రాష్ట్రంలోని ప్రభుత్వ రంగ బ్యాంకుల పనివేళలు నేటి నుంచి మారనున్నాయి. ఇక నుంచి ఉదయం పది గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పనిచేయనున్నాయి. మధ్యాహ్నం 2:00 గంటల నుంచి 2:30 గంటల వరకు భోజన విరామం. రాష్ట్రంలోని ప్రభుత్వ రంగ బ్యాంకులన్నీ నేటి నుంచి ఇదే సమయ పాలనను పాటిస్తాయని రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీ పేర్కొంది. ఇక, ప్రతి ఆదివారంతోపాటు రెండు, నాలుగు శనివారాలు బ్యాంకులు యథావిధిగా మూతపడతాయి.
సినీనటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఈ రోజు పుట్టినరోజు వేడుక జరుపుకుంటోన్న నేపథ్యంలో ఆయనకు మెగాస్టార్ చిరంజీవి శుభాకాంక్షలు తెలిపారు. ఆయనకు మహేశ్ బాబుతో పాటు పలువురు టాలీవుడ్ ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్లు చేశారు. సినిమాలతో పాటు రాజకీయాల్లో పవన్ కల్యాణ్ అద్భుత విజయాలు సాధించాలని తాము కోరుకుంటున్నట్లు తెలిపారు.
Comments
Post a Comment