Skip to main content

వాళ్ళు చేసిన అవినీతిని బయటికి తీస్తాం.. - టీడీపీ పై మంత్రి సంచలన వ్యాఖ్యలు..


రివర్స్ టెండరింగ్ వైవిధానాన్ని ఏపీలో ప్రతిపక్షాలు విమర్శలు చేయడం అర్థరహితమని జలవనరుల శాఖామంత్రి డాక్టర్ పోలుబోయిన అనీల్ కుమార్ యాదవ్ పేర్కొన్నారు.. రెండురోజులు పర్యటనలో భాగంగా మంత్రి ఇవాళ పెన్నానది బ్యారేజీ నిర్మాణం పనులను పరిశీలించారు.ఈసందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ...
ఏపీలో రివర్స్ టెండర్స్ విధానంలో రాష్ట్రానికి ఇప్పటికే ఎనిమిది వందల కోట్ల రూపాయలు కోట్ల రూపాయలు ఆదా అయ్యాయన్నారు.పోలవరం కుడికాలువ లో రూ 58 కోట్లు, పోలవరం మెయిన్ ప్రోజెక్టుపనుల్లో రూ 800 కోట్లు,నిన్న వెలుగొండ రివర్స్ టెండర్లలో సుమారు రూ.550 కోట్లు ఆదా అయ్యాయన్నారు. ఇంతపారదర్శకంగా రివర్స్ టెండర్లు ప్రక్రియ జరుగుతుంటే ప్రతిపక్షాలు విమర్శలు చేయడం పరిశీలిస్తే వారి ఆలోచన ఎంటన్నారు. 
రాష్ట్రానికి నిధులు ఆదా అవుతున్నా ప్రతిపక్షాలు జీర్ణించుకోలేక పోతున్నాయి.రివర్స్ టెండరింగ్ పై విమర్శలు దాన్ని కూడా ప్రతిపక్షాలకు తగదు అని మంత్రి అనిల్ కుమార్ విమర్శించారు.
ఏపీలో నీటిపారుదల శాఖలోనే కాకుండాఏపీ టీడ్కో...హౌస్సింగ్ సహా పనుల నిర్వహణ లోను రివర్స్ టెండరింగ్ చేస్తున్నట్లు మంత్రి చెప్పారు.ప్రభుత్వం రివర్స్ టెండరింగ్ ద్వారా ఆదాయ వనరులు అన్వేషిస్తుంటే ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయన్నారు.. రానున్న రోజుల్లో మరికొన్ని పనులకు రివర్స్ టెండరింగ్ విధానం కొనసాగిస్తామన్నారు.. ఆపరేషన్ అండ్ మెయింటెన్స్ వర్కుల విషయంలో తొలిసారిగా తమ ప్రభుత్వం టెండరింగ్ విధానం అమలు చేస్తున్నారన్నారు..
నెల్లూరు జిల్లాలో బ్యారేజీ నిర్మాణం పనులు వేగవంతం చేయాలని మంత్రి అనిల్ అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో నీటిపారుదల, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు.

Comments

Popular posts from this blog

పవన్ కు శుభాకాంక్షలు చెప్పిన చిరంజీవి

  సినీనటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఈ రోజు పుట్టినరోజు వేడుక జరుపుకుంటోన్న నేపథ్యంలో ఆయనకు మెగాస్టార్ చిరంజీవి శుభాకాంక్షలు తెలిపారు.  ఆయనకు మహేశ్ బాబుతో పాటు పలువురు టాలీవుడ్ ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్లు చేశారు. సినిమాలతో పాటు రాజకీయాల్లో పవన్ కల్యాణ్ అద్భుత విజయాలు సాధించాలని తాము కోరుకుంటున్నట్లు తెలిపారు.

చింతమనేనికి బెయిల్ నిరాకరణ: అక్టోబర్ 9వరకు రిమాండ్ పొడిగింపు

తెలుగుదేశం పార్టీ నేత, దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కు కోర్టులో చుక్కెదురు అయ్యింది. చింతమనేనికి బెయిల్ ఇచ్చేందుకు ఏలూరు కోర్టు నిరాకరించింది. అంతేకాదు చింతమనేని రిమాండ్ ను అక్టోబర్ 9 వరకు పొండిగించింది.  2017లో అప్పనపాడు గ్రామంలో స్థల వివాదంలో వ్యక్తిని నిర్బంధించి కులం పేరుతో దూషించిన కేసులో కేసు నమోదు అయ్యింది. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులో భాగంగా ఇటీవలే చింతమనేని ప్రభాకర్ ను పోలీసులు అరెస్ట్ చేశారు.  అనంతరం చింతమనేని ప్రభాకర్ ను ఏలూరులోని ఎస్సీఎస్టీ అట్రాసిటీ కోర్టులో హాజరుపరచగా కోర్టు 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. రిమాండ్ పూర్తవ్వడంతో బుధవారం పోలీసులు మరోసారి ఏలూరు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కోర్టులో హాజరుపరిచారు.  అలాగే బెయిల్ ఇవ్వాలంటూ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తరపు న్యాయవాది సైతం కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. చింతమనేని బెయిల్ పిటీషన్ ను న్యాయస్థానం తోసిపుచ్చింది. అనంతరం చింతమనేని రిమాండ్ ను వచ్చే నెల 9 వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ఏలూరు కోర్టు.  ఇకపోతే చింతమనేని ప్రభాకర్ ను అరెస్ట్ చేసేందుకు వెళ్లిన సమయంలో మహిళా పో...