Skip to main content

చంద్రబాబు, పవన్ కల్యాణ్ దొంగ ధర్నాలు చేస్తున్నారు: జోగి రమేశ్ విమర్శలు

 
ఏపీలో ఇసుక అంశం అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధానికి కారణమైంది. తాజాగా దీనిపై వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేశ్ స్పందించారు. ఇసుక విషయంలో చంద్రబాబు, పవన్ విషప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. కృత్రిమ కొరత సృష్టించాల్సిన అవసరం తమకు లేదని, ఇసుక కొరత త్వరలోనే తీరిపోతుందని అన్నారు. ఈ వ్యవహారంలో చంద్రబాబు, పవన్ కల్యాణ్ దొంగ ధర్నాలు చేస్తున్నారని జోగి రమేశ్ మండిపడ్డారు. వరదల కారణంగా ఇసుక తవ్వకాలు నిలిచిపోతే, ప్రభుత్వంపై అసత్యప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.

చంద్రబాబు హయాంలో ఆయన నివాసం పక్కన కోట్ల విలువైన ఇసుకను తవ్వుకుపోతే గ్రీన్ ట్రైబ్యునల్ రూ.100 కోట్ల జరిమానా విధించిందని తెలిపారు. ఇక, రెండు స్థానాల్లోనూ ఓటమిపాలైన పవన్ కల్యాణ్ కు సీఎం జగన్ ను విమర్శించే అర్హత ఎక్కడిదని ప్రశ్నించారు. త్వరలోనే టీడీపీ ఖాళీ అయిపోతుందని, టీడీపీ రాష్ట్రంలో ఉంటుందో, ఉండదో తెలియని పరిస్థితి నెలకొందని ఎద్దేవా చేశారు. అసలు, టీడీపీకి అధ్యక్షుడిగా చంద్రబాబు ఉంటారో, ఉండరో తెలియదని అన్నారు.

చాలా మంది వైసీపీ వైపు చూస్తున్నారని, జగన్ బాటలో నడవాలంటే విలువలకు కట్టుబడి ఉండాలని వ్యాఖ్యానించారు. ఫిరాయింపులకు సీఎం జగన్ వ్యతిరేకం అని, పార్టీలోకి రావాలనుకునేవారు పదవికి రాజీనామా చేయాల్సిందేనని తేల్చి చెప్పారు.

Comments

Popular posts from this blog

అంబులెన్స్‌కు దారి ఇచ్చిన సీఎం కాన్వాయ్...‌

వీడియో చూడండి : Click here ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వాహన శ్రేణి అంబులెన్స్‌కు దారిఇచ్చింది. పులివెందుల నుంచి తిరిగివచ్చిన సీఎం గన్నవరం విమానాశ్రయం నుంచి తాడేపల్లి నివాసానికి బయల్దేరారు. గూడవల్లి నిడమానూరు మధ్య ప్రమాదంలో గాయపడ్డ వ్యక్తిని తరలిస్తున్న అబులెన్స్‌కు దారి ఇచ్చారు. ఉయ్యూరు నుంచి గన్నవరం బైక్‌పైవెళ్తున్న చాపర్తిన శేఖర్‌ అనే వ్యక్తి ఉషారామ ఇంజినీరింగ్‌కాలేజీ సమీపంలో ప్రమాదానికి గురయ్యారు. అతన్ని నేషనల్‌ హైవే అంబులెన్స్‌ ద్వారా విజయవాడ ఈఎస్‌ఐ ఆస్పత్రికి తరలిస్తుండగా, దీనికి ముందు ఉన్న ముఖ్యమంత్రి కాన్వాయ్‌ పక్కకు తొలగి అంబులెన్స్‌కు దారి ఇచ్చింది.

ఒక్కో రైతుకు రూ.18,500 ఇవ్వాలి: పవన్‌

 రైతు భరోసా పథకాన్ని పీఎమ్‌ కిసాన్‌ యోజన పథకంతో ముడిపెట్టి అమలు చేస్తున్న జగన్‌.. తన ఎన్నికల వాగ్దానానికి సంపూర్ణత్వం సాధించలేక పోయారని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ విమర్శించారు. ప్రతి రైతు కుటుంబానికి  ఏడాదికి రూ.12,500  అందిస్తామని నవరత్నాలలో, ఎన్నికల ప్రణాళికలో ఘనంగా ప్రకటించి... కేంద్రం ఇస్తున్న రూ.6000 కలిపి రూ.13,500 ఇవ్వడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. నవరత్నాలు ప్రకటించినప్పుడు కేంద్ర ఇచ్చే సాయంతో కలిపి ఇస్తామని ఎందుకు ప్రకటించలేదని నిలదీశారు. రైతులకు ఇచ్చిన వాగ్దానం ప్రకారం రూ.12,500లకు కేంద్ర సాయం రూ.6000 కలిపి రూ.18,500 చొప్పున  రైతులకు పంపిణీ చేయాలని పవన్‌ కల్యాణ్‌ డిమాండ్‌ చేశారు. ఒక వేళ అంతమొత్తం ఇవ్వలేకపోతే  అందుకు కారణాలను రైతులకు చెప్పి,  వాగ్దానం ప్రకారం ఇవ్వనందుకు మన్నించమని అడగాలని పేర్కొన్నారు.