Skip to main content

భారత ఆర్మీ, వాయుసేన కోసం సైరా ప్రత్యేక ప్రదర్శనలు

 


తెలుగు సినీ ఖ్యాతిని మరింత పెంచిన చిత్రంగా సైరా అభినందనలు అందుకుంటోంది. మెగాస్టార్ చిరంజీవి నటించిన ఈ చారిత్రక చిత్రం అక్టోబరు 2న విడుదలై విజయవంతంగా నడుస్తోంది. వ్యాపారం కోసం భారతగడ్డపై అడుగుపెట్టిన బ్రిటీషర్లు ఆపై భారతీయులను బానిసత్వంలోకి నెట్టగా, నాటి తెల్లదొరలను ఎదిరించిన తొలితరం స్వాతంత్ర్య సమరయోధుడిగా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గుర్తింపు తెచ్చుకున్నారు.

అయితే ఆయన గురించి చరిత్రలో ఎక్కువగా పేర్కొనకపోవడంతో, చిరంజీవి ఎంతో శ్రద్ధ తీసుకుని సైరా చిత్రం ద్వారా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితాన్ని ప్రజల ముందుకు తీసుకువచ్చారు. ఇప్పుడీ చిత్రాన్ని భారత సైన్యం కోసం ప్రత్యేకంగా ప్రదర్శిస్తున్నారు. కర్ణాటకలో ధీరజ్ ఎంటర్ ప్రైజెస్ డిస్ట్రిబ్యూషన్ సంస్థ బెంగళూరులో ఆర్మీ, వాయుసేన సిబ్బంది కోసం దాదాపు 60 ప్రదర్శనలు కేటాయించింది. సామాజిక మాధ్యమాల్లో ఈ విషయం విపరీతంగా ప్రచారం అవుతోంది.

Comments

Popular posts from this blog

అత్యంత కష్టం మీద బోటును బయటికి తీసిన ధర్మాడి సత్యం బృందం

నెలరోజులకు పైగా గోదావరి నదీ గర్భంలోనే ఉండిపోయిన రాయల్ వశిష్ట బోటును ఎట్టకేలకు బయటికి తీశారు. ధర్మాడి సత్యం బృందం తీవ్ర ప్రయాసలకోర్చి బోటు ఆచూకీ గుర్తించడమే కాకుండా దాన్ని పైకి తీసుకువచ్చారు. మరికాసేపట్లో బోటును ఒడ్డుకు చేర్చనున్నారు. స్కూబా డైవర్ల సాయంతో బోటుకు లంగర్లు ఫిక్స్ చేసి పైకి తీసుకువచ్చేందుకు ధర్మాడి సత్యం బృందం చేసిన ప్రయత్నాలు ఫలించాయి. మొదట కొన్ని భాగాలుగా విడిపోయినా, ఆ తర్వాత మరోసారి ఐరన్ రోప్ లు బిగించి మొత్తం బోటును వెలికి తీశారు. గోదావరి ఉపరితలంపైకి చేరిన బోటును మరో రెండు గంటల్లో తీరానికి చేర్చే అవకాశాలున్నాయి.

మీడియాపై మాకు గౌరవముంది: కోటంరెడ్డి

  కొన్ని పత్రికలు, ఛానల్స్ తమ పాలనపై ప్రజల్లో అపోహలు సృష్టిస్తున్నాయని  వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. మీడియాపై తమకు గౌరవం ఉందని, అది ఎప్పటికీ కొనసాగుతుందని చెప్పారు. జీవో 2430 కొత్తగా తీసుకొచ్చింది కాదని, ఎప్పటినుంచో అది ఉందని తెలిపారు.  ఈ రోజు కోటంరెడ్డి మీడియాతో మాట్లాడారు. కొన్ని పత్రికలు, ఛానల్స్ పనికట్టుకుని తప్పుడు వార్తలతో అపోహలు సృష్టిస్తున్నాయన్నారు. తప్పుడు వార్తలు రాసేవారు భయపడాలని పేర్కొన్నారు. ఒకప్పుడు సాక్షి మీడియాను చంద్రబాబు అనుమతించనప్పుడు ఈ ఉద్యమ నేతలు ఎటుపోయారని నిలదీశారు. లోకేశ్ దీక్షలను చూసి ప్రజలు నవ్వుకుంటున్నారన్నారు. మంగళగిరి నియోజక వర్గంలో ఎన్ని ఓట్లు ఉన్నాయో కూడా లోకేశ్ కు తెలియదని విమర్శించారు. తమ పాలనను చంద్రబాబు సహించలేకపోతున్నారని ఆయన మండిపడ్డారు. చంద్రబాబు, తన హయాంలో తన కొడుకు లోకేశ్ తో కలిసి దోచుకుని లోటు బడ్జెట్ ను చూపెట్టారని విమర్శించారు. ప్రస్తుతం సీఎం జగన్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గాడిలో పెడుతున్నారని చెప్పారు.  చంద్రబాబుకు చదువుకునేటప్పటి నుంచే కులపిచ్చి ఉందని పేర్కొన్నారు. స్థాని...