Skip to main content

పోలవరం ప్రాజెక్టుపై కేంద్రానికి ఢిల్లీ హైకోర్టు కీలక ఆదేశాలు


ఢిల్లీ: పోలవరం ప్రాజెక్టులో భారీ అవినీతి జరిగిందంటూ.. ప్రముఖ విశ్లేషకులు, సామాజికవేత్త పెంటపాటి పుల్లారావు ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ప్రాజెక్ట్ అంచనా వ్యయాన్ని రూ.16 వేల కోట్ల నుంచి రూ.58 వేల కోట్లకు పెంచారని పిటిషన్‌లో పేర్కొన్నారు. టెండర్ నామినేషన్ల పద్ధతిలో వేల కోట్ల రూపాయల పనులు అప్పగిస్తున్నారని కోర్టుకు తెలిపారు. దీనిపై బుధవారం విచారించిన ఢిల్లీ హైకోర్టు చీఫ్ జస్టిస్ నరన్ భాయ్ పటేల్ నేతృత్వంలోని ధర్మాసనం.. కేంద్ర ప్రభుత్వానికి, కేంద్ర జలశక్తి శాఖకు కీలక ఆదేశాలు జారీ చేసింది. పిటిషన్‌ను ఫిర్యాదుగా పరిగణించి తక్షణం విచారణ జరపాలని సూచించింది.
హైకోర్టు ఆదేశాలపై పుల్లారావు సంతోషం వ్యక్తం చేశారు. న్యాయస్థానం ఆదేశాలతో పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన అవినీతి బయటపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రజాధనం దుర్వినియోగం కాకూడదనేదే తన ఉద్దేశమని, గత ప్రభుత్వ హయాంలో అవినీతికి పాల్పడిన ఉద్యోగులే.. మళ్ళీ కొత్త ప్రభుత్వంలో భాద్యతలు నిర్వర్తిస్తున్నారన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన అవినీతి, అక్రమాలకు బాధ్యులపై కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అమరావతి, పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో అవినీతి జరిగిందంటున్న రాష్ట్ర ప్రభుత్వం.. ఢిల్లీలో ఎందుకు మాట్లాడటం లేదని పుల్లారావు ప్రశ్నించారు.

Comments

Popular posts from this blog

అత్యంత కష్టం మీద బోటును బయటికి తీసిన ధర్మాడి సత్యం బృందం

నెలరోజులకు పైగా గోదావరి నదీ గర్భంలోనే ఉండిపోయిన రాయల్ వశిష్ట బోటును ఎట్టకేలకు బయటికి తీశారు. ధర్మాడి సత్యం బృందం తీవ్ర ప్రయాసలకోర్చి బోటు ఆచూకీ గుర్తించడమే కాకుండా దాన్ని పైకి తీసుకువచ్చారు. మరికాసేపట్లో బోటును ఒడ్డుకు చేర్చనున్నారు. స్కూబా డైవర్ల సాయంతో బోటుకు లంగర్లు ఫిక్స్ చేసి పైకి తీసుకువచ్చేందుకు ధర్మాడి సత్యం బృందం చేసిన ప్రయత్నాలు ఫలించాయి. మొదట కొన్ని భాగాలుగా విడిపోయినా, ఆ తర్వాత మరోసారి ఐరన్ రోప్ లు బిగించి మొత్తం బోటును వెలికి తీశారు. గోదావరి ఉపరితలంపైకి చేరిన బోటును మరో రెండు గంటల్లో తీరానికి చేర్చే అవకాశాలున్నాయి.

మీడియాపై మాకు గౌరవముంది: కోటంరెడ్డి

  కొన్ని పత్రికలు, ఛానల్స్ తమ పాలనపై ప్రజల్లో అపోహలు సృష్టిస్తున్నాయని  వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. మీడియాపై తమకు గౌరవం ఉందని, అది ఎప్పటికీ కొనసాగుతుందని చెప్పారు. జీవో 2430 కొత్తగా తీసుకొచ్చింది కాదని, ఎప్పటినుంచో అది ఉందని తెలిపారు.  ఈ రోజు కోటంరెడ్డి మీడియాతో మాట్లాడారు. కొన్ని పత్రికలు, ఛానల్స్ పనికట్టుకుని తప్పుడు వార్తలతో అపోహలు సృష్టిస్తున్నాయన్నారు. తప్పుడు వార్తలు రాసేవారు భయపడాలని పేర్కొన్నారు. ఒకప్పుడు సాక్షి మీడియాను చంద్రబాబు అనుమతించనప్పుడు ఈ ఉద్యమ నేతలు ఎటుపోయారని నిలదీశారు. లోకేశ్ దీక్షలను చూసి ప్రజలు నవ్వుకుంటున్నారన్నారు. మంగళగిరి నియోజక వర్గంలో ఎన్ని ఓట్లు ఉన్నాయో కూడా లోకేశ్ కు తెలియదని విమర్శించారు. తమ పాలనను చంద్రబాబు సహించలేకపోతున్నారని ఆయన మండిపడ్డారు. చంద్రబాబు, తన హయాంలో తన కొడుకు లోకేశ్ తో కలిసి దోచుకుని లోటు బడ్జెట్ ను చూపెట్టారని విమర్శించారు. ప్రస్తుతం సీఎం జగన్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గాడిలో పెడుతున్నారని చెప్పారు.  చంద్రబాబుకు చదువుకునేటప్పటి నుంచే కులపిచ్చి ఉందని పేర్కొన్నారు. స్థాని...