Skip to main content

రాజకీయ కక్షతోనే దుష్ప్రచారం: చంద్రబాబు

రాజకీయ కక్షతోనే దుష్ప్రచారం: చంద్రబాబు
ఐదేళ్లు ప్రతిపక్షంలో ఉండి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తెలియకుండానే జగన్‌ హామీలిచ్చారా అని తెదేపా అధినేత చంద్రబాబు నిలదీశారు. తెదేపా రాష్ట్ర కార్యాలయంలో పార్టీ ముఖ్యనేతలతో సమావేశమైన చంద్రబాబు తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...  మంగళగిరిలో నూతనంగా నిర్మిస్తున్న తెదేపా కేంద్ర కార్యాలయ భవనం పనులకు అడ్డంకులు కల్పించేందుకే ఆక్రమణ పేరుతో దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. పనిచేసే కూలీలు వేసుకున్న షెడ్లను కూడా ఆక్రమణలని ఆరోపణలు చేయడం  రాజకీయ దివాళాకోరుతనమని ఆక్షేపించారు. 3 బృందాలుగా అధికారులు పదే పదే తనిఖీలు చేయడం, ట్రాన్స్‌ఫార్మర్‌ తీసేయమనడం, విద్యుత్‌ సరఫరా నిలిపివేసి పనులు అడ్డుకోవడం రాజకీయ కక్ష సాధింపులో భాగమేనన్నారు.  రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తెలిసికూడా వైకాపా కార్యకర్తలు 4 లక్షల మందికి గ్రామ వాలంటీరు, సచివాలయ ఉద్యోగాలు ఎలా ఇచ్చారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.  తెలుగుదేశం ప్రభుత్వం ఆదాయమార్గాలు పెంచుతూనే... పేదల సంక్షేమం కోసం కృషి చేసిందని, ఆ సమతుల్యత ఇప్పుడెందుకు లేకుండా పోయిందని ప్రభుత్వాన్ని నిలదీశారు.  రాష్ట్రంలో అభివృద్ధి ఆగిపోయి, ఆదాయం పడిపోయి ప్రభుత్వంపైనే నమ్మకం లేకుండా పోయిందని చంద్రబాబు విమర్శించారు. వైకాపా ఎమ్మెల్యేలకు ఇసుక రీచ్‌లు కామధేనువుగా మారాయని ధ్వజమెత్తారు.

Comments

Popular posts from this blog

వారానికోసారి కష్టమేమీ కాదు... సీఎం జగన్‌ కేసులో సీబీఐ కౌంటర్

కోర్టుకు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని ఏపీ సీఎం జగన్ వేసిన పిటిషన్‌పై సీబీఐ కౌంటర్ దాఖలు చేసింది. అక్రమాస్తుల కేసు విచారణ నుంచి తనకు వ్యక్తిగత హాజరు మినహాయింపు ఇవ్వాలని ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సీబీఐ కోర్టులో వేసిన పిటిషన్‌పై సీబీఐ కౌంటర్ దాఖలు చేసింది. సీఎం జగన్ దాఖలు చేసిన పిటిషన్‌పై సీబీఐ అభ్యంతరం వ్యక్తం చేసింది. సాక్షులను జగన్ ప్రభావితం చేసే అవకాశం ఉందని పిటిషన్‌లో పేర్కొంది. ఆయన వాస్తవాలను దాచిపెట్టి పిటిషన్ వేశారని ఆరోపించింది. జగన్ జైల్లో ఉన్నప్పుడు సాక్షులను ప్రభావితం చేశారని... సీఎం పదవిలో ఉన్న జగన్ సాక్షులను మరింత ప్రభావితం చేసే అవకాశం ఉందని సీబీఐ తన పిటిషన్‌లో పేర్కొంది. ఏపీలో రెవెన్యూ లోటు అనేది సీఎంగా ఉన్న జగన్ వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇచ్చే కారణం కాదని తెలిపింది. సీఎంగా ఉన్న జగన్ విజయవాడ నుంచి వారానికోసారి హైదరాబాద్ రావడంకష్టమేమీ కాదని కౌంటర్‌ పిటిషన్‌లో సీబీఐ పేర్కొన్నట్టు తెలుస్తోంది. సీబీఐ కౌంటర్‌పై కోర్టు శుక్రవారం వాదనలు వినిపించనుంది.

బోటు వెలికితీత మరింత ఆలస్యం

కచ్చులూరు వద్ద మునిగిన బోటును రేపు వెలికితీస్తామని ధర్మాడి సత్యం తెలిపారు. బోటు వెలికితీత కోసం రెండోరోజు చేసిన ప్రయత్నాలు విఫలమైనట్లు చెప్పారు. వాతావరణం అనుకూలించనందువల్లే ఈ ఆలస్యం జరుగుతుందని వివరించారు. గోదావరిలో వరద ప్రహహం తగ్గిన కారణంగా బోటును రేపు బయటికి తీస్తామని స్పష్టం చేశారు. కాగా.. ధర్మాడి సత్యం బృందం వేసిన లంగర్‌కు బోటు తగిలి కదిలిందని స్థానికులు తెలిపారు.