Skip to main content

అన్నీ గమనించే రాజకీయాల్లోకి వచ్చా:పవన్‌

 
అన్నీ గమనించే రాజకీయాల్లోకి వచ్చా:పవన్‌
 నీతి, నిజాయతీ ఉండేవారు రాజకీయాల్లోకి రావాలని జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ ఆకాంక్షించారు. తనతో 25 ఏళ్లపాటు ప్రయాణించేవారు కావాలన్నారు. మానవత్వం కోసం పరితపించే ఎవరినైనా తాను అభిమానిస్తాని చెప్పారు. అమరావతిలో పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ప్రకాశం జిల్లా జనసైనికులతో నిర్వహించిన సమావేశంలో పవన్‌ మాట్లాడారు. అన్ని విషయాలు గమనించే రాజకీయాల్లోకి వచ్చానని.. తన అంతిమ శ్వాస వరకు రాజకీయ పార్టీని నడుపుతానని స్పష్టం చేశారు. సీఎం జగన్‌, తెదేపా అధినేత చంద్రబాబుతో వ్యక్తిగతంగా తనకు ఎలాంటి విభేదాలూ లేవన్నారు. గెలుపు, వ్యక్తిగత లబ్ధి కోసం పాకులాడే వ్యక్తిని కాదన్నారు.
సీఎం జగన్‌కు కేసుల భయం ఉంది
ఇసుక మాఫియా ఇప్పుడు కూడా జరుగుతోందని పవన్‌ విమర్శించారు. గతంలో తెదేపా నేతలు చేస్తే ఇప్పుడు వైకాపా నేతలు చేస్తున్నారని.. దీనిలో పెద్దగా తేడా ఏమీ లేదని వ్యాఖ్యానించారు. ప్రభుత్వాన్ని నడిపేవారు హింసను ప్రోత్సహించకూడదన్నారు.  మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో ఎందుకు పురోగతి లేదని పవన్‌ ప్రశ్నించారు. ప్రజలు 151 సీట్లతో అధికారం కట్టబెట్టినా వారి నమ్మకాన్ని వైకాపా ప్రభుత్వం నిలబెట్టుకోలేకపోతోందన్నారు. తమపై కేసులు ఉండేవాళ్లు సమాజంలో బలంగా మాట్లాడలేరని, రాష్ట్ర ప్రయోజనాల విషయంలో రాజీపడతారన్నారు. సీఎం జగన్‌ దిల్లీ వెళ్లి రాష్ట్ర ప్రాజెక్టులపై బలంగా మాట్లాడలేకపోయారని..ఆయనకు సీబీఐ కేసుల భయం ఉందని పవన్‌ వ్యాఖ్యానించారు. విశాఖలో జరిగిన కోడికత్తి కేసు ఏమైందని ప్రశ్నించారు. జగన్‌ బాబాయ్‌ హత్యకు గురైతే ఇప్పటికీ ఏమీ తేల్చలేకపోయారని ఎద్దేవా చేశారు.

Comments

Popular posts from this blog

సుజనా చౌదరి లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా ప్రైవేట్ బిల్లు పెడతాం: వైసీపీ ఎంపీ బాలశౌరి

బీజేపీ ఎంపీ సుజనాచౌదరిపై వైసీపీ ఎంపీ బాలశౌరి తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేశారు. మొన్నటి వరకు టీడీపీలో ఉన్న సుజనాచౌదరి బీజేపీలో చేరింది చంద్రబాబు అజెండా మోయడానికి కాదా? రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమా? చంద్రబాబు ప్రయోజనాలు ముఖ్యమా? ప్రధాని మోదీకి వ్యతిరేకంగా గతంలో ధర్మదీక్షలు చేసింది సుజనా కాదా? అని ప్రశ్నించారు. పొలిటికల్ బ్రోకర్, డూప్లికేట్ బీజేపీ నేత సుజనా చౌదరి మాటలకు విలువే లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సుజనా డూప్లికేట్ బీజేపీ నేత కాబట్టే చంద్రబాబు అజెండా అమలు చేస్తున్నారని ఆరోపించారు. సుజనాపై ఎథిక్స్ కమిటీలో ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు.  బ్యాంకులను మోసం చేసి డబ్బులు ఎగ్గొట్టిన సుజనా లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా పార్లమెంట్ లో ప్రైవేట్ బిల్లు పెడతామని సంచలన వ్యాఖ్యలు చేశారు.  

చైనాకు షాక్ : వాటిపై పెరగనున్న సుంకం

విదేశాల నుంచి దిగుమతయ్యే యాక్టివ్‌ ఫార్మాసూటికల్‌ ఇన్‌గ్రీడియంట్స్‌ (ఏపీఐ) దిగుమతులపై భారత  ప్రభుత్వం త్వరలోనే షాక్ ఇవ్వనుంది. ఏపీఐ దిగమతులపై కస్టమ్స్ సుంకాన్ని10 నుంచి 15 శాతం దాకా  పెంచాలని  ఫార్మాస్యూటికల్స్ విభాగం (డీఓపీ) యోచిస్తోంది. ముడి ఔషధాల (ఏపీఐ) దేశీయ తయారీని ప్రోత్సాహం ఇవ్వడంతోపాటు,చైనాపై అధికంగా ఆధారపడటాన్ని తగ్గించాలన్న వ్యూహంలో భాగంగా కేంద్రం ఈ నిర్ణయం తీసుకోనుంది. ఏపీఐ దిగుమతులపై సుంకాన్ని 20-25 శాతంగా ఉంచేందుకు ప్రభుత్వం పరిశీలిస్తోందని ఎకనామిక్ టైమ్స్ నివేదించింది. ప్రస్తుతం ఇది 10 శాతం మాత్రమే. భారత్-చైనా సరిహద్దు వివాదం, ఇటు చైనా ఉత్పత్తులను నిషేధించాలన్న డిమాండ్ అటు ప్రధానంగా ఏఐపీల కోసం చైనాపై అధికంగా ఆధారపడుతున్న తరుణంలో ఇది చైనాకు ప్రతికూలంగా మారనుంది.   ప్రస్తుతం, భారతదేశం 68 శాతం ఏపీఐలు, 90 శాతం కంటే ఎక్కువ యాంటీబయాటిక్‌లను చైనా నుండి దిగుమతి చేసుకుంటోంది. దేశీయంగా  వాల్యూమ్ పరంగా ప్రపంచంలో మూడవ అతిపెద్దది. క్లిష్టమైన కీ స్టార్టింగ్ మెటీరియల్స్ (కెఎస్ఎం), డ్రగ్ ఇంటర్మీడియట్...