Skip to main content

మెగాస్టార్‌తో కలిసి ‘సైరా’ను వీక్షించిన ఉపరాష్ట్రపతి ఎన్టీఆర్‌, ఏఎన్నార్‌ తర్వాత చిరు అంటూ..

మెగాస్టార్‌తో కలిసి ‘సైరా’ను వీక్షించిన ఉపరాష్ట్రపతి

 నందమూరి తారక రామారావు, అక్కినేని నాగేశ్వరరావు తర్వాతి జనరేషన్‌లో ప్రజల్ని అలరించడానికి చిరంజీవి వచ్చారని భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ప్రశంసించారు. ‘సైరా’ చిత్రానికి ప్రమోషన్స్‌లో భాగంగా మెగాస్టార్‌ చిరంజీవి తాజాగా ఉపరాష్ట్రపతిని దిల్లీలో కలుసుకున్నారు. ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు నివాసంలో ‘సైరా’ చిత్రాన్ని ప్రత్యేకంగా ప్రదర్శించారు. చిరంజీవితో పాటు తన కుటుంబ సభ్యులతో కలిసి ఈ చిత్రాన్ని వీక్షించిన అనంతరం వెంకయ్యనాయుడు మాట్లాడారు. చిరంజీవిని ప్రత్యేకంగా అభినందించారు. అప్పట్లో రామారావు, నాగేశ్వరరావు తర్వాతి జనరేషన్‌లో చిరంజీవి వచ్చారని గుర్తుచేసుకున్నారు. సైరా మంచి చారిత్రాత్మక చిత్రమని కొనియాడారు.
మెగాస్టార్‌తో కలిసి ‘సైరా’ను వీక్షించిన ఉపరాష్ట్రపతి
ఈ సందర్భంగా వెంకయ్య నాయుడు ట్వీట్‌ చేశారు. ‘‘బ్రిటిష్‌ వారి అరాచకాలను ఎదిరిస్తూ స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి చేసిన పోరాట స్ఫూర్తితో రూపొందిన ‘సైరా’ చిత్రం బాగుంది. నటులు చిరంజీవి, అమితాబ్‌ బచ్చన్‌, దర్శకుడు సురేందర్‌రెడ్డికి అభినందనలు. నిర్మాత రామ్‌ చరణ్‌ తేజ్‌కు ప్రత్యేక అభినందనలు. ఊరూవాడా చూడదగిన ఉత్తమ చిత్రం ‘సైరా’. చాలా కాలం తర్వాత చక్కని, ప్రేరణాదాయకమైన చిత్రం చూసే అవకాశం లభించింది. వలస పాలకుల దుర్మార్గాలను చాలా చక్కగా చిత్రీకరించారు. నిర్మాత, సినీనటులు, దర్శకుడు, సాంకేతిక నిపుణులు అందరికీ అభినందనలు’’ అని ట్విటర్‌లో తెలిపారు.
మెగాస్టార్‌తో కలిసి ‘సైరా’ను వీక్షించిన ఉపరాష్ట్రపతి

అక్టోబరు 2న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘సైరా’ సినీ ప్రముఖులతోపాటు విశ్లేషకుల ప్రశంసలు అందుకుంది. అంతేకాదు బాక్సాఫీసు వద్ద విశేషమైన వసూళ్లు రాబడుతోంది. ఈ సినిమా 12 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా రూ.230 కోట్లు రాబట్టినట్లు విశ్లేషకులు అంచనా వేశారు. అమెరికాలో చిత్రం 2.5 మిలియన్‌ డాలర్లకుపైగా వసూలు చేసింది. చిరు కెరీర్‌లో అమెరికాలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది.

Comments

Popular posts from this blog

సుజనా చౌదరి లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా ప్రైవేట్ బిల్లు పెడతాం: వైసీపీ ఎంపీ బాలశౌరి

బీజేపీ ఎంపీ సుజనాచౌదరిపై వైసీపీ ఎంపీ బాలశౌరి తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేశారు. మొన్నటి వరకు టీడీపీలో ఉన్న సుజనాచౌదరి బీజేపీలో చేరింది చంద్రబాబు అజెండా మోయడానికి కాదా? రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమా? చంద్రబాబు ప్రయోజనాలు ముఖ్యమా? ప్రధాని మోదీకి వ్యతిరేకంగా గతంలో ధర్మదీక్షలు చేసింది సుజనా కాదా? అని ప్రశ్నించారు. పొలిటికల్ బ్రోకర్, డూప్లికేట్ బీజేపీ నేత సుజనా చౌదరి మాటలకు విలువే లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సుజనా డూప్లికేట్ బీజేపీ నేత కాబట్టే చంద్రబాబు అజెండా అమలు చేస్తున్నారని ఆరోపించారు. సుజనాపై ఎథిక్స్ కమిటీలో ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు.  బ్యాంకులను మోసం చేసి డబ్బులు ఎగ్గొట్టిన సుజనా లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా పార్లమెంట్ లో ప్రైవేట్ బిల్లు పెడతామని సంచలన వ్యాఖ్యలు చేశారు.  

తెలంగాణ సర్కారుకు దర్శకుడు హరీశ్ శంకర్ సలహా

  హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ సమస్యలను తగ్గించడానికి మంత్రి కేటీఆర్ అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సమావేశంపై తెలంగాణ ఐటీ, పరిశ్రమల మంత్రిత్వ శాఖ ట్విట్టర్ లో పోస్ట్ చేయగా, దానిపై దర్శకుడు హరీశ్ శంకర్ స్పందించారు. హైదరాబాద్ నగరానికి స్లిప్ రోడ్ల అవసరం ఎంతో ఉందని తెలిపారు. మంత్రి కేటీఆర్ సమావేశంలో కొత్త స్లిప్ రోడ్ల అంశం కూడా చర్చకు రాగా, తక్షణ అవసరం అదేనని హరీశ్ శంకర్ అభిప్రాయపడ్డారు. హరీశ్ ప్రతిపాదనకు నెటిజన్ల నుంచి గణనీయమైన స్థాయిలో మద్దతు లభిస్తోంది.