Skip to main content

జగన్మోహన్ రెడ్డి పై మరో సారి ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన జేసీ...



నేతలు, కార్యకర్తల వలసలపై మాట్లాడిన జేసీ పోలీసుల కేసులు భరించలేక టిడిపి కార్యకర్తలు వైసిపిలో చేరుకున్నారని అన్నారు.
మాజీ ఎంపీ, టిడిపి సివియర్ నేత జేసీ దివాకర్ రెడ్డి వీలు చిక్కినప్పుడల్లా సిఎం జగన్ పై తనదైన శైలిలో స్పందిస్తుంటారు. తాజాగా మరోసారి జగన్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

జగన్ కు పరిపాలన అనుభవం లేదని, ఆయనకు మంచి చెడు చేప్పేవాళ్ళు లేరని వ్యాఖ్యానించారు. తాను పట్టిన కుందేలుకు మూడే కాళ్లన్న చందంగా పరిపాలన సాగిస్తున్నారని సెటైర్లు వేశారు. జగన్ నరేంద్ర మోడీ దయ వల్లే అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ జగన్ భారీ మెజార్టీతో గెలిచారని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు . నరేంద్ర మోడీ చేతిలో ఉన్న మంత్రదండం షిర్డీ సాయి కన్నా శక్తివంతమైనదని అభిప్రాయపడ్డారు. ఒక వైపు చురకలంటిస్తూనే జగన్ మంచీచెడు రెండు చేస్తున్నాడని అభిప్రాయపడడు.

Comments

Popular posts from this blog

సుజనా చౌదరి లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా ప్రైవేట్ బిల్లు పెడతాం: వైసీపీ ఎంపీ బాలశౌరి

బీజేపీ ఎంపీ సుజనాచౌదరిపై వైసీపీ ఎంపీ బాలశౌరి తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేశారు. మొన్నటి వరకు టీడీపీలో ఉన్న సుజనాచౌదరి బీజేపీలో చేరింది చంద్రబాబు అజెండా మోయడానికి కాదా? రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమా? చంద్రబాబు ప్రయోజనాలు ముఖ్యమా? ప్రధాని మోదీకి వ్యతిరేకంగా గతంలో ధర్మదీక్షలు చేసింది సుజనా కాదా? అని ప్రశ్నించారు. పొలిటికల్ బ్రోకర్, డూప్లికేట్ బీజేపీ నేత సుజనా చౌదరి మాటలకు విలువే లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సుజనా డూప్లికేట్ బీజేపీ నేత కాబట్టే చంద్రబాబు అజెండా అమలు చేస్తున్నారని ఆరోపించారు. సుజనాపై ఎథిక్స్ కమిటీలో ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు.  బ్యాంకులను మోసం చేసి డబ్బులు ఎగ్గొట్టిన సుజనా లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా పార్లమెంట్ లో ప్రైవేట్ బిల్లు పెడతామని సంచలన వ్యాఖ్యలు చేశారు.  

తెలంగాణ సర్కారుకు దర్శకుడు హరీశ్ శంకర్ సలహా

  హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ సమస్యలను తగ్గించడానికి మంత్రి కేటీఆర్ అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సమావేశంపై తెలంగాణ ఐటీ, పరిశ్రమల మంత్రిత్వ శాఖ ట్విట్టర్ లో పోస్ట్ చేయగా, దానిపై దర్శకుడు హరీశ్ శంకర్ స్పందించారు. హైదరాబాద్ నగరానికి స్లిప్ రోడ్ల అవసరం ఎంతో ఉందని తెలిపారు. మంత్రి కేటీఆర్ సమావేశంలో కొత్త స్లిప్ రోడ్ల అంశం కూడా చర్చకు రాగా, తక్షణ అవసరం అదేనని హరీశ్ శంకర్ అభిప్రాయపడ్డారు. హరీశ్ ప్రతిపాదనకు నెటిజన్ల నుంచి గణనీయమైన స్థాయిలో మద్దతు లభిస్తోంది.