Skip to main content

టెస్టు చాంపియన్ షిప్ లో ఎవరికీ అందనంత ఎత్తులో టీమిండియా

విరాట్ కోహ్లీ సారథ్యంలోని టీమిండియా టెస్టు క్రికెట్ లో అద్వితీయంగా రాణిస్తోంది. వైజాగ్ లో దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టు మ్యాచే అందుకు నిదర్శనం. అన్ని రంగాల్లోనూ రాణించి సఫారీలను 203 పరుగుల తేడాతో చిత్తుగా ఓడించింది. ఈ మ్యాచ్ ద్వారా భారత జట్టు ఐసీసీ టెస్టు చాంపియన్ షిప్ పాయింట్ల పట్టికలో ఎవరికీ అందనంత ఎత్తులో నిలిచింది.

ఇటీవలే ఇంగ్లాండ్ వేదికగా వరల్డ్ కప్ ముగిసిన తర్వాత ఐసీసీ టెస్టు చాంపియన్ షిప్ షురూ అయింది. ఇక మీదట ఆయా దేశాలు ఆడే టెస్టు మ్యాచ్ లు వరల్డ్ చాంపియన్ షిప్ లో భాగంగానే నిర్వహిస్తారు. ఈ క్రమంలో చాంపియన్ షిప్ మొదలయ్యాక భారత్ ఆడిన 3 టెస్టుల్లోనూ ఘనవిజయం సాధించింది. ఇటీవలే విండీస్ గడ్డపై రెండు టెస్టుల్లోనూ జయభేరి మోగించిన భారత్, ఇప్పుడు సొంతగడ్డపైనా అదే ఒరవడి కొనసాగించింది. తద్వారా ఐసీసీ టెస్టు చాంపియన్ షిప్ పాయింట్ల పట్టికలో 160 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది.

ఈ జాబితాలో ద్వితీయస్థానంలో ఉన్న న్యూజిలాండ్ కు, టీమిండియాకు మధ్య 100 పాయింట్ల అంతరం ఉంది. కివీస్ ఖాతాలో 60 పాయింట్లే ఉన్నాయి. అటు శ్రీలంక కూడా 60 పాయింట్లు సాధించింది. బలమైన టెస్టు జట్లుగా పేరుగాంచిన ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ ఈ జాబితాలో 4, 5 స్థానాల్లో ఉన్నాయి. ఇటీవలే యాషెస్ లో భాగంగా 5 టెస్టులాడిన ఇరు జట్లు చెరో రెండు మ్యాచ్ ల్లో విజయం సాధించగా, ఓ మ్యాచ్ డ్రాగా ముగిసింది. ఇక, టెస్టు వరల్డ్ చాంపియన్ షిప్ మొదలయ్యాక పాకిస్థాన్, బంగ్లాదేశ్ ఇప్పటివరకు మ్యాచ్ లు ఆడని కారణంగా పాయింట్ల పట్టికలో చివరన నిలిచాయి.

Comments

Popular posts from this blog

అత్యంత కష్టం మీద బోటును బయటికి తీసిన ధర్మాడి సత్యం బృందం

నెలరోజులకు పైగా గోదావరి నదీ గర్భంలోనే ఉండిపోయిన రాయల్ వశిష్ట బోటును ఎట్టకేలకు బయటికి తీశారు. ధర్మాడి సత్యం బృందం తీవ్ర ప్రయాసలకోర్చి బోటు ఆచూకీ గుర్తించడమే కాకుండా దాన్ని పైకి తీసుకువచ్చారు. మరికాసేపట్లో బోటును ఒడ్డుకు చేర్చనున్నారు. స్కూబా డైవర్ల సాయంతో బోటుకు లంగర్లు ఫిక్స్ చేసి పైకి తీసుకువచ్చేందుకు ధర్మాడి సత్యం బృందం చేసిన ప్రయత్నాలు ఫలించాయి. మొదట కొన్ని భాగాలుగా విడిపోయినా, ఆ తర్వాత మరోసారి ఐరన్ రోప్ లు బిగించి మొత్తం బోటును వెలికి తీశారు. గోదావరి ఉపరితలంపైకి చేరిన బోటును మరో రెండు గంటల్లో తీరానికి చేర్చే అవకాశాలున్నాయి.

మీడియాపై మాకు గౌరవముంది: కోటంరెడ్డి

  కొన్ని పత్రికలు, ఛానల్స్ తమ పాలనపై ప్రజల్లో అపోహలు సృష్టిస్తున్నాయని  వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. మీడియాపై తమకు గౌరవం ఉందని, అది ఎప్పటికీ కొనసాగుతుందని చెప్పారు. జీవో 2430 కొత్తగా తీసుకొచ్చింది కాదని, ఎప్పటినుంచో అది ఉందని తెలిపారు.  ఈ రోజు కోటంరెడ్డి మీడియాతో మాట్లాడారు. కొన్ని పత్రికలు, ఛానల్స్ పనికట్టుకుని తప్పుడు వార్తలతో అపోహలు సృష్టిస్తున్నాయన్నారు. తప్పుడు వార్తలు రాసేవారు భయపడాలని పేర్కొన్నారు. ఒకప్పుడు సాక్షి మీడియాను చంద్రబాబు అనుమతించనప్పుడు ఈ ఉద్యమ నేతలు ఎటుపోయారని నిలదీశారు. లోకేశ్ దీక్షలను చూసి ప్రజలు నవ్వుకుంటున్నారన్నారు. మంగళగిరి నియోజక వర్గంలో ఎన్ని ఓట్లు ఉన్నాయో కూడా లోకేశ్ కు తెలియదని విమర్శించారు. తమ పాలనను చంద్రబాబు సహించలేకపోతున్నారని ఆయన మండిపడ్డారు. చంద్రబాబు, తన హయాంలో తన కొడుకు లోకేశ్ తో కలిసి దోచుకుని లోటు బడ్జెట్ ను చూపెట్టారని విమర్శించారు. ప్రస్తుతం సీఎం జగన్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గాడిలో పెడుతున్నారని చెప్పారు.  చంద్రబాబుకు చదువుకునేటప్పటి నుంచే కులపిచ్చి ఉందని పేర్కొన్నారు. స్థాని...