Skip to main content

ప్రత్యర్థులను విమర్శించడమే సమస్యలకు పరిష్కారమా?: కేంద్రానికి మన్మోహన్ సింగ్ సూటిప్రశ్న

ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిలో పెట్టాలని సంకల్పించినప్పుడు ముందుగా లోపాలు గుర్తించి..  కారణాలను అన్వేషించాల్సి ఉంటుందని మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అన్నారు. ప్రభుత్వ రంగ బ్యాంకుల ప్రస్తుత దుస్థితికి కారణం యూపీఏ హయాంలో మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్న సమయంలో అనుసరించిన విధానాలే కారణమని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చేసిన విమర్శలకు మన్మోహన్ బదులిచ్చారు. ‘సమస్య పరిష్కారం కోసం కృషి చేయడానికి బదులుగా ఎన్డీఏ నిరంతరంగా ప్రతిపక్షాన్ని విమర్శిస్తోంది. అదే పరిష్కారమని భావిస్తున్నట్లుంది’ అని మన్మోహన్ సింగ్  మీడియాతో భేటీలో అన్నారు.

ఈ సందర్భంగా ఇటీవల వెలుగు చూసిన మహారాష్ట్ర కో ఆపరేటివ్ (పీఎంసీ) బ్యాంక్ సమస్యను ఎత్తి చూపుతూ.. మీ హయాంలో చోటుచేసుకున్న ఈ ఘటనపై ఏమంటారు? అంటూ మన్మోహన్ నిలదీశారు. పీఎంసీ తనపై భరోసా ఉంచిన 16 లక్షల డిపాజిట్ దారుల భవిష్యత్తును కష్టాల్లోకి నెట్టిందని చెప్పారు. ‘నేను ప్రధానిగా ఉన్నప్పుడు పీఎస్ బీలు సమస్యల్లో కూరుకుపోయాయని అంటున్నారు. మేము 2004 నుంచి 2014 వరకు అధికారంలో ఉన్నాము. అంతకు ముందు మీరు అధికారంలో ఉన్నారు. మళ్లీ   2014 నుంచి మీరు ఐదేళ్లు పాలన చేశారు. మొత్తం తప్పంతా యూపీఏదేనని ఆరోపించడం తగదు’ అని సింగ్ వ్యాఖ్యానించారు.

 మంత్రి పీయూష్ గోయల్ ప్రతి విమర్శ

మన్మోహన్ సింగ్ తన వైఫల్యాలను గుర్తించాలి. బలమైన ఆర్థిక వ్యవస్థను కొనసాగించలేకపోవడంతోపాటు, నిజాయతీతో కూడిన ప్రభుత్వ పాలనను అందించలేకపోయారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ చేతిలో కీలుబొమ్మై సొంత నిర్ణయాలు తీసుకోలేకపోయారు’ అని గోయల్ ప్రతి విమర్శ చేశారు.

Comments

Popular posts from this blog

పవన్ కు శుభాకాంక్షలు చెప్పిన చిరంజీవి

  సినీనటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఈ రోజు పుట్టినరోజు వేడుక జరుపుకుంటోన్న నేపథ్యంలో ఆయనకు మెగాస్టార్ చిరంజీవి శుభాకాంక్షలు తెలిపారు.  ఆయనకు మహేశ్ బాబుతో పాటు పలువురు టాలీవుడ్ ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్లు చేశారు. సినిమాలతో పాటు రాజకీయాల్లో పవన్ కల్యాణ్ అద్భుత విజయాలు సాధించాలని తాము కోరుకుంటున్నట్లు తెలిపారు.

చింతమనేనికి బెయిల్ నిరాకరణ: అక్టోబర్ 9వరకు రిమాండ్ పొడిగింపు

తెలుగుదేశం పార్టీ నేత, దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కు కోర్టులో చుక్కెదురు అయ్యింది. చింతమనేనికి బెయిల్ ఇచ్చేందుకు ఏలూరు కోర్టు నిరాకరించింది. అంతేకాదు చింతమనేని రిమాండ్ ను అక్టోబర్ 9 వరకు పొండిగించింది.  2017లో అప్పనపాడు గ్రామంలో స్థల వివాదంలో వ్యక్తిని నిర్బంధించి కులం పేరుతో దూషించిన కేసులో కేసు నమోదు అయ్యింది. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులో భాగంగా ఇటీవలే చింతమనేని ప్రభాకర్ ను పోలీసులు అరెస్ట్ చేశారు.  అనంతరం చింతమనేని ప్రభాకర్ ను ఏలూరులోని ఎస్సీఎస్టీ అట్రాసిటీ కోర్టులో హాజరుపరచగా కోర్టు 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. రిమాండ్ పూర్తవ్వడంతో బుధవారం పోలీసులు మరోసారి ఏలూరు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కోర్టులో హాజరుపరిచారు.  అలాగే బెయిల్ ఇవ్వాలంటూ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తరపు న్యాయవాది సైతం కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. చింతమనేని బెయిల్ పిటీషన్ ను న్యాయస్థానం తోసిపుచ్చింది. అనంతరం చింతమనేని రిమాండ్ ను వచ్చే నెల 9 వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ఏలూరు కోర్టు.  ఇకపోతే చింతమనేని ప్రభాకర్ ను అరెస్ట్ చేసేందుకు వెళ్లిన సమయంలో మహిళా పో...