Skip to main content

మహిళల స్పందనను తెలుసుకునేందుకట.. బస్సెక్కిన ఢిల్లీ సీఎం!

 రాజధాని ఢిల్లీలోని సిటీ బస్సుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణించే పథకాన్ని కేజ్రీవాల్ ప్రభుత్వం తీసుకొచ్చింది. ఈ నేపథ్యంలో తాము ప్రవేశపెట్టిన పథకంపై మహిళలు ఎలా స్పందిస్తున్నదీ తెలుసుకునేందుకు ముఖ్యమంత్రి కేజ్రీవాల్ బస్సెక్కారు. సిటీ బస్సులో ప్రయాణించి ఈ పథకంపై మహిళలతో మాట్లాడి వారి అభిప్రాయాలు తెలుసుకున్నారు. 

అనంతరం కేజ్రీవాల్ మాట్లాడుతూ.. మంచి పని ఎప్పటికైనా గొప్పగానే ఉంటుందని అన్నారు. అయితే, ప్రతిపక్షాలు మాత్రం ఈ పథకంపై పనిగట్టుకుని విమర్శలు చేస్తున్నాయని మండిపడ్డారు. తాము మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంతో సరిపెట్టలేదని, వారి భద్రత కోసం 13వేల మంది మార్షల్స్‌ను నియమించినట్టు సీఎం వివరించారు.

Comments

Popular posts from this blog

సుజనా చౌదరి లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా ప్రైవేట్ బిల్లు పెడతాం: వైసీపీ ఎంపీ బాలశౌరి

బీజేపీ ఎంపీ సుజనాచౌదరిపై వైసీపీ ఎంపీ బాలశౌరి తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేశారు. మొన్నటి వరకు టీడీపీలో ఉన్న సుజనాచౌదరి బీజేపీలో చేరింది చంద్రబాబు అజెండా మోయడానికి కాదా? రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమా? చంద్రబాబు ప్రయోజనాలు ముఖ్యమా? ప్రధాని మోదీకి వ్యతిరేకంగా గతంలో ధర్మదీక్షలు చేసింది సుజనా కాదా? అని ప్రశ్నించారు. పొలిటికల్ బ్రోకర్, డూప్లికేట్ బీజేపీ నేత సుజనా చౌదరి మాటలకు విలువే లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సుజనా డూప్లికేట్ బీజేపీ నేత కాబట్టే చంద్రబాబు అజెండా అమలు చేస్తున్నారని ఆరోపించారు. సుజనాపై ఎథిక్స్ కమిటీలో ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు.  బ్యాంకులను మోసం చేసి డబ్బులు ఎగ్గొట్టిన సుజనా లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా పార్లమెంట్ లో ప్రైవేట్ బిల్లు పెడతామని సంచలన వ్యాఖ్యలు చేశారు.  

తెలంగాణ సర్కారుకు దర్శకుడు హరీశ్ శంకర్ సలహా

  హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ సమస్యలను తగ్గించడానికి మంత్రి కేటీఆర్ అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సమావేశంపై తెలంగాణ ఐటీ, పరిశ్రమల మంత్రిత్వ శాఖ ట్విట్టర్ లో పోస్ట్ చేయగా, దానిపై దర్శకుడు హరీశ్ శంకర్ స్పందించారు. హైదరాబాద్ నగరానికి స్లిప్ రోడ్ల అవసరం ఎంతో ఉందని తెలిపారు. మంత్రి కేటీఆర్ సమావేశంలో కొత్త స్లిప్ రోడ్ల అంశం కూడా చర్చకు రాగా, తక్షణ అవసరం అదేనని హరీశ్ శంకర్ అభిప్రాయపడ్డారు. హరీశ్ ప్రతిపాదనకు నెటిజన్ల నుంచి గణనీయమైన స్థాయిలో మద్దతు లభిస్తోంది.