Skip to main content

రామ్ చరణ్ సతీమణి ఉపాసన తీరుపై బీజేపీ నేత ఫైర్..

ఈ శని వారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సినీ రంగ ప్రముఖులతో సమావేశం నిర్వహించిన సంగతి తెలిసిందే కదా.ఈ సమావేశం పట్ల ప్రధాని మోదీ సమావేశం పట్ల చిరంజీవి కోడలు రామ్ చరణ్ సతీమణి ఉపాసన కొణిదెల మండిపడిన సంగతి తెలిసిందే కదా. దీనికి బీజేపీకి చెందిన నేత కౌంటర్ ఇచ్చారు.


Upasana: రామ్ చరణ్ సతీమణి ఉపాసన తీరుపై బీజేపీ నేత ఫైర్..
ఈ శని వారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సినీ రంగ ప్రముఖులతో సమావేశం నిర్వహించిన సంగతి తెలిసిందే కదా. మహాత్మాగాంధీ 150వ జయంతి సందర్భంగా మహాత్ముడి ఆలోచనలను, సినిమాలు, ఇతర ప్రచార మాధ్యమాల ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లాలని సినీ పరిశ్రమకు ప్రధాని నరేంద్ర మోదీ సూచించారు. #ChangeWithin పేరుతో ఢిల్లీలోని లోక్‌కల్యాణ్‌ మార్గ్‌లో జరిగిన కార్యక్రమానికి బాలీవుడ్‌ నటులు అమీర్‌ఖాన్‌, షారూక్‌ ఖాన్‌లతో పాటు చాలా మంది ప్రముఖులు హాజరయ్యారు. మహాత్మాగాంధీ సిద్ధాంతాలను విస్తృతం చేయడంలో సినీ, టీవీ పరిశ్రమకు చెందిన కొందరు సభ్యులు గొప్పగా పనిచేస్తున్నారన్న మోదీ... గాంధీ సిద్ధాంతాలను, అనుసరించిన మార్గాలనూ వివరించారు. ఈ సమావేశం పట్ల ప్రధాని మోదీ సమావేశం పట్ల చిరంజీవి కోడలు రామ్ చరణ్ సతీమణి ఉపాసన కొణిదెల మండిపడిన సంగతి తెలిసిందే కదా.
బాలీవుడ్ ప్రముఖుల్ని ఆహ్వానించిన మోదీ..... దక్షిణాది తారలను ఎందుకు పిలవలేదన్నారు. దక్షిణాది అంటే మీకు ఎందుకంత వివక్ష అంటూ ప్రశ్నించారు. దక్షిణ చలనచిత్ర పరిశ్రమను కూడా మోదీ గౌరవించాలన్నారు. సౌత్‌పై చిన్నచూపు ఎందుకు అంటూ ట్వీట్ ద్వారా ఉపాసన ప్రశ్నించారు. దక్షిణ భారతం కూడా మోదీని చాలా గౌరవిస్తుందంటూ చెప్పుకొచ్చింది. మరోవైపు కుష్బూ కూడా ప్రధాని మోదీని ఉద్దేశిస్తూ.. దేశానికి సౌత్ సినిమా ఇండస్ట్రీ ఎంతో ఇచ్చింది. ఇక్కడి వాళ్లను కూడా కాస్త గుర్తు పెట్టుకొండి అంటూ ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే కదా.
ఐతే.. ఉపాసన ట్వీట్ పై విభిన్న భిన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. మరోవైపు ఈ సమావేశానికి రాజమౌళి, ప్రభాస్, రానాకు ఆహ్వానం అందినా.. వాళ్లు లండన్‌లో ప్రదర్శితమయ్యే బాహుబలి సినిమా కోసం అక్కడే ఉండటంతో ఈ ఈవెంట్‌కు హాజరు కాలేకపోయినట్టు సమాచారం. ఐతే ఈ వేడకలో ప్రముఖ నిర్మాత దిల్ రాజు, ఈనాడు’ సంస్థల ఎండీ సీహెచ్ కిరణ్..ఈటీవీ సీఈవో బాపినీడు, ప్రముఖ గాయకుడు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం, దిల్ రాజు, రకుల్ ప్రీత్ సింగ్ సంగీత దర్శకుడు సాలూరు వాసూరావు హాజరయ్యారయ్యారు. తెలుగు నుంచి ఇంత మంది హాజరయిన ఈ గగ్గోలు ఏమిటి అని ఉపాసన తీరును కడిగిపారుస్తున్నారు కొంత మంది నెటిజన్స్. మరోవైపు ఉపాసనను మరికొంత మంది ప్రశ్నిస్తూ.. మీ అపోలో హాస్పిటల్‌లో తెలుగు వాళ్లను  ఎంత మందిని తీసుకున్నారంటూ సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తున్నారు.

