Skip to main content

నేడు పోస్ట్‌డే- ఎస్‌బిఐకి ధీటుగా ఎదుగుతున్న త‌పాలా శాఖ‌


పోస్టల్ శాఖ‌ తరపున ప్రజలకి ఎన్నో‌ సేవలు అందిస్తున్నామ‌ని, విదేశాలు వెళ్లేందుకు కావాల్సిన పాస్ పోర్ట్ కూడా తపాలాశాఖ ద్వారా పొందవచ్చన్నారు  విజయవాడ రీజియన్ పోస్ట్ మాస్టర్ జనరల్ ఎలీషా..‌. మీడియాకు చెప్పారు. గురువారం వరల్డ్ పోస్ట్ డే సంద‌ర్భంగా ఆయ‌న త‌న కార్యాల‌యంలో మీడియాలో మాట్లాడుతూ  ప్రపంచ వ్యాప్తంగా నిర్వహించే పోస్ట్‌డేని  ఈనెల 9 నుంచి 15 వరకు వారోత్సవాలు గా రోజువారీ కార్య‌క్ర‌మాల‌తో నిర్వహిస్తున్నామ‌ని చెప్పారు.
10న  పోస్ట‌ల్‌ బ్యాంకింగ్ కార్యకలాపాలను ప్రజలకు తెలుపుతారు. SBI తర్వాత పోస్టల్ లోనే ఎక్కువ మంది ఖాతాదారులు ఉన్నారని, వీటిని మ‌రింత పెంచేందుకు చ‌ర్య‌లు తీసుకుంటున్న‌ట్టు తెలిపారు.11వ తేదీన గ్రామీణ ఇన్సూరెన్స్ స్కీంపై అవగాహన కల్పిస్తామ‌న్నారు. 12వ తేదీన పాఠశాలల్లో పిల్లలకు స్టాంపుల పై త‌మ సిబ్బంది తెలియ‌జేస్తార‌ని,14న వ్యాపార వేత్తలకు పోస్టల్ శాఖ అందించే సేవలను తెలిపి కొత్త ఖాతాదారుల పెంపుకు కృషి చేస్తార‌న్నారు.  అలాగే15న పోస్టల్ మెయిల్ కార్యకలాపాలని ప్రజల్లోకి తీసుకెళతామ‌ని తెలిపారు. 
ఇప్ప‌టి వ‌ర‌కు ఎపి లో 575 ఆధార్ కేంద్రాలు పోస్టల్ శాఖ తరపున ఏర్పాటు చేశామ‌ని, దాదాపు అన్ని పోస్టాఫీసుల‌లొ అన్ని రకాల లావాదేవీలు పూర్తి గా డిజిటలైజ్ చేశామ‌ని త‌ద్వారా గ్రామీణ ప్రాంతాలలో సైతం అన్ని రకాల‌ సేవలు ఆన్ లైన్ లో ఉంటాయని చెప్పారు.ప్రజలకు‌ చేరువుగా ఉండే పోస్టల్ శాఖ లో బ్యాంకు ఖాతాలు ప్రారంభించాలని కోరుతున్నామ‌ని, ఆప్ కా బ్యాంక్.. ఆప్ కా ద్వార్ నినాదంతో ఇంట్లో ఉండే లావాదేవీలు చూసుకునే అవకాశం కల్పించామ‌ని తెలిపారు.  పోస్టల్ లో ఖాతా ప్రారంభానికి కేవలం ఒక్క ఆధార్ ఫ్రూఫ్ స‌రిపోతుంద‌ని తెలిపారు. ఎ విష‌యం పైన అయినా నేరుగా పోస్ట‌ల్‌ వెబ్ సైట్ లోకి‌ వెళ్లి దరఖాస్తు‌ చేసుకోవచ్చని ఖాతాదారుల‌కు ఆయ‌న సూచించారు.
ఇప్ప‌టివ‌ర‌కు 1.29కోట్ల ఖాతాలు  పోస్టల్ శాఖ లో ఉన్నాయని ఓ ప్ర‌శ్న‌కు స‌మాధానంగా చెప్పారు.  2,700 మంది ని గ్రామీణ ప్రాంతాల్లో కొత్త గా నియమించేందుకు నిర్ణ‌యించామ‌ని ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ త్వరలో ప్రకటిస్తామ‌ని ఎలీషా చెప్పారు.

