Skip to main content

రాజకీయ కక్షతోనే దుష్ప్రచారం: చంద్రబాబు

రాజకీయ కక్షతోనే దుష్ప్రచారం: చంద్రబాబు
ఐదేళ్లు ప్రతిపక్షంలో ఉండి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తెలియకుండానే జగన్‌ హామీలిచ్చారా అని తెదేపా అధినేత చంద్రబాబు నిలదీశారు. తెదేపా రాష్ట్ర కార్యాలయంలో పార్టీ ముఖ్యనేతలతో సమావేశమైన చంద్రబాబు తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...  మంగళగిరిలో నూతనంగా నిర్మిస్తున్న తెదేపా కేంద్ర కార్యాలయ భవనం పనులకు అడ్డంకులు కల్పించేందుకే ఆక్రమణ పేరుతో దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. పనిచేసే కూలీలు వేసుకున్న షెడ్లను కూడా ఆక్రమణలని ఆరోపణలు చేయడం  రాజకీయ దివాళాకోరుతనమని ఆక్షేపించారు. 3 బృందాలుగా అధికారులు పదే పదే తనిఖీలు చేయడం, ట్రాన్స్‌ఫార్మర్‌ తీసేయమనడం, విద్యుత్‌ సరఫరా నిలిపివేసి పనులు అడ్డుకోవడం రాజకీయ కక్ష సాధింపులో భాగమేనన్నారు.  రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తెలిసికూడా వైకాపా కార్యకర్తలు 4 లక్షల మందికి గ్రామ వాలంటీరు, సచివాలయ ఉద్యోగాలు ఎలా ఇచ్చారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.  తెలుగుదేశం ప్రభుత్వం ఆదాయమార్గాలు పెంచుతూనే... పేదల సంక్షేమం కోసం కృషి చేసిందని, ఆ సమతుల్యత ఇప్పుడెందుకు లేకుండా పోయిందని ప్రభుత్వాన్ని నిలదీశారు.  రాష్ట్రంలో అభివృద్ధి ఆగిపోయి, ఆదాయం పడిపోయి ప్రభుత్వంపైనే నమ్మకం లేకుండా పోయిందని చంద్రబాబు విమర్శించారు. వైకాపా ఎమ్మెల్యేలకు ఇసుక రీచ్‌లు కామధేనువుగా మారాయని ధ్వజమెత్తారు.

Comments

Popular posts from this blog

సుజనా చౌదరి లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా ప్రైవేట్ బిల్లు పెడతాం: వైసీపీ ఎంపీ బాలశౌరి

బీజేపీ ఎంపీ సుజనాచౌదరిపై వైసీపీ ఎంపీ బాలశౌరి తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేశారు. మొన్నటి వరకు టీడీపీలో ఉన్న సుజనాచౌదరి బీజేపీలో చేరింది చంద్రబాబు అజెండా మోయడానికి కాదా? రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమా? చంద్రబాబు ప్రయోజనాలు ముఖ్యమా? ప్రధాని మోదీకి వ్యతిరేకంగా గతంలో ధర్మదీక్షలు చేసింది సుజనా కాదా? అని ప్రశ్నించారు. పొలిటికల్ బ్రోకర్, డూప్లికేట్ బీజేపీ నేత సుజనా చౌదరి మాటలకు విలువే లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సుజనా డూప్లికేట్ బీజేపీ నేత కాబట్టే చంద్రబాబు అజెండా అమలు చేస్తున్నారని ఆరోపించారు. సుజనాపై ఎథిక్స్ కమిటీలో ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు.  బ్యాంకులను మోసం చేసి డబ్బులు ఎగ్గొట్టిన సుజనా లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా పార్లమెంట్ లో ప్రైవేట్ బిల్లు పెడతామని సంచలన వ్యాఖ్యలు చేశారు.  

చైనాకు షాక్ : వాటిపై పెరగనున్న సుంకం

విదేశాల నుంచి దిగుమతయ్యే యాక్టివ్‌ ఫార్మాసూటికల్‌ ఇన్‌గ్రీడియంట్స్‌ (ఏపీఐ) దిగుమతులపై భారత  ప్రభుత్వం త్వరలోనే షాక్ ఇవ్వనుంది. ఏపీఐ దిగమతులపై కస్టమ్స్ సుంకాన్ని10 నుంచి 15 శాతం దాకా  పెంచాలని  ఫార్మాస్యూటికల్స్ విభాగం (డీఓపీ) యోచిస్తోంది. ముడి ఔషధాల (ఏపీఐ) దేశీయ తయారీని ప్రోత్సాహం ఇవ్వడంతోపాటు,చైనాపై అధికంగా ఆధారపడటాన్ని తగ్గించాలన్న వ్యూహంలో భాగంగా కేంద్రం ఈ నిర్ణయం తీసుకోనుంది. ఏపీఐ దిగుమతులపై సుంకాన్ని 20-25 శాతంగా ఉంచేందుకు ప్రభుత్వం పరిశీలిస్తోందని ఎకనామిక్ టైమ్స్ నివేదించింది. ప్రస్తుతం ఇది 10 శాతం మాత్రమే. భారత్-చైనా సరిహద్దు వివాదం, ఇటు చైనా ఉత్పత్తులను నిషేధించాలన్న డిమాండ్ అటు ప్రధానంగా ఏఐపీల కోసం చైనాపై అధికంగా ఆధారపడుతున్న తరుణంలో ఇది చైనాకు ప్రతికూలంగా మారనుంది.   ప్రస్తుతం, భారతదేశం 68 శాతం ఏపీఐలు, 90 శాతం కంటే ఎక్కువ యాంటీబయాటిక్‌లను చైనా నుండి దిగుమతి చేసుకుంటోంది. దేశీయంగా  వాల్యూమ్ పరంగా ప్రపంచంలో మూడవ అతిపెద్దది. క్లిష్టమైన కీ స్టార్టింగ్ మెటీరియల్స్ (కెఎస్ఎం), డ్రగ్ ఇంటర్మీడియట్...