Skip to main content

ఆర్టీసీఎండీని ఎందుకు నియమించలేదు?:హైకోర్టు

 
ఆర్టీసీఎండీని ఎందుకు నియమించలేదు?:హైకోర్టు
తెలంగాణలో ఆర్టీసీ సమ్మెపై హైకోర్టులో వాదనలు ముగిశాయి. సమ్మె నివారణకు తీసుకున్న చర్యలేంటని ఉన్నత న్యాయస్థానం ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. దీనికి పరిష్కారం చూపకపోతే మరింత ఇబ్బందికర పరిస్థితి తలెత్తవచ్చని అభిప్రాయపడింది. ఆర్టీసీ సమ్మె తీవ్ర రూపం దాలుస్తోందని.. ఆ సంస్థకు ఎండీని ఎందుకు నియమించలేదని హైకోర్టు ప్రశ్నించింది. ఫిలిప్పీన్స్‌లోనూ సమ్మెలతో ఆ దేశ ఆర్థిక పరిస్థితి మరింత దిగజారిందని ఈ సందర్భంగా గుర్తు చేసింది. కార్మికులకు నమ్మకం కలిగే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని సూచించింది.
ఆర్టీసీకి ఎండీని నియమించి ఉంటే కార్మికుల్లో నమ్మకం ఏర్పడి ఉండేదని.. ఎండీ నియామకం, హెచ్‌ఆర్‌ఏ పెంపు వంటి డిమాండ్లు న్యాయబద్ధమైనవని పేర్కొంది. సమ్మెతో ప్రజలు రెండువారాలుగా ఇబ్బంది పడుతున్నారని అసహనం వ్యక్తం చేసింది. రేపటి బంద్‌కు రాజకీయ పార్టీలు, ఉద్యోగ సంఘాలు, ప్రైవేటు క్యాబ్‌ డ్రైవర్లు మద్దతిస్తున్నట్లుగా ఉందని వ్యాఖ్యానించింది. దీనిపై అదనపు ఏజీ రామచంద్రరావు వాదనలు వినిపిస్తూ.. ఆర్టీసీ ఆర్థిక పరిస్థితి దృష్ట్యా కార్మికుల డిమాండ్లు నెరవేర్చడం సాధ్యం కాదని న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చారు. ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశామని.. ఆర్టీసీ ఆర్థిక పరిస్థితి వల్లే ఎండీ నియామకం చేపట్టలేదని వివరించారు. ప్రభుత్వ వాదనపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. కార్మికుల డిమాండ్లలో ఆర్థికంగా సంబంధం లేనివి కూడా ఉన్నాయని అభిప్రాయపడింది. మెరుగైన వైద్యం, మౌలిక సదుపాయాల కల్పన, స్పేర్‌ పార్టుల కొనుగోలు తదితర అంశాలు పరిష్కరించదగినవే కదా అని ప్రభుత్వాన్ని న్యాయస్థానం ప్రశ్నించింది. ఆర్టీసీ సమ్మెతో ఆదిలాబాద్‌ ఏజెన్సీలో వైద్యం కోసం ప్రజలు పట్టణాలకు రాలేకపోతున్నారని.. కార్మికులతో చర్చలు జరపాలని న్యాయస్థానం మరోసారి సూచించింది. చర్చల సారాంశాన్ని తెలపాలంటూ.. తదుపరి విచారణను ఈనెల 28కి వాయిదా వేసింది.

Comments

Popular posts from this blog

అత్యంత కష్టం మీద బోటును బయటికి తీసిన ధర్మాడి సత్యం బృందం

నెలరోజులకు పైగా గోదావరి నదీ గర్భంలోనే ఉండిపోయిన రాయల్ వశిష్ట బోటును ఎట్టకేలకు బయటికి తీశారు. ధర్మాడి సత్యం బృందం తీవ్ర ప్రయాసలకోర్చి బోటు ఆచూకీ గుర్తించడమే కాకుండా దాన్ని పైకి తీసుకువచ్చారు. మరికాసేపట్లో బోటును ఒడ్డుకు చేర్చనున్నారు. స్కూబా డైవర్ల సాయంతో బోటుకు లంగర్లు ఫిక్స్ చేసి పైకి తీసుకువచ్చేందుకు ధర్మాడి సత్యం బృందం చేసిన ప్రయత్నాలు ఫలించాయి. మొదట కొన్ని భాగాలుగా విడిపోయినా, ఆ తర్వాత మరోసారి ఐరన్ రోప్ లు బిగించి మొత్తం బోటును వెలికి తీశారు. గోదావరి ఉపరితలంపైకి చేరిన బోటును మరో రెండు గంటల్లో తీరానికి చేర్చే అవకాశాలున్నాయి.

మీడియాపై మాకు గౌరవముంది: కోటంరెడ్డి

  కొన్ని పత్రికలు, ఛానల్స్ తమ పాలనపై ప్రజల్లో అపోహలు సృష్టిస్తున్నాయని  వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. మీడియాపై తమకు గౌరవం ఉందని, అది ఎప్పటికీ కొనసాగుతుందని చెప్పారు. జీవో 2430 కొత్తగా తీసుకొచ్చింది కాదని, ఎప్పటినుంచో అది ఉందని తెలిపారు.  ఈ రోజు కోటంరెడ్డి మీడియాతో మాట్లాడారు. కొన్ని పత్రికలు, ఛానల్స్ పనికట్టుకుని తప్పుడు వార్తలతో అపోహలు సృష్టిస్తున్నాయన్నారు. తప్పుడు వార్తలు రాసేవారు భయపడాలని పేర్కొన్నారు. ఒకప్పుడు సాక్షి మీడియాను చంద్రబాబు అనుమతించనప్పుడు ఈ ఉద్యమ నేతలు ఎటుపోయారని నిలదీశారు. లోకేశ్ దీక్షలను చూసి ప్రజలు నవ్వుకుంటున్నారన్నారు. మంగళగిరి నియోజక వర్గంలో ఎన్ని ఓట్లు ఉన్నాయో కూడా లోకేశ్ కు తెలియదని విమర్శించారు. తమ పాలనను చంద్రబాబు సహించలేకపోతున్నారని ఆయన మండిపడ్డారు. చంద్రబాబు, తన హయాంలో తన కొడుకు లోకేశ్ తో కలిసి దోచుకుని లోటు బడ్జెట్ ను చూపెట్టారని విమర్శించారు. ప్రస్తుతం సీఎం జగన్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గాడిలో పెడుతున్నారని చెప్పారు.  చంద్రబాబుకు చదువుకునేటప్పటి నుంచే కులపిచ్చి ఉందని పేర్కొన్నారు. స్థాని...