Skip to main content

ఆ అవకాశమే ఉంటే ఒక్కరోజులో బోటును బయటికి తీస్తా: ధర్మాడి సత్యం

తూర్పుగోదావరి జిల్లా కచ్చులూరు వద్ద బోటు ప్రమాదం జరిగి పెద్ద సంఖ్యలో పర్యాటకులు మృత్యువాత పడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, మునిగిపోయిన బోటును వెలికితీస్తే ఆచూకీ తెలియని వారి మృతదేహాలు కూడా బయటపడొచ్చని ప్రభుత్వం భావిస్తోంది. ఈ క్రమంలో బోటు వెలికితీత పనులను కాకినాడ బాలాజీ మెరైన్స్ సంస్థకు అప్పగించింది. అయితే, మూడ్రోజులు తీవ్రంగా ప్రయత్నించినా బోటు ఆచూకీ లభ్యం కాలేదు. నాలుగోరోజు ప్రతికూల వాతావరణం కారణంగా పనులు నిలిచిపోయాయి. దీనిపై బాలాజీ మెరైన్స్ అధినేత ధర్మాడి సత్యం మీడియాతో మాట్లాడారు.

బోటు మునిగిపోయిన ప్రాంతంలో గతంలో కంటే ఇప్పుడు సుడిగుండాలు తీవ్రంగా ఉన్నాయని, తాము ప్రయాణిస్తున్న బోటు యజమాని భయపడుతున్నాడని, అందుకే వెలికితీత పనులు నిలిపివేశామని చెప్పారు. భారీ వర్షం పడడంతో గోదావరి ఉద్ధృతి మరింత పెరిగిందని, దాంతో సుడిగుండాలు తీవ్రత మరింత ఎక్కువైందని వివరించారు. ఇలాంటి ప్రమాదకర పరిస్థితుల్లో వెలికితీత కష్టసాధ్యమని ధర్మాడి సత్యం తెలిపారు.

అయితే, ఎన్డీఆర్ఎఫ్ దళాల వద్ద ఉన్న సాంకేతిక పరిజ్ఞానం సాయంతో నదిలోకి వెళ్లి బోటుకు నేరుగా లంగరు తగిలించే వీలుంటుందా? అని మీడియా ప్రతినిధి ప్రశ్నించగా, ఆ అవకాశమే ఉంటే తాను ఒక్కరోజులో బోటును బయటికి తీసిస్తానని ధర్మాడి సత్యం చెప్పారు. సముద్రంలో మునిగిపోయిన బోట్లును కూడా బయటికి తీసిన చరిత్ర తమకుందని, కానీ ఇక్కడ సుడిగుండాలు అన్ని ప్రయత్నాలకు ప్రతిబంధకంగా మారాయని అన్నారు. తమకు డబ్బు ముఖ్యం కాదని, బోటును వెలికితీయాలన్న లక్ష్యంతోనే వచ్చామని ఆయన స్పష్టం చేశారు.

Comments

Popular posts from this blog

పవన్ కు శుభాకాంక్షలు చెప్పిన చిరంజీవి

  సినీనటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఈ రోజు పుట్టినరోజు వేడుక జరుపుకుంటోన్న నేపథ్యంలో ఆయనకు మెగాస్టార్ చిరంజీవి శుభాకాంక్షలు తెలిపారు.  ఆయనకు మహేశ్ బాబుతో పాటు పలువురు టాలీవుడ్ ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్లు చేశారు. సినిమాలతో పాటు రాజకీయాల్లో పవన్ కల్యాణ్ అద్భుత విజయాలు సాధించాలని తాము కోరుకుంటున్నట్లు తెలిపారు.

చింతమనేనికి బెయిల్ నిరాకరణ: అక్టోబర్ 9వరకు రిమాండ్ పొడిగింపు

తెలుగుదేశం పార్టీ నేత, దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కు కోర్టులో చుక్కెదురు అయ్యింది. చింతమనేనికి బెయిల్ ఇచ్చేందుకు ఏలూరు కోర్టు నిరాకరించింది. అంతేకాదు చింతమనేని రిమాండ్ ను అక్టోబర్ 9 వరకు పొండిగించింది.  2017లో అప్పనపాడు గ్రామంలో స్థల వివాదంలో వ్యక్తిని నిర్బంధించి కులం పేరుతో దూషించిన కేసులో కేసు నమోదు అయ్యింది. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులో భాగంగా ఇటీవలే చింతమనేని ప్రభాకర్ ను పోలీసులు అరెస్ట్ చేశారు.  అనంతరం చింతమనేని ప్రభాకర్ ను ఏలూరులోని ఎస్సీఎస్టీ అట్రాసిటీ కోర్టులో హాజరుపరచగా కోర్టు 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. రిమాండ్ పూర్తవ్వడంతో బుధవారం పోలీసులు మరోసారి ఏలూరు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కోర్టులో హాజరుపరిచారు.  అలాగే బెయిల్ ఇవ్వాలంటూ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తరపు న్యాయవాది సైతం కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. చింతమనేని బెయిల్ పిటీషన్ ను న్యాయస్థానం తోసిపుచ్చింది. అనంతరం చింతమనేని రిమాండ్ ను వచ్చే నెల 9 వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ఏలూరు కోర్టు.  ఇకపోతే చింతమనేని ప్రభాకర్ ను అరెస్ట్ చేసేందుకు వెళ్లిన సమయంలో మహిళా పో...