Skip to main content

మెగాస్టార్‌తో కలిసి ‘సైరా’ను వీక్షించిన ఉపరాష్ట్రపతి ఎన్టీఆర్‌, ఏఎన్నార్‌ తర్వాత చిరు అంటూ..

మెగాస్టార్‌తో కలిసి ‘సైరా’ను వీక్షించిన ఉపరాష్ట్రపతి

 నందమూరి తారక రామారావు, అక్కినేని నాగేశ్వరరావు తర్వాతి జనరేషన్‌లో ప్రజల్ని అలరించడానికి చిరంజీవి వచ్చారని భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ప్రశంసించారు. ‘సైరా’ చిత్రానికి ప్రమోషన్స్‌లో భాగంగా మెగాస్టార్‌ చిరంజీవి తాజాగా ఉపరాష్ట్రపతిని దిల్లీలో కలుసుకున్నారు. ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు నివాసంలో ‘సైరా’ చిత్రాన్ని ప్రత్యేకంగా ప్రదర్శించారు. చిరంజీవితో పాటు తన కుటుంబ సభ్యులతో కలిసి ఈ చిత్రాన్ని వీక్షించిన అనంతరం వెంకయ్యనాయుడు మాట్లాడారు. చిరంజీవిని ప్రత్యేకంగా అభినందించారు. అప్పట్లో రామారావు, నాగేశ్వరరావు తర్వాతి జనరేషన్‌లో చిరంజీవి వచ్చారని గుర్తుచేసుకున్నారు. సైరా మంచి చారిత్రాత్మక చిత్రమని కొనియాడారు.
మెగాస్టార్‌తో కలిసి ‘సైరా’ను వీక్షించిన ఉపరాష్ట్రపతి
ఈ సందర్భంగా వెంకయ్య నాయుడు ట్వీట్‌ చేశారు. ‘‘బ్రిటిష్‌ వారి అరాచకాలను ఎదిరిస్తూ స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి చేసిన పోరాట స్ఫూర్తితో రూపొందిన ‘సైరా’ చిత్రం బాగుంది. నటులు చిరంజీవి, అమితాబ్‌ బచ్చన్‌, దర్శకుడు సురేందర్‌రెడ్డికి అభినందనలు. నిర్మాత రామ్‌ చరణ్‌ తేజ్‌కు ప్రత్యేక అభినందనలు. ఊరూవాడా చూడదగిన ఉత్తమ చిత్రం ‘సైరా’. చాలా కాలం తర్వాత చక్కని, ప్రేరణాదాయకమైన చిత్రం చూసే అవకాశం లభించింది. వలస పాలకుల దుర్మార్గాలను చాలా చక్కగా చిత్రీకరించారు. నిర్మాత, సినీనటులు, దర్శకుడు, సాంకేతిక నిపుణులు అందరికీ అభినందనలు’’ అని ట్విటర్‌లో తెలిపారు.
మెగాస్టార్‌తో కలిసి ‘సైరా’ను వీక్షించిన ఉపరాష్ట్రపతి

అక్టోబరు 2న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘సైరా’ సినీ ప్రముఖులతోపాటు విశ్లేషకుల ప్రశంసలు అందుకుంది. అంతేకాదు బాక్సాఫీసు వద్ద విశేషమైన వసూళ్లు రాబడుతోంది. ఈ సినిమా 12 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా రూ.230 కోట్లు రాబట్టినట్లు విశ్లేషకులు అంచనా వేశారు. అమెరికాలో చిత్రం 2.5 మిలియన్‌ డాలర్లకుపైగా వసూలు చేసింది. చిరు కెరీర్‌లో అమెరికాలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది.

