Skip to main content

చంద్రబాబు, పవన్ కల్యాణ్ దొంగ ధర్నాలు చేస్తున్నారు: జోగి రమేశ్ విమర్శలు

 
ఏపీలో ఇసుక అంశం అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధానికి కారణమైంది. తాజాగా దీనిపై వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేశ్ స్పందించారు. ఇసుక విషయంలో చంద్రబాబు, పవన్ విషప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. కృత్రిమ కొరత సృష్టించాల్సిన అవసరం తమకు లేదని, ఇసుక కొరత త్వరలోనే తీరిపోతుందని అన్నారు. ఈ వ్యవహారంలో చంద్రబాబు, పవన్ కల్యాణ్ దొంగ ధర్నాలు చేస్తున్నారని జోగి రమేశ్ మండిపడ్డారు. వరదల కారణంగా ఇసుక తవ్వకాలు నిలిచిపోతే, ప్రభుత్వంపై అసత్యప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.

చంద్రబాబు హయాంలో ఆయన నివాసం పక్కన కోట్ల విలువైన ఇసుకను తవ్వుకుపోతే గ్రీన్ ట్రైబ్యునల్ రూ.100 కోట్ల జరిమానా విధించిందని తెలిపారు. ఇక, రెండు స్థానాల్లోనూ ఓటమిపాలైన పవన్ కల్యాణ్ కు సీఎం జగన్ ను విమర్శించే అర్హత ఎక్కడిదని ప్రశ్నించారు. త్వరలోనే టీడీపీ ఖాళీ అయిపోతుందని, టీడీపీ రాష్ట్రంలో ఉంటుందో, ఉండదో తెలియని పరిస్థితి నెలకొందని ఎద్దేవా చేశారు. అసలు, టీడీపీకి అధ్యక్షుడిగా చంద్రబాబు ఉంటారో, ఉండరో తెలియదని అన్నారు.

చాలా మంది వైసీపీ వైపు చూస్తున్నారని, జగన్ బాటలో నడవాలంటే విలువలకు కట్టుబడి ఉండాలని వ్యాఖ్యానించారు. ఫిరాయింపులకు సీఎం జగన్ వ్యతిరేకం అని, పార్టీలోకి రావాలనుకునేవారు పదవికి రాజీనామా చేయాల్సిందేనని తేల్చి చెప్పారు.

Comments

Popular posts from this blog

సుజనా చౌదరి లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా ప్రైవేట్ బిల్లు పెడతాం: వైసీపీ ఎంపీ బాలశౌరి

బీజేపీ ఎంపీ సుజనాచౌదరిపై వైసీపీ ఎంపీ బాలశౌరి తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేశారు. మొన్నటి వరకు టీడీపీలో ఉన్న సుజనాచౌదరి బీజేపీలో చేరింది చంద్రబాబు అజెండా మోయడానికి కాదా? రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమా? చంద్రబాబు ప్రయోజనాలు ముఖ్యమా? ప్రధాని మోదీకి వ్యతిరేకంగా గతంలో ధర్మదీక్షలు చేసింది సుజనా కాదా? అని ప్రశ్నించారు. పొలిటికల్ బ్రోకర్, డూప్లికేట్ బీజేపీ నేత సుజనా చౌదరి మాటలకు విలువే లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సుజనా డూప్లికేట్ బీజేపీ నేత కాబట్టే చంద్రబాబు అజెండా అమలు చేస్తున్నారని ఆరోపించారు. సుజనాపై ఎథిక్స్ కమిటీలో ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు.  బ్యాంకులను మోసం చేసి డబ్బులు ఎగ్గొట్టిన సుజనా లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా పార్లమెంట్ లో ప్రైవేట్ బిల్లు పెడతామని సంచలన వ్యాఖ్యలు చేశారు.  

తెలంగాణ సర్కారుకు దర్శకుడు హరీశ్ శంకర్ సలహా

  హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ సమస్యలను తగ్గించడానికి మంత్రి కేటీఆర్ అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సమావేశంపై తెలంగాణ ఐటీ, పరిశ్రమల మంత్రిత్వ శాఖ ట్విట్టర్ లో పోస్ట్ చేయగా, దానిపై దర్శకుడు హరీశ్ శంకర్ స్పందించారు. హైదరాబాద్ నగరానికి స్లిప్ రోడ్ల అవసరం ఎంతో ఉందని తెలిపారు. మంత్రి కేటీఆర్ సమావేశంలో కొత్త స్లిప్ రోడ్ల అంశం కూడా చర్చకు రాగా, తక్షణ అవసరం అదేనని హరీశ్ శంకర్ అభిప్రాయపడ్డారు. హరీశ్ ప్రతిపాదనకు నెటిజన్ల నుంచి గణనీయమైన స్థాయిలో మద్దతు లభిస్తోంది.