Skip to main content

వైసీపీ వెనక్కి తగ్గిందా? కరకట్టపై కూల్చివేతలు ఆగినట్లేనా?

ఏపీలో అధికారంలోకి రాగానే... వైసీపీ ప్రభుత్వం అత్యంత ఆవేశంగా... టీడీపీ అప్పటివరకూ వాడుకున్న ప్రజావేదికను కూల్చివేసింది. రూ.40 కోట్ల ఖర్చుతో నిర్మించిన భవనాన్ని నేలమట్టం చెయ్యడమే కాక... కృష్ణా కరకట్టపై ఉన్న అక్రమ నిర్మాణాలన్నీ కూల్చేస్తామని ప్రకటించింది. ఆ ప్రకారమే... ఇటీవల అధికారులు... టీడీపీ అధినేత చంద్రబాబు ఉంటున్న ఇల్లు సహా... అక్రమ నిర్మాణాలకు నోటీసులు పంపారు. వారంలోగా ఖాళీ చెయ్యాలన్నది ఆ నోటీసుల్లో సారాంశం. దాంతో ఈ విషయం రాజకీయంగా కలకలం రేపింది. అక్రమ నిర్మాణాల్ని కూల్చేయాలని వైసీపీ నేతలు, కూల్చడానికి వీల్లేదని టీడీపీ నేతలూ వాదించారు. ఇంతలో... వారం గడిచిపోయింది. మరో మూడ్రోజులు కూడా అయిపోయాయి. కానీ... కూల్చివేతలు మాత్రం మొదలవ్వలేదు. కారణమేంటి? కూల్చివేస్తామని ఆర్భాటంగా ప్రకటించిన వైసీపీ ఇప్పుడు ఎందుకు సైలెంటైపోయింది?

వైసీపీ మౌనం వెనక టీడీపీ రాజకీయ ఎత్తుగడ ఉందని తెలుస్తోంది. కృష్ణా కరకట్టపై అక్రమ నిర్మాణాలున్న కొందరు టీడీపీ నేతలు... ఇటీవల బీజేపీలో చేరారు. తమ ఇళ్లను కూల్చనివ్వకుండా అడ్డుకోవాలని పార్టీ హైకమాండ్‌ని కోరారని తెలుస్తోంది. దాంతో బీజేపీ హైకమాండ్ నుంచీ వైసీపీ ప్రభుత్వానికి ఆదేశాలు వచ్చాయనీ... అందువల్లే వైసీపీ సర్కార్ సైలెంటైపోయిందనే వాదన వినిపిస్తోంది. ఇంతకుముంది కరెంంటు ఒప్పందాల విషయంలో కేంద్రానికి ఎదురుతిరిగిన వైసీపీ ప్రభుత్వం... ఆ తర్వాత మెత్తబడక తప్పలేదు. ఇప్పుడు కరకట్ట విషయంలోనూ కేంద్రం అనధికారిక ఆదేశాలు... వైసీపీ దూకుడుకి బ్రేక్ వేశాయనే వాదన ఏపీ పొలిటికల్ సర్కిల్‌లో వినిపిస్తోంది.

ముందుంది కూల్చివేత పండుగ : కూల్చివేతలకు బ్రేక్ పడిందనీ, వైసీపీ తమ దారికి వచ్చిందని ఓవైపు టీడీపీ నేతలు చెప్పుకుంటుంటే... అంత లేదంటున్నాయి వైసీపీ వర్గాలు. దసరా సెలవులు కావడంతో... ఏపీలో ప్రజలంతా పండుగ మూడ్‌లో ఉంటారు కాబట్టి... ఇలాంటి సమయంలో... కూల్చివేతలూ అవీ చేస్తే... వాటిని అడ్డుకునేందుకు టీడీపీ ఏ రాష్ట్రవ్యాప్త ఆందోళనలకో పిలుపిస్తే... లేనిపోని లా అండ్ ఆర్డర్ సమస్య వస్తుందని భావించిన ప్రభుత్వం... పండగ తర్వాత ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాలని డిసైడైనట్లు తెలుస్తోంది. కాబట్టి టీడీపీ నేతల ఆనందం... ఈ నాల్రోజులే అంటున్నాయి వైసీపీ వర్గాలు. కేంద్ర పరిధిలో కరెంటు ఒప్పందాలు... ఇదివరకే కుదరడం వల్ల... ఆ విషయంలో తమ అధినేత వెనక్కి తగ్గారే తప్ప... కేంద్రానికి తలొగ్గి కాదనీ... అక్రమ నిర్మాణాల్ని కూల్చివేసిన తర్వాత... టీడీపీ నేతలకు తత్వం బోధపడుతుందని అంటున్నారు.

