Skip to main content

ఫేస్‌బుక్‌ ఇప్పుడు ఫిఫ్త్‌ ఎస్టేట్‌...

ఫేస్‌బుక్‌ ఇప్పుడు ఫిఫ్త్‌ ఎస్టేట్‌...

ఫోర్త్‌ ఎస్టేట్‌ అని మనం పిలుచుకునే సంప్రదాయ న్యూస్‌ మీడియాకు దీటుగా ఫిఫ్త్‌ ఎస్టేట్ గా  ఫేస్‌బుక్‌ అవతరించిందని ఆ సంస్థ వ్యవస్థాపకుడు మార్క్‌ జుకర్‌బర్గ్‌ ప్రకటించారు. ప్రజలు తమ స్వరాన్ని వినిపించడానికి న్యూస్‌ మీడియా లేదా రాజకీయ నాయకులపై ఇక ఏ మాత్రం ఆధారపడనవసరం లేదని ఆయన పిలుపునిచ్చారు. వాషింగ్టన్‌లోని జార్జిటౌన్‌ విశ్వవిద్యాలయంలో ఆయన ఉపన్యసిస్తూ, సోషల్‌ మీడియా అధికారాన్ని నేరుగా ప్రజల చేతికిచ్చిందని అభిప్రాయపడ్డారు. తమ అభిప్రాయాలను స్వేచ్ఛగా వ్యక్తం చేయగల ప్రజలతో ఒక కొత్త శక్తి అవతరించిందని, అదే ఫిఫ్త్‌ ఎస్టేట్ అని ఆయన విశ్లేషించారు. ఈ విధమైన మార్పు న్యాయం, సంస్కృతి, టెక్నాలజీ తదితర రంగాలలో అనేక అతిముఖ్య పరిణామాలకు దారి తీస్తోందని ఆయన అన్నారు.
ఫేస్‌బుక్‌ ఇప్పుడు ఫిఫ్త్‌ ఎస్టేట్‌...
ఫేస్‌బుక్‌, నిజ నిర్ధారణ చేయకుండానే రాజకీయ ప్రకటనలను అంగీకరించడాన్ని ఆయన సమర్థించారు. ‘‘మేం రాజకీయ ప్రకటనల నిజానిజాల తనిఖీ చేపట్టం. అయితే ఇది రాజకీయ నాయకులకు కొమ్ముకాయడానికి కాదు. ప్రజలు నాయకులు చెప్పేది వినాలి. వారు చెప్పే విషయంలోని అంతరార్థాలు, పరిణామాలను స్వీయ విచక్షణతో అంచనా వేయగలగాలి. మా ప్రమాణాలకు విరుద్ధమైన ఏ వార్తనైనా, అది ఎంత ముఖ్యమైనదైనా సరే, మేం అంగీకరించం...అదేవిధంగా రాజకీయ నాయకుల విషయంలో కూడా హింసాత్మకమైన, ప్రమాదకరమైన అంశాలను మేము ప్రోత్సహించం. ఓటరును అణగదొక్కే ఏ ప్రయత్నానికైనా మేం వ్యతిరేకం. ఓటింగ్‌ అనేది ప్రజల వాణి.’’ అని జుకర్‌బర్గ్‌ అన్నా

Comments

Popular posts from this blog

వారానికోసారి కష్టమేమీ కాదు... సీఎం జగన్‌ కేసులో సీబీఐ కౌంటర్

కోర్టుకు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని ఏపీ సీఎం జగన్ వేసిన పిటిషన్‌పై సీబీఐ కౌంటర్ దాఖలు చేసింది. అక్రమాస్తుల కేసు విచారణ నుంచి తనకు వ్యక్తిగత హాజరు మినహాయింపు ఇవ్వాలని ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సీబీఐ కోర్టులో వేసిన పిటిషన్‌పై సీబీఐ కౌంటర్ దాఖలు చేసింది. సీఎం జగన్ దాఖలు చేసిన పిటిషన్‌పై సీబీఐ అభ్యంతరం వ్యక్తం చేసింది. సాక్షులను జగన్ ప్రభావితం చేసే అవకాశం ఉందని పిటిషన్‌లో పేర్కొంది. ఆయన వాస్తవాలను దాచిపెట్టి పిటిషన్ వేశారని ఆరోపించింది. జగన్ జైల్లో ఉన్నప్పుడు సాక్షులను ప్రభావితం చేశారని... సీఎం పదవిలో ఉన్న జగన్ సాక్షులను మరింత ప్రభావితం చేసే అవకాశం ఉందని సీబీఐ తన పిటిషన్‌లో పేర్కొంది. ఏపీలో రెవెన్యూ లోటు అనేది సీఎంగా ఉన్న జగన్ వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇచ్చే కారణం కాదని తెలిపింది. సీఎంగా ఉన్న జగన్ విజయవాడ నుంచి వారానికోసారి హైదరాబాద్ రావడంకష్టమేమీ కాదని కౌంటర్‌ పిటిషన్‌లో సీబీఐ పేర్కొన్నట్టు తెలుస్తోంది. సీబీఐ కౌంటర్‌పై కోర్టు శుక్రవారం వాదనలు వినిపించనుంది.

బోటు వెలికితీత మరింత ఆలస్యం

కచ్చులూరు వద్ద మునిగిన బోటును రేపు వెలికితీస్తామని ధర్మాడి సత్యం తెలిపారు. బోటు వెలికితీత కోసం రెండోరోజు చేసిన ప్రయత్నాలు విఫలమైనట్లు చెప్పారు. వాతావరణం అనుకూలించనందువల్లే ఈ ఆలస్యం జరుగుతుందని వివరించారు. గోదావరిలో వరద ప్రహహం తగ్గిన కారణంగా బోటును రేపు బయటికి తీస్తామని స్పష్టం చేశారు. కాగా.. ధర్మాడి సత్యం బృందం వేసిన లంగర్‌కు బోటు తగిలి కదిలిందని స్థానికులు తెలిపారు.