Skip to main content

అన్నీ గమనించే రాజకీయాల్లోకి వచ్చా:పవన్‌

 
అన్నీ గమనించే రాజకీయాల్లోకి వచ్చా:పవన్‌
 నీతి, నిజాయతీ ఉండేవారు రాజకీయాల్లోకి రావాలని జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ ఆకాంక్షించారు. తనతో 25 ఏళ్లపాటు ప్రయాణించేవారు కావాలన్నారు. మానవత్వం కోసం పరితపించే ఎవరినైనా తాను అభిమానిస్తాని చెప్పారు. అమరావతిలో పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ప్రకాశం జిల్లా జనసైనికులతో నిర్వహించిన సమావేశంలో పవన్‌ మాట్లాడారు. అన్ని విషయాలు గమనించే రాజకీయాల్లోకి వచ్చానని.. తన అంతిమ శ్వాస వరకు రాజకీయ పార్టీని నడుపుతానని స్పష్టం చేశారు. సీఎం జగన్‌, తెదేపా అధినేత చంద్రబాబుతో వ్యక్తిగతంగా తనకు ఎలాంటి విభేదాలూ లేవన్నారు. గెలుపు, వ్యక్తిగత లబ్ధి కోసం పాకులాడే వ్యక్తిని కాదన్నారు.
సీఎం జగన్‌కు కేసుల భయం ఉంది
ఇసుక మాఫియా ఇప్పుడు కూడా జరుగుతోందని పవన్‌ విమర్శించారు. గతంలో తెదేపా నేతలు చేస్తే ఇప్పుడు వైకాపా నేతలు చేస్తున్నారని.. దీనిలో పెద్దగా తేడా ఏమీ లేదని వ్యాఖ్యానించారు. ప్రభుత్వాన్ని నడిపేవారు హింసను ప్రోత్సహించకూడదన్నారు.  మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో ఎందుకు పురోగతి లేదని పవన్‌ ప్రశ్నించారు. ప్రజలు 151 సీట్లతో అధికారం కట్టబెట్టినా వారి నమ్మకాన్ని వైకాపా ప్రభుత్వం నిలబెట్టుకోలేకపోతోందన్నారు. తమపై కేసులు ఉండేవాళ్లు సమాజంలో బలంగా మాట్లాడలేరని, రాష్ట్ర ప్రయోజనాల విషయంలో రాజీపడతారన్నారు. సీఎం జగన్‌ దిల్లీ వెళ్లి రాష్ట్ర ప్రాజెక్టులపై బలంగా మాట్లాడలేకపోయారని..ఆయనకు సీబీఐ కేసుల భయం ఉందని పవన్‌ వ్యాఖ్యానించారు. విశాఖలో జరిగిన కోడికత్తి కేసు ఏమైందని ప్రశ్నించారు. జగన్‌ బాబాయ్‌ హత్యకు గురైతే ఇప్పటికీ ఏమీ తేల్చలేకపోయారని ఎద్దేవా చేశారు.

Comments

Popular posts from this blog

పవన్ కు శుభాకాంక్షలు చెప్పిన చిరంజీవి

  సినీనటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఈ రోజు పుట్టినరోజు వేడుక జరుపుకుంటోన్న నేపథ్యంలో ఆయనకు మెగాస్టార్ చిరంజీవి శుభాకాంక్షలు తెలిపారు.  ఆయనకు మహేశ్ బాబుతో పాటు పలువురు టాలీవుడ్ ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్లు చేశారు. సినిమాలతో పాటు రాజకీయాల్లో పవన్ కల్యాణ్ అద్భుత విజయాలు సాధించాలని తాము కోరుకుంటున్నట్లు తెలిపారు.

చింతమనేనికి బెయిల్ నిరాకరణ: అక్టోబర్ 9వరకు రిమాండ్ పొడిగింపు

తెలుగుదేశం పార్టీ నేత, దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కు కోర్టులో చుక్కెదురు అయ్యింది. చింతమనేనికి బెయిల్ ఇచ్చేందుకు ఏలూరు కోర్టు నిరాకరించింది. అంతేకాదు చింతమనేని రిమాండ్ ను అక్టోబర్ 9 వరకు పొండిగించింది.  2017లో అప్పనపాడు గ్రామంలో స్థల వివాదంలో వ్యక్తిని నిర్బంధించి కులం పేరుతో దూషించిన కేసులో కేసు నమోదు అయ్యింది. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులో భాగంగా ఇటీవలే చింతమనేని ప్రభాకర్ ను పోలీసులు అరెస్ట్ చేశారు.  అనంతరం చింతమనేని ప్రభాకర్ ను ఏలూరులోని ఎస్సీఎస్టీ అట్రాసిటీ కోర్టులో హాజరుపరచగా కోర్టు 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. రిమాండ్ పూర్తవ్వడంతో బుధవారం పోలీసులు మరోసారి ఏలూరు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కోర్టులో హాజరుపరిచారు.  అలాగే బెయిల్ ఇవ్వాలంటూ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తరపు న్యాయవాది సైతం కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. చింతమనేని బెయిల్ పిటీషన్ ను న్యాయస్థానం తోసిపుచ్చింది. అనంతరం చింతమనేని రిమాండ్ ను వచ్చే నెల 9 వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ఏలూరు కోర్టు.  ఇకపోతే చింతమనేని ప్రభాకర్ ను అరెస్ట్ చేసేందుకు వెళ్లిన సమయంలో మహిళా పో...