Skip to main content

చంద్రబాబును టార్గెట్ చేసిన‌ బీజేపీ




టీడీపీ అధినేత చంద్రబాబును బీజేపీ టార్గెట్ చేసింది. ఈ మేరకు అమరావతి పేరుతో వేల కోట్లు దోచుకున్నారని, పోలవరం టెండర్లలో కమీషన్లు తీసుకున్నారని బీజేపీ నేతలు బాబుపై విమర్శలు గుప్పించారు. తెలుగుదేశంతో పొత్తు కారణంగానే రాష్ట్రంలో బీజేపీ నష్టపోయిందని, దశాబ్దాలుగా కమలం పార్టీ ఎదగకుండా చంద్రబాబు అడ్డుకుంటూ వచ్చారని విమర్శలు చేశారు. ఇప్పటి వరకూ ఉప్పూ నిప్పుగా ఉన్న బీజేపీ, టీడీపీ మళ్లీ మైత్రిబంధం కలవనుందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల విశాఖ పర్యటనలో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు అందుకు బలం చేకూరుస్తున్నాయన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. కేంద్రంతో విభేధించి నష్టపోయామని, పట్టుదలకు పోకుండా ఉంటే అంత ఇబ్బందులు వచ్చేవి కాదని చంద్రబాబు వ్యాఖ్యానించారు. కేంద్రంతో సఖ్యత లేకపోవడంతో రాష్ట్రానికి లాభం జరగలేదన్నారు.జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గురించి కూడా ప్రత్యేకంగా మాట్లాడారు. పవన్‌తో హుందాగా ఉండాలనే గాజువాకలో ఎన్నికల ప్రచారానికి రాలేదన్నారు. ఆయనతో లాలూచీ వ్యవహారాలు ఏం లేవని వ్యాఖ్యానించారు. బీజేపీ, జనసేనను ఉద్దేశించి చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు ఏపీలో చర్చనీయాంశంగా మారాయి. 

Comments

Popular posts from this blog

సుజనా చౌదరి లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా ప్రైవేట్ బిల్లు పెడతాం: వైసీపీ ఎంపీ బాలశౌరి

బీజేపీ ఎంపీ సుజనాచౌదరిపై వైసీపీ ఎంపీ బాలశౌరి తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేశారు. మొన్నటి వరకు టీడీపీలో ఉన్న సుజనాచౌదరి బీజేపీలో చేరింది చంద్రబాబు అజెండా మోయడానికి కాదా? రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమా? చంద్రబాబు ప్రయోజనాలు ముఖ్యమా? ప్రధాని మోదీకి వ్యతిరేకంగా గతంలో ధర్మదీక్షలు చేసింది సుజనా కాదా? అని ప్రశ్నించారు. పొలిటికల్ బ్రోకర్, డూప్లికేట్ బీజేపీ నేత సుజనా చౌదరి మాటలకు విలువే లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సుజనా డూప్లికేట్ బీజేపీ నేత కాబట్టే చంద్రబాబు అజెండా అమలు చేస్తున్నారని ఆరోపించారు. సుజనాపై ఎథిక్స్ కమిటీలో ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు.  బ్యాంకులను మోసం చేసి డబ్బులు ఎగ్గొట్టిన సుజనా లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా పార్లమెంట్ లో ప్రైవేట్ బిల్లు పెడతామని సంచలన వ్యాఖ్యలు చేశారు.  

చైనాకు షాక్ : వాటిపై పెరగనున్న సుంకం

విదేశాల నుంచి దిగుమతయ్యే యాక్టివ్‌ ఫార్మాసూటికల్‌ ఇన్‌గ్రీడియంట్స్‌ (ఏపీఐ) దిగుమతులపై భారత  ప్రభుత్వం త్వరలోనే షాక్ ఇవ్వనుంది. ఏపీఐ దిగమతులపై కస్టమ్స్ సుంకాన్ని10 నుంచి 15 శాతం దాకా  పెంచాలని  ఫార్మాస్యూటికల్స్ విభాగం (డీఓపీ) యోచిస్తోంది. ముడి ఔషధాల (ఏపీఐ) దేశీయ తయారీని ప్రోత్సాహం ఇవ్వడంతోపాటు,చైనాపై అధికంగా ఆధారపడటాన్ని తగ్గించాలన్న వ్యూహంలో భాగంగా కేంద్రం ఈ నిర్ణయం తీసుకోనుంది. ఏపీఐ దిగుమతులపై సుంకాన్ని 20-25 శాతంగా ఉంచేందుకు ప్రభుత్వం పరిశీలిస్తోందని ఎకనామిక్ టైమ్స్ నివేదించింది. ప్రస్తుతం ఇది 10 శాతం మాత్రమే. భారత్-చైనా సరిహద్దు వివాదం, ఇటు చైనా ఉత్పత్తులను నిషేధించాలన్న డిమాండ్ అటు ప్రధానంగా ఏఐపీల కోసం చైనాపై అధికంగా ఆధారపడుతున్న తరుణంలో ఇది చైనాకు ప్రతికూలంగా మారనుంది.   ప్రస్తుతం, భారతదేశం 68 శాతం ఏపీఐలు, 90 శాతం కంటే ఎక్కువ యాంటీబయాటిక్‌లను చైనా నుండి దిగుమతి చేసుకుంటోంది. దేశీయంగా  వాల్యూమ్ పరంగా ప్రపంచంలో మూడవ అతిపెద్దది. క్లిష్టమైన కీ స్టార్టింగ్ మెటీరియల్స్ (కెఎస్ఎం), డ్రగ్ ఇంటర్మీడియట్...