Comments

Popular posts from this blog

సుజనా చౌదరి లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా ప్రైవేట్ బిల్లు పెడతాం: వైసీపీ ఎంపీ బాలశౌరి

బీజేపీ ఎంపీ సుజనాచౌదరిపై వైసీపీ ఎంపీ బాలశౌరి తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేశారు. మొన్నటి వరకు టీడీపీలో ఉన్న సుజనాచౌదరి బీజేపీలో చేరింది చంద్రబాబు అజెండా మోయడానికి కాదా? రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమా? చంద్రబాబు ప్రయోజనాలు ముఖ్యమా? ప్రధాని మోదీకి వ్యతిరేకంగా గతంలో ధర్మదీక్షలు చేసింది సుజనా కాదా? అని ప్రశ్నించారు. పొలిటికల్ బ్రోకర్, డూప్లికేట్ బీజేపీ నేత సుజనా చౌదరి మాటలకు విలువే లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సుజనా డూప్లికేట్ బీజేపీ నేత కాబట్టే చంద్రబాబు అజెండా అమలు చేస్తున్నారని ఆరోపించారు. సుజనాపై ఎథిక్స్ కమిటీలో ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు.  బ్యాంకులను మోసం చేసి డబ్బులు ఎగ్గొట్టిన సుజనా లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా పార్లమెంట్ లో ప్రైవేట్ బిల్లు పెడతామని సంచలన వ్యాఖ్యలు చేశారు.  

చైనాకు షాక్ : వాటిపై పెరగనున్న సుంకం

విదేశాల నుంచి దిగుమతయ్యే యాక్టివ్‌ ఫార్మాసూటికల్‌ ఇన్‌గ్రీడియంట్స్‌ (ఏపీఐ) దిగుమతులపై భారత  ప్రభుత్వం త్వరలోనే షాక్ ఇవ్వనుంది. ఏపీఐ దిగమతులపై కస్టమ్స్ సుంకాన్ని10 నుంచి 15 శాతం దాకా  పెంచాలని  ఫార్మాస్యూటికల్స్ విభాగం (డీఓపీ) యోచిస్తోంది. ముడి ఔషధాల (ఏపీఐ) దేశీయ తయారీని ప్రోత్సాహం ఇవ్వడంతోపాటు,చైనాపై అధికంగా ఆధారపడటాన్ని తగ్గించాలన్న వ్యూహంలో భాగంగా కేంద్రం ఈ నిర్ణయం తీసుకోనుంది. ఏపీఐ దిగుమతులపై సుంకాన్ని 20-25 శాతంగా ఉంచేందుకు ప్రభుత్వం పరిశీలిస్తోందని ఎకనామిక్ టైమ్స్ నివేదించింది. ప్రస్తుతం ఇది 10 శాతం మాత్రమే. భారత్-చైనా సరిహద్దు వివాదం, ఇటు చైనా ఉత్పత్తులను నిషేధించాలన్న డిమాండ్ అటు ప్రధానంగా ఏఐపీల కోసం చైనాపై అధికంగా ఆధారపడుతున్న తరుణంలో ఇది చైనాకు ప్రతికూలంగా మారనుంది.   ప్రస్తుతం, భారతదేశం 68 శాతం ఏపీఐలు, 90 శాతం కంటే ఎక్కువ యాంటీబయాటిక్‌లను చైనా నుండి దిగుమతి చేసుకుంటోంది. దేశీయంగా  వాల్యూమ్ పరంగా ప్రపంచంలో మూడవ అతిపెద్దది. క్లిష్టమైన కీ స్టార్టింగ్ మెటీరియల్స్ (కెఎస్ఎం), డ్రగ్ ఇంటర్మీడియట్...