Skip to main content

విజయసాయిరెడ్డి గారూ! ఇలాంటి వ్యాఖ్యలు సమాజానికి మంచిది కాదు: బాలకృష్ణ చిన్నల్లుడు శ్రీ భరత్

నందమూరి బాలకృష్ణ చిన్నల్లుడు, విశాఖ టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన శ్రీ భరత్ కుటుంబం రూ.13 కోట్లు పైచిలుకు బకాయి పడ్డట్టు పేపర్లలో ఆస్తుల వేలం ప్రకటన ఆంధ్రా బ్యాంక్ ఇచ్చిందంటూ వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఇటీవల వ్యాఖ్యలు  చేసిన సంగతి తెలిసిందే . ఈ వ్యాఖ్యలపై శ్రీభరత్ స్పందించారు. ట్విట్టర్ వేదికగా ఆయన వరుస ట్వీట్లు చేశారు. ట్రాన్స్ కో సకాలంలో చెల్లింపులు చేసి ఉంటే వాయిదాలు సమయానికి చెల్లించేవాళ్ళం, కానీ ఆర్దిక ఇబ్బందులు కారణంగా ప్రభుత్వం బకాయిలు చెల్లించలేని పరిస్థితిలో ఉన్న విషయం తమకు స్పష్టంగా తెలిసి కూడా, ప్రజల డబ్బును తాను దొంగిలించినట్లు నిందలు వేయడం చాలా విచారకరం అని, ఇలాంటి వ్యాఖ్యలు సమాజానికి మంచివికావనేది తన అభిప్రాయంగా పేర్కొన్నారు.

మన రాష్ట్రంలో చాలా మంది వ్యాపారస్తులు బిల్లులు రాక ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని స్థితిలో ఉన్నారు కనుక విజయసాయిరెడ్డి సలహాలు రాష్ట్ర ప్రభుత్వానికి చాలా అవసరం అని అన్నారు. ఈ సందర్భంగా విజయసాయిరెడ్డికి ఓ బహిరంగ లేఖ రాశారు. ‘ఇప్పుడు మీరు ప్రభుత్వంలో బాధ్యత గల పదవిలో ఉన్నారు. మీరూ అంతే బాధ్యతగా మాట్లాడాలని ఆశిస్తాం. కానీ, అందుకు భిన్నంగా మీరు చేస్తున్న వ్యాఖ్యలకు నేను బదులు చెప్పాల్సి వస్తోంది. ప్రజలకు నిజాలు తెలియాలి...’ అని ఆ లేఖలో పేర్కొన్నారు

Comments

Popular posts from this blog

పుట్టినరోజు కేక్ కట్ చేయడంపై తన అభిప్రాయాలు వెల్లడించిన పవన్ కల్యాణ్

 జనసేన పార్టీ అధ్యక్షుడు, టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ జన్మదినోత్సవం (సెప్టెంబరు 2) సందర్భంగా ఆయన అభిమానుల్లో కోలాహలం నెలకొంది. ఆయన మాత్రం ఎప్పటిలాగానే ఎంతో కూల్ గా కనిపించారు. తన బర్త్ డే సందర్భంగా పెద్దగా ఎప్పుడూ కేకులు కట్ చేయని పవన్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర అంశాలు వెల్లడించారు. చిన్నప్పటి నుంచి తనకు బర్త్ డే వేడుకలపై ఆసక్తి తక్కువని తెలిపారు. ఒకట్రెండు సార్లు స్కూల్లో చాక్లెట్లు పంచానని, కొన్ని సందర్భాల్లో తన కుటుంబ సభ్యులు కూడా తన పుట్టినరోజు సంగతి మర్చిపోయేవారని వెల్లడించారు. ఎప్పుడైనా తన పుట్టినరోజు సంగతి గుర్తొస్తే వదిన డబ్బులు ఇచ్చేవారని, ఆ డబ్బులతో పుస్తకాలు కొనుక్కోవడం తప్ప ప్రత్యేకమైన వేడుకలు తక్కువేనని పవన్ వివరించారు. "ఇక సినీ రంగంలోకి వచ్చిన తర్వాత నా పుట్టినరోజు వేడుకలను ఫ్రెండ్స్, నిర్మాతలు చేస్తుంటే ఇబ్బందికరంగా అనిపించేది. కేకు కోయడం, ఆ కేకు ముక్కలను నోట్లో పెట్టడం అంతా ఎబ్బెట్టుగా అనిపించేది. అందుకే జన్మదిన వేడుకలంటే నాకు పెద్దగా ఇష్టం ఉండదు... దీనికి వేరే కారణాలేవీ లేవు" అని పవన్ తెలిపారు.  

విశాఖ శంకుస్థాపనకు మోదీని పిలుస్తాం: బొత్స

  ఎట్టి పరిస్థితుల్లో విశాఖ రాజధాని శంకుస్థాపన జరిగి తీరుతుందని ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. మన కుటుంబంలో ఏదైనా ఫంక్షన్ జరిగితే అందరినీ ఆహ్వానిస్తామని... అదే విధంగా విశాఖ శంకుస్థాపనకు కూడా ప్రధాని మోదీతో పాటు, అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులను ఆహ్వానిస్తామని చెప్పారు. అన్ని ప్రాంతాల అభివృద్ధే తమ లక్ష్యమని చెప్పారు. అమరావతిని కూడా చంద్రబాబు గ్రాఫిక్స్ మాదిరి కాకుండా నిజంగా అభివృద్ధి చేసి చూపిస్తామని తెలిపారు. అమరావతిలో పెండిగ్ పనులపై దృష్టి సారించామని బొత్స చెప్పారు. అమరావతి రైతులకు గత ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేరుస్తామని తెలిపారు. అంతేకాని, ఆర్థిక పరిస్థితిని చూసుకోకుండా, ఆర్బాటాలకు పోయి, అప్పులు తెచ్చుకుంటూ అమరావతిని నిర్మించలేమని చెప్పారు. చంద్రబాబుకు స్వప్రయోజనాలే ముఖ్యమని విమర్శించారు. ప్రతిపక్ష పాత్రను పోషించడంలో టీడీపీ విఫలమైందని చెప్పారు. అధికారపక్షం, ప్రతిపక్షం రెండు పాత్రలను తామే పోషించుకుంటూ, న్యాయస్థానాలకు లోబడి ముందుకు వెళ్తున్నామని తెలిపారు. నిజం, నిజాయతీనే ఎప్పటికీ నిలుస్తాయని చెప్పారు.