Skip to main content

మరో ప్రతిష్టాత్మక పథకానికి శ్రీకారం చుట్టనన్న సీఎం జగన్



మరో ప్రతిష్టాత్మక పథకానికి శ్రీకారం చుట్టనన్న సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. నవంబర్ 14న నాడు- నేడు కార్యక్రమం ప్రారంభo. వచ్చే నాలుగేళ్లలో  అన్ని ప్రభుత్వ పాఠశాలలను ఆధునికీకరించాలని  సర్కార్ లక్ష్యం. ప్రతి ఏడాది 1500 కోట్లు చొప్పున నాలుగేళ్లలో 6 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేయనున్న సర్కార్ . ప్రైవేటు కాంట్రాక్టర్ లతో కాకుండా... కమ్యూనిటీ కాంట్రాక్టింగ్ పద్ధతిన దేశంలోనే తొలిసారి అమలు చేయాలని జగన్ నిర్ణయం. ప్రజల భాగస్వామ్యంతో ప్రతి స్కూల్ ఆధునికీకరణ. నేడు స్కూల్ ఎలా ఉంది.. నాలుగేళ్ల తరువాత ఎలా ఉందో ఫొటోలతో ప్రజల ముందుంచాలని భావిస్తున్న సీఎం వైఎస్ జగన్. అవినీతికి ఆస్కారం లేకుండా ఉండేందుకే కమ్యూనిటీ కాంట్రాక్టింగ్ పద్ధతిని అవలంభిస్తున్న జగన్.

Comments

Popular posts from this blog

సుజనా చౌదరి లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా ప్రైవేట్ బిల్లు పెడతాం: వైసీపీ ఎంపీ బాలశౌరి

బీజేపీ ఎంపీ సుజనాచౌదరిపై వైసీపీ ఎంపీ బాలశౌరి తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేశారు. మొన్నటి వరకు టీడీపీలో ఉన్న సుజనాచౌదరి బీజేపీలో చేరింది చంద్రబాబు అజెండా మోయడానికి కాదా? రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమా? చంద్రబాబు ప్రయోజనాలు ముఖ్యమా? ప్రధాని మోదీకి వ్యతిరేకంగా గతంలో ధర్మదీక్షలు చేసింది సుజనా కాదా? అని ప్రశ్నించారు. పొలిటికల్ బ్రోకర్, డూప్లికేట్ బీజేపీ నేత సుజనా చౌదరి మాటలకు విలువే లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సుజనా డూప్లికేట్ బీజేపీ నేత కాబట్టే చంద్రబాబు అజెండా అమలు చేస్తున్నారని ఆరోపించారు. సుజనాపై ఎథిక్స్ కమిటీలో ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు.  బ్యాంకులను మోసం చేసి డబ్బులు ఎగ్గొట్టిన సుజనా లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా పార్లమెంట్ లో ప్రైవేట్ బిల్లు పెడతామని సంచలన వ్యాఖ్యలు చేశారు.  

తెలంగాణ సర్కారుకు దర్శకుడు హరీశ్ శంకర్ సలహా

  హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ సమస్యలను తగ్గించడానికి మంత్రి కేటీఆర్ అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సమావేశంపై తెలంగాణ ఐటీ, పరిశ్రమల మంత్రిత్వ శాఖ ట్విట్టర్ లో పోస్ట్ చేయగా, దానిపై దర్శకుడు హరీశ్ శంకర్ స్పందించారు. హైదరాబాద్ నగరానికి స్లిప్ రోడ్ల అవసరం ఎంతో ఉందని తెలిపారు. మంత్రి కేటీఆర్ సమావేశంలో కొత్త స్లిప్ రోడ్ల అంశం కూడా చర్చకు రాగా, తక్షణ అవసరం అదేనని హరీశ్ శంకర్ అభిప్రాయపడ్డారు. హరీశ్ ప్రతిపాదనకు నెటిజన్ల నుంచి గణనీయమైన స్థాయిలో మద్దతు లభిస్తోంది.