Skip to main content

చంద్రబాబును టార్గెట్ చేసిన‌ బీజేపీ




టీడీపీ అధినేత చంద్రబాబును బీజేపీ టార్గెట్ చేసింది. ఈ మేరకు అమరావతి పేరుతో వేల కోట్లు దోచుకున్నారని, పోలవరం టెండర్లలో కమీషన్లు తీసుకున్నారని బీజేపీ నేతలు బాబుపై విమర్శలు గుప్పించారు. తెలుగుదేశంతో పొత్తు కారణంగానే రాష్ట్రంలో బీజేపీ నష్టపోయిందని, దశాబ్దాలుగా కమలం పార్టీ ఎదగకుండా చంద్రబాబు అడ్డుకుంటూ వచ్చారని విమర్శలు చేశారు. ఇప్పటి వరకూ ఉప్పూ నిప్పుగా ఉన్న బీజేపీ, టీడీపీ మళ్లీ మైత్రిబంధం కలవనుందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల విశాఖ పర్యటనలో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు అందుకు బలం చేకూరుస్తున్నాయన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. కేంద్రంతో విభేధించి నష్టపోయామని, పట్టుదలకు పోకుండా ఉంటే అంత ఇబ్బందులు వచ్చేవి కాదని చంద్రబాబు వ్యాఖ్యానించారు. కేంద్రంతో సఖ్యత లేకపోవడంతో రాష్ట్రానికి లాభం జరగలేదన్నారు.జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గురించి కూడా ప్రత్యేకంగా మాట్లాడారు. పవన్‌తో హుందాగా ఉండాలనే గాజువాకలో ఎన్నికల ప్రచారానికి రాలేదన్నారు. ఆయనతో లాలూచీ వ్యవహారాలు ఏం లేవని వ్యాఖ్యానించారు. బీజేపీ, జనసేనను ఉద్దేశించి చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు ఏపీలో చర్చనీయాంశంగా మారాయి. 

Comments

Popular posts from this blog

సుజనా చౌదరి లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా ప్రైవేట్ బిల్లు పెడతాం: వైసీపీ ఎంపీ బాలశౌరి

బీజేపీ ఎంపీ సుజనాచౌదరిపై వైసీపీ ఎంపీ బాలశౌరి తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేశారు. మొన్నటి వరకు టీడీపీలో ఉన్న సుజనాచౌదరి బీజేపీలో చేరింది చంద్రబాబు అజెండా మోయడానికి కాదా? రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమా? చంద్రబాబు ప్రయోజనాలు ముఖ్యమా? ప్రధాని మోదీకి వ్యతిరేకంగా గతంలో ధర్మదీక్షలు చేసింది సుజనా కాదా? అని ప్రశ్నించారు. పొలిటికల్ బ్రోకర్, డూప్లికేట్ బీజేపీ నేత సుజనా చౌదరి మాటలకు విలువే లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సుజనా డూప్లికేట్ బీజేపీ నేత కాబట్టే చంద్రబాబు అజెండా అమలు చేస్తున్నారని ఆరోపించారు. సుజనాపై ఎథిక్స్ కమిటీలో ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు.  బ్యాంకులను మోసం చేసి డబ్బులు ఎగ్గొట్టిన సుజనా లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా పార్లమెంట్ లో ప్రైవేట్ బిల్లు పెడతామని సంచలన వ్యాఖ్యలు చేశారు.  

తెలంగాణ సర్కారుకు దర్శకుడు హరీశ్ శంకర్ సలహా

  హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ సమస్యలను తగ్గించడానికి మంత్రి కేటీఆర్ అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సమావేశంపై తెలంగాణ ఐటీ, పరిశ్రమల మంత్రిత్వ శాఖ ట్విట్టర్ లో పోస్ట్ చేయగా, దానిపై దర్శకుడు హరీశ్ శంకర్ స్పందించారు. హైదరాబాద్ నగరానికి స్లిప్ రోడ్ల అవసరం ఎంతో ఉందని తెలిపారు. మంత్రి కేటీఆర్ సమావేశంలో కొత్త స్లిప్ రోడ్ల అంశం కూడా చర్చకు రాగా, తక్షణ అవసరం అదేనని హరీశ్ శంకర్ అభిప్రాయపడ్డారు. హరీశ్ ప్రతిపాదనకు నెటిజన్ల నుంచి గణనీయమైన స్థాయిలో మద్దతు లభిస్తోంది.