Skip to main content

రామ్ చరణ్ సతీమణి ఉపాసన తీరుపై బీజేపీ నేత ఫైర్..

ఈ శని వారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సినీ రంగ ప్రముఖులతో సమావేశం నిర్వహించిన సంగతి తెలిసిందే కదా.ఈ సమావేశం పట్ల ప్రధాని మోదీ సమావేశం పట్ల చిరంజీవి కోడలు రామ్ చరణ్ సతీమణి ఉపాసన కొణిదెల మండిపడిన సంగతి తెలిసిందే కదా. దీనికి బీజేపీకి చెందిన నేత కౌంటర్ ఇచ్చారు.


Upasana: రామ్ చరణ్ సతీమణి ఉపాసన తీరుపై బీజేపీ నేత ఫైర్..
ఈ శని వారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సినీ రంగ ప్రముఖులతో సమావేశం నిర్వహించిన సంగతి తెలిసిందే కదా. మహాత్మాగాంధీ 150వ జయంతి సందర్భంగా మహాత్ముడి ఆలోచనలను, సినిమాలు, ఇతర ప్రచార మాధ్యమాల ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లాలని సినీ పరిశ్రమకు ప్రధాని నరేంద్ర మోదీ సూచించారు. #ChangeWithin పేరుతో ఢిల్లీలోని లోక్‌కల్యాణ్‌ మార్గ్‌లో జరిగిన కార్యక్రమానికి బాలీవుడ్‌ నటులు అమీర్‌ఖాన్‌, షారూక్‌ ఖాన్‌లతో పాటు చాలా మంది ప్రముఖులు హాజరయ్యారు. మహాత్మాగాంధీ సిద్ధాంతాలను విస్తృతం చేయడంలో సినీ, టీవీ పరిశ్రమకు చెందిన కొందరు సభ్యులు గొప్పగా పనిచేస్తున్నారన్న మోదీ... గాంధీ సిద్ధాంతాలను, అనుసరించిన మార్గాలనూ వివరించారు. ఈ సమావేశం పట్ల ప్రధాని మోదీ సమావేశం పట్ల చిరంజీవి కోడలు రామ్ చరణ్ సతీమణి ఉపాసన కొణిదెల మండిపడిన సంగతి తెలిసిందే కదా.
బాలీవుడ్ ప్రముఖుల్ని ఆహ్వానించిన మోదీ..... దక్షిణాది తారలను ఎందుకు పిలవలేదన్నారు. దక్షిణాది అంటే మీకు ఎందుకంత వివక్ష అంటూ ప్రశ్నించారు. దక్షిణ చలనచిత్ర పరిశ్రమను కూడా మోదీ గౌరవించాలన్నారు. సౌత్‌పై చిన్నచూపు ఎందుకు అంటూ ట్వీట్ ద్వారా ఉపాసన ప్రశ్నించారు. దక్షిణ భారతం కూడా మోదీని చాలా గౌరవిస్తుందంటూ చెప్పుకొచ్చింది. మరోవైపు కుష్బూ కూడా ప్రధాని మోదీని ఉద్దేశిస్తూ.. దేశానికి సౌత్ సినిమా ఇండస్ట్రీ ఎంతో ఇచ్చింది. ఇక్కడి వాళ్లను కూడా కాస్త గుర్తు పెట్టుకొండి అంటూ ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే కదా.
ఐతే.. ఉపాసన ట్వీట్ పై విభిన్న భిన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. మరోవైపు ఈ సమావేశానికి రాజమౌళి, ప్రభాస్, రానాకు ఆహ్వానం అందినా.. వాళ్లు లండన్‌లో ప్రదర్శితమయ్యే బాహుబలి సినిమా కోసం అక్కడే ఉండటంతో ఈ ఈవెంట్‌కు హాజరు కాలేకపోయినట్టు సమాచారం. ఐతే ఈ వేడకలో ప్రముఖ నిర్మాత దిల్ రాజు, ఈనాడు’ సంస్థల ఎండీ సీహెచ్ కిరణ్..ఈటీవీ సీఈవో బాపినీడు, ప్రముఖ గాయకుడు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం, దిల్ రాజు, రకుల్ ప్రీత్ సింగ్ సంగీత దర్శకుడు సాలూరు వాసూరావు హాజరయ్యారయ్యారు. తెలుగు నుంచి ఇంత మంది హాజరయిన ఈ గగ్గోలు ఏమిటి అని ఉపాసన తీరును కడిగిపారుస్తున్నారు కొంత మంది నెటిజన్స్. మరోవైపు ఉపాసనను మరికొంత మంది ప్రశ్నిస్తూ.. మీ అపోలో హాస్పిటల్‌లో తెలుగు వాళ్లను  ఎంత మందిని తీసుకున్నారంటూ సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తున్నారు.