తాజాగా బీజేపీ కి చెందిన నేత ఒకరు.. ఉపాసనను ప్రశ్నిస్తూ.. మీ మామ చిరంజీవి, మీ ఆయన రామ్ చరణ్ హీరోలుగా నటించిన సినిమాల్లో తెలుగు వాళ్లను ముఖ్యంగా హీరోయిన్స్‌గా ఎంత మంది తీసుకున్నారు అంటూ ప్రశ్నించాడు. మొత్తం నార్త్ భామలతోనే మీ కుటుంబ సభ్యులు నటిస్తున్నారంటూ ఈ సందర్భంగా చెప్పుకొచ్చాడు. సదరు బీజేపీ నేత అడిగిన ప్రశ్నకు ఉపాసన ఏమి సమాధానం ఇస్తుందో చూడాలి.

Comments

Popular posts from this blog

అత్యంత కష్టం మీద బోటును బయటికి తీసిన ధర్మాడి సత్యం బృందం

నెలరోజులకు పైగా గోదావరి నదీ గర్భంలోనే ఉండిపోయిన రాయల్ వశిష్ట బోటును ఎట్టకేలకు బయటికి తీశారు. ధర్మాడి సత్యం బృందం తీవ్ర ప్రయాసలకోర్చి బోటు ఆచూకీ గుర్తించడమే కాకుండా దాన్ని పైకి తీసుకువచ్చారు. మరికాసేపట్లో బోటును ఒడ్డుకు చేర్చనున్నారు. స్కూబా డైవర్ల సాయంతో బోటుకు లంగర్లు ఫిక్స్ చేసి పైకి తీసుకువచ్చేందుకు ధర్మాడి సత్యం బృందం చేసిన ప్రయత్నాలు ఫలించాయి. మొదట కొన్ని భాగాలుగా విడిపోయినా, ఆ తర్వాత మరోసారి ఐరన్ రోప్ లు బిగించి మొత్తం బోటును వెలికి తీశారు. గోదావరి ఉపరితలంపైకి చేరిన బోటును మరో రెండు గంటల్లో తీరానికి చేర్చే అవకాశాలున్నాయి.

మీడియాపై మాకు గౌరవముంది: కోటంరెడ్డి

  కొన్ని పత్రికలు, ఛానల్స్ తమ పాలనపై ప్రజల్లో అపోహలు సృష్టిస్తున్నాయని  వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. మీడియాపై తమకు గౌరవం ఉందని, అది ఎప్పటికీ కొనసాగుతుందని చెప్పారు. జీవో 2430 కొత్తగా తీసుకొచ్చింది కాదని, ఎప్పటినుంచో అది ఉందని తెలిపారు.  ఈ రోజు కోటంరెడ్డి మీడియాతో మాట్లాడారు. కొన్ని పత్రికలు, ఛానల్స్ పనికట్టుకుని తప్పుడు వార్తలతో అపోహలు సృష్టిస్తున్నాయన్నారు. తప్పుడు వార్తలు రాసేవారు భయపడాలని పేర్కొన్నారు. ఒకప్పుడు సాక్షి మీడియాను చంద్రబాబు అనుమతించనప్పుడు ఈ ఉద్యమ నేతలు ఎటుపోయారని నిలదీశారు. లోకేశ్ దీక్షలను చూసి ప్రజలు నవ్వుకుంటున్నారన్నారు. మంగళగిరి నియోజక వర్గంలో ఎన్ని ఓట్లు ఉన్నాయో కూడా లోకేశ్ కు తెలియదని విమర్శించారు. తమ పాలనను చంద్రబాబు సహించలేకపోతున్నారని ఆయన మండిపడ్డారు. చంద్రబాబు, తన హయాంలో తన కొడుకు లోకేశ్ తో కలిసి దోచుకుని లోటు బడ్జెట్ ను చూపెట్టారని విమర్శించారు. ప్రస్తుతం సీఎం జగన్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గాడిలో పెడుతున్నారని చెప్పారు.  చంద్రబాబుకు చదువుకునేటప్పటి నుంచే కులపిచ్చి ఉందని పేర్కొన్నారు. స్థాని...