Skip to main content

చిన్నారి బాలయ్య' గోకుల్ కన్నుమూత... దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన బాలకృష్ణ



తెలుగు బుల్లితెర రంగంలో విషాదం నెలకొంది. జీ తెలుగు చానల్లో ప్రసారమయ్యే డ్రామా జూనియర్స్ కార్యక్రమంలో తన డైలాగులు, హావభావాలతో అచ్చు నందమూరి బాలకృష్ణను తలపింప చేసే బాలనటుడు గోకుల్ మృతి చెందాడు. గోకుల్ డెంగ్యూతో బాధపడుతూ బెంగళూరులోని ఓ ఆసుపత్రిలో కన్నుమూశాడు. గతంలో గోకుల్ తన అభిమాన హీరో బాలకృష్ణను కూడా కలిసి ఆశీస్సులు అందుకున్నాడు. ఇప్పుడు గోకుల్ లేడని తెలియడంతో బాలయ్య తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు.తమకు అభిమానుల కంటే విలువైనది మరొకటి ఉండదని, అలాంటిది చిన్నారి అభిమాని గోకుల్ మృతి తన మనసును కలచివేస్తోందని తెలిపారు. తానంటే ప్రాణం ఇచ్చే గోకుల్ ఇంత చిన్న వయసులో డెంగ్యూ కారణంగా ఈ లోకాన్ని విడిచివెళ్లడం అత్యంత బాధ కలిగిస్తోందని పేర్కొన్నారు. గోకుల్ డైలాగులు చెప్పే విధానం, హావభావాలు ఎంతో బాగుండేవని, ఎంతో భవిష్యత్తు ఉందని భావించేవాడ్నని బాలకృష్ణ గుర్తుచేసుకున్నారు.

గోకుల్ స్వస్థలం చిత్తూరు జిల్లా మదనపల్లె. తండ్రి యోగేంద్రబాబు, తల్లి సుమాంజలి. మొదటి నుంచి బాలకృష్ణలా డైలాగులు చెబుతూ ఇంటిపక్కనవారిని అలరిస్తూ అంచెలంచెలుగా బుల్లితెర రంగంలో ప్రవేశించి కొద్దికాలంలోనే గుర్తింపు తెచ్చుకున్నాడు. జీ తెలుగు చానల్ లో ప్రసారమయ్యే డ్రామా జూనియర్స్ కు ఎంపికవడంతో గోకుల్ ప్రతిభ అందరికీ తెలిసింది.

Comments

Popular posts from this blog

అమరావతిలో భూముల రేట్లు తగ్గకుండా: సీఆర్డీఏ స్థానంలో కొత్త అథారిటీ: కీలక నోటిఫికేషన్

 మూడు రాజధానులను ఏర్పాటు చేయడానికి ఉద్దేశించిన ఏపీ వికేంద్రీకరణ బిల్లు ఆమోదం పొందడం, రాజధాని ప్రాంత అభివృద్ధి అథారిటీ (సీఆర్డీ) రద్దు నేపథ్యంలో.. ప్రభుత్వం మెరుపు వేగంతో నిర్ణయాలను తీసుకుంటోంది. పరిపాలనను వేగవంతం చేసేలా తక్షణ చర్యలకు దిగింది. సీఆర్డీఏ బిల్లు రద్దు అనంతరం దాని స్థానంలో అమరావతి మెట్రోపాలిటన్ ప్రాంత అభివృద్ధి మండలిని ఏర్పాటు చేస్తామని ప్రకటించిన ప్రభుత్వం.. దాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. ఏఎంఆర్డీఏ కమిటీ సభ్యులనూ నియమించింది. సీఆర్డీఏకు బదులుగా ఏఎంఆర్డీఏ సీఆర్డీఏ స్థాయంలో అమరావతి మెట్రోపాలిటన్ ప్రాంత అభివృద్ధి మండలి (ఏఎంఆర్డీఏ)ని ఏర్పాటు చేసింది. ఈ మేరకు నోటిఫికేషన్‌ను జారీ చేసింది. సీఆర్డీఏను రద్దు చేస్తూ అసెంబ్లీ ఆమోదించిన తీర్మానంపై గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆమోదముద్ర వేసిన మరుసటి రోజే ఏఎంఆర్డీఏను తెరపైకి తీసుకొచ్చింది. దానితో పాటు కొత్త సభ్యులను నియమించింది. మున్సిపల్ శాఖ కార్యదర్శి జే శ్యామల రావు దీనికి సంబంధించిన నోటిఫికేషన్‌ను జారీ చేశారు. మొత్తం 11 మంది సభ్యులను ఏఎంఆర్డీఏ కమిటీలో నియమించారు. సభ్యులు వీరే.. మున్సిపల్ శాఖ కార్యదర్శి డిప్య...