Skip to main content

టీటీడీ పరిధిలోకి స్విమ్స్ ఆస్పత్రిని తీసుకుంటాం: వైవీ సుబ్బారెడ్డి

 


తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పాలకమండలి సమావేశాన్ని ఈరోజు నిర్వహించి, పలు అంశాలపై నిర్ణయాలు తీసుకున్నారు. సమావేశం అనంతరం మీడియాతో టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ, టీటీడీ పరిధిలోకి స్విమ్స్ ఆస్పత్రిని తీసుకోవాలని, తిరుపతిలో 250 ఎకరాలలో ఆధ్యాత్మిక సిటీ నిర్మించాలని, గరుఢ వారధి నిర్మాణ పనుల రీడిజైన్ చేయాలని నిర్ణయించినట్టు తెలిపారు.

ఇటీవల విజయవంతంగా జరిగిన బ్రహ్మోత్సవాల నిర్వహణకు సహకరించిన టీటీడీ శాశ్వత  ఉద్యోగులకు రూ.14 వేల చొప్పున, కాంట్రాక్టు ఉద్యోగులకు రూ.6,500 చొప్పున 'బ్రహ్మోత్సవ బహుమానం' ఇవ్వాలని తీర్మానించినట్టు ఆయన చెప్పారు. బాలాజీ రిజర్వాయర్ నిర్మాణానికి నిధులు కేటాయిస్తామని, మూడు నెలల్లోగా తిరుమలలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ను నిషేధించాలని తీర్మానించినట్టు తెలియజేశారు.

 టీటీడీలో వంశపారంపర్య అర్చక వ్యవస్థను అమలు చేస్తామని, ఈవో నేతృత్వంలో ఓ కమిటీ కూడా ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. తిరుపతిలో సంపూర్ణ మద్యపాన నిషేధానికి  తీర్మానం చేసిందని, టీటీడీ పరిధిలోని 162 మంది అటవీ కార్మికులను రెగ్యులరైజ్ చేయాలని నిర్ణయించినట్టు పేర్కొన్నారు.   

Comments

Popular posts from this blog

సుజనా చౌదరి లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా ప్రైవేట్ బిల్లు పెడతాం: వైసీపీ ఎంపీ బాలశౌరి

బీజేపీ ఎంపీ సుజనాచౌదరిపై వైసీపీ ఎంపీ బాలశౌరి తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేశారు. మొన్నటి వరకు టీడీపీలో ఉన్న సుజనాచౌదరి బీజేపీలో చేరింది చంద్రబాబు అజెండా మోయడానికి కాదా? రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమా? చంద్రబాబు ప్రయోజనాలు ముఖ్యమా? ప్రధాని మోదీకి వ్యతిరేకంగా గతంలో ధర్మదీక్షలు చేసింది సుజనా కాదా? అని ప్రశ్నించారు. పొలిటికల్ బ్రోకర్, డూప్లికేట్ బీజేపీ నేత సుజనా చౌదరి మాటలకు విలువే లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సుజనా డూప్లికేట్ బీజేపీ నేత కాబట్టే చంద్రబాబు అజెండా అమలు చేస్తున్నారని ఆరోపించారు. సుజనాపై ఎథిక్స్ కమిటీలో ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు.  బ్యాంకులను మోసం చేసి డబ్బులు ఎగ్గొట్టిన సుజనా లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా పార్లమెంట్ లో ప్రైవేట్ బిల్లు పెడతామని సంచలన వ్యాఖ్యలు చేశారు.  

తెలంగాణ సర్కారుకు దర్శకుడు హరీశ్ శంకర్ సలహా

  హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ సమస్యలను తగ్గించడానికి మంత్రి కేటీఆర్ అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సమావేశంపై తెలంగాణ ఐటీ, పరిశ్రమల మంత్రిత్వ శాఖ ట్విట్టర్ లో పోస్ట్ చేయగా, దానిపై దర్శకుడు హరీశ్ శంకర్ స్పందించారు. హైదరాబాద్ నగరానికి స్లిప్ రోడ్ల అవసరం ఎంతో ఉందని తెలిపారు. మంత్రి కేటీఆర్ సమావేశంలో కొత్త స్లిప్ రోడ్ల అంశం కూడా చర్చకు రాగా, తక్షణ అవసరం అదేనని హరీశ్ శంకర్ అభిప్రాయపడ్డారు. హరీశ్ ప్రతిపాదనకు నెటిజన్ల నుంచి గణనీయమైన స్థాయిలో మద్దతు లభిస్తోంది.