Skip to main content

ఫేస్‌బుక్‌ ఇప్పుడు ఫిఫ్త్‌ ఎస్టేట్‌...

ఫేస్‌బుక్‌ ఇప్పుడు ఫిఫ్త్‌ ఎస్టేట్‌...

ఫోర్త్‌ ఎస్టేట్‌ అని మనం పిలుచుకునే సంప్రదాయ న్యూస్‌ మీడియాకు దీటుగా ఫిఫ్త్‌ ఎస్టేట్ గా  ఫేస్‌బుక్‌ అవతరించిందని ఆ సంస్థ వ్యవస్థాపకుడు మార్క్‌ జుకర్‌బర్గ్‌ ప్రకటించారు. ప్రజలు తమ స్వరాన్ని వినిపించడానికి న్యూస్‌ మీడియా లేదా రాజకీయ నాయకులపై ఇక ఏ మాత్రం ఆధారపడనవసరం లేదని ఆయన పిలుపునిచ్చారు. వాషింగ్టన్‌లోని జార్జిటౌన్‌ విశ్వవిద్యాలయంలో ఆయన ఉపన్యసిస్తూ, సోషల్‌ మీడియా అధికారాన్ని నేరుగా ప్రజల చేతికిచ్చిందని అభిప్రాయపడ్డారు. తమ అభిప్రాయాలను స్వేచ్ఛగా వ్యక్తం చేయగల ప్రజలతో ఒక కొత్త శక్తి అవతరించిందని, అదే ఫిఫ్త్‌ ఎస్టేట్ అని ఆయన విశ్లేషించారు. ఈ విధమైన మార్పు న్యాయం, సంస్కృతి, టెక్నాలజీ తదితర రంగాలలో అనేక అతిముఖ్య పరిణామాలకు దారి తీస్తోందని ఆయన అన్నారు.
ఫేస్‌బుక్‌ ఇప్పుడు ఫిఫ్త్‌ ఎస్టేట్‌...
ఫేస్‌బుక్‌, నిజ నిర్ధారణ చేయకుండానే రాజకీయ ప్రకటనలను అంగీకరించడాన్ని ఆయన సమర్థించారు. ‘‘మేం రాజకీయ ప్రకటనల నిజానిజాల తనిఖీ చేపట్టం. అయితే ఇది రాజకీయ నాయకులకు కొమ్ముకాయడానికి కాదు. ప్రజలు నాయకులు చెప్పేది వినాలి. వారు చెప్పే విషయంలోని అంతరార్థాలు, పరిణామాలను స్వీయ విచక్షణతో అంచనా వేయగలగాలి. మా ప్రమాణాలకు విరుద్ధమైన ఏ వార్తనైనా, అది ఎంత ముఖ్యమైనదైనా సరే, మేం అంగీకరించం...అదేవిధంగా రాజకీయ నాయకుల విషయంలో కూడా హింసాత్మకమైన, ప్రమాదకరమైన అంశాలను మేము ప్రోత్సహించం. ఓటరును అణగదొక్కే ఏ ప్రయత్నానికైనా మేం వ్యతిరేకం. ఓటింగ్‌ అనేది ప్రజల వాణి.’’ అని జుకర్‌బర్గ్‌ అన్నా

Comments

Popular posts from this blog

పవన్ కు శుభాకాంక్షలు చెప్పిన చిరంజీవి

  సినీనటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఈ రోజు పుట్టినరోజు వేడుక జరుపుకుంటోన్న నేపథ్యంలో ఆయనకు మెగాస్టార్ చిరంజీవి శుభాకాంక్షలు తెలిపారు.  ఆయనకు మహేశ్ బాబుతో పాటు పలువురు టాలీవుడ్ ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్లు చేశారు. సినిమాలతో పాటు రాజకీయాల్లో పవన్ కల్యాణ్ అద్భుత విజయాలు సాధించాలని తాము కోరుకుంటున్నట్లు తెలిపారు.

చింతమనేనికి బెయిల్ నిరాకరణ: అక్టోబర్ 9వరకు రిమాండ్ పొడిగింపు

తెలుగుదేశం పార్టీ నేత, దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కు కోర్టులో చుక్కెదురు అయ్యింది. చింతమనేనికి బెయిల్ ఇచ్చేందుకు ఏలూరు కోర్టు నిరాకరించింది. అంతేకాదు చింతమనేని రిమాండ్ ను అక్టోబర్ 9 వరకు పొండిగించింది.  2017లో అప్పనపాడు గ్రామంలో స్థల వివాదంలో వ్యక్తిని నిర్బంధించి కులం పేరుతో దూషించిన కేసులో కేసు నమోదు అయ్యింది. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులో భాగంగా ఇటీవలే చింతమనేని ప్రభాకర్ ను పోలీసులు అరెస్ట్ చేశారు.  అనంతరం చింతమనేని ప్రభాకర్ ను ఏలూరులోని ఎస్సీఎస్టీ అట్రాసిటీ కోర్టులో హాజరుపరచగా కోర్టు 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. రిమాండ్ పూర్తవ్వడంతో బుధవారం పోలీసులు మరోసారి ఏలూరు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కోర్టులో హాజరుపరిచారు.  అలాగే బెయిల్ ఇవ్వాలంటూ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తరపు న్యాయవాది సైతం కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. చింతమనేని బెయిల్ పిటీషన్ ను న్యాయస్థానం తోసిపుచ్చింది. అనంతరం చింతమనేని రిమాండ్ ను వచ్చే నెల 9 వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ఏలూరు కోర్టు.  ఇకపోతే చింతమనేని ప్రభాకర్ ను అరెస్ట్ చేసేందుకు వెళ్లిన సమయంలో మహిళా పో...