Skip to main content

చిన్నారి బాలయ్య' గోకుల్ కన్నుమూత... దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన బాలకృష్ణ



తెలుగు బుల్లితెర రంగంలో విషాదం నెలకొంది. జీ తెలుగు చానల్లో ప్రసారమయ్యే డ్రామా జూనియర్స్ కార్యక్రమంలో తన డైలాగులు, హావభావాలతో అచ్చు నందమూరి బాలకృష్ణను తలపింప చేసే బాలనటుడు గోకుల్ మృతి చెందాడు. గోకుల్ డెంగ్యూతో బాధపడుతూ బెంగళూరులోని ఓ ఆసుపత్రిలో కన్నుమూశాడు. గతంలో గోకుల్ తన అభిమాన హీరో బాలకృష్ణను కూడా కలిసి ఆశీస్సులు అందుకున్నాడు. ఇప్పుడు గోకుల్ లేడని తెలియడంతో బాలయ్య తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు.తమకు అభిమానుల కంటే విలువైనది మరొకటి ఉండదని, అలాంటిది చిన్నారి అభిమాని గోకుల్ మృతి తన మనసును కలచివేస్తోందని తెలిపారు. తానంటే ప్రాణం ఇచ్చే గోకుల్ ఇంత చిన్న వయసులో డెంగ్యూ కారణంగా ఈ లోకాన్ని విడిచివెళ్లడం అత్యంత బాధ కలిగిస్తోందని పేర్కొన్నారు. గోకుల్ డైలాగులు చెప్పే విధానం, హావభావాలు ఎంతో బాగుండేవని, ఎంతో భవిష్యత్తు ఉందని భావించేవాడ్నని బాలకృష్ణ గుర్తుచేసుకున్నారు.

గోకుల్ స్వస్థలం చిత్తూరు జిల్లా మదనపల్లె. తండ్రి యోగేంద్రబాబు, తల్లి సుమాంజలి. మొదటి నుంచి బాలకృష్ణలా డైలాగులు చెబుతూ ఇంటిపక్కనవారిని అలరిస్తూ అంచెలంచెలుగా బుల్లితెర రంగంలో ప్రవేశించి కొద్దికాలంలోనే గుర్తింపు తెచ్చుకున్నాడు. జీ తెలుగు చానల్ లో ప్రసారమయ్యే డ్రామా జూనియర్స్ కు ఎంపికవడంతో గోకుల్ ప్రతిభ అందరికీ తెలిసింది.

Comments

Popular posts from this blog

వారానికోసారి కష్టమేమీ కాదు... సీఎం జగన్‌ కేసులో సీబీఐ కౌంటర్

కోర్టుకు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని ఏపీ సీఎం జగన్ వేసిన పిటిషన్‌పై సీబీఐ కౌంటర్ దాఖలు చేసింది. అక్రమాస్తుల కేసు విచారణ నుంచి తనకు వ్యక్తిగత హాజరు మినహాయింపు ఇవ్వాలని ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సీబీఐ కోర్టులో వేసిన పిటిషన్‌పై సీబీఐ కౌంటర్ దాఖలు చేసింది. సీఎం జగన్ దాఖలు చేసిన పిటిషన్‌పై సీబీఐ అభ్యంతరం వ్యక్తం చేసింది. సాక్షులను జగన్ ప్రభావితం చేసే అవకాశం ఉందని పిటిషన్‌లో పేర్కొంది. ఆయన వాస్తవాలను దాచిపెట్టి పిటిషన్ వేశారని ఆరోపించింది. జగన్ జైల్లో ఉన్నప్పుడు సాక్షులను ప్రభావితం చేశారని... సీఎం పదవిలో ఉన్న జగన్ సాక్షులను మరింత ప్రభావితం చేసే అవకాశం ఉందని సీబీఐ తన పిటిషన్‌లో పేర్కొంది. ఏపీలో రెవెన్యూ లోటు అనేది సీఎంగా ఉన్న జగన్ వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇచ్చే కారణం కాదని తెలిపింది. సీఎంగా ఉన్న జగన్ విజయవాడ నుంచి వారానికోసారి హైదరాబాద్ రావడంకష్టమేమీ కాదని కౌంటర్‌ పిటిషన్‌లో సీబీఐ పేర్కొన్నట్టు తెలుస్తోంది. సీబీఐ కౌంటర్‌పై కోర్టు శుక్రవారం వాదనలు వినిపించనుంది.

బోటు వెలికితీత మరింత ఆలస్యం

కచ్చులూరు వద్ద మునిగిన బోటును రేపు వెలికితీస్తామని ధర్మాడి సత్యం తెలిపారు. బోటు వెలికితీత కోసం రెండోరోజు చేసిన ప్రయత్నాలు విఫలమైనట్లు చెప్పారు. వాతావరణం అనుకూలించనందువల్లే ఈ ఆలస్యం జరుగుతుందని వివరించారు. గోదావరిలో వరద ప్రహహం తగ్గిన కారణంగా బోటును రేపు బయటికి తీస్తామని స్పష్టం చేశారు. కాగా.. ధర్మాడి సత్యం బృందం వేసిన లంగర్‌కు బోటు తగిలి కదిలిందని స్థానికులు తెలిపారు.