Skip to main content

దేవీపట్నం చేరుకున్న స్కూబా డైవర్లు... బోటు మునిగిన కచ్చులూరు వద్దకు ప్రయాణం

 


తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నంకు విశాఖ నుంచి స్కూబా డైవర్లు చేరుకున్నారు. తూర్పుగోదావరి జిల్లా కచ్చులూరు వద్ద గోదావరి నదిలో మునిగిపోయిన ‘రాయల్‌ వశిష్ట’ బోటు ఎక్కడ ఉన్నది స్పష్టంగా తెలియడంతో, దాన్ని వెలికి తీయాలంటే స్కూబా డైవర్ల అవసరం ఉందని రెస్క్యూటీం నాయకుడు ధర్మాడి సత్యం అధికారులకు తెలియజేసిన విషయం తెలిసిందే. సత్యం సూచన మేరకు అధికారులు విశాఖలోని డైవర్లతో మాట్లాడారు. వారు ఈరోజు ఉదయం దేవీపట్నం చేరుకున్నారు. అయితే డైవర్లను కచ్చులూరు పంపే విషయంలో ధర్మాడి సత్యం, పోలీసుల మధ్య వివాదం నెలకొంది. ఉన్నతాధికారుల అనుమతి లేదంటూ పోలీసులు డైవర్లను ఘటనా స్థలి అయిన కచ్చులూరుకు పంపేందుకు నిరాకరించారు.

అధికారుల అనుమతితోనే డైవర్లను రప్పిస్తే, మళ్లీ ఇదేం తిరకాసని సత్యం పోలీసులతో వాదనకు దిగాడు. పని ముందుకు వెళ్లాలంటే తక్షణం డైవర్లు కచ్చులూరు వెళ్లేందుకు బోటు ఏర్పాటు చేయాలని కోరాడు. ఇరువర్గాల మధ్య వాదనతో వ్యవహారంలో ప్రతిష్టంభన నెలకొంది. దీంతో కాకినాడ పోర్టు అధికారి ఆదినారాయణ జోక్యం చేసుకుని డైవర్లను ఘటనా స్థలికి పంపించేందుకు అనుమతించి, బోటు ఏర్పాటు చేయడంతో సమస్య పరిష్కారం అయింది.

కాగా, నాలుగు రోజులుగా సత్యం బృందం బోటు వెలికితీసేందుకు  చేస్తున్న ప్రయత్నాలు అందినట్టే అంది చేజారుతున్నాయి. దీంతో డైవర్లను నేరుగా బోటు వద్దకు పంపి సరైన ప్రదేశంలో బోటుకు లంగర్లు తగిలిస్తే వెలికితీత సులువవుతుందన్నది సత్యం బృందం ఉద్దేశం. ఇప్పుడు డైవర్లు కూడా వచ్చినందున వీరి ప్రయత్నం ఎంతవరకు ఫలిస్తుందో చూడాలి. 

Comments

Popular posts from this blog

సుజనా చౌదరి లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా ప్రైవేట్ బిల్లు పెడతాం: వైసీపీ ఎంపీ బాలశౌరి

బీజేపీ ఎంపీ సుజనాచౌదరిపై వైసీపీ ఎంపీ బాలశౌరి తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేశారు. మొన్నటి వరకు టీడీపీలో ఉన్న సుజనాచౌదరి బీజేపీలో చేరింది చంద్రబాబు అజెండా మోయడానికి కాదా? రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమా? చంద్రబాబు ప్రయోజనాలు ముఖ్యమా? ప్రధాని మోదీకి వ్యతిరేకంగా గతంలో ధర్మదీక్షలు చేసింది సుజనా కాదా? అని ప్రశ్నించారు. పొలిటికల్ బ్రోకర్, డూప్లికేట్ బీజేపీ నేత సుజనా చౌదరి మాటలకు విలువే లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సుజనా డూప్లికేట్ బీజేపీ నేత కాబట్టే చంద్రబాబు అజెండా అమలు చేస్తున్నారని ఆరోపించారు. సుజనాపై ఎథిక్స్ కమిటీలో ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు.  బ్యాంకులను మోసం చేసి డబ్బులు ఎగ్గొట్టిన సుజనా లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా పార్లమెంట్ లో ప్రైవేట్ బిల్లు పెడతామని సంచలన వ్యాఖ్యలు చేశారు.  

తెలంగాణ సర్కారుకు దర్శకుడు హరీశ్ శంకర్ సలహా

  హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ సమస్యలను తగ్గించడానికి మంత్రి కేటీఆర్ అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సమావేశంపై తెలంగాణ ఐటీ, పరిశ్రమల మంత్రిత్వ శాఖ ట్విట్టర్ లో పోస్ట్ చేయగా, దానిపై దర్శకుడు హరీశ్ శంకర్ స్పందించారు. హైదరాబాద్ నగరానికి స్లిప్ రోడ్ల అవసరం ఎంతో ఉందని తెలిపారు. మంత్రి కేటీఆర్ సమావేశంలో కొత్త స్లిప్ రోడ్ల అంశం కూడా చర్చకు రాగా, తక్షణ అవసరం అదేనని హరీశ్ శంకర్ అభిప్రాయపడ్డారు. హరీశ్ ప్రతిపాదనకు నెటిజన్ల నుంచి గణనీయమైన స్థాయిలో మద్దతు లభిస్తోంది.