Skip to main content

హుజూర్ నగర్ లో టీఆర్ఎస్ కు మద్దతివ్వాలని ప్రజలను కోరతాం... సీపీఐ నారాయణ

హుజూర్ నగర్ ఉపఎన్నిక నేపథ్యంలో నామినేషన్లకు గడువు ముగిసింది. ఈ క్రమంలో సీపీఐ నారాయణ వ్యాఖ్యలు ఆసక్తి కలిగిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ తమతో సరిగా వ్యవహరించలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. కలిసివచ్చే పార్టీలను సమన్వయం చేయడంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి విఫలం అయ్యారని నారాయణ ఆరోపించారు. సీపీఎం నామినేషన్ తిరస్కరణకు గురి కావడంతో వారికి మద్దతు ఇవ్వలేకపోతున్నామని, ఈ నేపథ్యంలో అధికార టీఆర్ఎస్ కు మద్దతివ్వాలని ప్రజలను కోరతామని స్పష్టం చేశారు. ఇప్పటికే టీఆర్ఎస్ నేతలు సీపీఐ ముఖ్యులతో చర్చలు జరిపిన నేపథ్యంలో నారాయణ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్, సీపీఐ దోస్తీ స్పష్టమైంది.

Comments

Popular posts from this blog

సుజనా చౌదరి లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా ప్రైవేట్ బిల్లు పెడతాం: వైసీపీ ఎంపీ బాలశౌరి

బీజేపీ ఎంపీ సుజనాచౌదరిపై వైసీపీ ఎంపీ బాలశౌరి తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేశారు. మొన్నటి వరకు టీడీపీలో ఉన్న సుజనాచౌదరి బీజేపీలో చేరింది చంద్రబాబు అజెండా మోయడానికి కాదా? రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమా? చంద్రబాబు ప్రయోజనాలు ముఖ్యమా? ప్రధాని మోదీకి వ్యతిరేకంగా గతంలో ధర్మదీక్షలు చేసింది సుజనా కాదా? అని ప్రశ్నించారు. పొలిటికల్ బ్రోకర్, డూప్లికేట్ బీజేపీ నేత సుజనా చౌదరి మాటలకు విలువే లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సుజనా డూప్లికేట్ బీజేపీ నేత కాబట్టే చంద్రబాబు అజెండా అమలు చేస్తున్నారని ఆరోపించారు. సుజనాపై ఎథిక్స్ కమిటీలో ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు.  బ్యాంకులను మోసం చేసి డబ్బులు ఎగ్గొట్టిన సుజనా లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా పార్లమెంట్ లో ప్రైవేట్ బిల్లు పెడతామని సంచలన వ్యాఖ్యలు చేశారు.  

తెలంగాణ సర్కారుకు దర్శకుడు హరీశ్ శంకర్ సలహా

  హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ సమస్యలను తగ్గించడానికి మంత్రి కేటీఆర్ అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సమావేశంపై తెలంగాణ ఐటీ, పరిశ్రమల మంత్రిత్వ శాఖ ట్విట్టర్ లో పోస్ట్ చేయగా, దానిపై దర్శకుడు హరీశ్ శంకర్ స్పందించారు. హైదరాబాద్ నగరానికి స్లిప్ రోడ్ల అవసరం ఎంతో ఉందని తెలిపారు. మంత్రి కేటీఆర్ సమావేశంలో కొత్త స్లిప్ రోడ్ల అంశం కూడా చర్చకు రాగా, తక్షణ అవసరం అదేనని హరీశ్ శంకర్ అభిప్రాయపడ్డారు. హరీశ్ ప్రతిపాదనకు నెటిజన్ల నుంచి గణనీయమైన స్థాయిలో మద్దతు లభిస్తోంది.