Comments

Popular posts from this blog

అత్యంత కష్టం మీద బోటును బయటికి తీసిన ధర్మాడి సత్యం బృందం

నెలరోజులకు పైగా గోదావరి నదీ గర్భంలోనే ఉండిపోయిన రాయల్ వశిష్ట బోటును ఎట్టకేలకు బయటికి తీశారు. ధర్మాడి సత్యం బృందం తీవ్ర ప్రయాసలకోర్చి బోటు ఆచూకీ గుర్తించడమే కాకుండా దాన్ని పైకి తీసుకువచ్చారు. మరికాసేపట్లో బోటును ఒడ్డుకు చేర్చనున్నారు. స్కూబా డైవర్ల సాయంతో బోటుకు లంగర్లు ఫిక్స్ చేసి పైకి తీసుకువచ్చేందుకు ధర్మాడి సత్యం బృందం చేసిన ప్రయత్నాలు ఫలించాయి. మొదట కొన్ని భాగాలుగా విడిపోయినా, ఆ తర్వాత మరోసారి ఐరన్ రోప్ లు బిగించి మొత్తం బోటును వెలికి తీశారు. గోదావరి ఉపరితలంపైకి చేరిన బోటును మరో రెండు గంటల్లో తీరానికి చేర్చే అవకాశాలున్నాయి.

మీడియాపై మాకు గౌరవముంది: కోటంరెడ్డి

  కొన్ని పత్రికలు, ఛానల్స్ తమ పాలనపై ప్రజల్లో అపోహలు సృష్టిస్తున్నాయని  వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. మీడియాపై తమకు గౌరవం ఉందని, అది ఎప్పటికీ కొనసాగుతుందని చెప్పారు. జీవో 2430 కొత్తగా తీసుకొచ్చింది కాదని, ఎప్పటినుంచో అది ఉందని తెలిపారు.  ఈ రోజు కోటంరెడ్డి మీడియాతో మాట్లాడారు. కొన్ని పత్రికలు, ఛానల్స్ పనికట్టుకుని తప్పుడు వార్తలతో అపోహలు సృష్టిస్తున్నాయన్నారు. తప్పుడు వార్తలు రాసేవారు భయపడాలని పేర్కొన్నారు. ఒకప్పుడు సాక్షి మీడియాను చంద్రబాబు అనుమతించనప్పుడు ఈ ఉద్యమ నేతలు ఎటుపోయారని నిలదీశారు. లోకేశ్ దీక్షలను చూసి ప్రజలు నవ్వుకుంటున్నారన్నారు. మంగళగిరి నియోజక వర్గంలో ఎన్ని ఓట్లు ఉన్నాయో కూడా లోకేశ్ కు తెలియదని విమర్శించారు. తమ పాలనను చంద్రబాబు సహించలేకపోతున్నారని ఆయన మండిపడ్డారు. చంద్రబాబు, తన హయాంలో తన కొడుకు లోకేశ్ తో కలిసి దోచుకుని లోటు బడ్జెట్ ను చూపెట్టారని విమర్శించారు. ప్రస్తుతం సీఎం జగన్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గాడిలో పెడుతున్నారని చెప్పారు.  చంద్రబాబుకు చదువుకునేటప్పటి నుంచే కులపిచ్చి ఉందని పేర్కొన్నారు. స్థాని...