Skip to main content

మెగాస్టార్‌తో కలిసి ‘సైరా’ను వీక్షించిన ఉపరాష్ట్రపతి ఎన్టీఆర్‌, ఏఎన్నార్‌ తర్వాత చిరు అంటూ..

మెగాస్టార్‌తో కలిసి ‘సైరా’ను వీక్షించిన ఉపరాష్ట్రపతి

 నందమూరి తారక రామారావు, అక్కినేని నాగేశ్వరరావు తర్వాతి జనరేషన్‌లో ప్రజల్ని అలరించడానికి చిరంజీవి వచ్చారని భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ప్రశంసించారు. ‘సైరా’ చిత్రానికి ప్రమోషన్స్‌లో భాగంగా మెగాస్టార్‌ చిరంజీవి తాజాగా ఉపరాష్ట్రపతిని దిల్లీలో కలుసుకున్నారు. ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు నివాసంలో ‘సైరా’ చిత్రాన్ని ప్రత్యేకంగా ప్రదర్శించారు. చిరంజీవితో పాటు తన కుటుంబ సభ్యులతో కలిసి ఈ చిత్రాన్ని వీక్షించిన అనంతరం వెంకయ్యనాయుడు మాట్లాడారు. చిరంజీవిని ప్రత్యేకంగా అభినందించారు. అప్పట్లో రామారావు, నాగేశ్వరరావు తర్వాతి జనరేషన్‌లో చిరంజీవి వచ్చారని గుర్తుచేసుకున్నారు. సైరా మంచి చారిత్రాత్మక చిత్రమని కొనియాడారు.
మెగాస్టార్‌తో కలిసి ‘సైరా’ను వీక్షించిన ఉపరాష్ట్రపతి
ఈ సందర్భంగా వెంకయ్య నాయుడు ట్వీట్‌ చేశారు. ‘‘బ్రిటిష్‌ వారి అరాచకాలను ఎదిరిస్తూ స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి చేసిన పోరాట స్ఫూర్తితో రూపొందిన ‘సైరా’ చిత్రం బాగుంది. నటులు చిరంజీవి, అమితాబ్‌ బచ్చన్‌, దర్శకుడు సురేందర్‌రెడ్డికి అభినందనలు. నిర్మాత రామ్‌ చరణ్‌ తేజ్‌కు ప్రత్యేక అభినందనలు. ఊరూవాడా చూడదగిన ఉత్తమ చిత్రం ‘సైరా’. చాలా కాలం తర్వాత చక్కని, ప్రేరణాదాయకమైన చిత్రం చూసే అవకాశం లభించింది. వలస పాలకుల దుర్మార్గాలను చాలా చక్కగా చిత్రీకరించారు. నిర్మాత, సినీనటులు, దర్శకుడు, సాంకేతిక నిపుణులు అందరికీ అభినందనలు’’ అని ట్విటర్‌లో తెలిపారు.
మెగాస్టార్‌తో కలిసి ‘సైరా’ను వీక్షించిన ఉపరాష్ట్రపతి

అక్టోబరు 2న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘సైరా’ సినీ ప్రముఖులతోపాటు విశ్లేషకుల ప్రశంసలు అందుకుంది. అంతేకాదు బాక్సాఫీసు వద్ద విశేషమైన వసూళ్లు రాబడుతోంది. ఈ సినిమా 12 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా రూ.230 కోట్లు రాబట్టినట్లు విశ్లేషకులు అంచనా వేశారు. అమెరికాలో చిత్రం 2.5 మిలియన్‌ డాలర్లకుపైగా వసూలు చేసింది. చిరు కెరీర్‌లో అమెరికాలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది.

Comments

Popular posts from this blog

అత్యంత కష్టం మీద బోటును బయటికి తీసిన ధర్మాడి సత్యం బృందం

నెలరోజులకు పైగా గోదావరి నదీ గర్భంలోనే ఉండిపోయిన రాయల్ వశిష్ట బోటును ఎట్టకేలకు బయటికి తీశారు. ధర్మాడి సత్యం బృందం తీవ్ర ప్రయాసలకోర్చి బోటు ఆచూకీ గుర్తించడమే కాకుండా దాన్ని పైకి తీసుకువచ్చారు. మరికాసేపట్లో బోటును ఒడ్డుకు చేర్చనున్నారు. స్కూబా డైవర్ల సాయంతో బోటుకు లంగర్లు ఫిక్స్ చేసి పైకి తీసుకువచ్చేందుకు ధర్మాడి సత్యం బృందం చేసిన ప్రయత్నాలు ఫలించాయి. మొదట కొన్ని భాగాలుగా విడిపోయినా, ఆ తర్వాత మరోసారి ఐరన్ రోప్ లు బిగించి మొత్తం బోటును వెలికి తీశారు. గోదావరి ఉపరితలంపైకి చేరిన బోటును మరో రెండు గంటల్లో తీరానికి చేర్చే అవకాశాలున్నాయి.

మీడియాపై మాకు గౌరవముంది: కోటంరెడ్డి

  కొన్ని పత్రికలు, ఛానల్స్ తమ పాలనపై ప్రజల్లో అపోహలు సృష్టిస్తున్నాయని  వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. మీడియాపై తమకు గౌరవం ఉందని, అది ఎప్పటికీ కొనసాగుతుందని చెప్పారు. జీవో 2430 కొత్తగా తీసుకొచ్చింది కాదని, ఎప్పటినుంచో అది ఉందని తెలిపారు.  ఈ రోజు కోటంరెడ్డి మీడియాతో మాట్లాడారు. కొన్ని పత్రికలు, ఛానల్స్ పనికట్టుకుని తప్పుడు వార్తలతో అపోహలు సృష్టిస్తున్నాయన్నారు. తప్పుడు వార్తలు రాసేవారు భయపడాలని పేర్కొన్నారు. ఒకప్పుడు సాక్షి మీడియాను చంద్రబాబు అనుమతించనప్పుడు ఈ ఉద్యమ నేతలు ఎటుపోయారని నిలదీశారు. లోకేశ్ దీక్షలను చూసి ప్రజలు నవ్వుకుంటున్నారన్నారు. మంగళగిరి నియోజక వర్గంలో ఎన్ని ఓట్లు ఉన్నాయో కూడా లోకేశ్ కు తెలియదని విమర్శించారు. తమ పాలనను చంద్రబాబు సహించలేకపోతున్నారని ఆయన మండిపడ్డారు. చంద్రబాబు, తన హయాంలో తన కొడుకు లోకేశ్ తో కలిసి దోచుకుని లోటు బడ్జెట్ ను చూపెట్టారని విమర్శించారు. ప్రస్తుతం సీఎం జగన్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గాడిలో పెడుతున్నారని చెప్పారు.  చంద్రబాబుకు చదువుకునేటప్పటి నుంచే కులపిచ్చి ఉందని పేర్కొన్నారు. స్థాని...