Skip to main content

టీడీపీ పతనం వల్లభనేని వంశీతో ప్రారంభమైంది.. ఎంతదాకా వెళ్తుందో చూడాలి: విష్ణువర్ధన్ రెడ్డి


ఇప్పటి వరకు నీతులు చెప్పిన వైసీపీ మాట మార్చిందని ఏపీ బీజేపీ ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి విమర్శించారు. టీడీపీ ఎమ్మెల్యేలను లాక్కునే పనిలో పడిందని అన్నారు. 23 మంది ఎమ్మెల్యేలు ఉన్న టీడీపీలో వల్లభనేని వంశీతో కొత్త రాజకీయాలను ప్రారంభించిందని చెప్పారు.

చంద్రబాబు మీద టీడీపీ ఎమ్మెల్యేలకు విశ్వాసం కొరవడిందని అన్నారు. ఏపీలో టీడీపీ పతనం ప్రారంభమైందని చెప్పారు. వల్లభనేని వంశీతో ప్రారంభమైన ఈ పరిణామం... రానున్న రోజుల్లో ఎంత దూరం వెళ్తుందో చూడాలని అన్నారు. తన గోతిని తానే తీసుకోవడం అంటే ఇదే చంద్రబాబుగారూ అంటూ సెటైర్ వేశారు. వల్లభనేని వంశీ నిన్న ముఖ్యమంత్రి జగన్ తో భేటీ అయిన సంగతి తెలిసిందే. గత కొంత కాలంగా టీడీపీతో అంటీముట్టనట్టు ఉన్న వంశీ... వైసీపీలో చేరబోతున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది.   

Comments

Popular posts from this blog

అంబులెన్స్‌కు దారి ఇచ్చిన సీఎం కాన్వాయ్...‌

వీడియో చూడండి : Click here ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వాహన శ్రేణి అంబులెన్స్‌కు దారిఇచ్చింది. పులివెందుల నుంచి తిరిగివచ్చిన సీఎం గన్నవరం విమానాశ్రయం నుంచి తాడేపల్లి నివాసానికి బయల్దేరారు. గూడవల్లి నిడమానూరు మధ్య ప్రమాదంలో గాయపడ్డ వ్యక్తిని తరలిస్తున్న అబులెన్స్‌కు దారి ఇచ్చారు. ఉయ్యూరు నుంచి గన్నవరం బైక్‌పైవెళ్తున్న చాపర్తిన శేఖర్‌ అనే వ్యక్తి ఉషారామ ఇంజినీరింగ్‌కాలేజీ సమీపంలో ప్రమాదానికి గురయ్యారు. అతన్ని నేషనల్‌ హైవే అంబులెన్స్‌ ద్వారా విజయవాడ ఈఎస్‌ఐ ఆస్పత్రికి తరలిస్తుండగా, దీనికి ముందు ఉన్న ముఖ్యమంత్రి కాన్వాయ్‌ పక్కకు తొలగి అంబులెన్స్‌కు దారి ఇచ్చింది.

మరోసారి రంగంలోకి దిగిన ధర్మాడి సత్యం... ఓ చిన్నారి కోసం అన్వేషణ!

తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో దీప్తిశ్రీ అనే ఏడేళ్ల చిన్నారి అదృశ్యం కావడం సంచలనం సృష్టించింది. దీప్తిశ్రీని  హత్యచేసి ఇంద్రపాలెం వద్ద ఉప్పుటేరులో పడవేసినట్టు పోలీసులు భావిస్తున్నారు. అమె సవతి తల్లి శాంతకుమారి ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటుందని దీప్తిశ్రీ బంధువులు ఆరోపిస్తున్నారు. ఆమెను అదుపులోకి తీసుకున్న పోలీసులు తమదైన శైలిలో ప్రశ్నించడంతో కీలక సమాచారం అందజేసినట్టు తెలుస్తోంది. శాంతకుమారి ఇచ్చిన సమాచారం ఆధారంగా ఇంద్రపాలెం లాకుల వద్ద దీప్తిశ్రీ మృతదేహం కోసం గాలింపు చేపట్టారు. అందుకోసం పోలీసులు ధర్మాడి సత్యం బృందం సాయం కోరారు. ఇటీవలే గోదావరి నదిలో బోటును వెలికితీసిన ధర్మాడి సత్యం ఓ చిన్నారి కోసం వెంటనే స్పందించారు. తన బృందంతో ఉప్పుటేరులో గాలింపు చేపట్టారు. అయితే, 30 గంటలు గడిచిన తర్వాతే మృతదేహం నీటిపై తేలుతుందని, ఈలోపు తమ ప్రయత్నాలు కొనసాగిస్తామని ధర్మాడి సత్యం తెలిపారు.