Skip to main content

రాజకీయ కక్షతోనే దుష్ప్రచారం: చంద్రబాబు

రాజకీయ కక్షతోనే దుష్ప్రచారం: చంద్రబాబు
ఐదేళ్లు ప్రతిపక్షంలో ఉండి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తెలియకుండానే జగన్‌ హామీలిచ్చారా అని తెదేపా అధినేత చంద్రబాబు నిలదీశారు. తెదేపా రాష్ట్ర కార్యాలయంలో పార్టీ ముఖ్యనేతలతో సమావేశమైన చంద్రబాబు తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...  మంగళగిరిలో నూతనంగా నిర్మిస్తున్న తెదేపా కేంద్ర కార్యాలయ భవనం పనులకు అడ్డంకులు కల్పించేందుకే ఆక్రమణ పేరుతో దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. పనిచేసే కూలీలు వేసుకున్న షెడ్లను కూడా ఆక్రమణలని ఆరోపణలు చేయడం  రాజకీయ దివాళాకోరుతనమని ఆక్షేపించారు. 3 బృందాలుగా అధికారులు పదే పదే తనిఖీలు చేయడం, ట్రాన్స్‌ఫార్మర్‌ తీసేయమనడం, విద్యుత్‌ సరఫరా నిలిపివేసి పనులు అడ్డుకోవడం రాజకీయ కక్ష సాధింపులో భాగమేనన్నారు.  రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తెలిసికూడా వైకాపా కార్యకర్తలు 4 లక్షల మందికి గ్రామ వాలంటీరు, సచివాలయ ఉద్యోగాలు ఎలా ఇచ్చారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.  తెలుగుదేశం ప్రభుత్వం ఆదాయమార్గాలు పెంచుతూనే... పేదల సంక్షేమం కోసం కృషి చేసిందని, ఆ సమతుల్యత ఇప్పుడెందుకు లేకుండా పోయిందని ప్రభుత్వాన్ని నిలదీశారు.  రాష్ట్రంలో అభివృద్ధి ఆగిపోయి, ఆదాయం పడిపోయి ప్రభుత్వంపైనే నమ్మకం లేకుండా పోయిందని చంద్రబాబు విమర్శించారు. వైకాపా ఎమ్మెల్యేలకు ఇసుక రీచ్‌లు కామధేనువుగా మారాయని ధ్వజమెత్తారు.

Comments

Popular posts from this blog

పవన్ కు శుభాకాంక్షలు చెప్పిన చిరంజీవి

  సినీనటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఈ రోజు పుట్టినరోజు వేడుక జరుపుకుంటోన్న నేపథ్యంలో ఆయనకు మెగాస్టార్ చిరంజీవి శుభాకాంక్షలు తెలిపారు.  ఆయనకు మహేశ్ బాబుతో పాటు పలువురు టాలీవుడ్ ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్లు చేశారు. సినిమాలతో పాటు రాజకీయాల్లో పవన్ కల్యాణ్ అద్భుత విజయాలు సాధించాలని తాము కోరుకుంటున్నట్లు తెలిపారు.

చింతమనేనికి బెయిల్ నిరాకరణ: అక్టోబర్ 9వరకు రిమాండ్ పొడిగింపు

తెలుగుదేశం పార్టీ నేత, దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కు కోర్టులో చుక్కెదురు అయ్యింది. చింతమనేనికి బెయిల్ ఇచ్చేందుకు ఏలూరు కోర్టు నిరాకరించింది. అంతేకాదు చింతమనేని రిమాండ్ ను అక్టోబర్ 9 వరకు పొండిగించింది.  2017లో అప్పనపాడు గ్రామంలో స్థల వివాదంలో వ్యక్తిని నిర్బంధించి కులం పేరుతో దూషించిన కేసులో కేసు నమోదు అయ్యింది. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులో భాగంగా ఇటీవలే చింతమనేని ప్రభాకర్ ను పోలీసులు అరెస్ట్ చేశారు.  అనంతరం చింతమనేని ప్రభాకర్ ను ఏలూరులోని ఎస్సీఎస్టీ అట్రాసిటీ కోర్టులో హాజరుపరచగా కోర్టు 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. రిమాండ్ పూర్తవ్వడంతో బుధవారం పోలీసులు మరోసారి ఏలూరు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కోర్టులో హాజరుపరిచారు.  అలాగే బెయిల్ ఇవ్వాలంటూ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తరపు న్యాయవాది సైతం కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. చింతమనేని బెయిల్ పిటీషన్ ను న్యాయస్థానం తోసిపుచ్చింది. అనంతరం చింతమనేని రిమాండ్ ను వచ్చే నెల 9 వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ఏలూరు కోర్టు.  ఇకపోతే చింతమనేని ప్రభాకర్ ను అరెస్ట్ చేసేందుకు వెళ్లిన సమయంలో మహిళా పో...