Skip to main content

మెగాస్టార్‌తో కలిసి ‘సైరా’ను వీక్షించిన ఉపరాష్ట్రపతి ఎన్టీఆర్‌, ఏఎన్నార్‌ తర్వాత చిరు అంటూ..

మెగాస్టార్‌తో కలిసి ‘సైరా’ను వీక్షించిన ఉపరాష్ట్రపతి

 నందమూరి తారక రామారావు, అక్కినేని నాగేశ్వరరావు తర్వాతి జనరేషన్‌లో ప్రజల్ని అలరించడానికి చిరంజీవి వచ్చారని భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ప్రశంసించారు. ‘సైరా’ చిత్రానికి ప్రమోషన్స్‌లో భాగంగా మెగాస్టార్‌ చిరంజీవి తాజాగా ఉపరాష్ట్రపతిని దిల్లీలో కలుసుకున్నారు. ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు నివాసంలో ‘సైరా’ చిత్రాన్ని ప్రత్యేకంగా ప్రదర్శించారు. చిరంజీవితో పాటు తన కుటుంబ సభ్యులతో కలిసి ఈ చిత్రాన్ని వీక్షించిన అనంతరం వెంకయ్యనాయుడు మాట్లాడారు. చిరంజీవిని ప్రత్యేకంగా అభినందించారు. అప్పట్లో రామారావు, నాగేశ్వరరావు తర్వాతి జనరేషన్‌లో చిరంజీవి వచ్చారని గుర్తుచేసుకున్నారు. సైరా మంచి చారిత్రాత్మక చిత్రమని కొనియాడారు.
మెగాస్టార్‌తో కలిసి ‘సైరా’ను వీక్షించిన ఉపరాష్ట్రపతి
ఈ సందర్భంగా వెంకయ్య నాయుడు ట్వీట్‌ చేశారు. ‘‘బ్రిటిష్‌ వారి అరాచకాలను ఎదిరిస్తూ స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి చేసిన పోరాట స్ఫూర్తితో రూపొందిన ‘సైరా’ చిత్రం బాగుంది. నటులు చిరంజీవి, అమితాబ్‌ బచ్చన్‌, దర్శకుడు సురేందర్‌రెడ్డికి అభినందనలు. నిర్మాత రామ్‌ చరణ్‌ తేజ్‌కు ప్రత్యేక అభినందనలు. ఊరూవాడా చూడదగిన ఉత్తమ చిత్రం ‘సైరా’. చాలా కాలం తర్వాత చక్కని, ప్రేరణాదాయకమైన చిత్రం చూసే అవకాశం లభించింది. వలస పాలకుల దుర్మార్గాలను చాలా చక్కగా చిత్రీకరించారు. నిర్మాత, సినీనటులు, దర్శకుడు, సాంకేతిక నిపుణులు అందరికీ అభినందనలు’’ అని ట్విటర్‌లో తెలిపారు.
మెగాస్టార్‌తో కలిసి ‘సైరా’ను వీక్షించిన ఉపరాష్ట్రపతి

అక్టోబరు 2న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘సైరా’ సినీ ప్రముఖులతోపాటు విశ్లేషకుల ప్రశంసలు అందుకుంది. అంతేకాదు బాక్సాఫీసు వద్ద విశేషమైన వసూళ్లు రాబడుతోంది. ఈ సినిమా 12 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా రూ.230 కోట్లు రాబట్టినట్లు విశ్లేషకులు అంచనా వేశారు. అమెరికాలో చిత్రం 2.5 మిలియన్‌ డాలర్లకుపైగా వసూలు చేసింది. చిరు కెరీర్‌లో అమెరికాలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది.

Comments

Popular posts from this blog

సుజనా చౌదరి లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా ప్రైవేట్ బిల్లు పెడతాం: వైసీపీ ఎంపీ బాలశౌరి

బీజేపీ ఎంపీ సుజనాచౌదరిపై వైసీపీ ఎంపీ బాలశౌరి తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేశారు. మొన్నటి వరకు టీడీపీలో ఉన్న సుజనాచౌదరి బీజేపీలో చేరింది చంద్రబాబు అజెండా మోయడానికి కాదా? రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమా? చంద్రబాబు ప్రయోజనాలు ముఖ్యమా? ప్రధాని మోదీకి వ్యతిరేకంగా గతంలో ధర్మదీక్షలు చేసింది సుజనా కాదా? అని ప్రశ్నించారు. పొలిటికల్ బ్రోకర్, డూప్లికేట్ బీజేపీ నేత సుజనా చౌదరి మాటలకు విలువే లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సుజనా డూప్లికేట్ బీజేపీ నేత కాబట్టే చంద్రబాబు అజెండా అమలు చేస్తున్నారని ఆరోపించారు. సుజనాపై ఎథిక్స్ కమిటీలో ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు.  బ్యాంకులను మోసం చేసి డబ్బులు ఎగ్గొట్టిన సుజనా లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా పార్లమెంట్ లో ప్రైవేట్ బిల్లు పెడతామని సంచలన వ్యాఖ్యలు చేశారు.  

చైనాకు షాక్ : వాటిపై పెరగనున్న సుంకం

విదేశాల నుంచి దిగుమతయ్యే యాక్టివ్‌ ఫార్మాసూటికల్‌ ఇన్‌గ్రీడియంట్స్‌ (ఏపీఐ) దిగుమతులపై భారత  ప్రభుత్వం త్వరలోనే షాక్ ఇవ్వనుంది. ఏపీఐ దిగమతులపై కస్టమ్స్ సుంకాన్ని10 నుంచి 15 శాతం దాకా  పెంచాలని  ఫార్మాస్యూటికల్స్ విభాగం (డీఓపీ) యోచిస్తోంది. ముడి ఔషధాల (ఏపీఐ) దేశీయ తయారీని ప్రోత్సాహం ఇవ్వడంతోపాటు,చైనాపై అధికంగా ఆధారపడటాన్ని తగ్గించాలన్న వ్యూహంలో భాగంగా కేంద్రం ఈ నిర్ణయం తీసుకోనుంది. ఏపీఐ దిగుమతులపై సుంకాన్ని 20-25 శాతంగా ఉంచేందుకు ప్రభుత్వం పరిశీలిస్తోందని ఎకనామిక్ టైమ్స్ నివేదించింది. ప్రస్తుతం ఇది 10 శాతం మాత్రమే. భారత్-చైనా సరిహద్దు వివాదం, ఇటు చైనా ఉత్పత్తులను నిషేధించాలన్న డిమాండ్ అటు ప్రధానంగా ఏఐపీల కోసం చైనాపై అధికంగా ఆధారపడుతున్న తరుణంలో ఇది చైనాకు ప్రతికూలంగా మారనుంది.   ప్రస్తుతం, భారతదేశం 68 శాతం ఏపీఐలు, 90 శాతం కంటే ఎక్కువ యాంటీబయాటిక్‌లను చైనా నుండి దిగుమతి చేసుకుంటోంది. దేశీయంగా  వాల్యూమ్ పరంగా ప్రపంచంలో మూడవ అతిపెద్దది. క్లిష్టమైన కీ స్టార్టింగ్ మెటీరియల్స్ (కెఎస్ఎం), డ్రగ్ ఇంటర్మీడియట్...