వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారం లోకి వచ్చి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తరువాత దేశంలో ఎక్కడ లేని విధంగా పోలీసులు కూడా వారాంతపు సెలవు ఉండాలని దానిని అమలు చేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి.ఈ ప్రభుత్వం పోలీస్ సంక్షేమానికి కట్టుబడి ఉంది వారం లో ఒక రోజు పోలీస్ సమస్యలు ను ఉన్నతస్థాయి అధికారులు చెప్పుకునే విధంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి.దేశంలో ఎవరు చెయ్యని విధంగా నాడు ఉమ్మడి అంధ్రప్రదేశ్ లో దీవంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి ఒక మహిళను హోం మంత్రి గా పెడితే ,నేడు ఆయన తనయుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం లో కూడా మహిళ ను హోం మంత్రి ని చేసారు..
నెలరోజులకు పైగా గోదావరి నదీ గర్భంలోనే ఉండిపోయిన రాయల్ వశిష్ట బోటును ఎట్టకేలకు బయటికి తీశారు. ధర్మాడి సత్యం బృందం తీవ్ర ప్రయాసలకోర్చి బోటు ఆచూకీ గుర్తించడమే కాకుండా దాన్ని పైకి తీసుకువచ్చారు. మరికాసేపట్లో బోటును ఒడ్డుకు చేర్చనున్నారు. స్కూబా డైవర్ల సాయంతో బోటుకు లంగర్లు ఫిక్స్ చేసి పైకి తీసుకువచ్చేందుకు ధర్మాడి సత్యం బృందం చేసిన ప్రయత్నాలు ఫలించాయి. మొదట కొన్ని భాగాలుగా విడిపోయినా, ఆ తర్వాత మరోసారి ఐరన్ రోప్ లు బిగించి మొత్తం బోటును వెలికి తీశారు. గోదావరి ఉపరితలంపైకి చేరిన బోటును మరో రెండు గంటల్లో తీరానికి చేర్చే అవకాశాలున్నాయి.
Comments
Post a Comment