Skip to main content

పోలవరం ప్రాజెక్టుపై కేంద్రానికి ఢిల్లీ హైకోర్టు కీలక ఆదేశాలు


ఢిల్లీ: పోలవరం ప్రాజెక్టులో భారీ అవినీతి జరిగిందంటూ.. ప్రముఖ విశ్లేషకులు, సామాజికవేత్త పెంటపాటి పుల్లారావు ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ప్రాజెక్ట్ అంచనా వ్యయాన్ని రూ.16 వేల కోట్ల నుంచి రూ.58 వేల కోట్లకు పెంచారని పిటిషన్‌లో పేర్కొన్నారు. టెండర్ నామినేషన్ల పద్ధతిలో వేల కోట్ల రూపాయల పనులు అప్పగిస్తున్నారని కోర్టుకు తెలిపారు. దీనిపై బుధవారం విచారించిన ఢిల్లీ హైకోర్టు చీఫ్ జస్టిస్ నరన్ భాయ్ పటేల్ నేతృత్వంలోని ధర్మాసనం.. కేంద్ర ప్రభుత్వానికి, కేంద్ర జలశక్తి శాఖకు కీలక ఆదేశాలు జారీ చేసింది. పిటిషన్‌ను ఫిర్యాదుగా పరిగణించి తక్షణం విచారణ జరపాలని సూచించింది.
హైకోర్టు ఆదేశాలపై పుల్లారావు సంతోషం వ్యక్తం చేశారు. న్యాయస్థానం ఆదేశాలతో పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన అవినీతి బయటపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రజాధనం దుర్వినియోగం కాకూడదనేదే తన ఉద్దేశమని, గత ప్రభుత్వ హయాంలో అవినీతికి పాల్పడిన ఉద్యోగులే.. మళ్ళీ కొత్త ప్రభుత్వంలో భాద్యతలు నిర్వర్తిస్తున్నారన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన అవినీతి, అక్రమాలకు బాధ్యులపై కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అమరావతి, పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో అవినీతి జరిగిందంటున్న రాష్ట్ర ప్రభుత్వం.. ఢిల్లీలో ఎందుకు మాట్లాడటం లేదని పుల్లారావు ప్రశ్నించారు.

Comments

Popular posts from this blog

వారానికోసారి కష్టమేమీ కాదు... సీఎం జగన్‌ కేసులో సీబీఐ కౌంటర్

కోర్టుకు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని ఏపీ సీఎం జగన్ వేసిన పిటిషన్‌పై సీబీఐ కౌంటర్ దాఖలు చేసింది. అక్రమాస్తుల కేసు విచారణ నుంచి తనకు వ్యక్తిగత హాజరు మినహాయింపు ఇవ్వాలని ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సీబీఐ కోర్టులో వేసిన పిటిషన్‌పై సీబీఐ కౌంటర్ దాఖలు చేసింది. సీఎం జగన్ దాఖలు చేసిన పిటిషన్‌పై సీబీఐ అభ్యంతరం వ్యక్తం చేసింది. సాక్షులను జగన్ ప్రభావితం చేసే అవకాశం ఉందని పిటిషన్‌లో పేర్కొంది. ఆయన వాస్తవాలను దాచిపెట్టి పిటిషన్ వేశారని ఆరోపించింది. జగన్ జైల్లో ఉన్నప్పుడు సాక్షులను ప్రభావితం చేశారని... సీఎం పదవిలో ఉన్న జగన్ సాక్షులను మరింత ప్రభావితం చేసే అవకాశం ఉందని సీబీఐ తన పిటిషన్‌లో పేర్కొంది. ఏపీలో రెవెన్యూ లోటు అనేది సీఎంగా ఉన్న జగన్ వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇచ్చే కారణం కాదని తెలిపింది. సీఎంగా ఉన్న జగన్ విజయవాడ నుంచి వారానికోసారి హైదరాబాద్ రావడంకష్టమేమీ కాదని కౌంటర్‌ పిటిషన్‌లో సీబీఐ పేర్కొన్నట్టు తెలుస్తోంది. సీబీఐ కౌంటర్‌పై కోర్టు శుక్రవారం వాదనలు వినిపించనుంది.

బోటు వెలికితీత మరింత ఆలస్యం

కచ్చులూరు వద్ద మునిగిన బోటును రేపు వెలికితీస్తామని ధర్మాడి సత్యం తెలిపారు. బోటు వెలికితీత కోసం రెండోరోజు చేసిన ప్రయత్నాలు విఫలమైనట్లు చెప్పారు. వాతావరణం అనుకూలించనందువల్లే ఈ ఆలస్యం జరుగుతుందని వివరించారు. గోదావరిలో వరద ప్రహహం తగ్గిన కారణంగా బోటును రేపు బయటికి తీస్తామని స్పష్టం చేశారు. కాగా.. ధర్మాడి సత్యం బృందం వేసిన లంగర్‌కు బోటు తగిలి కదిలిందని స్థానికులు తెలిపారు.