Skip to main content

వాళ్ళు చేసిన అవినీతిని బయటికి తీస్తాం.. - టీడీపీ పై మంత్రి సంచలన వ్యాఖ్యలు..


రివర్స్ టెండరింగ్ వైవిధానాన్ని ఏపీలో ప్రతిపక్షాలు విమర్శలు చేయడం అర్థరహితమని జలవనరుల శాఖామంత్రి డాక్టర్ పోలుబోయిన అనీల్ కుమార్ యాదవ్ పేర్కొన్నారు.. రెండురోజులు పర్యటనలో భాగంగా మంత్రి ఇవాళ పెన్నానది బ్యారేజీ నిర్మాణం పనులను పరిశీలించారు.ఈసందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ...
ఏపీలో రివర్స్ టెండర్స్ విధానంలో రాష్ట్రానికి ఇప్పటికే ఎనిమిది వందల కోట్ల రూపాయలు కోట్ల రూపాయలు ఆదా అయ్యాయన్నారు.పోలవరం కుడికాలువ లో రూ 58 కోట్లు, పోలవరం మెయిన్ ప్రోజెక్టుపనుల్లో రూ 800 కోట్లు,నిన్న వెలుగొండ రివర్స్ టెండర్లలో సుమారు రూ.550 కోట్లు ఆదా అయ్యాయన్నారు. ఇంతపారదర్శకంగా రివర్స్ టెండర్లు ప్రక్రియ జరుగుతుంటే ప్రతిపక్షాలు విమర్శలు చేయడం పరిశీలిస్తే వారి ఆలోచన ఎంటన్నారు. 
రాష్ట్రానికి నిధులు ఆదా అవుతున్నా ప్రతిపక్షాలు జీర్ణించుకోలేక పోతున్నాయి.రివర్స్ టెండరింగ్ పై విమర్శలు దాన్ని కూడా ప్రతిపక్షాలకు తగదు అని మంత్రి అనిల్ కుమార్ విమర్శించారు.
ఏపీలో నీటిపారుదల శాఖలోనే కాకుండాఏపీ టీడ్కో...హౌస్సింగ్ సహా పనుల నిర్వహణ లోను రివర్స్ టెండరింగ్ చేస్తున్నట్లు మంత్రి చెప్పారు.ప్రభుత్వం రివర్స్ టెండరింగ్ ద్వారా ఆదాయ వనరులు అన్వేషిస్తుంటే ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయన్నారు.. రానున్న రోజుల్లో మరికొన్ని పనులకు రివర్స్ టెండరింగ్ విధానం కొనసాగిస్తామన్నారు.. ఆపరేషన్ అండ్ మెయింటెన్స్ వర్కుల విషయంలో తొలిసారిగా తమ ప్రభుత్వం టెండరింగ్ విధానం అమలు చేస్తున్నారన్నారు..
నెల్లూరు జిల్లాలో బ్యారేజీ నిర్మాణం పనులు వేగవంతం చేయాలని మంత్రి అనిల్ అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో నీటిపారుదల, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు.

Comments

Popular posts from this blog

అమరావతిలో భూముల రేట్లు తగ్గకుండా: సీఆర్డీఏ స్థానంలో కొత్త అథారిటీ: కీలక నోటిఫికేషన్

 మూడు రాజధానులను ఏర్పాటు చేయడానికి ఉద్దేశించిన ఏపీ వికేంద్రీకరణ బిల్లు ఆమోదం పొందడం, రాజధాని ప్రాంత అభివృద్ధి అథారిటీ (సీఆర్డీ) రద్దు నేపథ్యంలో.. ప్రభుత్వం మెరుపు వేగంతో నిర్ణయాలను తీసుకుంటోంది. పరిపాలనను వేగవంతం చేసేలా తక్షణ చర్యలకు దిగింది. సీఆర్డీఏ బిల్లు రద్దు అనంతరం దాని స్థానంలో అమరావతి మెట్రోపాలిటన్ ప్రాంత అభివృద్ధి మండలిని ఏర్పాటు చేస్తామని ప్రకటించిన ప్రభుత్వం.. దాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. ఏఎంఆర్డీఏ కమిటీ సభ్యులనూ నియమించింది. సీఆర్డీఏకు బదులుగా ఏఎంఆర్డీఏ సీఆర్డీఏ స్థాయంలో అమరావతి మెట్రోపాలిటన్ ప్రాంత అభివృద్ధి మండలి (ఏఎంఆర్డీఏ)ని ఏర్పాటు చేసింది. ఈ మేరకు నోటిఫికేషన్‌ను జారీ చేసింది. సీఆర్డీఏను రద్దు చేస్తూ అసెంబ్లీ ఆమోదించిన తీర్మానంపై గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆమోదముద్ర వేసిన మరుసటి రోజే ఏఎంఆర్డీఏను తెరపైకి తీసుకొచ్చింది. దానితో పాటు కొత్త సభ్యులను నియమించింది. మున్సిపల్ శాఖ కార్యదర్శి జే శ్యామల రావు దీనికి సంబంధించిన నోటిఫికేషన్‌ను జారీ చేశారు. మొత్తం 11 మంది సభ్యులను ఏఎంఆర్డీఏ కమిటీలో నియమించారు. సభ్యులు వీరే.. మున్సిపల్ శాఖ కార్యదర్శి డిప్య...

కర్ఫ్యూ ఎత్తేస్తే రక్తపాతమే.. యుద్ధం వస్తే మేం సిద్ధం : ఇమ్రాన్‌

జమ్ముకశ్మీర్‌లో కర్ఫ్యూ ఎత్తేస్తే రక్తపాతమేనని పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ చెప్పుకొచ్చారు. శుక్రవారం నాడు 74వ ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశంలో భాగంగా ఇమ్రాన్ మాట్లాడుతూ.. ఐరాస వేదికగా కవ్వింపు ప్రకటన చేశారు. కశ్మీర్‌ను కేవలం రాజకీయం కోసం మాత్రమే వాడుకుంటున్నారని విమర్శలు గుప్పించారు.   ప్రపంచం ఏం చేసింది?.   బాలాకోట్‌లో 500 మంది తీవ్రవాదులు రెడీగా ఉన్నారని ఇండియా రక్షణ మంత్రి చెబుతున్నారు. 500 మంది తీవ్రవాదులను పంపి మేమేం సాధిస్తాం?. 500 మంది తీవ్రవాదులను పంపాల్సిన అవసరం మాకేంటి.?. ఇస్లామిక్ టెర్రరిజం అంటూ ఇండియా మాపై ముద్ర వేస్తుంది. కశ్మీరీల హక్కులు ఎవరికీ పట్టవు. కశ్మీర్‌లో అనుసరిస్తున్న విధానాలు భారత్‌లో ఉన్న ముస్లింలపై ఎలా ప్రభావం చూపుతాయో మోదీ ఆలోచించారా?. 10 లక్షల మంది రోహింగ్యాలను బర్మా నుంచి గెంటేస్తే ప్రపంచం ఏం చేసింది?. ఇలాంటి పరిణామాలే ఇస్లాం సమాజంలో ఆవేదన, అసంతృప్తిని రేపుతున్నాయి ’  అని ఇమ్రాన్ ఆగ్రహ వ్యక్తం చేశారు. యుద్ధం వస్తే మేం సిద్ధం! ‘ ఇప్పుడు చాలా సంక్లిష్టం సమయం నడుస్తోంది. అణ్వాయుధాలున్న రెండు దేశాలు తలపడాల్స...