Skip to main content

సైకిల్ తొక్కుతూ వచ్చి ఓటేసిన హర్యానా ముఖ్యమంత్రి ఖట్టర్

హర్యానా, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. పలువురు ప్రముఖులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ సైకిల్ తొక్కుతూ కర్నాల్ పోలింగ్ కేంద్రం వద్దకు వచ్చి అందరి దృష్టినీ ఆకర్షించారు. ఆయనతో పాటు పలువురు కార్యకర్తలు కూడా సైకిల్ పైనే పోలింగ్ కేంద్రానికి వచ్చారు. రాష్ట్రంలో పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోందని ఖట్టర్ అన్నారు. కాంగ్రెస్ తో పాటు ప్రతిపక్ష పార్టీలన్నీ ఇప్పటికే ఓడిపోయాయని ఆయన వ్యాఖ్యానించారు.

మరోవైపు, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫఢ్నవీస్ తన సతీమణి అమృత, తల్లి సరితలతో కలిసి పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటు హక్కు వినియోగించుకున్నారు. నాగ్ పూర్ లో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఓటు హక్కు వినియోగించుకొని మీడియాతో మాట్లాడారు.

'ఈ రోజు ప్రజాస్వామ్య పండుగ. ప్రజలందరూ ఓటు వేసి దేశ ప్రజాస్వామ్యాన్ని మరింత శక్తిమంతం చేయాలని కోరుతున్నాను. బీజేపీ, శివసేన, రిపబ్లికన్ పార్టీల కూటమి ఈ ఎన్నికల్లోనూ రికార్డు స్థాయిలో భారీ విజయం సాధిస్తుందన్న నమ్మకంతో ఉన్నాను. దేవేంద్ర ఫడ్నవీస్ మరోసారి రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తారు. కేంద్రంలో మోదీ, రాష్ట్రంలో ఫడ్నవీస్ ప్రభుత్వాలు ప్రజల సంక్షేమం కోసం చాలా పనులు చేశాయి. నోటాకి ఓటు వేయొద్దు. దేశ ప్రజాస్వామ్యానికి మంచిది కాదు' అని గడ్కరీ వ్యాఖ్యానించారు.

Comments

Popular posts from this blog

సుజనా చౌదరి లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా ప్రైవేట్ బిల్లు పెడతాం: వైసీపీ ఎంపీ బాలశౌరి

బీజేపీ ఎంపీ సుజనాచౌదరిపై వైసీపీ ఎంపీ బాలశౌరి తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేశారు. మొన్నటి వరకు టీడీపీలో ఉన్న సుజనాచౌదరి బీజేపీలో చేరింది చంద్రబాబు అజెండా మోయడానికి కాదా? రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమా? చంద్రబాబు ప్రయోజనాలు ముఖ్యమా? ప్రధాని మోదీకి వ్యతిరేకంగా గతంలో ధర్మదీక్షలు చేసింది సుజనా కాదా? అని ప్రశ్నించారు. పొలిటికల్ బ్రోకర్, డూప్లికేట్ బీజేపీ నేత సుజనా చౌదరి మాటలకు విలువే లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సుజనా డూప్లికేట్ బీజేపీ నేత కాబట్టే చంద్రబాబు అజెండా అమలు చేస్తున్నారని ఆరోపించారు. సుజనాపై ఎథిక్స్ కమిటీలో ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు.  బ్యాంకులను మోసం చేసి డబ్బులు ఎగ్గొట్టిన సుజనా లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా పార్లమెంట్ లో ప్రైవేట్ బిల్లు పెడతామని సంచలన వ్యాఖ్యలు చేశారు.  

చైనాకు షాక్ : వాటిపై పెరగనున్న సుంకం

విదేశాల నుంచి దిగుమతయ్యే యాక్టివ్‌ ఫార్మాసూటికల్‌ ఇన్‌గ్రీడియంట్స్‌ (ఏపీఐ) దిగుమతులపై భారత  ప్రభుత్వం త్వరలోనే షాక్ ఇవ్వనుంది. ఏపీఐ దిగమతులపై కస్టమ్స్ సుంకాన్ని10 నుంచి 15 శాతం దాకా  పెంచాలని  ఫార్మాస్యూటికల్స్ విభాగం (డీఓపీ) యోచిస్తోంది. ముడి ఔషధాల (ఏపీఐ) దేశీయ తయారీని ప్రోత్సాహం ఇవ్వడంతోపాటు,చైనాపై అధికంగా ఆధారపడటాన్ని తగ్గించాలన్న వ్యూహంలో భాగంగా కేంద్రం ఈ నిర్ణయం తీసుకోనుంది. ఏపీఐ దిగుమతులపై సుంకాన్ని 20-25 శాతంగా ఉంచేందుకు ప్రభుత్వం పరిశీలిస్తోందని ఎకనామిక్ టైమ్స్ నివేదించింది. ప్రస్తుతం ఇది 10 శాతం మాత్రమే. భారత్-చైనా సరిహద్దు వివాదం, ఇటు చైనా ఉత్పత్తులను నిషేధించాలన్న డిమాండ్ అటు ప్రధానంగా ఏఐపీల కోసం చైనాపై అధికంగా ఆధారపడుతున్న తరుణంలో ఇది చైనాకు ప్రతికూలంగా మారనుంది.   ప్రస్తుతం, భారతదేశం 68 శాతం ఏపీఐలు, 90 శాతం కంటే ఎక్కువ యాంటీబయాటిక్‌లను చైనా నుండి దిగుమతి చేసుకుంటోంది. దేశీయంగా  వాల్యూమ్ పరంగా ప్రపంచంలో మూడవ అతిపెద్దది. క్లిష్టమైన కీ స్టార్టింగ్ మెటీరియల్స్ (కెఎస్ఎం), డ్రగ్ ఇంటర్మీడియట్...