లెటర్ ఆఫ్ క్రెడిట్(ఎల్వోసి) రాష్ట్రప్రభుత్వం ఇవ్వడంతో కేంద్రప్రభుత్వం విద్యుత్ కొనుగోళ్లకు అనుమతి ఇచ్చింది. ముందస్తుగా నగదు చెల్లించలేదని కెఎస్కె అనే ప్రైవేట్ కంపెనీ ఫిర్యాదు చేయడంతో రాష్ట్రానికి చెందిన విద్యుత్ సంస్థలను కేంద్రప్రభుత్వం బ్లాక్ చేసిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో అవసరాలకు తగ్గట్టుగా పవర్ ఎక్సైంజ్లో రాష్ట్రం విద్యుత్ కొనుగోలు చేసుకునేందుకు వీలు లేకుండా కేంద్రం చేసింది. రాష్ట్రప్రభుత్వం నగదు జమచేయడంతో కొనుగోళ్లకు అనుమతి ఇస్తున్నట్లు సోమవారం సదరన్ రీజనల్ లోడ్ డిస్పాచ్ సెంటర్(ఎస్ఆర్ఎల్డిసి) వెబ్సైట్లో పేర్కొంది. కెఎస్కె థర్మల్ కేంద్రానికి రూ.120 కోట్లు రాష్ట్రప్రభుత్వం సోమవారం చెల్లించడంతో ఎక్సెంజ్లో రాష్ట్ర డిస్కంలు విద్యుత్ కొనుగోలు చేస్తున్నాయి. దీంతో శని, ఆదివారాలతో పోల్చుకుంటే సోమవారం రాష్ట్రంలో విద్యుత్ కోతలు కూడా తగ్గాయి. ఆదివారం 6879 మెగావాట్ల విద్యుత్ డిమాండ్ ఉండగా అందుబాటులో 6670 మెగావాట్లు ఉంది. 200 మెగావాట్లు లోటు ఉంది. ఆదివారంతో పోల్చుకుంటే సోమవారం డిమాండ్ పెరిగింది. 7,200 మెగవాట్ల అవసరం కాగా అందుబాటులో 6,940 మెగావాట్లు ఉంది. 900 మెగావాట్ల లోటు ఉండగా, పవర్ ఎక్సెంజ్లో 680 నుంచి 1450 మెగావాట్లను డిస్కంలు కొనుగోలు చేశాయి. ఆదివారంతో పోల్చుకుంటే సోమవారం జెన్కో ఉత్పత్తి తగ్గింది. ఆదివారం 2,777 మెగావాట్ల ఉత్పిత్తి కాగా, సోమవారం 2,550 మెగావాట్లే ఉత్పిత్తి జరిగింది.
మూడు రాజధానులను ఏర్పాటు చేయడానికి ఉద్దేశించిన ఏపీ వికేంద్రీకరణ బిల్లు ఆమోదం పొందడం, రాజధాని ప్రాంత అభివృద్ధి అథారిటీ (సీఆర్డీ) రద్దు నేపథ్యంలో.. ప్రభుత్వం మెరుపు వేగంతో నిర్ణయాలను తీసుకుంటోంది. పరిపాలనను వేగవంతం చేసేలా తక్షణ చర్యలకు దిగింది. సీఆర్డీఏ బిల్లు రద్దు అనంతరం దాని స్థానంలో అమరావతి మెట్రోపాలిటన్ ప్రాంత అభివృద్ధి మండలిని ఏర్పాటు చేస్తామని ప్రకటించిన ప్రభుత్వం.. దాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. ఏఎంఆర్డీఏ కమిటీ సభ్యులనూ నియమించింది. సీఆర్డీఏకు బదులుగా ఏఎంఆర్డీఏ సీఆర్డీఏ స్థాయంలో అమరావతి మెట్రోపాలిటన్ ప్రాంత అభివృద్ధి మండలి (ఏఎంఆర్డీఏ)ని ఏర్పాటు చేసింది. ఈ మేరకు నోటిఫికేషన్ను జారీ చేసింది. సీఆర్డీఏను రద్దు చేస్తూ అసెంబ్లీ ఆమోదించిన తీర్మానంపై గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆమోదముద్ర వేసిన మరుసటి రోజే ఏఎంఆర్డీఏను తెరపైకి తీసుకొచ్చింది. దానితో పాటు కొత్త సభ్యులను నియమించింది. మున్సిపల్ శాఖ కార్యదర్శి జే శ్యామల రావు దీనికి సంబంధించిన నోటిఫికేషన్ను జారీ చేశారు. మొత్తం 11 మంది సభ్యులను ఏఎంఆర్డీఏ కమిటీలో నియమించారు. సభ్యులు వీరే.. మున్సిపల్ శాఖ కార్యదర్శి డిప్య...
Comments
Post a Comment