Skip to main content

ఫేస్‌బుక్‌ ఇప్పుడు ఫిఫ్త్‌ ఎస్టేట్‌...

ఫేస్‌బుక్‌ ఇప్పుడు ఫిఫ్త్‌ ఎస్టేట్‌...

ఫోర్త్‌ ఎస్టేట్‌ అని మనం పిలుచుకునే సంప్రదాయ న్యూస్‌ మీడియాకు దీటుగా ఫిఫ్త్‌ ఎస్టేట్ గా  ఫేస్‌బుక్‌ అవతరించిందని ఆ సంస్థ వ్యవస్థాపకుడు మార్క్‌ జుకర్‌బర్గ్‌ ప్రకటించారు. ప్రజలు తమ స్వరాన్ని వినిపించడానికి న్యూస్‌ మీడియా లేదా రాజకీయ నాయకులపై ఇక ఏ మాత్రం ఆధారపడనవసరం లేదని ఆయన పిలుపునిచ్చారు. వాషింగ్టన్‌లోని జార్జిటౌన్‌ విశ్వవిద్యాలయంలో ఆయన ఉపన్యసిస్తూ, సోషల్‌ మీడియా అధికారాన్ని నేరుగా ప్రజల చేతికిచ్చిందని అభిప్రాయపడ్డారు. తమ అభిప్రాయాలను స్వేచ్ఛగా వ్యక్తం చేయగల ప్రజలతో ఒక కొత్త శక్తి అవతరించిందని, అదే ఫిఫ్త్‌ ఎస్టేట్ అని ఆయన విశ్లేషించారు. ఈ విధమైన మార్పు న్యాయం, సంస్కృతి, టెక్నాలజీ తదితర రంగాలలో అనేక అతిముఖ్య పరిణామాలకు దారి తీస్తోందని ఆయన అన్నారు.
ఫేస్‌బుక్‌ ఇప్పుడు ఫిఫ్త్‌ ఎస్టేట్‌...
ఫేస్‌బుక్‌, నిజ నిర్ధారణ చేయకుండానే రాజకీయ ప్రకటనలను అంగీకరించడాన్ని ఆయన సమర్థించారు. ‘‘మేం రాజకీయ ప్రకటనల నిజానిజాల తనిఖీ చేపట్టం. అయితే ఇది రాజకీయ నాయకులకు కొమ్ముకాయడానికి కాదు. ప్రజలు నాయకులు చెప్పేది వినాలి. వారు చెప్పే విషయంలోని అంతరార్థాలు, పరిణామాలను స్వీయ విచక్షణతో అంచనా వేయగలగాలి. మా ప్రమాణాలకు విరుద్ధమైన ఏ వార్తనైనా, అది ఎంత ముఖ్యమైనదైనా సరే, మేం అంగీకరించం...అదేవిధంగా రాజకీయ నాయకుల విషయంలో కూడా హింసాత్మకమైన, ప్రమాదకరమైన అంశాలను మేము ప్రోత్సహించం. ఓటరును అణగదొక్కే ఏ ప్రయత్నానికైనా మేం వ్యతిరేకం. ఓటింగ్‌ అనేది ప్రజల వాణి.’’ అని జుకర్‌బర్గ్‌ అన్నా

Comments

Popular posts from this blog

సుజనా చౌదరి లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా ప్రైవేట్ బిల్లు పెడతాం: వైసీపీ ఎంపీ బాలశౌరి

బీజేపీ ఎంపీ సుజనాచౌదరిపై వైసీపీ ఎంపీ బాలశౌరి తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేశారు. మొన్నటి వరకు టీడీపీలో ఉన్న సుజనాచౌదరి బీజేపీలో చేరింది చంద్రబాబు అజెండా మోయడానికి కాదా? రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమా? చంద్రబాబు ప్రయోజనాలు ముఖ్యమా? ప్రధాని మోదీకి వ్యతిరేకంగా గతంలో ధర్మదీక్షలు చేసింది సుజనా కాదా? అని ప్రశ్నించారు. పొలిటికల్ బ్రోకర్, డూప్లికేట్ బీజేపీ నేత సుజనా చౌదరి మాటలకు విలువే లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సుజనా డూప్లికేట్ బీజేపీ నేత కాబట్టే చంద్రబాబు అజెండా అమలు చేస్తున్నారని ఆరోపించారు. సుజనాపై ఎథిక్స్ కమిటీలో ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు.  బ్యాంకులను మోసం చేసి డబ్బులు ఎగ్గొట్టిన సుజనా లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా పార్లమెంట్ లో ప్రైవేట్ బిల్లు పెడతామని సంచలన వ్యాఖ్యలు చేశారు.  

చైనాకు షాక్ : వాటిపై పెరగనున్న సుంకం

విదేశాల నుంచి దిగుమతయ్యే యాక్టివ్‌ ఫార్మాసూటికల్‌ ఇన్‌గ్రీడియంట్స్‌ (ఏపీఐ) దిగుమతులపై భారత  ప్రభుత్వం త్వరలోనే షాక్ ఇవ్వనుంది. ఏపీఐ దిగమతులపై కస్టమ్స్ సుంకాన్ని10 నుంచి 15 శాతం దాకా  పెంచాలని  ఫార్మాస్యూటికల్స్ విభాగం (డీఓపీ) యోచిస్తోంది. ముడి ఔషధాల (ఏపీఐ) దేశీయ తయారీని ప్రోత్సాహం ఇవ్వడంతోపాటు,చైనాపై అధికంగా ఆధారపడటాన్ని తగ్గించాలన్న వ్యూహంలో భాగంగా కేంద్రం ఈ నిర్ణయం తీసుకోనుంది. ఏపీఐ దిగుమతులపై సుంకాన్ని 20-25 శాతంగా ఉంచేందుకు ప్రభుత్వం పరిశీలిస్తోందని ఎకనామిక్ టైమ్స్ నివేదించింది. ప్రస్తుతం ఇది 10 శాతం మాత్రమే. భారత్-చైనా సరిహద్దు వివాదం, ఇటు చైనా ఉత్పత్తులను నిషేధించాలన్న డిమాండ్ అటు ప్రధానంగా ఏఐపీల కోసం చైనాపై అధికంగా ఆధారపడుతున్న తరుణంలో ఇది చైనాకు ప్రతికూలంగా మారనుంది.   ప్రస్తుతం, భారతదేశం 68 శాతం ఏపీఐలు, 90 శాతం కంటే ఎక్కువ యాంటీబయాటిక్‌లను చైనా నుండి దిగుమతి చేసుకుంటోంది. దేశీయంగా  వాల్యూమ్ పరంగా ప్రపంచంలో మూడవ అతిపెద్దది. క్లిష్టమైన కీ స్టార్టింగ్ మెటీరియల్స్ (కెఎస్ఎం), డ్రగ్ ఇంటర్మీడియట్...