తాజాగా బీజేపీ కి చెందిన నేత ఒకరు.. ఉపాసనను ప్రశ్నిస్తూ.. మీ మామ చిరంజీవి, మీ ఆయన రామ్ చరణ్ హీరోలుగా నటించిన సినిమాల్లో తెలుగు వాళ్లను ముఖ్యంగా హీరోయిన్స్‌గా ఎంత మంది తీసుకున్నారు అంటూ ప్రశ్నించాడు. మొత్తం నార్త్ భామలతోనే మీ కుటుంబ సభ్యులు నటిస్తున్నారంటూ ఈ సందర్భంగా చెప్పుకొచ్చాడు. సదరు బీజేపీ నేత అడిగిన ప్రశ్నకు ఉపాసన ఏమి సమాధానం ఇస్తుందో చూడాలి.

Comments

Popular posts from this blog

సుజనా చౌదరి లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా ప్రైవేట్ బిల్లు పెడతాం: వైసీపీ ఎంపీ బాలశౌరి

బీజేపీ ఎంపీ సుజనాచౌదరిపై వైసీపీ ఎంపీ బాలశౌరి తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేశారు. మొన్నటి వరకు టీడీపీలో ఉన్న సుజనాచౌదరి బీజేపీలో చేరింది చంద్రబాబు అజెండా మోయడానికి కాదా? రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమా? చంద్రబాబు ప్రయోజనాలు ముఖ్యమా? ప్రధాని మోదీకి వ్యతిరేకంగా గతంలో ధర్మదీక్షలు చేసింది సుజనా కాదా? అని ప్రశ్నించారు. పొలిటికల్ బ్రోకర్, డూప్లికేట్ బీజేపీ నేత సుజనా చౌదరి మాటలకు విలువే లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సుజనా డూప్లికేట్ బీజేపీ నేత కాబట్టే చంద్రబాబు అజెండా అమలు చేస్తున్నారని ఆరోపించారు. సుజనాపై ఎథిక్స్ కమిటీలో ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు.  బ్యాంకులను మోసం చేసి డబ్బులు ఎగ్గొట్టిన సుజనా లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా పార్లమెంట్ లో ప్రైవేట్ బిల్లు పెడతామని సంచలన వ్యాఖ్యలు చేశారు.  

తెలంగాణ సర్కారుకు దర్శకుడు హరీశ్ శంకర్ సలహా

  హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ సమస్యలను తగ్గించడానికి మంత్రి కేటీఆర్ అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సమావేశంపై తెలంగాణ ఐటీ, పరిశ్రమల మంత్రిత్వ శాఖ ట్విట్టర్ లో పోస్ట్ చేయగా, దానిపై దర్శకుడు హరీశ్ శంకర్ స్పందించారు. హైదరాబాద్ నగరానికి స్లిప్ రోడ్ల అవసరం ఎంతో ఉందని తెలిపారు. మంత్రి కేటీఆర్ సమావేశంలో కొత్త స్లిప్ రోడ్ల అంశం కూడా చర్చకు రాగా, తక్షణ అవసరం అదేనని హరీశ్ శంకర్ అభిప్రాయపడ్డారు. హరీశ్ ప్రతిపాదనకు నెటిజన్ల నుంచి గణనీయమైన స్థాయిలో మద్దతు లభిస్తోంది.