Skip to main content

ఆర్టీసీఎండీని ఎందుకు నియమించలేదు?:హైకోర్టు

 
ఆర్టీసీఎండీని ఎందుకు నియమించలేదు?:హైకోర్టు
తెలంగాణలో ఆర్టీసీ సమ్మెపై హైకోర్టులో వాదనలు ముగిశాయి. సమ్మె నివారణకు తీసుకున్న చర్యలేంటని ఉన్నత న్యాయస్థానం ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. దీనికి పరిష్కారం చూపకపోతే మరింత ఇబ్బందికర పరిస్థితి తలెత్తవచ్చని అభిప్రాయపడింది. ఆర్టీసీ సమ్మె తీవ్ర రూపం దాలుస్తోందని.. ఆ సంస్థకు ఎండీని ఎందుకు నియమించలేదని హైకోర్టు ప్రశ్నించింది. ఫిలిప్పీన్స్‌లోనూ సమ్మెలతో ఆ దేశ ఆర్థిక పరిస్థితి మరింత దిగజారిందని ఈ సందర్భంగా గుర్తు చేసింది. కార్మికులకు నమ్మకం కలిగే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని సూచించింది.
ఆర్టీసీకి ఎండీని నియమించి ఉంటే కార్మికుల్లో నమ్మకం ఏర్పడి ఉండేదని.. ఎండీ నియామకం, హెచ్‌ఆర్‌ఏ పెంపు వంటి డిమాండ్లు న్యాయబద్ధమైనవని పేర్కొంది. సమ్మెతో ప్రజలు రెండువారాలుగా ఇబ్బంది పడుతున్నారని అసహనం వ్యక్తం చేసింది. రేపటి బంద్‌కు రాజకీయ పార్టీలు, ఉద్యోగ సంఘాలు, ప్రైవేటు క్యాబ్‌ డ్రైవర్లు మద్దతిస్తున్నట్లుగా ఉందని వ్యాఖ్యానించింది. దీనిపై అదనపు ఏజీ రామచంద్రరావు వాదనలు వినిపిస్తూ.. ఆర్టీసీ ఆర్థిక పరిస్థితి దృష్ట్యా కార్మికుల డిమాండ్లు నెరవేర్చడం సాధ్యం కాదని న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చారు. ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశామని.. ఆర్టీసీ ఆర్థిక పరిస్థితి వల్లే ఎండీ నియామకం చేపట్టలేదని వివరించారు. ప్రభుత్వ వాదనపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. కార్మికుల డిమాండ్లలో ఆర్థికంగా సంబంధం లేనివి కూడా ఉన్నాయని అభిప్రాయపడింది. మెరుగైన వైద్యం, మౌలిక సదుపాయాల కల్పన, స్పేర్‌ పార్టుల కొనుగోలు తదితర అంశాలు పరిష్కరించదగినవే కదా అని ప్రభుత్వాన్ని న్యాయస్థానం ప్రశ్నించింది. ఆర్టీసీ సమ్మెతో ఆదిలాబాద్‌ ఏజెన్సీలో వైద్యం కోసం ప్రజలు పట్టణాలకు రాలేకపోతున్నారని.. కార్మికులతో చర్చలు జరపాలని న్యాయస్థానం మరోసారి సూచించింది. చర్చల సారాంశాన్ని తెలపాలంటూ.. తదుపరి విచారణను ఈనెల 28కి వాయిదా వేసింది.

Comments

Popular posts from this blog

Android ఫోన్లలో బ్యాంక్ అకౌంట్ వివరాలు దోచుకునే కొత్త మాల్వేర్ 'BlackRock' హడలెత్తిస్తోంది

Trojan కేటగిరికి చెందినదిగా చెబుతున్న 'BlackRock' అనే ఒక మాల్వేర్ Android స్మార్ట్ ఫోన్ల నుండి వినియోగదారుల విలువైన బ్యాంక్ సమాచారాన్ని సేకరిస్తున్నట్లు బయటపడింది. ఇప్పటి వరకూ పర్సనల్ డేటా చౌర్యానికి మాత్రమే పరిమితమైన సైబర్ దాడులు ఇప్పుడు ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ల నుండి బ్యాంక్ అకౌంట్ వివరాలు కూడా దోచుకునేంతగా ముందుకు సాగుతోంది. ఒక మాల్వేర్, బ్యాంక్ అకౌంట్ ఆధారాలను మరియు క్రెడిట్ కార్డు వాటి వాటి వివరాలను ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్ల ద్వారా సేకరిస్తున్నట్లు మరియు ఇది దాదాపుగా 300 పైగా ఆండ్రాయిడ్ యాప్స్ పైన తాన్ ప్రభావాన్ని చూపిస్తున్నట్లు తెలిపింది. అసలే ప్రజలు కరోనా మహమ్మారితో దెబ్బకి హడలెత్తి పోతోంటే, ఆన్ లైన్ లో సైబర్ దాడులు మరియు సైబర్ మోసాలు మరింతగా కృంగదీస్తున్నాయి. ఇప్పటి వరకూ పర్సనల్ డేటా చౌర్యానికి మాత్రమే పరిమితమైన సైబర్ దాడులు ఇప్పుడు ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ల నుండి బ్యాంక్ అకౌంట్ వివరాలు కూడా దోచుకునేంతగా ముందుకు  సాగుతోంది. ఇప్పుడు కొత్తగా వచ్చిన ఒక నివేదిక ప్రకారం,Trojan కేటగిరికి చెందినదిగా చెబుతున్న 'BlackRock' అనే ఒక మాల్వేర్ Android స...

ఆమిర్‌ ఖాన్‌పై విమర్శలు గుప్పిస్తున్న నెటిజెన్లు

  బాలీవుడ్ స్టార్ ఆమిర్ ఖాన్ పై నెటిజెన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే, తన తాజా చిత్రం 'లాల్ సింగ్ చద్దా' షూటింగ్ కోసం ఆమిర్ ఇటీవల టర్కీకి వెళ్లారు. ఈ సమయంలో ఆయనతో సెల్ఫీలు తీసుకునేందుకు అక్కడి వారు ఉత్సాహం చూపారు. తన పర్యటనలో భాగంగా టర్కీ అధ్యక్షుడి భార్య ఎమినే ఎర్డోగన్ ను కూడా ఆమిర్ కలిశారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా ఆమె తెలిపారు. ప్రముఖ భారతీయ నటుడు ఆమిర్ ను కలవడం సంతోషంగా ఉందని ఆమె చెప్పారు. టర్కీలోని పలు ప్రాంతాల్లో షూటింగ్ చేశారని.. ఆ చిత్రాన్ని చూసేందుకు తాను కూడా ఎదురుచూస్తున్నానని ఆమె అన్నారు. ఈ వ్యవహారంపై ఆమిర్ పై నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. కశ్మీర్ విషయంలో పాకిస్థాన్ కు టర్కీ అధ్యక్షుడు మద్దతు ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఎమినేను ఆమిర్ కలవకుండా వుండి ఉంటే బాగుండేదని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.