Comments

Popular posts from this blog

ఎలన్ మస్క్... స్టార్ షిప్ రెడీ... వచ్చే ఏడాది మార్స్ చెంతకు ప్రయాణం

మార్స్ గ్రహంపైకి వన్ వే ట్రిప్‌గా ఆసక్తి ఉన్న ప్రజలను పంపుతానని ప్రకటించిన ఆమెరికా బిలియనీర్ వ్యాపారి ఎలన్ మస్క్... అన్నంత పనీ చేస్తున్నారు. మనుషుల్ని చందమామ, మార్స్ చెంతకు తీసుకెళ్లడం కోసం ఆయన కంపెనీ స్పేస్ ఎక్స్... సరికొత్త విమానం తరహా స్పేస్ షిప్‌లను తయారుచేస్తోంది. ఇవి రాకెట్‌‌లా కాకుండా... విమానం లాగా... అంతరిక్షంలోకి వెళ్లి... గ్రహాలపై మనుషుల్ని దించేసి... తిరిగి ఖాళీగా వెనక్కి వచ్చేస్తాయి. గ్రహాలపైకి వెళ్లినవాళ్లు తిరిగి వచ్చే అవకాశాలు లేవు. ఇందుకు రిటర్న్ ట్రిప్ అవకాశం కల్పించట్లేదు ఎలన్ మస్క్. వన్ వే ట్రిప్‌గా వెళ్లేందుకు ఆసక్తి ఉన్నవారే టికెట్ బుక్ చేసుకోమని సూచిస్తున్నారు. తాజాగా ఆయన ఆవిష్కరించిన స్పేస్‌షిప్‌లో వంద మంది ప్రయాణించేందుకు వీలుంది. టెక్సాస్... బోకా చికాలో... ఎంతో మంది అంతరిక్ష ఔత్సాహికులు, రిపోర్టర్ల సమక్షంలో చందమామ, మార్స్‌పైకి పంపే స్టార్ షిప్‌ను ఆవిష్కరించారు ఎలన్ మస్క్. వచ్చే ఆరు నెలల్లో దాన్ని అంతరిక్షంలో ఓ రౌండ్ వేయించి... వచ్చే ఏడాది మనుషులను అందులో పంపాలనుకుంటున్నారు ఎలన్ మస్క్. ఎప్పుడో పదకొండు ఏళ్ల కిందట ఫాల్కన్-1 రాకెట్‌ను తయారుచేసింది స్పేస్ ఎక...

క్రెడిట్ పై పెట్రోలును కొనుగోలు చేస్తే నో క్యాష్‌బ్యాక్‌

క్రెడిట్‌ కార్డులను వినియోగించి పెట్రోలును కొనుగోలు చేస్తే ఇన్నాళ్లూ లభిస్తున్న 0.75 శాతం క్యాష్‌బ్యాక్‌ అక్టోబరు ఒకటో తేది నుంచి ఉండబోదని కంపెనీలు ప్ర‌క‌టించాయి.  2016లో పెద్ద నోట్లను రద్దు చేసిన తర్వాత డిజిటల్‌ చెల్లింపులను ప్రోత్సహించడానికి ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగానే డిస్కౌంట్‌ ఇవ్వాలని చమురు కంపెనీలను కోరింది. దీంతో డిజిటల్‌ చెల్లింపులను ప్రోత్సహించడానికి  2016 డిసెంబరు నుంచి క్రెడిట్‌, డెబిట్‌, ఈ-వాలెట్ల ద్వారా పెట్రోల్‌, డీజిల్‌ కొనుగోలు చేసే వారికి 0.75శాతం డిస్కౌంట్‌ను క్యాష్‌బ్యాక్‌ రూపంలో  ఇవ్వాల‌ని  చమురు కంపెనీలు క్యాష్‌బ్యాక్‌లను ప్రకటించిన విష‌యం తెలిసిందే. కాగా వచ్చే నెల ఒకటో తేది నుంచి ఆ డిస్కౌంట్‌ ఉండబోదని తాజాగా కంపెనీలు వెల్లడించాయి. ఇకమీదట డెబిట్‌, ఇతర డిజిటల్‌ పద్ధతుల ద్వారా చెల్లించేవారికి మాత్రం ఈ డిస్కౌంట్‌ యధావిధిగా కొనసాగుతుంది.