Skip to main content

భారత ఆర్మీ, వాయుసేన కోసం సైరా ప్రత్యేక ప్రదర్శనలు

 


తెలుగు సినీ ఖ్యాతిని మరింత పెంచిన చిత్రంగా సైరా అభినందనలు అందుకుంటోంది. మెగాస్టార్ చిరంజీవి నటించిన ఈ చారిత్రక చిత్రం అక్టోబరు 2న విడుదలై విజయవంతంగా నడుస్తోంది. వ్యాపారం కోసం భారతగడ్డపై అడుగుపెట్టిన బ్రిటీషర్లు ఆపై భారతీయులను బానిసత్వంలోకి నెట్టగా, నాటి తెల్లదొరలను ఎదిరించిన తొలితరం స్వాతంత్ర్య సమరయోధుడిగా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గుర్తింపు తెచ్చుకున్నారు.

అయితే ఆయన గురించి చరిత్రలో ఎక్కువగా పేర్కొనకపోవడంతో, చిరంజీవి ఎంతో శ్రద్ధ తీసుకుని సైరా చిత్రం ద్వారా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితాన్ని ప్రజల ముందుకు తీసుకువచ్చారు. ఇప్పుడీ చిత్రాన్ని భారత సైన్యం కోసం ప్రత్యేకంగా ప్రదర్శిస్తున్నారు. కర్ణాటకలో ధీరజ్ ఎంటర్ ప్రైజెస్ డిస్ట్రిబ్యూషన్ సంస్థ బెంగళూరులో ఆర్మీ, వాయుసేన సిబ్బంది కోసం దాదాపు 60 ప్రదర్శనలు కేటాయించింది. సామాజిక మాధ్యమాల్లో ఈ విషయం విపరీతంగా ప్రచారం అవుతోంది.

Comments

Popular posts from this blog

5100 రూట్లకు అనుమతులిస్తే కార్మికుల పరిస్థితి ఏంటి?: కేసీఆర్ ప్రకటనపై ఆశ్వత్థామరెడ్డి స్పందన

కార్మికులను తొలగించే అధికారం ఎవరికీ లేదని తెలంగాణ ఆర్టీసీ జేఏసీ కన్వీనర్‌ ఆశ్వత్థామరెడ్డి అన్నారు. మంగళవారం రాత్రిలోగా విధుల్లో చేరాలని సీఎం కేసీఆర్ నిన్న ప్రకటన చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆర్టీసీ జేఏసీ సమావేశం నిర్వహించింది. అనంతరం అశ్వత్థామరెడ్డి మీడియాతో మాట్లాడారు. కార్మికుల డిమాండ్లను నెరవేర్చే వరకు సమ్మె విరమించబోమని, కేసీఆర్ డెడ్ లైన్లు పెట్టడం కొత్తేం కాదని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా డిపో మేనేజర్లు కూడా సమ్మెలో పాల్గొనాలని కోరారు. ఆర్టీసీలోనూ రిజర్వేషన్లు అమలు అవుతున్నాయని, ఒకవేళ ఈ సంస్థ ప్రైవేటు పరమైతే వెనకబడ్డ కులాలకు అన్యాయం జరుగుతుందని అశ్వత్థామరెడ్డి చెప్పారు. కార్మికులను కేసీఆర్ ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆయన చెప్పారు. 5100 రూట్లకు అనుమతులు ఇస్తే ఆర్టీసీ కార్మికుల పరిస్థితి ఏంటని ఆయన ప్రశ్నించారు. తమ డిమాండ్లను కేసీఆర్ అంగీకరిస్తే యూనియన్లు ఉండవని ఆయన చెప్పారు. కాగా, నిన్న జరిగిన తెలంగాణ కేబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకున్న విషయం తెలిసిందే. 5,100 ప్రైవేట్ బస్సులకు రూట్ పర్మిట్ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్లు కేసీఆర్ ప్రకటన చేశారు. ఆర్ట

కశ్మీర్ యాపిల్స్‌పై భారత వ్యతిరేక నినాదాలు

కశ్మీర్:  మార్కెట్లోకి కొత్త కశ్మీర్ యాపిల్ పండ్లు వచ్చాయి. వ్యాపారులు వాటిని కొనుగోలు చేశారు. బాక్సులు ఓపెన్ చేసి... ఒక్కసారిగా షాక్ అయ్యారు. పండ్లపై భారత్ వ్యతిరేక నినాదాలు బ్లాక్ స్కెచ్‌తో రాసి ఉండటమే దీనికి కారణం. కశ్మీర్‌లోని కథువా హోల్‌సేల్ మార్కెట్లో ఈ ఘటన చోటు చేసుకుంది. దీనిపై వ్యాపారులు మార్కెట్ ఎదుట నిరసనకు దిగారు. పండ్లపై ‘బుర్హాన్ వనీ’, ‘పాకిస్థాన్ జిందాబాద్’, ‘గో బ్యాక్ ఇండియా’ నినాదాలు ఉండటంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులకు ఫిర్యాదు చేసిన మార్కెట్ ప్రెసిడెంట్ రోహిత్ గుప్తా.. చర్యకు పాల్పడిన వారిని వెంటనే గుర్తించాలని.. కఠిన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు