్సీఎస్టీ అట్రాసిటీ కోర్టులో హాజరుపరచగా కోర్టు 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. రిమాండ్ పూర్తవ్వడంతో బుధవారం పోలీసులు మరోసారి ఏలూరు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కోర్టులో హాజరుపరిచారు.  అలాగే బెయిల్ ఇవ్వాలంటూ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తరపు న్యాయవాది సైతం కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. చింతమనేని బెయిల్ పిటీషన్ ను న్యాయస్థానం తోసిపుచ్చింది. అనంతరం చింతమనేని రిమాండ్ ను వచ్చే నెల 9 వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ఏలూరు కోర్టు.  ఇకపోతే చింతమనేని ప్రభాకర్ ను అరెస్ట్ చేసేందుకు వెళ్లిన సమయంలో మహిళా పో...