Skip to main content

జియోకు షాకిచ్చిన వోడాఫోన్-ఐడియా... పైసా కూడా వద్దని ప్రకటన!

తమ నెట్ వర్క్ నుంచి ఇతర నెట్ వర్క్ లకు చేసే కాల్స్ కు నిమిషానికి 6 పైసలు వసూలు చేస్తామని రిలయన్స్ జియో ప్రత్యేక ప్రకటన విడుదల చేసిన నేపథ్యంలో, ఆ సంస్థకు షాకిస్తూ, తాము మాత్రం ఎటువంటి ఇంటర్ కనెక్ట్ యూసేజ్ చార్జ్ (ఐయూసీ)లను వసూలు చేయబోమని స్పష్టం చేసింది.

కాల్స్ మొత్తం ఉచితమేనంటూ, కేవలం డేటాకు డబ్బు చెల్లిస్తే సరిపోతుందంటూ, రెండు సంవత్సరాల క్రితం మార్కెట్లోకి వచ్చిన జియో, భారత టెలికం రంగంలో సంచలనమైన సంగతి తెలిసిందే. జియో ఇప్పుడు ఇండియాలో టాప్-2లో ఉంది. తాజాగా ఐయూసీ చార్జీల వసూలు ప్రకటనతో సోషల్ మీడియాలో జియోపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

కాగా, వినియోగదారుల పరంగా నంబర్ వన్ స్థానంలో ఉన్న వోడాఫోన్-ఐడియా మాత్రం తమకు ఎటువంటి ఐయూసీ చార్జీలను వసూలు చేసే ఉద్దేశం లేదని తెలిపింది. తమ వినియోగదారులు ఇతర నెట్‌ వర్క్‌ కాల్స్ కోసం ఎప్పటిలానే కాల్స్ చేసుకోవచ్చని స్పష్టం చేసింది. వినియోగదారులపై భారం పడకూడదనేదే తమ అభిమతమని తెలిపింది. ఇదే సమయంలో ఐయూసీ ఛార్జీలు వసూలు చేస్తామని చెప్పడం తొందరపాటు చర్యని, ఇంటర్ కనెక్ట్‌ మధ్య నలుగుతున్న సమస్యకు ఇది పరిష్కారం కాదని వ్యాఖ్యానించింది.

ఇదిలావుండగా, ఐయూసీ చార్జీల వ్యవహారం మొబైల్ ఆపరేటర్లు తేల్చుకోవాలే తప్ప వినియోగదారులకు సంబంధించిన విషయం కాదని గతంలోనే ట్రాయ్ (టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా) వెల్లడించిన సంగతి తెలిసిందే.

Comments

Popular posts from this blog

సుజనా చౌదరి లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా ప్రైవేట్ బిల్లు పెడతాం: వైసీపీ ఎంపీ బాలశౌరి

బీజేపీ ఎంపీ సుజనాచౌదరిపై వైసీపీ ఎంపీ బాలశౌరి తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేశారు. మొన్నటి వరకు టీడీపీలో ఉన్న సుజనాచౌదరి బీజేపీలో చేరింది చంద్రబాబు అజెండా మోయడానికి కాదా? రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమా? చంద్రబాబు ప్రయోజనాలు ముఖ్యమా? ప్రధాని మోదీకి వ్యతిరేకంగా గతంలో ధర్మదీక్షలు చేసింది సుజనా కాదా? అని ప్రశ్నించారు. పొలిటికల్ బ్రోకర్, డూప్లికేట్ బీజేపీ నేత సుజనా చౌదరి మాటలకు విలువే లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సుజనా డూప్లికేట్ బీజేపీ నేత కాబట్టే చంద్రబాబు అజెండా అమలు చేస్తున్నారని ఆరోపించారు. సుజనాపై ఎథిక్స్ కమిటీలో ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు.  బ్యాంకులను మోసం చేసి డబ్బులు ఎగ్గొట్టిన సుజనా లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా పార్లమెంట్ లో ప్రైవేట్ బిల్లు పెడతామని సంచలన వ్యాఖ్యలు చేశారు.  

తెలంగాణ సర్కారుకు దర్శకుడు హరీశ్ శంకర్ సలహా

  హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ సమస్యలను తగ్గించడానికి మంత్రి కేటీఆర్ అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సమావేశంపై తెలంగాణ ఐటీ, పరిశ్రమల మంత్రిత్వ శాఖ ట్విట్టర్ లో పోస్ట్ చేయగా, దానిపై దర్శకుడు హరీశ్ శంకర్ స్పందించారు. హైదరాబాద్ నగరానికి స్లిప్ రోడ్ల అవసరం ఎంతో ఉందని తెలిపారు. మంత్రి కేటీఆర్ సమావేశంలో కొత్త స్లిప్ రోడ్ల అంశం కూడా చర్చకు రాగా, తక్షణ అవసరం అదేనని హరీశ్ శంకర్ అభిప్రాయపడ్డారు. హరీశ్ ప్రతిపాదనకు నెటిజన్ల నుంచి గణనీయమైన స్థాయిలో మద్దతు లభిస్తోంది.