Skip to main content

సీపెట్ కార్యక్రమాలు దేశవ్యాప్తంగా కొనసాగుతున్నాయి: కేంద్ర మంత్రి సదానంద గౌడ





ప్లాస్టిక్ సమస్యపై ప్రధాని నరేంద్ర మోదీ సీరియస్ గా దృష్టి సారించారని, ప్లాస్టిక్ నిర్మూలనకు కూడా పిలుపునిచ్చారని కేంద్ర మంత్రి సదానంద గౌడ అన్నారు. ఆంధ్రప్రదేశ్ లోని గన్నవరం మండలం, సూరంపల్లిలో సీపెట్ భవన సముదాయాన్ని సీఎం జగన్ తో కలిసి కేంద్ర మంత్రి ప్రారంభించారు. ముఖ్యమంత్రి జగన్ తో వేదిక పంచుకోవడం ఆనందంగా ఉందని ఈ సందర్భంగా కేంద్ర మంత్రి వ్యాఖ్యానించారు. దేశాభివృద్ధిలో యువతదే కీలక పాత్ర అని, ప్రపంచంలోనే అత్యధిక సంఖ్యలో యువతను కలిగివున్న దేశం భారత్ అని ఆయన పేర్కొన్నారు.

‘ప్లాస్టిక్ మన జీవితంలో భాగమైంది. దాన్ని రీసైక్లింగ్ చేయడం ద్వారా పర్యావరణం కలుషితం కాకుండా కాపాడవచ్చు. ప్రధాని మోదీ ప్లాస్టిక్ నిర్మూలనకు పిలుపునిచ్చారు. సీపెట్ అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ప్లాస్టిక్ ను రీసైక్లింగ్ చేసేందుకు కృషిచేస్తుంది. విజయవాడలో పరిశ్రమలు నెలకొల్పడానికి మంచి అవకాశాలున్నాయి, దీనిపై నేను సీఎం జగన్ తో చర్చిస్తా. కొత్త రాష్ట్రాల అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉంది. నెల్లూరు జిల్లా నాయుడు పేటలో మరో సీపెట్ సంస్థ ఏర్పాటు చేస్తాం’ అని సదానంద గౌడ చెప్పారు.   

Comments

Popular posts from this blog

అంబులెన్స్‌కు దారి ఇచ్చిన సీఎం కాన్వాయ్...‌

వీడియో చూడండి : Click here ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వాహన శ్రేణి అంబులెన్స్‌కు దారిఇచ్చింది. పులివెందుల నుంచి తిరిగివచ్చిన సీఎం గన్నవరం విమానాశ్రయం నుంచి తాడేపల్లి నివాసానికి బయల్దేరారు. గూడవల్లి నిడమానూరు మధ్య ప్రమాదంలో గాయపడ్డ వ్యక్తిని తరలిస్తున్న అబులెన్స్‌కు దారి ఇచ్చారు. ఉయ్యూరు నుంచి గన్నవరం బైక్‌పైవెళ్తున్న చాపర్తిన శేఖర్‌ అనే వ్యక్తి ఉషారామ ఇంజినీరింగ్‌కాలేజీ సమీపంలో ప్రమాదానికి గురయ్యారు. అతన్ని నేషనల్‌ హైవే అంబులెన్స్‌ ద్వారా విజయవాడ ఈఎస్‌ఐ ఆస్పత్రికి తరలిస్తుండగా, దీనికి ముందు ఉన్న ముఖ్యమంత్రి కాన్వాయ్‌ పక్కకు తొలగి అంబులెన్స్‌కు దారి ఇచ్చింది.

పవన్ కు శుభాకాంక్షలు చెప్పిన చిరంజీవి

  సినీనటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఈ రోజు పుట్టినరోజు వేడుక జరుపుకుంటోన్న నేపథ్యంలో ఆయనకు మెగాస్టార్ చిరంజీవి శుభాకాంక్షలు తెలిపారు.  ఆయనకు మహేశ్ బాబుతో పాటు పలువురు టాలీవుడ్ ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్లు చేశారు. సినిమాలతో పాటు రాజకీయాల్లో పవన్ కల్యాణ్ అద్భుత విజయాలు సాధించాలని తాము కోరుకుంటున్నట్లు తెలిపారు.