Skip to main content

నాసా సంచలనం.. అంగారకుడిపైకి శ్రీవారి పేరు

2020 జూలైలో అంగారకుడిపైకి మిషన్ మార్స్ రోవర్ ను పంపబోతున్న అమెరికా అంతరిక్ష సంస్థ నాసా ఈ మేరకు ఏర్పాట్లు చేస్తోంది.  ఇప్పటికే అక్కడికి పంపే రోవర్ లో ఓ మైక్రోచిప్ ను అమర్చింది. ఆ చిప్ లో ప్రపంచవ్యాప్తంగా ప్రజలు సూచించిన పేర్లను నిక్షిప్తం చేసింది.
ఈ చిప్ లో పేర్లను నిక్షిప్తం చేయడానికి ‘సెండ్ యువర్ నేమ్ టు మార్స్ ’అని నాసా సెప్టెంబర్ 30వరకు పేర్లను ఆహ్వానించింది. ఇందులో కోటిమందికి పైగా ప్రజలను పేర్లను పంపారు. నేషనల్ మిషన్ ఆఫ్ మాన్యస్ర్కిప్ట్ మాజీ డైరెక్టర్ వెంకటరమణారెడ్డి నాసా వెబ్ సైట్ లో శ్రీవారి పేరును ప్రతిపాదించారు.వీటిలో అత్యధికంగా ప్రతిపాదించిన ‘తిరుమల శ్రీవేంకటేశ్వరుని’ పేరును నాసా ఎంపిక చేసింది.

దీంతో ఇప్పుడు అంగారక గ్రహంపై పంపే రోవర్ లో శ్రీవారి పేరును నాసా నిక్షిప్తం చేసింది. మన తిరుమలేషుడు పేరు ఇప్పుడు అంగారక గ్రహంపై వెళ్లనుందన్నమాట.. గ్రహాలు దాటి వెళుతున్న శ్రీవారి  అద్భుతం చూడాలంటే మనం 2020 జూలై వరకూ ఆగాల్సిందే..

Comments

Popular posts from this blog

ఉల్లిపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం!

  ఆకాశాన్నంటిన్న ఉల్లిపాయల ధరలను కిందకు దించేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాన్ని వెలువరించింది. ఈ నెలాఖరులోగా 2 వేల టన్నుల ఉల్లిని దిగుమతి చేసుకునేందుకు రంగం సిద్ధం చేసింది. ఇప్పటికే ఎంఎంటీసీ ద్వారా టెండర్లను కేంద్రం ఆహ్వానించింది. ఈ సంవత్సరం ఉల్లి దిగుబడి తగ్గడంతో కిలో ఉల్లిపాయల ధర రూ. 80 వరకూ పలుకుతుండగా, సామాన్యులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్న సంగతి తెలిసిందే. అసలే పండగల సీజన్ కావడం, పైగా మహారాష్ట్ర, హర్యానా రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు ఈ నెలాఖరులో జరుగనున్న నేపథ్యంలో, ప్రజా వ్యతిరేకతను తగ్గించేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.

తమిళనాడులో కుండపోత వర్షం...వరుణాగ్రహంతో వణుకుతున్న రాష్ట్రం!

  బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా తమిళనాడులో కుండపోతగా వర్షం కురుస్తోంది. పలు జిల్లాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. మరో రెండు రోజులపాటు ఇదే పరిస్థితి ఉండే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపధ్యంలో జనం వణుకుతున్నారు. రాష్ట్రంలోని కాంచీపురం, ఆర్కేనగర్‌, తిరుత్తణి, తూత్తుకుడి, తిరునల్వేలి, తంజావూరు, తిరువారూరు, శివగంగై జిల్లాల్లోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.  ముందు జాగ్రత్త చర్యగా ప్రభుత్వం వర్షబీభత్సం అధికంగా ఉన్న మధురై, రామనాథపురం జిల్లాల్లోని పాఠశాలలకు సెలవు ప్రకటించింది. సముద్రంలోకి వేటకు వెళ్లవద్దని మత్స్యకారులను ప్రభుత్వం కోరింది.