Skip to main content

దేవీపట్నం చేరుకున్న స్కూబా డైవర్లు... బోటు మునిగిన కచ్చులూరు వద్దకు ప్రయాణం

 


తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నంకు విశాఖ నుంచి స్కూబా డైవర్లు చేరుకున్నారు. తూర్పుగోదావరి జిల్లా కచ్చులూరు వద్ద గోదావరి నదిలో మునిగిపోయిన ‘రాయల్‌ వశిష్ట’ బోటు ఎక్కడ ఉన్నది స్పష్టంగా తెలియడంతో, దాన్ని వెలికి తీయాలంటే స్కూబా డైవర్ల అవసరం ఉందని రెస్క్యూటీం నాయకుడు ధర్మాడి సత్యం అధికారులకు తెలియజేసిన విషయం తెలిసిందే. సత్యం సూచన మేరకు అధికారులు విశాఖలోని డైవర్లతో మాట్లాడారు. వారు ఈరోజు ఉదయం దేవీపట్నం చేరుకున్నారు. అయితే డైవర్లను కచ్చులూరు పంపే విషయంలో ధర్మాడి సత్యం, పోలీసుల మధ్య వివాదం నెలకొంది. ఉన్నతాధికారుల అనుమతి లేదంటూ పోలీసులు డైవర్లను ఘటనా స్థలి అయిన కచ్చులూరుకు పంపేందుకు నిరాకరించారు.

అధికారుల అనుమతితోనే డైవర్లను రప్పిస్తే, మళ్లీ ఇదేం తిరకాసని సత్యం పోలీసులతో వాదనకు దిగాడు. పని ముందుకు వెళ్లాలంటే తక్షణం డైవర్లు కచ్చులూరు వెళ్లేందుకు బోటు ఏర్పాటు చేయాలని కోరాడు. ఇరువర్గాల మధ్య వాదనతో వ్యవహారంలో ప్రతిష్టంభన నెలకొంది. దీంతో కాకినాడ పోర్టు అధికారి ఆదినారాయణ జోక్యం చేసుకుని డైవర్లను ఘటనా స్థలికి పంపించేందుకు అనుమతించి, బోటు ఏర్పాటు చేయడంతో సమస్య పరిష్కారం అయింది.

కాగా, నాలుగు రోజులుగా సత్యం బృందం బోటు వెలికితీసేందుకు  చేస్తున్న ప్రయత్నాలు అందినట్టే అంది చేజారుతున్నాయి. దీంతో డైవర్లను నేరుగా బోటు వద్దకు పంపి సరైన ప్రదేశంలో బోటుకు లంగర్లు తగిలిస్తే వెలికితీత సులువవుతుందన్నది సత్యం బృందం ఉద్దేశం. ఇప్పుడు డైవర్లు కూడా వచ్చినందున వీరి ప్రయత్నం ఎంతవరకు ఫలిస్తుందో చూడాలి. 

Comments

Popular posts from this blog

సుజనా చౌదరి లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా ప్రైవేట్ బిల్లు పెడతాం: వైసీపీ ఎంపీ బాలశౌరి

బీజేపీ ఎంపీ సుజనాచౌదరిపై వైసీపీ ఎంపీ బాలశౌరి తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేశారు. మొన్నటి వరకు టీడీపీలో ఉన్న సుజనాచౌదరి బీజేపీలో చేరింది చంద్రబాబు అజెండా మోయడానికి కాదా? రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమా? చంద్రబాబు ప్రయోజనాలు ముఖ్యమా? ప్రధాని మోదీకి వ్యతిరేకంగా గతంలో ధర్మదీక్షలు చేసింది సుజనా కాదా? అని ప్రశ్నించారు. పొలిటికల్ బ్రోకర్, డూప్లికేట్ బీజేపీ నేత సుజనా చౌదరి మాటలకు విలువే లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సుజనా డూప్లికేట్ బీజేపీ నేత కాబట్టే చంద్రబాబు అజెండా అమలు చేస్తున్నారని ఆరోపించారు. సుజనాపై ఎథిక్స్ కమిటీలో ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు.  బ్యాంకులను మోసం చేసి డబ్బులు ఎగ్గొట్టిన సుజనా లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా పార్లమెంట్ లో ప్రైవేట్ బిల్లు పెడతామని సంచలన వ్యాఖ్యలు చేశారు.  

చైనాకు షాక్ : వాటిపై పెరగనున్న సుంకం

విదేశాల నుంచి దిగుమతయ్యే యాక్టివ్‌ ఫార్మాసూటికల్‌ ఇన్‌గ్రీడియంట్స్‌ (ఏపీఐ) దిగుమతులపై భారత  ప్రభుత్వం త్వరలోనే షాక్ ఇవ్వనుంది. ఏపీఐ దిగమతులపై కస్టమ్స్ సుంకాన్ని10 నుంచి 15 శాతం దాకా  పెంచాలని  ఫార్మాస్యూటికల్స్ విభాగం (డీఓపీ) యోచిస్తోంది. ముడి ఔషధాల (ఏపీఐ) దేశీయ తయారీని ప్రోత్సాహం ఇవ్వడంతోపాటు,చైనాపై అధికంగా ఆధారపడటాన్ని తగ్గించాలన్న వ్యూహంలో భాగంగా కేంద్రం ఈ నిర్ణయం తీసుకోనుంది. ఏపీఐ దిగుమతులపై సుంకాన్ని 20-25 శాతంగా ఉంచేందుకు ప్రభుత్వం పరిశీలిస్తోందని ఎకనామిక్ టైమ్స్ నివేదించింది. ప్రస్తుతం ఇది 10 శాతం మాత్రమే. భారత్-చైనా సరిహద్దు వివాదం, ఇటు చైనా ఉత్పత్తులను నిషేధించాలన్న డిమాండ్ అటు ప్రధానంగా ఏఐపీల కోసం చైనాపై అధికంగా ఆధారపడుతున్న తరుణంలో ఇది చైనాకు ప్రతికూలంగా మారనుంది.   ప్రస్తుతం, భారతదేశం 68 శాతం ఏపీఐలు, 90 శాతం కంటే ఎక్కువ యాంటీబయాటిక్‌లను చైనా నుండి దిగుమతి చేసుకుంటోంది. దేశీయంగా  వాల్యూమ్ పరంగా ప్రపంచంలో మూడవ అతిపెద్దది. క్లిష్టమైన కీ స్టార్టింగ్ మెటీరియల్స్ (కెఎస్ఎం), డ్రగ్ ఇంటర్మీడియట్...