Skip to main content

ఒడ్డుకు చేరిన వశిష్ఠ.. బోటులోనే మృతదేహాలు

 
ఒడ్డుకు చేరిన వశిష్ఠ.. బోటులోనే మృతదేహాలు
 తూర్పుగోదావరి జిల్లా కచ్చులూరు వద్ద గోదావరిలో మునిగిపోయిన రాయల్‌ వశిష్ఠ బోటు 38 రోజుల తర్వాత ఎట్టకేలకు ఒడ్డుకు చేరింది. ధర్మాడి సత్యం బృందం, స్కూబా డైవర్లు తీవ్రంగా శ్రమించి నదిలో నుంచి బోటును వెలికితీశారు. దుర్వాసన వస్తుండటంతో ఎవరూ బోటు వద్దకు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. బోటులో గుర్తుపట్టలేని స్థితిలో ఉన్న ఏడు మృతదేహాలను గుర్తించి బయటకు తీశారు. పూర్తిగా కుళ్లిపోయి ఎముకలు బయటపడుతున్నాయి.
ఒడ్డుకు చేరిన వశిష్ఠ.. బోటులోనే మృతదేహాలు
గత నెల 15న 77 మందితో పాపికొండల పర్యటనకు బయలుదేరిన వశిష్ఠ బోటు కచ్చులూరు సమీపంలో గోదావరిలో మునిగిపోయింది. ఈ ప్రమాదంలో 39 మంది మృతిచెందగా,  26 మంది సురక్షితంగా బయటపడ్డారు. మరో 12 మంది ఆచూకీ తెలియలేదు. దీంతో అప్పటి నుంచి నదిలో మునిగిపోయిన బోటును వెలికితీసేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. బోటును వెలికితీసే బాధ్యతను కాకినాడకు చెందిన ధర్మాడి సత్యంకు అప్పగించారు. మునిగిపోయిన బోట్లు, పడవలను వెలికితీయడంలో మంచి నైపుణ్యం ఉన్న ధర్మాడి సత్యం.. తన బృందంతో గత కొన్నిరోజులుగా బోటును వెలికితీసేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. ఫలితం లేకపోవడంతో విశాఖ నుంచి స్కూబా డైవర్లను తీసుకొచ్చారు. వారు నదీగర్భంలోకి వెళ్లి ఇసుకులో కూరుకుపోయిన బోటుకు లంగర్లు, ఐరన్‌ రోప్‌ కట్టడంతో అతికష్టం మీద పొక్లెయిన్‌తో బయటకు లాగారు. గత 38 రోజులుగా నదీ గర్భంలోనే బోటు ఉండటంతో పూర్తిగా ధ్వంసమైంది. బోటులో ఏడు మృతదేహాలు కనిపిస్తున్నప్పటికీ.. అందులో ఇంకా ఎన్ని మృతదేహాలు ఉన్నాయన్నది అధికారికంగా ప్రకటించలేదు. నీటిలో తేలియాడుతున్న మరికొన్ని మృతదేహాలను ఒడ్డుకు చేరుస్తున్నారు. ఎన్ని అవాంతరాలు ఎదురైనా పట్టువీడకుండా బోటు వెలికితీసిన ధర్మాడి సత్యం బృందానికి సమీప గ్రామాల ప్రజలు అభినందనలు తెలిపారు.  బోటును ఒడ్డుకు చేర్చిన అనంతరం ధర్మాడి సత్యం మీడియాతో మాట్లాడుతూ..లోతు ఎక్కువగా ఉండటం వల్లే వెలికితీత ప్రక్రియ ఆలస్యమైందని తెలిపారు. బోటును వెలికితీసినందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. బోటు వెలికితీతలో విశాఖ స్కూబా డైవర్లు చేసిన కృషి మరువలేనిదని చెప్పారు.

Comments

Popular posts from this blog

చింతమనేనికి బెయిల్ నిరాకరణ: అక్టోబర్ 9వరకు రిమాండ్ పొడిగింపు

తెలుగుదేశం పార్టీ నేత, దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కు కోర్టులో చుక్కెదురు అయ్యింది. చింతమనేనికి బెయిల్ ఇచ్చేందుకు ఏలూరు కోర్టు నిరాకరించింది. అంతేకాదు చింతమనేని రిమాండ్ ను అక్టోబర్ 9 వరకు పొండిగించింది.  2017లో అప్పనపాడు గ్రామంలో స్థల వివాదంలో వ్యక్తిని నిర్బంధించి కులం పేరుతో దూషించిన కేసులో కేసు నమోదు అయ్యింది. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులో భాగంగా ఇటీవలే చింతమనేని ప్రభాకర్ ను పోలీసులు అరెస్ట్ చేశారు.  అనంతరం చింతమనేని ప్రభాకర్ ను ఏలూరులోని ఎస్సీఎస్టీ అట్రాసిటీ కోర్టులో హాజరుపరచగా కోర్టు 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. రిమాండ్ పూర్తవ్వడంతో బుధవారం పోలీసులు మరోసారి ఏలూరు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కోర్టులో హాజరుపరిచారు.  అలాగే బెయిల్ ఇవ్వాలంటూ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తరపు న్యాయవాది సైతం కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. చింతమనేని బెయిల్ పిటీషన్ ను న్యాయస్థానం తోసిపుచ్చింది. అనంతరం చింతమనేని రిమాండ్ ను వచ్చే నెల 9 వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ఏలూరు కోర్టు.  ఇకపోతే చింతమనేని ప్రభాకర్ ను అరెస్ట్ చేసేందుకు వెళ్లిన సమయంలో మహిళా పో...

పవన్ కు శుభాకాంక్షలు చెప్పిన చిరంజీవి

  సినీనటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఈ రోజు పుట్టినరోజు వేడుక జరుపుకుంటోన్న నేపథ్యంలో ఆయనకు మెగాస్టార్ చిరంజీవి శుభాకాంక్షలు తెలిపారు.  ఆయనకు మహేశ్ బాబుతో పాటు పలువురు టాలీవుడ్ ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్లు చేశారు. సినిమాలతో పాటు రాజకీయాల్లో పవన్ కల్యాణ్ అద్భుత విజయాలు సాధించాలని తాము కోరుకుంటున్నట్లు తెలిపారు.