Skip to main content

రాజకీయ కక్షతోనే దుష్ప్రచారం: చంద్రబాబు

రాజకీయ కక్షతోనే దుష్ప్రచారం: చంద్రబాబు
ఐదేళ్లు ప్రతిపక్షంలో ఉండి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తెలియకుండానే జగన్‌ హామీలిచ్చారా అని తెదేపా అధినేత చంద్రబాబు నిలదీశారు. తెదేపా రాష్ట్ర కార్యాలయంలో పార్టీ ముఖ్యనేతలతో సమావేశమైన చంద్రబాబు తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...  మంగళగిరిలో నూతనంగా నిర్మిస్తున్న తెదేపా కేంద్ర కార్యాలయ భవనం పనులకు అడ్డంకులు కల్పించేందుకే ఆక్రమణ పేరుతో దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. పనిచేసే కూలీలు వేసుకున్న షెడ్లను కూడా ఆక్రమణలని ఆరోపణలు చేయడం  రాజకీయ దివాళాకోరుతనమని ఆక్షేపించారు. 3 బృందాలుగా అధికారులు పదే పదే తనిఖీలు చేయడం, ట్రాన్స్‌ఫార్మర్‌ తీసేయమనడం, విద్యుత్‌ సరఫరా నిలిపివేసి పనులు అడ్డుకోవడం రాజకీయ కక్ష సాధింపులో భాగమేనన్నారు.  రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తెలిసికూడా వైకాపా కార్యకర్తలు 4 లక్షల మందికి గ్రామ వాలంటీరు, సచివాలయ ఉద్యోగాలు ఎలా ఇచ్చారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.  తెలుగుదేశం ప్రభుత్వం ఆదాయమార్గాలు పెంచుతూనే... పేదల సంక్షేమం కోసం కృషి చేసిందని, ఆ సమతుల్యత ఇప్పుడెందుకు లేకుండా పోయిందని ప్రభుత్వాన్ని నిలదీశారు.  రాష్ట్రంలో అభివృద్ధి ఆగిపోయి, ఆదాయం పడిపోయి ప్రభుత్వంపైనే నమ్మకం లేకుండా పోయిందని చంద్రబాబు విమర్శించారు. వైకాపా ఎమ్మెల్యేలకు ఇసుక రీచ్‌లు కామధేనువుగా మారాయని ధ్వజమెత్తారు.

Comments

Popular posts from this blog

సుజనా చౌదరి లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా ప్రైవేట్ బిల్లు పెడతాం: వైసీపీ ఎంపీ బాలశౌరి

బీజేపీ ఎంపీ సుజనాచౌదరిపై వైసీపీ ఎంపీ బాలశౌరి తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేశారు. మొన్నటి వరకు టీడీపీలో ఉన్న సుజనాచౌదరి బీజేపీలో చేరింది చంద్రబాబు అజెండా మోయడానికి కాదా? రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమా? చంద్రబాబు ప్రయోజనాలు ముఖ్యమా? ప్రధాని మోదీకి వ్యతిరేకంగా గతంలో ధర్మదీక్షలు చేసింది సుజనా కాదా? అని ప్రశ్నించారు. పొలిటికల్ బ్రోకర్, డూప్లికేట్ బీజేపీ నేత సుజనా చౌదరి మాటలకు విలువే లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సుజనా డూప్లికేట్ బీజేపీ నేత కాబట్టే చంద్రబాబు అజెండా అమలు చేస్తున్నారని ఆరోపించారు. సుజనాపై ఎథిక్స్ కమిటీలో ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు.  బ్యాంకులను మోసం చేసి డబ్బులు ఎగ్గొట్టిన సుజనా లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా పార్లమెంట్ లో ప్రైవేట్ బిల్లు పెడతామని సంచలన వ్యాఖ్యలు చేశారు.  

తెలంగాణ సర్కారుకు దర్శకుడు హరీశ్ శంకర్ సలహా

  హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ సమస్యలను తగ్గించడానికి మంత్రి కేటీఆర్ అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సమావేశంపై తెలంగాణ ఐటీ, పరిశ్రమల మంత్రిత్వ శాఖ ట్విట్టర్ లో పోస్ట్ చేయగా, దానిపై దర్శకుడు హరీశ్ శంకర్ స్పందించారు. హైదరాబాద్ నగరానికి స్లిప్ రోడ్ల అవసరం ఎంతో ఉందని తెలిపారు. మంత్రి కేటీఆర్ సమావేశంలో కొత్త స్లిప్ రోడ్ల అంశం కూడా చర్చకు రాగా, తక్షణ అవసరం అదేనని హరీశ్ శంకర్ అభిప్రాయపడ్డారు. హరీశ్ ప్రతిపాదనకు నెటిజన్ల నుంచి గణనీయమైన స్థాయిలో మద్దతు లభిస్తోంది.