Skip to main content

పోలవరం ప్రాజెక్టుపై కేంద్రానికి ఢిల్లీ హైకోర్టు కీలక ఆదేశాలు


ఢిల్లీ: పోలవరం ప్రాజెక్టులో భారీ అవినీతి జరిగిందంటూ.. ప్రముఖ విశ్లేషకులు, సామాజికవేత్త పెంటపాటి పుల్లారావు ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ప్రాజెక్ట్ అంచనా వ్యయాన్ని రూ.16 వేల కోట్ల నుంచి రూ.58 వేల కోట్లకు పెంచారని పిటిషన్‌లో పేర్కొన్నారు. టెండర్ నామినేషన్ల పద్ధతిలో వేల కోట్ల రూపాయల పనులు అప్పగిస్తున్నారని కోర్టుకు తెలిపారు. దీనిపై బుధవారం విచారించిన ఢిల్లీ హైకోర్టు చీఫ్ జస్టిస్ నరన్ భాయ్ పటేల్ నేతృత్వంలోని ధర్మాసనం.. కేంద్ర ప్రభుత్వానికి, కేంద్ర జలశక్తి శాఖకు కీలక ఆదేశాలు జారీ చేసింది. పిటిషన్‌ను ఫిర్యాదుగా పరిగణించి తక్షణం విచారణ జరపాలని సూచించింది.
హైకోర్టు ఆదేశాలపై పుల్లారావు సంతోషం వ్యక్తం చేశారు. న్యాయస్థానం ఆదేశాలతో పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన అవినీతి బయటపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రజాధనం దుర్వినియోగం కాకూడదనేదే తన ఉద్దేశమని, గత ప్రభుత్వ హయాంలో అవినీతికి పాల్పడిన ఉద్యోగులే.. మళ్ళీ కొత్త ప్రభుత్వంలో భాద్యతలు నిర్వర్తిస్తున్నారన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన అవినీతి, అక్రమాలకు బాధ్యులపై కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అమరావతి, పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో అవినీతి జరిగిందంటున్న రాష్ట్ర ప్రభుత్వం.. ఢిల్లీలో ఎందుకు మాట్లాడటం లేదని పుల్లారావు ప్రశ్నించారు.

Comments

Popular posts from this blog

సుజనా చౌదరి లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా ప్రైవేట్ బిల్లు పెడతాం: వైసీపీ ఎంపీ బాలశౌరి

బీజేపీ ఎంపీ సుజనాచౌదరిపై వైసీపీ ఎంపీ బాలశౌరి తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేశారు. మొన్నటి వరకు టీడీపీలో ఉన్న సుజనాచౌదరి బీజేపీలో చేరింది చంద్రబాబు అజెండా మోయడానికి కాదా? రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమా? చంద్రబాబు ప్రయోజనాలు ముఖ్యమా? ప్రధాని మోదీకి వ్యతిరేకంగా గతంలో ధర్మదీక్షలు చేసింది సుజనా కాదా? అని ప్రశ్నించారు. పొలిటికల్ బ్రోకర్, డూప్లికేట్ బీజేపీ నేత సుజనా చౌదరి మాటలకు విలువే లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సుజనా డూప్లికేట్ బీజేపీ నేత కాబట్టే చంద్రబాబు అజెండా అమలు చేస్తున్నారని ఆరోపించారు. సుజనాపై ఎథిక్స్ కమిటీలో ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు.  బ్యాంకులను మోసం చేసి డబ్బులు ఎగ్గొట్టిన సుజనా లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా పార్లమెంట్ లో ప్రైవేట్ బిల్లు పెడతామని సంచలన వ్యాఖ్యలు చేశారు.  

తెలంగాణ సర్కారుకు దర్శకుడు హరీశ్ శంకర్ సలహా

  హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ సమస్యలను తగ్గించడానికి మంత్రి కేటీఆర్ అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సమావేశంపై తెలంగాణ ఐటీ, పరిశ్రమల మంత్రిత్వ శాఖ ట్విట్టర్ లో పోస్ట్ చేయగా, దానిపై దర్శకుడు హరీశ్ శంకర్ స్పందించారు. హైదరాబాద్ నగరానికి స్లిప్ రోడ్ల అవసరం ఎంతో ఉందని తెలిపారు. మంత్రి కేటీఆర్ సమావేశంలో కొత్త స్లిప్ రోడ్ల అంశం కూడా చర్చకు రాగా, తక్షణ అవసరం అదేనని హరీశ్ శంకర్ అభిప్రాయపడ్డారు. హరీశ్ ప్రతిపాదనకు నెటిజన్ల నుంచి గణనీయమైన స్థాయిలో మద్దతు లభిస్తోంది.