Skip to main content

చిన్నారి బాలయ్య' గోకుల్ కన్నుమూత... దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన బాలకృష్ణ



తెలుగు బుల్లితెర రంగంలో విషాదం నెలకొంది. జీ తెలుగు చానల్లో ప్రసారమయ్యే డ్రామా జూనియర్స్ కార్యక్రమంలో తన డైలాగులు, హావభావాలతో అచ్చు నందమూరి బాలకృష్ణను తలపింప చేసే బాలనటుడు గోకుల్ మృతి చెందాడు. గోకుల్ డెంగ్యూతో బాధపడుతూ బెంగళూరులోని ఓ ఆసుపత్రిలో కన్నుమూశాడు. గతంలో గోకుల్ తన అభిమాన హీరో బాలకృష్ణను కూడా కలిసి ఆశీస్సులు అందుకున్నాడు. ఇప్పుడు గోకుల్ లేడని తెలియడంతో బాలయ్య తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు.తమకు అభిమానుల కంటే విలువైనది మరొకటి ఉండదని, అలాంటిది చిన్నారి అభిమాని గోకుల్ మృతి తన మనసును కలచివేస్తోందని తెలిపారు. తానంటే ప్రాణం ఇచ్చే గోకుల్ ఇంత చిన్న వయసులో డెంగ్యూ కారణంగా ఈ లోకాన్ని విడిచివెళ్లడం అత్యంత బాధ కలిగిస్తోందని పేర్కొన్నారు. గోకుల్ డైలాగులు చెప్పే విధానం, హావభావాలు ఎంతో బాగుండేవని, ఎంతో భవిష్యత్తు ఉందని భావించేవాడ్నని బాలకృష్ణ గుర్తుచేసుకున్నారు.

గోకుల్ స్వస్థలం చిత్తూరు జిల్లా మదనపల్లె. తండ్రి యోగేంద్రబాబు, తల్లి సుమాంజలి. మొదటి నుంచి బాలకృష్ణలా డైలాగులు చెబుతూ ఇంటిపక్కనవారిని అలరిస్తూ అంచెలంచెలుగా బుల్లితెర రంగంలో ప్రవేశించి కొద్దికాలంలోనే గుర్తింపు తెచ్చుకున్నాడు. జీ తెలుగు చానల్ లో ప్రసారమయ్యే డ్రామా జూనియర్స్ కు ఎంపికవడంతో గోకుల్ ప్రతిభ అందరికీ తెలిసింది.

Comments

Popular posts from this blog

సుజనా చౌదరి లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా ప్రైవేట్ బిల్లు పెడతాం: వైసీపీ ఎంపీ బాలశౌరి

బీజేపీ ఎంపీ సుజనాచౌదరిపై వైసీపీ ఎంపీ బాలశౌరి తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేశారు. మొన్నటి వరకు టీడీపీలో ఉన్న సుజనాచౌదరి బీజేపీలో చేరింది చంద్రబాబు అజెండా మోయడానికి కాదా? రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమా? చంద్రబాబు ప్రయోజనాలు ముఖ్యమా? ప్రధాని మోదీకి వ్యతిరేకంగా గతంలో ధర్మదీక్షలు చేసింది సుజనా కాదా? అని ప్రశ్నించారు. పొలిటికల్ బ్రోకర్, డూప్లికేట్ బీజేపీ నేత సుజనా చౌదరి మాటలకు విలువే లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సుజనా డూప్లికేట్ బీజేపీ నేత కాబట్టే చంద్రబాబు అజెండా అమలు చేస్తున్నారని ఆరోపించారు. సుజనాపై ఎథిక్స్ కమిటీలో ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు.  బ్యాంకులను మోసం చేసి డబ్బులు ఎగ్గొట్టిన సుజనా లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా పార్లమెంట్ లో ప్రైవేట్ బిల్లు పెడతామని సంచలన వ్యాఖ్యలు చేశారు.  

చైనాకు షాక్ : వాటిపై పెరగనున్న సుంకం

విదేశాల నుంచి దిగుమతయ్యే యాక్టివ్‌ ఫార్మాసూటికల్‌ ఇన్‌గ్రీడియంట్స్‌ (ఏపీఐ) దిగుమతులపై భారత  ప్రభుత్వం త్వరలోనే షాక్ ఇవ్వనుంది. ఏపీఐ దిగమతులపై కస్టమ్స్ సుంకాన్ని10 నుంచి 15 శాతం దాకా  పెంచాలని  ఫార్మాస్యూటికల్స్ విభాగం (డీఓపీ) యోచిస్తోంది. ముడి ఔషధాల (ఏపీఐ) దేశీయ తయారీని ప్రోత్సాహం ఇవ్వడంతోపాటు,చైనాపై అధికంగా ఆధారపడటాన్ని తగ్గించాలన్న వ్యూహంలో భాగంగా కేంద్రం ఈ నిర్ణయం తీసుకోనుంది. ఏపీఐ దిగుమతులపై సుంకాన్ని 20-25 శాతంగా ఉంచేందుకు ప్రభుత్వం పరిశీలిస్తోందని ఎకనామిక్ టైమ్స్ నివేదించింది. ప్రస్తుతం ఇది 10 శాతం మాత్రమే. భారత్-చైనా సరిహద్దు వివాదం, ఇటు చైనా ఉత్పత్తులను నిషేధించాలన్న డిమాండ్ అటు ప్రధానంగా ఏఐపీల కోసం చైనాపై అధికంగా ఆధారపడుతున్న తరుణంలో ఇది చైనాకు ప్రతికూలంగా మారనుంది.   ప్రస్తుతం, భారతదేశం 68 శాతం ఏపీఐలు, 90 శాతం కంటే ఎక్కువ యాంటీబయాటిక్‌లను చైనా నుండి దిగుమతి చేసుకుంటోంది. దేశీయంగా  వాల్యూమ్ పరంగా ప్రపంచంలో మూడవ అతిపెద్దది. క్లిష్టమైన కీ స్టార్టింగ్ మెటీరియల్స్ (కెఎస్ఎం), డ్రగ్ ఇంటర్మీడియట్...