Skip to main content

సైకిల్ తొక్కుతూ వచ్చి ఓటేసిన హర్యానా ముఖ్యమంత్రి ఖట్టర్

హర్యానా, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. పలువురు ప్రముఖులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ సైకిల్ తొక్కుతూ కర్నాల్ పోలింగ్ కేంద్రం వద్దకు వచ్చి అందరి దృష్టినీ ఆకర్షించారు. ఆయనతో పాటు పలువురు కార్యకర్తలు కూడా సైకిల్ పైనే పోలింగ్ కేంద్రానికి వచ్చారు. రాష్ట్రంలో పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోందని ఖట్టర్ అన్నారు. కాంగ్రెస్ తో పాటు ప్రతిపక్ష పార్టీలన్నీ ఇప్పటికే ఓడిపోయాయని ఆయన వ్యాఖ్యానించారు.

మరోవైపు, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫఢ్నవీస్ తన సతీమణి అమృత, తల్లి సరితలతో కలిసి పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటు హక్కు వినియోగించుకున్నారు. నాగ్ పూర్ లో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఓటు హక్కు వినియోగించుకొని మీడియాతో మాట్లాడారు.

'ఈ రోజు ప్రజాస్వామ్య పండుగ. ప్రజలందరూ ఓటు వేసి దేశ ప్రజాస్వామ్యాన్ని మరింత శక్తిమంతం చేయాలని కోరుతున్నాను. బీజేపీ, శివసేన, రిపబ్లికన్ పార్టీల కూటమి ఈ ఎన్నికల్లోనూ రికార్డు స్థాయిలో భారీ విజయం సాధిస్తుందన్న నమ్మకంతో ఉన్నాను. దేవేంద్ర ఫడ్నవీస్ మరోసారి రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తారు. కేంద్రంలో మోదీ, రాష్ట్రంలో ఫడ్నవీస్ ప్రభుత్వాలు ప్రజల సంక్షేమం కోసం చాలా పనులు చేశాయి. నోటాకి ఓటు వేయొద్దు. దేశ ప్రజాస్వామ్యానికి మంచిది కాదు' అని గడ్కరీ వ్యాఖ్యానించారు.

Comments

Popular posts from this blog

పవన్ కు శుభాకాంక్షలు చెప్పిన చిరంజీవి

  సినీనటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఈ రోజు పుట్టినరోజు వేడుక జరుపుకుంటోన్న నేపథ్యంలో ఆయనకు మెగాస్టార్ చిరంజీవి శుభాకాంక్షలు తెలిపారు.  ఆయనకు మహేశ్ బాబుతో పాటు పలువురు టాలీవుడ్ ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్లు చేశారు. సినిమాలతో పాటు రాజకీయాల్లో పవన్ కల్యాణ్ అద్భుత విజయాలు సాధించాలని తాము కోరుకుంటున్నట్లు తెలిపారు.

చింతమనేనికి బెయిల్ నిరాకరణ: అక్టోబర్ 9వరకు రిమాండ్ పొడిగింపు

తెలుగుదేశం పార్టీ నేత, దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కు కోర్టులో చుక్కెదురు అయ్యింది. చింతమనేనికి బెయిల్ ఇచ్చేందుకు ఏలూరు కోర్టు నిరాకరించింది. అంతేకాదు చింతమనేని రిమాండ్ ను అక్టోబర్ 9 వరకు పొండిగించింది.  2017లో అప్పనపాడు గ్రామంలో స్థల వివాదంలో వ్యక్తిని నిర్బంధించి కులం పేరుతో దూషించిన కేసులో కేసు నమోదు అయ్యింది. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులో భాగంగా ఇటీవలే చింతమనేని ప్రభాకర్ ను పోలీసులు అరెస్ట్ చేశారు.  అనంతరం చింతమనేని ప్రభాకర్ ను ఏలూరులోని ఎస్సీఎస్టీ అట్రాసిటీ కోర్టులో హాజరుపరచగా కోర్టు 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. రిమాండ్ పూర్తవ్వడంతో బుధవారం పోలీసులు మరోసారి ఏలూరు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కోర్టులో హాజరుపరిచారు.  అలాగే బెయిల్ ఇవ్వాలంటూ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తరపు న్యాయవాది సైతం కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. చింతమనేని బెయిల్ పిటీషన్ ను న్యాయస్థానం తోసిపుచ్చింది. అనంతరం చింతమనేని రిమాండ్ ను వచ్చే నెల 9 వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ఏలూరు కోర్టు.  ఇకపోతే చింతమనేని ప్రభాకర్ ను అరెస్ట్ చేసేందుకు వెళ్లిన సమయంలో మహిళా పో...